మొదటిగా పేర్కొన్న ఇద్దరు పూర్వీకులు దావీదు, అబ్రాహాము. (1:1)
యోసేపు భార్య మరియ. ఎందుకంటే ఆమె యేసుకు జన్మనిచ్చింది (1:16).
మరియ యోసేపుకు ప్రదానం కావడానికి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది (1:18).
యోసేపు నీతిమంతుడు (1:19).
యోసేపు మరియను రహస్యంగా విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు (1:19).
యోసేపుకు దేవదూత కలలో కనబడి మరియను భార్యగా స్వీకరించమని, ఆమెకు గర్భం పరిశుద్ధాత్మ వలన కలిగినదని చెప్పాడు (1:20).
ఆయన తన ప్రజలను తమ పాపాలనుండి రక్షిస్తాడు కనుక అ పేరు పెట్టాడు (1:21).
కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు, అని పాత నిబంధనలో ప్రవక్త చెప్పినట్టు ఇదంతా జరిగింది. ఇమ్మానుయేలు అంటే "దేవుడు మనకు తోడు" అని అర్థం (1:23).
మరియ యేసుకు జన్మనిచ్చేంత వరకు ఆమెను సమీపించలేదు (1:25).
యేసు యూదా దేశంలోని బెత్లేహేములో జన్మించాడు (2:1).
తూర్పు దేశపు జ్ఞానులు యేసును "యూదుల రాజు" అని పిలిచారు (2:2).
తూర్పు దిక్కున వెలసిన యూదుల రాజు నక్షత్రం చూసి తెలుసుకున్నారు (2:2).
ఈ వార్త విన్న హేరోదు రాజు కలవరపడ్డాడు (2:3).
యేసు బేత్లెహేములో పుడతాడని ప్రవచనం ద్వారా వారు తెలుసుకున్నారు (2:5-6).
తూర్పు దేశం నుండి జ్ఞానులను నడిపించిన నక్షత్రం యేసు ఉన్న యింటిపై నిలిచింది (2:9).
జ్ఞానులు యేసు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన బాలుడుగా ఉన్నాడు (2:11).
జ్ఞానులు యేసుకు బంగారము, బోళము, సాంబ్రాణి కానుకలుగా ఇచ్చారు (2:11).
వారిని హేరోదు దగ్గరకు తిరిగి వెళ్ళవద్దని దేవుడు హెచ్చరించినందువల్ల వారు వేరొక మార్గంలో వెళ్లారు (2:12).
హేరోదు యేసును చంపాలని చూస్తున్నాడని, అందువల్ల మరియను, యేసును తీసుకొని ఐగుప్తుకు పారిపొమ్మని కలలో దూత చెప్పాడు (2:13).
యేసును ఇగుప్తుకు తీసుకు వెళ్ళినప్పుడు 'ఇగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని' అనే ప్రవచనం నెరవేరింది (2:15).
బేత్లెహేము ప్రాంతంలోని రెండు సంవత్సరాల లోపు వయసు మగ పిల్లలను చంపించాడు (2:16).
యోసేపుకు కలలో ఇశ్రాయేలు దేశానికి తిరిగి వెళ్ళమని సూచనలు అందాయి (2:19-20).
యోసేపు మరియా, యేసులతో కలసి గలిలయలోని నజరేతులో నివసించాడు (2:22-23).
క్రీస్తు నజరేతువాడని ప్రవక్తలు పలికిన మాట నెరవేరింది (2:23).
బాప్తిసమిచ్చే యోహాను "పరలోక రాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడి" అని ప్రకటిస్తున్నాడు (3:2).
"ప్రభువు మార్గము సరాళము చేయుడి" అనే ప్రవచనం నెరవేర్చడానికి బాప్తిసమిచ్చే యోహాను వచ్చాడు (3:3).
మారుమనస్సుకు తగిన ఫలము ఫలించమని బాప్తిసమిచ్చే యోహాను పరిసయ్యులకు, సద్దూకయ్యులకు చెప్పాడు (3:8).
అబ్రాహాము తమ తండ్రి అని తమలో తాము అనుకోవద్దని యోహాను చెప్పాడు (3:9).
మంచి ఫలము ఫలించని చెట్టు నరికివేయబడి అగ్నిలో పడవేయబడుతుందని యోహాను చెప్పాడు (3:10).
బాప్తిసమిచ్చే యోహాను తరువాత వచ్చేవాడు పరిశుద్ధాత్మలో, అగ్నిలో బాప్తిసమిస్తాడు (3:11).
"నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది" అని యేసు యోహానుతో చెప్పాడు (3:15).
యేసు నీటిలో నుండి బయటకు వచ్చీనప్పుదు దేవుని ఆత్మ పావురం రూపంలో పైనుండి తన పైకి క్రిందికి దిగి రావడం చూసాడు (3:16).
"ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను" అన్న స్వరం పరలోకం నుండి వినిపించింది (3:17).
అపవాది చేత శోధింపబడడానికి యేసును ఆత్మ కొనిపోయాడు (4:1).
యేసు నలభై పగళ్ళు , నలభై రాత్రులు ఉపవాసమున్నాడు (4:2).
రాళ్ళను రొట్టెలుగా చేయమని అపవాది యేసును మొదటిగా శోధించాడు (4:3).
మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని యేసు జవాబిచ్చాడు (4:4).
అపవాది యేసును దేవాలయంపై నుండి క్రిందికి దూకమని చెప్పి శోదించాడు (4:5-6).
యేసు, ప్రభువైన దేవుణ్ణి శోధించకూడదని చెప్పాడు (4:7).
అపవాది తనకు సాగిలపడి నమస్కారము చేయమని చెప్పాడు (4:8-9).
ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని యేసు అపవాదికి చెప్పాడు (4:10).
గలిలయ లోని ప్రజలకు వెలుగు కనబడింది అని పలికిన యెషయా ప్రవచనం నెరవేరింది (4:15-16).
యేసు, "పరలోకరాజ్యము సమీపించియున్నది కనుక మారుమనస్సు పొందుది" అని ప్రకటించడం మొదలుపెట్టాడు" (4:17).
పేతురు, ఆంద్రెయలను మనుషులను పట్టే జాలరులనుగా చేస్తానని యేసు చెప్పాడు (4:19).
పేతురు, ఆంద్రెయ, యాకోబు మరియు యోహానులు చేపలు పట్టేవారు (4:18,21).
యేసు గలిలయలోని సమాజమందిరములోకి వెళ్ళాడు (4:23).
నానా విధమైన రోగముల చేత పీడింపబడుతున్నవారిని, దయ్యములు పట్టినవారిని ఆయన దగ్గరకు తెస్తున్నారు, యేసు వారిని బాగుపరుస్తున్నాడు (4:24).
ఈ సమయంలో బహు జనసమూహములు యేసును వెంబడిస్తున్నారు (4:25).
ఆత్మ విషయంలో దీనులైనవారు ధన్యులు ఎందుకంటే పరలోక రాజ్యం వారిది (5:3).
దు:ఖపడేవారు ధన్యులు, ఎందుకంటే వారు ఓదార్చబడతారు (5:4).
సాత్వీకులు ధన్యులు, ఎందుకంటే వారు భూలోకంను స్వతంత్రించుకొంటారు (5:5).
నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు, ఎందుకంటే వారు తృప్తిపరచబడతారు (5:6).
యేసు నిమిత్తం జనులచే హింసించబడేవారు ధన్యులు, ఎందుకంటే పరలోకమందు వారి ఫలము అధికమౌతుంది (5:11-12).
విశ్వాసులు తమ మంచి క్రియలను బట్టి ఇతరుల ఎదుట తమ వెలుగును ప్రకాశింపనియ్యాలి (5:15-16).
పాత నిబంధన చట్టాలను, ప్రవక్తల ప్రవచనాలను నేరవేర్చడానికే యేసు వచ్చాడు (5:17).
దేవుని ఆజ్ఞలను పాటిస్తూ వాటిని ఇతరులకు బోధించేవాడు పరలోకంలో గొప్పవాడు (5:19).
నరహత్య చేసేవాడు మాత్రమే కాక, తన సహోదరుని మీద కోపగించేవాడు కూడా తీర్పులోకి ప్రవేశిస్తాడు (5:21-22).
మనం మన సహోదరుని పట్ల విరోధం ఏదైనా ఉన్నట్టయితే అతనితో సమాధానపడాలని యేసు బోధించాడు? (5:23-24).
త్రోవలో ఉండగానే మన ప్రతివాదితో సమాధానపడాలని యేసు బోధించాడు (5:25).
వ్యభిచారం మాత్రమే కాదు గాని ఒక స్త్రీని మోహపు చూపు చూడడం కూడా పాపమేనని యేసు బోధించాడు (5:27-28).
పాపంలో పడేలా చేసే విషయాలను మనం వదిలించుకొని, వాటికి దూరంగా ఉండాలని యేసు చెప్పాడు (5:29-30).
అవివాహితుల మధ్య వ్యభిచారం విషయంలో యేసు విడాకులు అనుమతించాడు (5:32).
వ్యభిచార కారణం లేకుండా తన భార్యను వదిలేసే ప్రతివాడూ ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. వదిలేసిన ఆమెను పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. [5:32].
వీటన్నిటికి మించి మన మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను అని యేసు చెప్పాడు (5:33-37).
మనం దుష్టుని విషయంలో అతణ్ణి ఎదిరించకుండా ఉండాలని యేసు బోధించాడు (5:38-39).
మన శత్రువులను, మనలను ద్వేషించే వారిని ప్రేమించి, వారి కోసం ప్రార్ధించాలని యేసు బోధించాడు (5:43-44).
మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే మీరు ప్రత్యేకంగా చేస్తున్నది ఏమిటి? అన్యులు కూడా అలాగే చేస్తున్నారు గదా అని యేసు చెప్పాడు (5:46-47).
మనం చేసే నీతి క్రియలు రహస్యంగా ఉండాలి (6:1-4).
రహస్యంగా చేసే ప్రార్థన తండ్రి వద్దనుండి ప్రతిఫలం పొందుతుంది (6:6).
మన తండ్రికి మన అక్కరలు ఏమిటో తెలుసు గనుక ప్రార్థనలో విస్తారమైన మాటలు పలుకవద్దని యేసు చెప్పాడు (6:7-8).
తండ్రి చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్టుగా భూమియందును నెరవేరాలని ప్రార్ధించాలి (6:10).
మన ఋణస్తులను మనం క్షమించకపోతే దేవుడు మన ఋణాలను క్షమించడు (6:15).
మనం ఉపవాసం చేస్తున్నట్టు ఇతరులకు కనబడేలా కాక, రహస్యమందున్న తండ్రికి కనబడేలా చేస్తే తండ్రి ప్రతిఫలమిస్తాడు (6:16-18).
పరలోకంలో మన నిధి దాచుకోవాలి. ఎందుకంటే అది నాశనం కాదు, దొంగలు దోచుకోరు (6:19-20).
మన ధనం ఎక్కడ ఉంటుందో మన హృదయం అక్కడ ఉంటుంది (6:21).
దేవుడు, సంపద అనే ఇద్దరు యజమానులలో ఒకరిని మాత్రమే ఎంచుకోవాలి (6:24).
ఏమి తింటామో, ఏమి త్రాగుతామో, ఏమి ధరిస్తామో అని మనం చింతించకూడదు. ఎందుకంటే, పక్షులను పట్టించుకొనే దేవుడు వాటికంటే శ్రేష్టమైన మనలను మరింత ఎక్కువగా పట్టించుకుంటాడు (6:25-26).
మనం చింతించడం వల్ల ఒక మూర ఎత్తు పెరగలేమని యేసు గుర్తు చేస్తున్నాడు (6:27).
మనం ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదటగా వెదకాలి. అప్పుడు మన భూలోక అవసరాలు మనకు అనుగ్రహించబడతాయి (6:33).
మనం మొదటగా మన కళ్ళలో ఉన్న దూలమును తీసివేసుకోవాలి (7:1-5).
పరిశుధ్ధమైనది కుక్కలకు వేస్తే అవి వాటిని కాళ్ళతో తొక్కి మనమీద పడి మనలను చీల్చి వేస్తాయి (7:6).
మనం తండ్రి నుంచి పొందాలంటే ఆయనను అడగాలి, వెదకాలి, తట్టాలి (7:8).
ఆయనను అడుగువారికి ఆయన మంచి ఈవులను అనుగ్రహిస్తాడు (7:11).
ఇతరుల మనకు ఏమి చేయాలని కోరుకుంటామో వారికీ అలానే చేయాలని ధర్మశాస్త్రము, ప్రవక్తలు బోధించారు (7:12).
వెడల్పు మార్గము నాశనమునకు నడిపిస్తుంది (7:13).
ఇరుకు మార్గము జీవమునకు నడిపిస్తుంది (7:14).
వారి జీవితాలలోని ఫలములను బట్టి వారిని గుర్తించగలము (7:15-20).
తండ్రి చిత్తం నేరవేర్చువారు పరలోకరాజ్యములో ప్రవేశిస్తారు (7:21).
యేసు వారిని చూసి, "నేను మిమ్ములను ఎన్నటికీ ఎరుగను, అక్రమము చేయువారలారా నా యెద్ద నుండి వెళ్ళండి" అంటాడు (7:22-23).
యేసు మాటలు విని ఆ ప్రకారము చేసినవాడు బుద్ధిమంతుడు (7:24).
యేసు మాటలు విని ఆ ప్రకారము చేయనివాడు బుద్ధిలేనివాడు (7:26).
శాస్త్రుల బోధలతో పోలిస్తే ఆయన బోధ అధికారము గలదిగా ఉన్నది (7:29).
స్వస్థపడిన కుష్టరోగి యాజకుని ఎదుట సాక్ష్యార్ధంగా కనబడాలని దేవాలయానికి వెళ్ళమన్నాడు (8:4).
నేను వచ్చి సేవకుణ్ణి స్వస్థపరుస్తానని యేసు చెప్పాడు (8:7).
యేసు తన ఇంటికి వచ్చుటకు తాను అయోగ్యుడనని శతాధిపతి తలంచాడు. యేసు ఒక్క మాట పలికితే తన సేవకుడు బాగుపడతాడని నమ్మాడు (8:8).
ఇశ్రాయేలీయులలో ఎవరిలోనైనా ఇలాంటి విశ్వాసము కనబడలేదని యేసు చెప్పాడు (8:10).
అనేకులు తూర్పు నుండి, పడమర నుండి వచ్చి పరలోక రాజ్యములో భోజనపు బల్ల వద్ద కూర్చుంటారు (8:11).
రాజ్య సంబంధులు చీకటిలోకి త్రోయబడతారని యేసు చెప్పాడు (8:12).
యేసు పేతురు ఇంటిలోకి వెళ్ళినప్పుడు పేతురు అత్తను స్వస్థపరిచాడు (8:14-15).
"ఆయన మన బలహీనతలను సహించుకొని మన రోగములను భరించెనని యెషయా ప్రవక్త ద్వారా పలకబడిన ప్రవచనం నెరవేరింది (8:17).
యేసు తనకు తల వాల్చుకొనుటకు కూడా స్థలము లేదని చెప్పాడు (8:20).
యేసు ఆ శిష్యునితో, తనను వెంబడించమని, మరణించిన వారు మరణించిన వారిని పాతిపెట్టుకోనిమ్మని చెప్పాడు (8:21-22).
సముద్రము మీద తుపాను లేచి పడవ అలలతో కప్పబడినప్పుడు యేసు నిద్రపోతున్నాడు (8:24).
యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు, "అల్ప విశ్వాసులారా, ఎందుకు భాధపడుతున్నారు?" (8:26).
యేసుకు గాలీ, సముద్రమూ లోబడుతున్నాయని శిష్యులు ఆశ్చర్యపడ్డారు (8:27).
యేసు దయ్యములు పట్టిన ఇద్దరు ఉగ్రులైన మనుషులను కలుసుకున్నాడు (8:28).
సమయము రాకమునుపే మమ్మును బాధించుటకు వచ్చితివా అని యేసుతో చెప్పాయి (8:29).
యేసు ఆ దయ్యాలను వెళ్ళగొట్టగా, అవి పందుల గుంపులో ప్రవేశించి సముద్రములోకి వేగంగా పరుగెత్తి నీళ్ళలో పడి చనిపోయాయి (8:32).
పట్టణస్థులు తమ ప్రాంతం విడిచిపొమ్మని ఆయనను బ్రతిమాలుకొన్నారు (8:34).
పక్షవాతం గలవానితో అతని పాపలు క్షమించబడ్డాయని చెప్పడం ద్వారా ఆయనకు పాపాలు క్షమించే అధికారం ఉన్నదని చెప్పాడు (9:5-6).
ప్రజలు భయపడి మనుష్యునికి ఇలాంటి అధికారం ఇచ్చిన దేవుణ్ణి స్తుతించారు (9:8).
యేసు శిష్యుడు కాకముందు మత్తయి సుంకపు పన్ను వసూలుదారుడు (9:9).
యేసు, ఆయన శిష్యులు సుంకరులతో, పాపులతో కలసి భోజనం చేశారు (9:10).
యేసు పాపులను పిలవడానికి వచ్చానని చెప్పాడు (9:13).
తన శిష్యులతో తనతో కలసి ఉన్నందున వారు ఉపవాసం ఉండడం లేదని యేసు చెప్పాడు (9:15).
యేసు వారి యొద్ద నుండి కొనిపోబడినప్పుడు ఉపవాసం ఉంటారని యేసు చెప్పాడు (9:15).
రక్తస్రావ రోగం గల స్త్రీ యేసు పైవస్త్రపు చెంగును మాత్రం ముట్టుకుంటే తాను స్వస్థపడతానని అనుకొన్నది (9:20-21).
స్త్రీ బాగుపడడానికి ఆమె విశ్వాసం దోహద పడిందని యేసు చెప్పాడు (9:22).
ఆ బాలిక చనిపోలేదు, నిద్రపోతున్నదని యేసు చెప్పినప్పుడు అక్కడి ప్రజలు ఆయనను అపహసించారు (9:24).
యేసు ఆ బాలికను మరణం నుండి లేపిన వార్త అ ప్రాంతమంతా వ్యాపించింది (9:26).
"దావీదు కుమారుడా, మమ్మును కనికరించుము" అంటూ ఇద్దరుగుడ్డి వారు కేకలు వేసారు (9:27).
యేసు ఇద్దరు గుడ్డి వారిలో ఉన్న నమ్మకాన్ని బట్టి స్వస్థపరిచాడు (9:29).
ఈయన దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పారు (9:34).
యేసు జన సమూహమును చూసి వారు కాపరి లేని గొర్రెల వలే , విసిగి చెదరి ఉన్నందున వారిపై కనికరపడ్డాడు (9:36).
కొత్త విస్తారంగా ఉన్నందున కోత పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొమ్మని యేసు తన శిష్యులతో చెప్పాడు (9:38).
అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, ప్రతివిధమైన రోగమును, వ్యాధిని స్వస్థపరుచుటకు యేసు తన పన్నెండుమంది శిష్యులకు అధికారం ఇచ్చాడు (10:1).
యేసును అప్పగించేబోయే శిష్యుని పేరు ఇస్కరియోతు యూదా (10:4).
యేసు తన శిష్యులను ఇశ్రాయేలు దేశంలోని నశించిన గొర్రెల యొద్దకు పంపాడు (10:6).
లేదు, శిష్యులు ధనం గానీ, అదనంగా దుస్తులు గానీ తమ వెంట తీసుకుని వెళ్ళకూడదు (10:9-10).
శిష్యులు గ్రామ గ్రామాలకు తిరుగుతున్నపుడు యోగ్యుడైన ఒక వ్యక్తిని వెదకి అతని ఇంటి వద్ద బస చెయ్యాలి (10:11).
శిష్యులను అంగీకరించక, వారి మాటలు వినని పట్టణాల ప్రజలకు సోదోమ గోమోర్రా జరిగినదానికంటే మించిన కీడు జరుగుతుంది (10:14-15).
శిష్యులుగా ఉండగోరువారు ప్రజలచే మహాసభలకు అప్పగింపబడడానికి, కొరడా దెబ్బలు తినడానికి, అధిపతుల ఎదుట నిలబడడానికి సిద్ధపడి ఉండాలి (10:17-18).
శిష్యులు మాట్లాడుతున్నప్పుడు తండ్రి ఆత్మ వారిలో ఉండి మాట్లాడిస్తున్నారు (10:20).
అంతము వరకు సహించినవాడు రక్షింపబడతారని యేసు చెప్పాడు (10:22).
యేసును ద్వేషించినవారు ఆయన శిష్యులను కూడా ద్వేషిస్తారు (10:22,24-25).
ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడనక్కరలేదని యేసు చెప్పాడు (10:28).
ఆత్మను, దేహమును కూడా నరకములో నశింపజేసే వాడికి భయపడాలని యేసు చెప్పాడు (10:28).
యేసును ఒప్పుకొన్నవారిని ఆయన తన తండ్రి ఎదుట ఒప్పుకుంటాడు (10:32).
యేసును తిరస్కరించిన వారిని ఆయన తన తండ్రి ఎదుట తిరస్కరిస్తాడు (10:33).
గృహాలలోని సభ్యులలో విభేదాలు పెట్టేందుకు తాను వచ్చానని యేసు చెప్పాడు (10:34-36).
యేసు కోసం తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకుంటాడు (10:39).
శిష్యుడని ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చల్లని నీరు ఇచ్చేవాడు అందుకు తగిన ఫలము పొందుతాడు (10:42).
యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించుట ముగించిన తరువాత పట్టణంలలో బోధించుటకు, ప్రకటించుటకు వెళ్ళిపోయాడు (11:1).
బాప్తిస్మం ఇచ్చు యోహాను యేసుకు, "రాబోవువాడవు నీవేనా? మేము మరియొకని కొరకు కనిపెట్టవలెనా" అనే సందేశం పంపిచాడు (11:3).
గుడ్డివారు చూచుచున్నారు, చనిపోయినవారు తిరిగి లేస్తున్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుతున్నది అని యోహానుకు చెప్పమని యేసు చెప్పాడు (11:5).
తన విషయంలో అభ్యంతరపడనివాడు ధన్యుడని యేసు చెప్పాడు (11:6).
మార్గమును సిద్ధపరచడానికి ముందుగా రాబోవు దూత అని బాప్తిస్మం ఇచ్చు యోహానును గూర్చిన ప్రవచనం ఉన్నది అని యేసు చెప్పాడు(11:9-10).
బాప్తిస్మం ఇచ్చు యోహాను ఏలీయా ప్రవక్త అని యేసు చెప్పాడు (11:14).
బాప్తిస్మం ఇచ్చు యోహాను ఏమియు తినకుండా, త్రాగకుండా ఉండుటను బట్టి అతనికి దయ్యము పట్టింది అన్నారు (11:18).
యేసు ఇతరులతో కలసి తినుచూ, త్రాగుచూ ఉండుటను బట్టి అక్కడివారు అతనిని గూర్చి ఇతడు తిండిబోతు, తాగుబోతు, సుంకరులకు, పాపులకు స్నేహితుడని చెప్పుకున్నారు (11:19).
విస్తారమైన అద్భుత కార్యాలు జరిగించినప్పటికీ మార్పు నొందని పట్టణాలపై తీర్పు వస్తుందని యేసు ప్రకటించాడు (11:20-24).
పరలోక రాజ్య విషయాలను జ్ఞానులకు, వివేకులకు మరుగు చేసినందుకు యేసు తండ్రికి స్తుతులు చెల్లించాడు (11:25).
పరలోక రాజ్య విషయాలను పసిపిల్లలకు, బుద్ధిహీనులకు బయలు పరచినందుకు యేసు తండ్రికి స్తుతులు చెల్లించాడు (11:25).
తండ్రి తనకు తెలుసుననీ తనకు ఇష్టమైన వారికి తాను బయలు పరుస్తాననీ యేసు చెప్పాడు (11:27).
ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త ప్రజలకు ఆయన విశ్రాంతి కలుగజేస్తానని యేసు వాగ్దానం చేశాడు (11:28).
యేసు శిష్యులు పంటచేనిలో ప్రవేశించి వెన్నులు తుంచి తింటూ విశ్రాంతి దినమున చేయకూడని పని చేస్తున్నారని పరిసయ్యులు నేరారోపణ చేశారు (12:2).
యేసు తానే దేవాలయము కంటే గొప్పవాడినని చెప్పాడు (12:6).
మనుష్య కుమారుడైన యేసు విశ్రాంతి దినానికి ప్రభువు (12:8).
పరిసయ్యులు యేసును "విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా?" అని ప్రశ్నించారు (12:10).
విశ్రాంతి దినమున మేలు చేయుట న్యాయమేనని యేసు చెప్పాడు (12:12).
యేసు ఊచ చెయ్యి గలవాడిని స్వస్థపరచినపుడు పరిసయ్యులు ఆలయం బయటకు వెళ్లి యేసును ఎలా సంహరించాలి అని ఆయనకు విరోధముగా ఆలోచన చేశారు (12:14).
యేసును గూర్చి యెషయా ప్రవచనం ప్రకారం యేసు జగడమాడడు, కేకలు వేయడు, నలిగినా రెల్లును విరువడు, మకమకలాడుతున్నఅవిసెనారను ఆర్పడు (12:19-20).
అన్యజనులకు దేవుని న్యాయవిధి యేసు ద్వారా ఎవరికి ప్రచురము చేయబడుతుంది (12:18,21).
సాతాను వలన సాతానును వెళ్ళగొడితే సాతాను రాజ్యము ఎలా నిలబడుతుంది అని యేసు చెప్పాడు (12:26).
దేవుని ఆత్మ వలన తాను దయ్యములను వెళ్ళగొట్టినప్పుడు దేవుని రాజ్యము వారి యొద్దకు వస్తుందని యేసు చెప్పాడు (12:28).
ఆత్మ విషయమైన దూషణ అనే పాపం క్షమించబడదని యేసు చెప్పాడు (12:31).
చెట్టు అది కాసే ఫలాల వలన మంచిదో, కాదో తెలుస్తుంది (12:33).
తమ మాటలను బట్టి పరిసయ్యులు అపరాధులుగా తీర్పు తీర్చబడతారు అని యేసు చెప్పాడు(12:37).
యోనా ఉన్నట్టు, మూడు రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండబోతున్నానని యేసు ఈ తరం వారికి సూచన ఇచ్చాడు (12:39-40).
తాను యోనా కంటే గొప్పవాడినని యేసు చెప్పాడు (12:41).
నీనివే ప్రజలు, దక్షిణ దేశపు రాణి యోనా ద్వారా, సొలోమోను ద్వారా దేవుని మాటలు విన్నారు. యేసు తరంలోని ప్రజలపై యోనా, సోలోమోనుల కంటే గొప్పవాడైన యేసు మాటలు వినలేదు (12:41-42).
తాను సొలోమోను కంటే గొప్పవాడినని యేసు చెప్పాడు (12:42).
వదిలి పోయిన అపవిత్రాత్మవెళ్లి తనకంటే చెడ్డవైన మరో ఏడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చి ఆ వ్యక్తి కడపటి స్థితి కంటే మొదటి స్థితి హీనమైనదిగా అయ్యేలా చేస్తుంది. యేసు తరంలోని వ్యక్తి అలానే ఉంటాడు(12:43-45).
తన తండ్రి చిత్తము చొప్పున చేయువాడే తనకు తల్లి, సహోదరుడు, సహోదరి అని యేసు చెప్పాడు (12:46-50).
త్రోవ పక్కన పడిన విత్తనాలను పక్షులు వచ్చి తినివేశాయి (13:4).
మన్నులేని రాతి నేలను పడిన విత్తనాలు అక్కడ మన్ను లేనందున అవి మొలిచాయి గానీ, సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాయి (13:5-6).
ముండ్ల పొదలలో పడిన విత్తనాలు మొలిచి ముండ్లపొదలు పెరిగి వాటిని అణచివేశాయి (13:7).
మంచి నేలలో పడిన విత్తనాలు ఒకటి నూరంతలుగా, ఒకటి అరువదంతలుగా, ఒకటి ముప్పదంతలుగా ఫలించాయి (13:8).
యెషయా ప్రవచనం ప్రకారం, ప్రజలు వింటారు గానీ గ్రహించరు, చూస్తారు గానీ ఎంతమాత్రము తెలుసుకోరు (13:14).
యేసు మాటలు విని వాటిని అర్ధం చేసుకోలేని ప్రజల హృదయాలు కొవ్వు పట్టాయి. వారి చెవులు మందములయ్యాయి, వారి కన్నులు మూసికోనిపోయాయి (13:15).
త్రోవ పక్కన పడిన విత్తనం వలే ఒక వ్యక్తివాక్యము విని దానిని గ్రహించక ఉన్నప్పుడు దుష్టుడు వచ్చి వాని హృదయములో చల్లిన దానిని ఎత్తుకుపోతాడు (13:19).
రాతి నెలలో పడిన విత్తనం వలే ఒక వ్యక్తి వాక్యము విని వెంటనే దానిని సంతోషముగా గ్రహించును కానీ, వాక్యము నిమిత్తము శ్రమ అయినను, హింస అయినను కలుగగానే అభ్యంతరపడతాడు (13:20-21).
ముండ్ల పొదలలో పడిన విత్తనం వలే ఒక వ్యక్తిని ఐహిక విచారములు, ధన మోహము ఆ వాక్యము అణచివేస్తాయి (13:22).
మంచి నేలలో పడిన విత్తనం వలే ఒక వ్యక్తి వాక్యము విని గ్రహించి, సఫలుడై, నూరంతలుగా, అరువదంతలుగా, ముప్పదంతలుగా ఫలిస్తాడు (13:23).
శత్రువు పొలములో గురుగులు చల్లాడు (13:28).
రెండు పంటలూ కలసి పెరిగిన తరువాత కోతకాలము వచ్చినప్పుడు, గోధుమలను గిడ్డంగిలో సమకూర్చి, గురుగులను తగలబెట్టమని యజమాని చెప్పాడు (13:30).
ఆవగింజ మొక్క పెరిగి పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల్లో నివసించునంత చెట్టు అవుతుంది (13:31-32).
పరలోక రాజ్యము కొంచెము పొంగజేసే పదార్థం కలిసిన మూడు కుంచాల పిండి తో పోల్చబడినది (13:33).
మంచి విత్తనాలు విత్తేవాడు మనుష్య కుమారుడు, పంట పొలం లోకం, మంచి విత్తనాలు రాజ్య వారసులు, గురుగులు దుష్టుని సంబంధులు, పంట కోయువారు దేవదూతలు (13:37-39).
యుగసమాప్తిలో దుర్నీతిపరులు అగ్నిగుండములో పడవేయబడతారు (13:42).
యుగసమాప్తిలో నీతిమంతులు తండ్రి రాజ్యంలో సూర్యునివలే తేజరిల్లుతారు (13:43).
తనకు ఉన్నదంతా అమ్మి ఆ పొలము కొన్నాడు (13:44).
మంచి ముత్యం కనుగొన్న వ్యక్తి వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి అ ముత్యం కొన్నాడు (13:45-46).
వల నిండినప్పుడు మంచి చేపలను గంపలోకి చేర్చి, చెడ్డవాటిని బయట పారవేస్తారు. అదే విధంగా యుగసమాప్తిలో దేవదూతలు నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పాడవేస్తారు (13:47-50).
"ఈ జ్ఞానం, ఈ అద్భుతములు చేసే శక్తి ఎక్కడినుంచి వచ్చాయి" అని ఆశ్చర్యపడ్డారు (13:54).
ప్రవక్త తన దేశములో, తన యింటిలో ఘనహీనుడుగా ఉంటాడని యేసు చెప్పాడు (13:57).
స్వదేశీయుల అవిశ్వాసం వల్ల యేసు అక్కడ అనేక అద్భుతాలు చేయలేదు (13:58).
బాప్తిసమిచ్చే యోహాను చనిపోయి తిరిగి లేచాడని హేరోదు యేసును గురించి అనుకున్నాడు (14:2).
హేరోదు తన సోదరుని భార్యను ఉంచుకొన్నాడని యోహాను చెప్పాడు (14:4).
ప్రజలు ఇతనిని ప్రవక్త అని గౌరవిస్తున్నందువల్ల ప్రజలకు భయపడి హేరోదు యోహానుకు వెంటనే మరణ శిక్ష విధించలేదు (14:5).
హేరోదియ ఏమి కోరినా ఇస్తానని ఆమెకు ప్రమాణం చేశాడు (14:7).
ఒక పళ్ళెంలోయోహాను తలను తెచ్చి ఇవ్వమని కోరింది (14:8).
విందు సమయంలో ప్రజలందరి ఎదుటా చేసిన ప్రమాణం నెరవేర్చుకోవడానికి ఆమె కోరిక తీర్చవలసి వచ్చింది. (14:9).
జనసమూహములను చూసి యేసు వారిపై కనికరపడి, వారిలో రోగులను స్వస్థపరిచాడు (14:14).
జనసమూహములకు మీరే భోజనము పెట్టమని యేసు తన శిష్యులతో చెప్పాడు (14:16).
యేసు ఆ రొట్టెలను, చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి, ఆశీర్వదించి ఆ రొట్టెలు జనసమూహమునకు పంచమని శిష్యులకు ఇచ్చాడు (14:19).
అయిదు వేలమంది పురుషులతోపాటు స్త్రీలు, పిల్లలు తినగా పన్నెండు గంపలు మిగిలిపోయాయి (14:20-21).
యేసు ఒంటరిగా ప్రార్థన చేయడానికి కొండ పైకి వెళ్ళాడు (14:23).
బలమైన గాలి వీచినప్పుడు శిష్యులు ప్రయాణిస్తున్న నావ అదుపుతప్పింది (14:24).
యేసు నీళ్ళపై నడుచుకుంటూ వచ్చాడు (14:25).
యేసు తన శిష్యులకు నేనే, భయపడవద్దని, ధైర్యంగా ఉండమని చెప్పాడు (14:27).
నీళ్ళపై నడచి రమ్మని యేసు పేతురుతో చెప్పాడు (14:29).
పేతురు భయపడినప్పుడు నీళ్ళలో మునిగిపోవడం మొదలుపెట్టాడు (14:30).
యేసు, పేతురు దోనె ఎక్కినప్పుడు గాలి అణగిపోయింది (14:32).
దీనిని చూసిన శిష్యులు యేసు నిజముగా దేవుని కుమారుడని చెప్పి ఆయనకు మొక్కారు (14:33).
యేసు, ఆయన శిష్యులు సముద్రపు అవతలి తీరం చేరుకొన్నప్పుడు ప్రజలు రోగులను యేసు దగ్గరకు తీసుకువచ్చారు (14:35).
పరిసయ్యులు తమ తల్లితండ్రుల నుండి సంక్రమించినది "దేవార్పితమని" చెప్పి తమ పిల్లలను వారికి సహాయం చేయనీయక అడ్డుపడుతున్నారు (15:3-6).
పరిసయ్యులు తమ పెదవులతో దేవుణ్ణి ఘనపరుస్తారు గాని వారి హృదయాలు ఆయనకు దూరముగా ఉన్నవి అని యెషయా ప్రవచించాడు (15:7-8).
పరిసయ్యులు మనుషులు కల్పించిన పద్ధతులు బోధిస్తున్నారు (15:9).
మనుష్యుని నోటిలోకి వెళ్ళునది అతనిని అపవిత్రపరచదని యేసు చెప్పాడు (15:11,17,20).
మనుష్యుని నోటి నుండి వచ్చునది అతనిని అపవిత్రపరుస్తుందని యేసు చెప్పాడు (15:11,18-20).
యేసు పరిసయ్యులను గుడ్డివారని పిలిచాడు. గుడ్డివారు గుడ్డివారికి దారి చూపినపుడు ఇద్దరూ గుంటలో పడతారు (15:14).
దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారం, వేశ్యాగమనము, దొంగతనము, అబద్ధ సాక్ష్యము, దేవదూషణ ఒక వ్యక్తి హృదయాన్ని మలినం చేస్తాయి (15:19).
యేసు ఆమెతో ఒక్క మాట కూడా చెప్పలేదు (15:23).
యేసు, తాను ఇశ్రాయేలు ఇంటివారిలో నశించిన గొర్రెల వద్దకే పంపబడ్డానని చెప్పాడు (15:24).
ఆమె విశ్వాసము గొప్పదని చెప్పి, ఆమె కోరుకొన్నది నెరవేర్చాడు (15:28).
యేసు మూగ వారిని, కుంటివారిని, గుడ్డివారిని, అంగహీనులను స్వస్థపరిచాడు (15:30-31).
శిష్యుల వద్ద ఉన్న ఏడు రొట్టెలు, కొన్ని చిన్న చేపలతో యేసు జనసమూహం ఆకలి తీర్చాడు (15:34).
యేసు రొట్టెలు, చేపలు పట్టుకొని దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించి, రొట్టెలు విరిచి తన శిష్యులకు ఇచ్చాడు (15:36).
స్త్రీలు, పిల్లలు కాక నాలుగు వేలమంది పురుషులు తృప్తిగా తిన్నారు (15:38).
వారందరూ తిన్న తరువాత ఏడు గంపల రొట్టెలు, చేపలు మిగిలాయి (15:37).
పరిసయ్యులు, సద్దూకయ్యులు ఆకాశము నుండి ఏదైనా సూచక క్రియ చేసి చూపించమని యేసును అడిగారు (16:1).
పరిసయ్యులు, సద్దూకయ్యులకు యోనాను గూర్చిన సూచక క్రియ వారికి అనుగ్రహింపబడుతుందని చెప్పాడు (16:4).
పరిసయ్యులు, సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త వహించాలని యేసు తన శిష్యులకు చెప్పాడు (16:6).
శిష్యులను జాగ్రత్త వహించాలని చెప్పడంలోని యేసు అసలైన ఉద్దేశం పరిసయ్యుల, సద్దూకయ్యుల బోధలను గూర్చి జాగ్రత్త పడమని (16:12).
యేసు తన శిష్యులను "మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారు?" అని అడిగాడు (16:13).
కొందరు బాప్తీస్మమిచ్చు యోహాను అనీ, కొందరు ఏలీయా అనీ, కొందరు యిర్మీయా అనీ, ప్రవక్తలలో ఒకడనీ అనుకొంటున్నారు (16;14).
"నీవు సజీవుడైన దేవుని కుమారడవైన క్రీస్తువు" అని పేతురు జవాబిచ్చాడు (16:16).
యేసు అడిగిన ప్రశ్నకు జవాబును పరలోకమందున్న తండ్రి అతనికి బయలుపరిచాడు (16:17).
యేసు పరలోకపు తాళపు చెవులు పేతురుకు ఇచ్చాడు. పేతురు భూలోకంలో దేనిని బంధిస్తాడో పరలోకంలో అది బంధించబడుతుంది, భూలోకంలో దేనిని విప్పుతాడో అది పరలోకంలో విప్పబడుతుంది అని యేసు చెప్పాడు (16:19).
తాను యెరూషలేముకు వెళ్లి, అనేక శ్రమలు పొంది, చంపబడి, మూడవ రోజున లేపబడవలసి ఉన్నదని చెప్పడం మొదలుపెట్టాడు (16:21).
యేసు పేతురుతో, "సాతానా, నా వెనుకకు పొమ్ము" అన్నాడు (16:23).
యేసును అనుసరించే ప్రతి ఒక్కరూ తనను తాను ఉపేక్షించుకొని, తన సిలువను ఎత్తికొని ఆయనను వెంబడించాలి (16:24).
ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే వానికి ఏమి ప్రయోజనము అని యేసు చెప్పాడు (16:26).
మనుష్యకుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కలసి రాబోతున్నాడని యేసు చెప్పాడు (16:27).
మనుష్యకుమారుడు తిరిగి వచ్చినప్పుడు ప్రతివారికి వారి వారి క్రియల చొప్పున తగిన ప్రతిఫలం చెల్లిస్తాడు (16:27).
పేతురు, యాకోబు అతని సహోదరుడైన యోహాను యేసుతో కలసి వెళ్లారు (17:1).
యేసు ముఖము సూర్యునివలె ప్రకాశించింది. ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివయ్యాయి (17:2).
మోషే, ఏలీయాలు యేసుతో మాట్లాడడానికి ప్రత్యక్షమయ్యారు (17:3).
వారు ముగ్గురికీ మూడు కుటీరాలు నిర్మిద్దామని పేతురు అన్నాడు (17:4).
ప్రకాశవంతమైన మేఘము నుండి, "ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి" అన్న మాటలు వినిపించాయి (17:5).
మనుష్య కుమారుడు మరణించి తిరిగి లేచే వరకు ఈ దర్శనము ఎవరికీ చెప్పవద్దని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు (17:9).
లేఖనాల ప్రకారం ఏలీయా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెడతాడని యేసు చెప్పాడు (17:11).
ఏలీయా బాప్తిసమిచ్చే యోహానుగా ఇదివరకే వచ్చినప్పుడు మనుషులు అతనిని తెలుసుకోక, వారి ఇష్టం వచ్చినట్టు అతని పట్ల చేశారు అని యేసు చెప్పాడు (17:10-13).
శిష్యులు చాంద్ర రోగం ఉన్న బాలుణ్ణి స్వస్థ పరచ లేకపోయారు (17:14-16).
యేసు అతనిలో ఉన్న దయ్యాన్ని గద్దించాడు. ఆ గంటలోనే ఆ బాలుడు స్వస్థత పొందాడు (17:18).
తమకున్న అల్ప విశ్వాసం వల్లనే బాలుణ్ణి శిష్యులు స్వస్థ పరచ లేకపోయారని యేసు చెప్పాడు (17:20).
యేసు తన శిష్యులతో తనను చంపే వారికీ తనను అప్పగిస్తారని, వారు తనను చంపుతారని, మూడవ రోజున తిరిగి లేస్తానని చెప్పినప్పుడు శిష్యులు విచారగ్రస్తులయ్యారు (17:22-23).
పేతురును సముద్రమునకు వెళ్లి, గాలం వేసి మొదటగా వచ్చే చేపను పట్టుకొని దాని నోరు తెరిచి అక్కడ దొరికిన ఒక షెకెలుతో ఇద్దరి పన్ను కట్టాలని యేసు పేతురుతో చెప్పాడు (17:27).
మనం తప్పక మార్పు చెంది చిన్న బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించలేము అని యేసు చెప్పాడు (18:3).
తనను తాను తగ్గించుకునేవాడే పరలోక రాజ్యంలో గొప్పవాడని యేసు చెప్పాడు (18:4).
యేసునందు విశ్వాసముంచిన చిన్నవారిని అభ్యంతరపరచువాడు మెడకు తిరుగలి రాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట మేలు (18:6).
మనకు అభ్యంతరం కలిగించే దేనినైనా విసిరి పారవేయాలని యేసు చెప్పాడు (18:8-9).
చిన్నపిల్లలను ఎందుకు తృణీకరించకూడదంటే పిల్లల దూతలు పరలోకమందున్న తండ్రి ముఖాన్ని చూస్తున్నారని యేసు చెప్పాడు (18:10).
ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న తండ్రి చిత్తము కాదు (18:12-14).
మొదటగా, అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతని తప్పు తెలియజెయ్యి (18:15).
రెండవదిగా, నీతో సహా ఇద్దరు ముగ్గురిని సాక్ష్యులుగా నీ వెంట తీసుకు వెళ్ళు (18:16).
మూడవది, ఆ సంగతి సంఘములో చెప్పాలి (18:17).
ఇద్దరు ముగ్గురు కూడుకొని ప్రార్ధించినప్పుడు వారి మధ్యన ఉంటానని యేసు వాగ్దానం చేస్తున్నాడు (18:20).
మనం మన సహోదరుణ్ణి ఏడుసార్లు మాత్రమే కాదు, డెభ్బై ఏళ్లసార్లు క్షమించాలని యేసు చెప్పాడు (18:21-22).
సేవకుడు తన యజమానికి పదివేల తలాంతులు అచ్చియున్నాడు. అతడు దానిని తీర్చలేకపోయాడు (18:24-25).
యజమాని ఆ సేవకునిపై కనికరపడి అతనిని విడిచిపెట్టి క్షమించాడు (18:27).
ఆ సేవకుడు తనకు వంద తలాంతులు అచ్చియున్న తోటి సేవకుణ్ణి క్షమించకుండా చెరసాలలో వేయించాడు (18:28-30).
యజమాని సేవకుణ్ణి పిలిచి అతడు క్షమించబడినట్టు, అతని తోటి దాసుని పట్ల కనికరం చూపాలని చెప్పాడు (18:33).
యజమాని తనకు అచ్చియున్నందంతా చెల్లించే వరకూ బాధపరచువారికి అతణ్ణి అప్పగించాడు (18:34).
యజమాని తన సేవకునిపట్ల చేసినట్టు, మనం మన సహోదరులను హృదయపూర్వకంగా క్షమించకపోతే పరలోకపు తండ్రి కూడా ఇలాగే చేస్తాడని యేసు చెప్పాడు (18:35).
"ఏ కారణం చేతనైనా భార్యకు విడాకులు ఇవ్వడం న్యాయమేనా?" అని పరిసయ్యులు యేసుని ప్రశ్నించారు (19:3).
సృష్టి ఆరంభంలో దేవుడు పురుషుని, స్త్రీని సృష్టించాడని యేసు చెప్పాడు (19:4).
పురుషుడు తన తండ్రిని, తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడని యేసు చెప్పాడు (19:5).
పురుషుడు తన భార్యను హత్తుకొని ఉండుట వలన వారిద్దరూ ఏక శరీరులుగా ఉంటారు (19:5-6).
దేవుడు జతపరచిన వారిని మానవుడు వేరు చేయకూడని చేయకూడని యేసు చెప్పాడు (19:6).
ఆనాటి యూదుల హృదయ కఠినత్వాన్ని బట్టి మోషే విడాకులు అనుమతించాడని యేసు చెప్పాడు (19:7-8).
కేవలం వ్యభిచారం కోసమే తన భార్యను విడిచిపెట్టి మరో స్త్రీని వివాహం చేసుకొనేవాడు వ్యభిచారి. విడిచి పెట్టబడిన దానిని వివాహం చేసుకొనేవాడు వ్యభిచారి అని యేసు చెప్పాడు (19:9).
నపుంసకులుగా మారేందుకు అంగీకరించే వారిని నపుంసకులుగా మారనివ్వండి అని యేసు చెప్పాడు (19:10-12).
చిన్నపిల్లలను యేసు దగ్గరకు తీసుకు వచ్చినప్పుడు శిష్యులు వారిని గద్దించారు (19:13).
చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని తన యొద్దకు రానివ్వమని, పరలోక రాజ్యం ఇలాంటివారిదేనని యేసు చెప్పాడు (19:14).
నిత్యజీవంలో ప్రవేశించాలంటే ఆజ్ఞలన్నిటినీ పాటించమని యేసు అ యువకునితో చెప్పాడు (19:16-17).
ఆజ్ఞలన్నిటినీ పాటిస్తున్నానని అ యువకుడు చెప్పినప్పుడు యేసు అతనితో అతనికున్నవన్నీ అమ్మివేసి పేదవారికి ఇవ్వమని చెప్పాడు (19:20-21).
ఆ యువకుడు ఎక్కువ ఆస్థి గలవాడు కనుక యేసు చెప్పిన మాట విని విచార పడుతూ తిరిగి వెళ్ళిపోయాడు (19:22).
ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని యేసు చెప్పాడు. అయితే దేవునికి సమస్తమును సాధ్యమే (19:23-26).
తనను వెంబడించిన శిష్యులు పునరుత్థాన దినమందు, వారు పన్నెండు సింహాసనములపై కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల వారికి తీర్పు తీరుస్తారని యేసు చెప్పాడు (19:28).
మొదటివారు అనేకులు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారు అని యేసు చెప్పాడు (19:30).
ఇంటి యజమాని తాను కుదుర్చుకొన్న పనివారికి రోజుకు ఒక దేనారము ఇవ్వడానికి అంగీకరించాడు (20:1-2).
ఏది న్యాయమో అది ఇస్తానని ఇంటి యజమాని కూలివారితో చెప్పాడు (20:4-7).
పన్నెండు గంటలకు కుదుర్చుకున్న కూలీలకు ఒక దేనారము కూలి లభించింది (20:9).
తాము రోజంతా పనిచేసినప్పటికీ చివరి గంట పనిచేసినవారితో సమానమైన కూలీ దొరికిందని సణుగుకొన్నారు (20:11-12).
పొద్దుటి నుంచి పని చేసినవారికి చెప్పినట్టు ఒక దేనారం కూలి ఇచ్చానని, అయితే తన ఇష్ట ప్రకారం మిగతా కూలీలకు కూడా అంతే చెల్లించానని ఇంటి యజమాని చెప్పాడు (20:13-15).
తనను ప్రధాన యాజకులు శాస్త్రులు పట్టుకొని మరణ శిక్ష విధించి సిలువ వేస్తారని, తాను మూడవ రోజున తిరిగి లేస్తానని శిష్యులకు ముందుగా చెప్పాడు (20:17-19).
తన కుమారులు యేసు రాజ్యంలో ఆయనకు కుడివైపున ఒకరు, ఎడమవైపున ఒకరు కూర్చుని ఉండాలని యేసును కోరుకున్నది (20:20-21).
ఆయన ఎంపిక చేసిన వారికోసం తగిన స్థలాలను తండ్రి అయిన దేవుడు నిర్ణయిస్తాడు (20:23).
గొప్పవాడుగా ఉండగోరిన వాడు పరిచారకుడుగా ఉండాలని ఉండాలని యేసు చెప్పాడు (20:26).
అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇవ్వడానికి వచ్చానని యేసు చెప్పాడు (20:28).
ఆ ఇద్దరు గుడ్డివాళ్ళు, "ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణించు" అని కేకలు వేసారు (20:30).
ఇద్దరు గుడ్డివాళ్ళను చూసి యేసు వారిపై కనికరపడ్డాడు (20:34).
శిష్యులు వెళ్ళినప్పుడు వారికి కట్టబడియున్న ఒక గాడిద, దానితో గాడిద పిల్ల కనబడతాయని యేసు చెప్పాడు (21:2).
ప్రవక్త, ఇదిగో నీ రాజు గాడిదను, చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని ప్రవచించాడు (21:4-5).
యెరూషలేము వీధుల్లో యేసు ప్రయాణిస్తున్నపుడు జనసమూహములు పైబట్టలు, చెట్ల కొమ్మలు దారి వెంట పరిచారు (21:8).
జనసమూహం "దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము" అని కేకలు వేశారు (21:9). .
దేవాలయములో ప్రవేశించి యేసు, క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టి, రూకలు మార్చువారి, గువ్వలను అమ్మేవారి బల్లలను పడదోశాడు (21:12).
దేవుని మందిరాన్ని వ్యాపారులు దొంగల గుహవలె చేశారని యేసు అన్నాడు (21:13).
బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్దింపజేసితివి అని ప్రవక్తలచే పలుకబడిన ప్రవచనం యేసు వారికి గుర్తు చేశాడు (21:15-16).
అది కాపు లేకుండా ఉన్నందువల్ల యేసు ఆ చెట్టుని శపించాడు (21:18-19).
వారు ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుతారో అవి దొరికాయని నమ్మితే వాటన్నిటినీ పొందుతారని యేసు బోధించాడు (21:20-22).
ప్రధాన యాజకులు, పెద్దలు యేసు దగ్గరకు వచ్చి, ఏ అధికారంతో యేసు ఈ పనులన్నీ చేస్తున్నాడని అడిగారు (21:23).
బాప్తిసమిచ్చే యోహాను ఇచ్చే బాప్తిస్మం పరలోకం నుండి కలిగిందా, లేక మనుషులనుండి కలిగిందా అని యేసు వారిని ప్రశ్నించాడు (21:25).
బాప్తిసమిచ్చే యోహాను ఇచ్చే బాప్తిస్మం పరలోకం నుండి కలిగినది అని చెబితే, యోహానును ఎందుకు నమ్మలేదని యేసు ప్రశ్నించవచ్చు (21:25).
బాప్తిసమిచ్చే యోహానును ఒక ప్రవక్తగా భావిస్తున్న ప్రజలకు భయపడి ఏ జవాబూ చెప్పలేదు (21:26).
మొదటి కుమారుడు ముందు వెళ్లనని చెప్పినప్పటికీ తరువాత తన మనస్సు మార్చుకొని వెళ్లి పని పూర్తిచేశాడు (21:28-31).
సుంకరులు, వేశ్యలు యోహాను నీతి మార్గమును నమ్మారు, ప్రధాన యాజకులు, శాస్త్రులు యోహాను నీతి మార్గమును నమ్మక పశ్చాత్తాపపడలేదు (21:31-32).
గుత్త కాపులు సేవకులలో ఒకరిని కొట్టారు, ఒకరిని చంపారు, మరియొకరిపై రాళ్ళు రువ్వారు (21:35-36).
చివరగా యజమాని తన కుమారుణ్ణి పంపించాడు (21:37).
యజమాని కుమారుణ్ణి గుత్త కాపులు చంపివేశారు (21:38-39).
ఆ దుర్మార్గులైన గుత్త కాపులను సంహరించి పంటలో భాగం ఇచ్చే వేరే కాపులకు ఇవ్వమని చెప్పారు (21:40-41).
ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అవుతుంది (21:42).
దేవుని రాజ్యము ప్రధాన యాజకులు, పరిసయ్యుల యొద్ద నుండి తీసివేయబడి దాని ఫలమిచ్చు ప్రజల యొద్దకు తీసుకురాబడుతుంది (21:43).
యేసును ప్రజలు ప్రవక్త అని భావించినందువల్ల ప్రధాన యాజకులు, పరిసయ్యులు ప్రజలకు భయపడి యేసును బంధించలేకపోయారు (21:46).
కొందరు ఆహ్వానం లక్ష్యపెట్టలేదు, కొందరు తమ సొంత పనులకు వెళ్ళిపోయారు, కొందరు ఆ సేవకులను పట్టుకుని అవమాన పరచి చంపివేశారు (22:2-6).
రాజు తన సేనలను పంపి ఆ హంతకులను చంపించి, వారి నగరాన్ని తగలబెట్టించాడు (22:7).
తరువాత రాజు తన సేవకులకు కనబడినవారందరినీ, వారు మంచివారైనా, చెడ్డవారైనా అందరినీ పిలిపించాడు (22:9-10).
పెండ్లి దుస్తులు ధరించనివారి కాళ్ళు, చేతులు కట్టివేసి చీకటిలోకి తోసివేశాడు (22:11-13).
పరిసయ్యులు యేసును మాటలలో పెట్టి చిక్కుల్లో పడవేయాలని చూశారు (22:15).
కైసరుకు పన్ను కట్టడం న్యాయమా, కాదా అని యేసును అడిగారు (22:17).
కైసరువి కైసరుకి, దేవునివి దేవునికి ఇవ్వమని వారికి జవాబిచ్చాడు (22:21).
పునరుత్దానము అనేది లేదని సద్దూకయ్యుల నమ్ముతారు (22:23).
ఒక స్త్రీకి ఏడుగురు భర్తలు ఉన్నారు (22:24-27).
సద్దూకయ్యులకు లేఖానాలు, దేవుని శక్తీ గురించి తెలియదు (22:29).
పునరుత్థానంలో ఎవరూ పెండ్లి చేసుకోరని యేసు చెప్పాడు (22:30).
తండ్రియైన దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడైయున్నాడని లేఖనాలను ప్రస్తావిస్తూ యేసు చెప్పాడు (22:32).
ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసును ధర్మశాస్త్రములో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏమిటని ప్రశ్నించాడు (22:36).
నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను, నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించవలెను అనేవి యేసు చెప్పిన ప్రాముఖ్యమైన రెండు ఆజ్ఞలు (22:37-39).
క్రీస్తు ఎవరి కుమారుడు అని అడిగాడు (22:42).
క్రీస్తు దావీదు కుమారుడని పరిసయ్యులు జవాచ్చారు (22:42).
తన ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఎలా చెబుతున్నాడని యేసు అడిగాడు (22:43-45).
యేసు అడిగిన దానికి వారు ఎవరూ మాట్లాడలేకపోయారు (22:46).
పరిసయ్యులు, శాస్త్రులు మోషే పీఠం మీద కూర్చుని చెప్పే వాటన్నిటినీ గైకొనుమని యేసు చెప్పాడు (23:2-3).
పరిసయ్యుల, శాస్త్రుల క్రియల చొప్పున చేయవద్దని యేసు ఎందుకు చెప్పాడంటే వారు చెబుతారు గాని ఆ ప్రకారం చేయరు (23:3).
పరిసయ్యుల, శాస్త్రులు ఇతరులు చూడాలని తమ క్రియలు జరిగిస్తారు (23:5).
పరలోకమందున్నవాడు ఒక్కడే మన తండ్రి, క్రీస్తు ఒక్కడే మన గురువు అని యేసు చెప్పాడు (23:8-10).
తనను హెచ్చించుకొనే వారిని తగ్గిస్తాడు, తనను తగ్గించుకోనే వారిని హెచ్చిస్తాదు (23:12).
పరిసయ్యుల, శాస్త్రులు ఒక వ్యక్తిని తమ మతంలోకి చేర్చుకొన్నప్పుడు ఆ వ్యక్తి వారికంటే రెండు రెట్లు అధిక శిక్షకు పాత్రుడవుతాడు (23:15).
యేసు పరిసయ్యులను, శాస్త్రులను పదే పదే వేషదారులు అని పిలిచాడు (23:13-15,23,25,27,29).
పరిసయ్యుల, శాస్త్రుల బోధలు అంధులైన మార్గదర్శకులు, అంధులైన అవివేకులు అని యేసు చెప్పాడు (23:16-19).
పరిసయ్యులు, శాస్త్రులు ధర్మ శాస్త్రములో ముఖ్యమైన విషయాలలో అంటే న్యాయము, కనికరము, విశ్వాసము విషయాలలో తప్పిపోతున్నారు (23:23).
పరిసయ్యులు, శాస్త్రులు తమ గిన్నెలు బయట శుభ్రం చేస్తున్నారు గాని గిన్నెల లోపల శుభ్రం చేయడం లేదు (23:25-26).
పరిసయ్యులు, శాస్త్రులు వేషధారణ, అన్యాయం, అక్రమాలతో తమ హృదయాలు నింపుకొన్నారు (23:25,28).
పరిసయ్యుల, శాస్త్రుల పితరులు దేవుని ప్రవక్తలను చంపివేశారు (23:29-31).
శాస్త్రులు, పరిసయ్యులు తీర్పులో నరక శిక్షను ఎదుర్కోబోతున్నారు (23:33).
వారిలో కొందరిని సిలువ వేస్తారు, కొందరిని కొరడాలతో కొడతారు, కొందరిని తరిమి వేస్తారు (23:34).
చిందింపబడిన నీతిమంతుల రక్తమంతా వారి శాస్త్రుల, పరిసయ్యుల మీదకు వస్తుంది (23:35).
యేసు చెప్పిన ఇవన్నీప్రస్తుత తరమువారికి వస్తాయి (23:36).
యెరూషలేము సంతతి అంతటినీ ఒక చోట సమకూర్చవలెనని కోరినప్పుడు వారు నిరాకరించారు (23:37).
ఇప్పుడు యెరూషలేము పట్టణం విడిచిపెట్టబడింది (23:38).
యెరూషలేములోని దేవాలయము రాయి మీద రాయి ఒక్కటికూడా నిలబడకుండా పడదోయబడుతుందని యేసు ప్రవచించాడు (24:2).
ఇవి ఎప్పుడు జరుగుతాయి, యేసు రాకడకు, యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని అడిగారు (24:3).
అనేకులు యేసు పేరట వచ్చి తామే క్రీస్తు అని చెప్పి పలువురిని మోసం చేస్తారు (24:5).
యుద్ధములు, కరువులు, భూకంపాలు మొదలైనవి వేదన కలగడానికి ప్రారంభమయ్యే సంభవాలు అని యేసు చెప్పాడు (24:6-8).
ఆ సమయంలో విశ్వాసులు శ్రమలపాలై చనిపోతారు, జనములచేత ద్వేషింపబడతారు, అనేకులు అభ్యంతరపడి అప్పగించుకొంటారు, ఒకరినొకరు ద్వేషించుకొంటారు (24:9-12).
అంతము వరకు సహించినవారు రక్షింపబడతారు (24:13).
రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్ధమై లోకమంతటా ప్రకటింపబడుతుంది (24:14).
విశ్వాసులు నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో ఉండడం చూసినప్పుడు కొండలకు పారిపోతారు(24:15-18).
లోకం ఆరంభం నుండి ఇప్పటివరకు ఇలాంటి శ్రమ కలగలేదు, ఇకపై ఎప్పటికీ జరగదు (24:21).
అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు గొప్ప సూచక క్రియలు, మహత్కార్యములు కనపరచి ఏర్పరచ బడిన వారిని మోసగిస్తారు (24:24).
మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలా కనడుతుందో రాబోయే మనుష్య కుమారుడు కనబడతాడు (24:27).
సూర్యుణ్ణి, చంద్రుణ్ణి చీకటి కమ్మివేస్తుంది. నక్షత్రాలు ఆకాశం నుండి రాలిపోతాయి (24:29).
మనుష్య కుమారుడు మహిమతో, ప్రభావముతో దిగి వచ్చుట చూసినప్పుడు భూమిపై ఉన్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకుంటారు (24:30).
దూతలు ఎంపిక చేయబడిన వారిని పోగుచేయడానికి వచ్చినప్పుడు గొప్ప బూర శబ్దం వినిపిస్తుండి (24:31).
ఈ విషయాలన్నీ జరిగే వరకు ఈ తరము గతించదని యేసు చెప్పాడు (24:34).
ఆకాశము, భూమి గతించి పోయినా ఆయన మాటలు గతింపవని యేసు చెప్పాడు (24:35).
కేవలం ఒక్క తండ్రికి మాత్రమే ఈ విషయాలన్నీఎప్పుడు జరుగుతాయో తెలుసు (24:36).
ప్రజలు తినుచూ, త్రాగుచూ పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుచు మనుష్య కుమారుని రాకడను గూర్చి తెలుసుకొనకుండా ఉంటారు (24:37-39).
ప్రభువు ఎప్పుడు వస్తాడో విశ్వాసులకు తెలియదు కనుక మెలకువ కలిగి సిద్ధంగా ఉండాలని యేసు చెప్పాడు (24:42,44).
నమ్మకమైన, బుద్ధిమంతుడైన సేవకుడు తన యజమాని ఇంట లేనప్పుడు యజమాని ఇంటివారి బాగోగులు చూసుకుంటాడు (24:45-46).
యజమాని తన యావదాస్తిపై ఆ సేవకునికి బాధ్యతలు అప్పగిస్తాడు (24:47).
యజమాని ఇంట లేనప్పుడు దుష్టుడైన సేవకుడు తన తోటి సేవకులను కొట్టి, తాగుబోతులతో కలసి తాగుతూ, తింటూ ఉంటాడు (24:48-49).
యజమాని తిరిగి వచ్చినప్పుడు దుష్టుడైన సేవకుణ్ణి రెండుగా నరికించి, ఏడ్పు పండ్లు కొరుకుట ఉండే స్థలానికి తోలివేస్తాడు (24:51).
బుద్ధి లేని కన్యలు పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనేందుకు వెళ్లేముందు తమ దివిటీలలో నూనె తీసుకు వెళ్ళలేదు (25:3).
బుద్ధి గల కన్యలు పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనేందుకు వెళ్లే ముందు తమ దివిటీలలో సరిపడిన నూనె తీసుకు వెళ్లారు (25:4).
పెండ్లి కుమారుడు అనుకొన్నసమయం కంటే ఆలస్యంగాఅర్థరాత్రి సమయంలో వచ్చాడు (25:5-6).
బుద్ధి గల కన్యలు పెండ్లి కుమారునీతో కలసి పెండ్లి విందుకు వెళ్లారు (25:10).
బుద్ధిలేని కన్యలు నూనె కొనేందుకు వెళ్లి తిరిగి వచ్చే సమయానికి విందు తలుపులు మోయబడ్డాయి (25:8-12).
ఆ దినమైనా, సమయమైనా తెలియదు గనుక విశ్వాసులు మెలకువగా, సిద్ధంగా ఉండాలని యేసు చెప్పాడు (25:13).
అయిదు తలాంతులు పొందినవాడు అదనంగా మరో అయిదు తలాంతులు సంపాదించాడు. రెండు తలాంతులు పొందినవాడు అదనంగా మరో రెండు తలాంతులు సంపాదించాడు (25:16-17).
అతడు ఒక గొయ్యి తవ్వి యజమాని ఇచ్చిన తలాంతును దాచిపెట్టాడు (25:18).
యజమాని చాలాకాలం వరకు తిరిగి రాలేదు (25:19).
యజమాని వారితో, "భళా నమ్మకమైన మంచి దాసుడా" అని మెచ్చుకొని వారిని అనేకమైన వాటిపై నియమించాడు (25:20-23).
యజమాని ఆ సేవకుణ్ణి "సోమరివైన చెడ్డ దాసుడా" అని చెప్పి అతని వద్దనుండి ఒక్క తలాంతు తీసి వేసి, అతణ్ణి చీకటిలోకి విసరివేయమని చెప్పాడు (25:24-30).
మనుష్య కుమారుడు మహిమగల సింహాసనముపై కూర్చుని సమస్త జనులను పోగుచేసి ఒకరినుండి ఒకరిని వేరుపరుస్తాడు (25:31-32).
రాజు కుడిపక్కన ఉన్నవారు లోకం పుట్టినది మొదలు తమ కోసం సిద్దపరచబడిన రాజ్యం పొందుతారు (25:34).
రాజు కుడిపక్కన ఉన్నవారు ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టారు, దాహం ఉన్నవారి దాహం తీర్చారు, పరదేశులను ఆదరించారు, బట్టలు లేనివారికి బట్టలిచ్చారు, రోగులను పరామర్శించారు, ఖైదీలను దర్శించారు (25:35-40).
రాజు కుడి పక్కన ఉన్నవారు అపవాదికి, వాడి దూతలకు సిద్దపరచబడిన నిత్యాగ్నిలోకి పడద్రోయబడతారు (25:41).
రాజు ఎడమ పక్కన ఉన్నవారు ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టలేదు, దాహం గొన్నవారి దప్పిక తీర్చలేదు, పరదేశులను ఆదరించలేదు, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వలేదు, రోగులను పరామర్శించలేదు, ఖైదీలను దర్శించలేదు (25:42-45).
పస్కా పండుగ రెండు రోజుల్లో రాబోతున్నదని యేసు చెప్పాడు (26:2).
వారు యేసును మాయోపాయము చేత పట్టుకొని ఆయనను చంపాలని ఆలోచన చేశారు (26:4).
పండుగ సందర్భంగా యేసుని చంపితే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని వారు భయపడ్డారు (26:5).
శిష్యులు కోపగించుకోని ఆ అత్తరును అమ్మి వచ్చిన ధనం పేదలకు పంచవచ్చు గదా అన్నారు (26:6-9).
నా భూస్థాపన కొరకు ఈమె ఈ అత్తరు పోసినదని యేసు చెప్పాడు (26:12).
యేసును అప్పగించడానికి ఇస్కరియోతు యూదాకు ప్రధాన యాజకులు ముప్ఫై వెండి నాణెములు చెల్లించారు (26:14-15).
తనను అప్పగింపబోయే వాడికి బాధ, వాడు పుట్టకుండా ఉన్నట్టయితే అతనికి మేలు అని యేసు అన్నాడు (26:24).
"నీవన్నట్టే" అని యేసు జవాబిచ్చాడు (26:25).
"దీనిని తీసికొని తినండి, ఇది నా శరీరము" అని చెప్పాడు (26:26).
"ఇది నా రక్తము, అంటే పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము" అని చెప్పాడు (26:28).
ఆ రాత్రి వారంతా తన విషయంలో అభ్యంతరపడతారని యేసు చెప్పాడు (26:30-31).
పేతురు ఈ రాత్రి కోడి కూయక ముందు తనను ఎరుగనని మూడుసార్లు చెబుతాడని యేసు చెప్పాడు (26:33-34).
శిష్యులను మెలకువగా ఉండి కనిపెట్టమని యేసు కోరాడు (26:37-38).
సాధ్యమైతే ఈ గిన్నెను నానుండి తొలగిపోనిమ్ము అని ప్రార్ధించాడు (26:39).
యేసు, తన చిత్తం కాక తండ్రి చిత్తమే నెరవేరాలని కోరాడు (26:39,42).
యేసు ప్రార్ధించి తిరిగి వచ్చినప్పుడు శిష్యులు నిద్రపోతున్నారు (26:40,43,45).
యేసు శిష్యులను విడిచి మూడుసార్లు ప్రార్ధించడానికి వెళ్ళాడు? (26:39-44).
గుంపులో ఉన్న యేసును ముద్దు పెట్టుకోవడం అనే సూచనను బట్టి ఆయనే యేసు అని గుర్తించాలని యూదా చెప్పాడు (26:47-50).
యేసు శిష్యులలో ఒకడు కత్తితో ప్రధాన యాజకుని సేవకుని చెవి నరికివేశాడు (26:51).
యేసు తన తండ్రిని కోరితే పన్నెండు సేనా వ్యూహాల కంటే ఎక్కువ సేనలను తండ్రి పంపుతాడని యేసు చెప్పాడు (26:53).
జరుగుతున్నఈ సంఘటనలన్నీ లేఖానాల నెరవేర్పు అని యేసు చెప్పాడు (26:54,56).
శిష్యులు అందరూ యేసును విడిచి పారిపోయారు (26:56).
ఆయనను చంపాలని యేసుకు వ్యతిరేకంగా ప్రజలచే అబద్ధ సాక్ష్యం చెప్పించాలని చూస్తున్నారు (26:59).
ప్రధాన యాజకుడు యేసు, దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఆ మాట తమతో చెప్పమని ఆజ్ఞాపించాడు (26:63).
యేసు, "నీవు చెప్పినట్టే" అని జవాబిచ్చాడు (26:64).
మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుని ఉండడం ప్రధాన యాజకుడు చూస్తాడని యేసు చెప్పాడు (26:64).
యేసు దైవదూషణ చేస్తున్నాడని ప్రధాన యాజకుడు యేసుపై నేరారోపణ చేశాడు (26:65).
వారు యేసు ముఖంపై ఉమ్మివేసి, గుద్ది, అరచేతులతో కొట్టారు (26:67).
యేసు ఎవరో తనకు తెలియదని పేతురు చెప్పాడు (26:70,72,74).
మూడవసారి పేతురు జవాబిచ్చిన వెంటనే కోడి కూసింది (26:74).
తనను ఎరుగనని మూడుసార్లు పలికిన తర్వాతే కోడి కూస్తుందని యేసు చెప్పిన మాట జ్ఞాపకం తెచ్చుకున్నాడు (26:75).
ఉదయమైనప్పుడు వారు యేసును గవర్నరు పిలాతు దగ్గరకు తీసుకు వెళ్ళారు (27:2).
నిరపరాధి రక్తం అప్పగించినందుకు పశ్చాత్తాపపడిన యూదా ఆ వెండి నాణేలు విసిరివేసి వెళ్ళి ఉరి వేసుకున్నాడు (27:3-5).
వారు విదేశీయులను పాతిపెట్టడం కోసం కొంత పొలం కొన్నారు (27:6-7).
ఈ సంఘటనలు వల్ల యిర్మీయా ప్రవచనాలు నేరవేరాయి (27:9-10).
పిలాతు యేసును 'నీవు యూదుల రాజువా? అని అడిగాడు. అందుకు యేసు, 'అవును, నీవు అన్నట్టే' అని జవాబిచ్చాడు (27:11).
యేసు ఒక్క మాట కూడా బదులు పలకలేదు (27:12-14).
పస్కా పండుగ సాంప్రదాయం ప్రకారం పిలాతు యేసును విడుదల చేయించాలని కోరాడు (27:15-18).
ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దని ఆమె పిలాతుకు వర్తమానం పంపించింది (27:19).
ప్రధాన యాజకులు, పెద్దలు యేసును కాక బరబ్బాను విడుదల చేయాలని కేకలు వేసేలా ప్రజలను ప్రేరేపించారు (27:20).
యేసును సిలువ వేయమని ప్రజలు కోరుకున్నారు (27:22-23).
పిలాతు ప్రజల ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తము గూర్చి తాను నిరపరాధినని చెప్పి, యేసును జనసమూహానికి అప్పగించాడు (27:24).
ప్రజలు, "వాని రక్తము మా మీదను, మా పిల్లల మీదను ఉండును గాక" అని కేకలు వేసారు (27:25).
సైనికులు యేసుకు అంగీ తొడిగించి, తలపై ముళ్ళ కిరీటం ఉంచి, ఆయనను గేలి చేస్తూ, ఆయన తలపై కొట్టి, సిలువ వేసేందుకు తీసుకువెళ్ళారు (27:27-31).
యేసు మోస్తున్న సిలువను మోయమని సీమోనును బలవంతపెట్టారు (27:32).
వారు "కపాల స్థలము" అని అర్ధం వచ్చే గొల్గొతాకు యేసును తీసుకువచ్చారు (27:33).
సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన దుస్తులు పంచుకొని, అక్కడే కూర్చుని ఆయనకు కాపలా కాస్తున్నారు (27:35-36).
"ఇతడు యూదుల రాజైన యేసు" అని వ్రాశారు (27:37).
యేసుకు కుడి పక్కన, ఎడమ పక్కన ఇద్దరు దొంగలను ఆయనతోపాటు సిలువ వేశారు (27:38).
తనను తాను రక్షించుకొని సిలువ దిగి రమ్మని యేసును సవాలు చేశారు (27:39-44).
మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మింది (27:45).
యేసు, "నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి" అని కేక వేసాడు (27:46).
యేసు ప్రాణం విడిచాడు (27:50).
యేసు మరణించిన తరువాత దేవాలయపు తెర పైనుండి క్రిందకు రెండుగా చినిగింది (27:51).
సమాధులు తెరుచుకుని అనేకమంది పరిశుద్ధులు లేచి అనేకమందికి కనబడ్డారు (27:52-53).
"ఇతడు నిజముగా దేవుని కుమారుడు" అని శతాధిపతి సాక్ష్యం ఇచ్చాడు (27:54).
ధనవంతుడైన యేసు శిష్యుడు యోసేపు పిలాతును యేసు దేహం తనకిమ్మని అడిగి, నారబట్ట చుట్టి తన సొంత కొత్త సమాధిలో ఉంచాడు (27:57-60).
ఒక పెద్ద రాయిని సమాధికి అడ్డంగా ఉంచారు (27:60).
యేసు దేహాన్ని ఎవరూ ఎత్తుకు వెళ్ళకుండా భద్రం చేయడానికి కాపలా పెట్టమని అడగడానికి కలిశారు (27:62-64).
సమాధి రాతికి ముద్ర వేసి, సైనికులను కాపలా ఉంచడానికి పిలాతు అనుమతి ఇచ్చాడు (27:65-66).
ఆదివారం తెల్లవారుజామున వారు యేసు సమాధి దగ్గరకు వెళ్ళారు (28:1).
దేవుని దూత రాయి దొర్లించాడు (28:2).
దూతకు భయపడి కావలివారు వణకి చచ్చిన వారి వలె ఉండిపోయారు (28:4).
యేసు మృతులలోనుండి లేచి గలిలయలోకి వారికంటే ముందుగా వెళ్ళాడు అని దూత చెప్పాడు (28:5-7).
యేసు వారికి ఎదురుపడ్డాడు. అప్పుడు వారు ఆయన పాదాలు పట్టుకొని ఆయనకు మొక్కారు (28:8-9).
ప్రధాన యాజకులు సైనికులకు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి, యేసు దేహాన్ని ఆయన శిష్యులు ఎత్తుకు వెళ్ళారని ప్రచారం చెయ్యమని చెప్పారు (28:11-13).
శిష్యులు యేసుకు మొక్కారు. అయితే కొందరు సందేహించారు (28:17).
పరలోకంలో, భూమి మీదా తనకు సర్వాధికారం ఇవ్వబడిందని యేసు చెప్పాడు (28:18).
సమస్త జనులను శిష్యులనుగా చేసి, వారికి బాప్తిస్మం ఇస్తూ, యేసు ఆజ్ఞాపించిన వాటిని నెరవేర్చాలని బోధించమని చెప్పాడు (28:19-20).
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వమని యేసు తన శిష్యులకు చెప్పాడు (28:19).
నేను యుగసమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటానని వాగ్దానం చేశాడు (28:20).
ప్రభువు మార్గాన్ని సిద్ధపరచుడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దంగా ఉండే ఒక దూతను పంపుతాడని యెషయా ముందుగా చెప్పాడు. (1:2-3).
పాప క్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించడానికి యోహాను వచ్చాడు?1:4).
యోహాను చేత బాప్తిస్మము తీసుకున్న వారుతమ పాపాలు ఒప్పుకున్నారు. (1:5).
యోహాను మిడతలను, అడవి తేనెను తినేవాడు. (1:6).
తన వెనుక వచ్చువాడు పరిశుద్దాత్మతో బాప్తిస్మమిస్తాడని యోహాను చెప్పాడు. (1:8).
బాప్తిస్మము తీసుకున్న తరువాత ఆకాశము చీల్చ బడుటయు, పరిశుద్దాత్మ పావురము వలె తన మీదికి దిగి వచ్చుటయు యేసు చూసాడు. (1:10).
"నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేను ఆనందించు చున్నాను" అని ఆకాశము నుండి వచ్చిన శబ్దము పలికింది. (1:11).
తన పరుపు ఎత్తుకొని ఇంటికి వెళ్ళమని యేసు పక్షవాత రోగితో చెప్పాడు, ఆ వ్యక్తి అలానే చేసాడు. (2:8-12).
దేవుని ఆత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకు వెళ్ళాడు. (1:12).
యేసు అరణ్యములో నలభై రోజులు ఉన్నాడు. ఆయన అక్కడ సైతాను చేత విషమ పరీక్షలకు గురి అయ్యాడు. (1:13).
దేవుని రాజ్యం దగ్గరగా ఉంది, పశ్చాత్తాపపడి శుభవార్తను నమ్మండి అని యేసు ప్రకటించాడు. (1:15).
సీమోనును, అంద్రెయను మనుష్యులను పట్టే జాలరులుగా చేస్తానని యేసు చెప్పాడు. (1:17).
సీమోను, అంద్రెయ, యాకోబు, యోహనుల వృత్తి చేపలు పట్టడం. (1:16,19).
యేసు ఉపదేశం సమాజ కేంద్రంలోని వారు ఆశ్చర్య పడేలా చేసింది ఎందుకంటే ఆయన అధికారం కలవాడిగా ఉపదేశించాడు. (1:22).
సమాజ కేంద్రంలో మలిన పిశాచం యేసుకు దేవుని పవిత్రుడు అనే పేరు ఇచ్చింది. (1:24).
యేసుని గురించిన వార్త చుట్టుపక్కలా అంతటా వ్యాపించింది. (1:28).
వారు సీమోను ఇంటిలోనికి వెళ్ళినప్పుడు యేసు అతని అత్తను స్వస్థపరచాడు. (1:30).
సాయంకాల సమయాన ప్రజలు రోగులందరినీ దయ్యాలు పట్టిన వారినందరిని ఆయన దగ్గరకు తీసుకొని వచ్చారు. (1:32-34).
సూర్యోదయాన యేసు లేచి నిర్జన స్థలానికి వెళ్లి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. (1:35).
దగ్గరగా ఉన్న గ్రామాలలో ప్రకటించడానికి తాను వచ్చాడని యేసు పేతురు?ో చెప్పాడు?(1:38-39).
యేసు కుష్టరోగి పై జాలి పడి అతనిని బాగు చేసాడు. (1:40-42).
సాక్ష్యంగా ఉండేందుకు మోషే ధర్మశాస్త్రం లో విధించిన వాటిని అర్పించమని యేసు కుష్టరోగికి చెప్పాడు. (1:44).
"కుమారా నీ పాపాలకు క్షమాపణ దొరికింది" యేసు పక్షవాత రోగితో చెప్పాడు? (2:5).
యేసు దేవదూషణ చేస్తున్నాడు, ఎందుకంటే దేవుడు?క్కడే పాపాలు క్షమించగలవాడు అని కొందరు ధర్మశాస్త్ర పండితులు ఆలోచించారు. (2:6-7).
యేసు పిలిచినప్పుడు లేవి సుంకం వసూలు చేసే స్థానం లో కూర్చుని వున్నాడు. (2:13-14).
లేవి ఇంటిలో యేసు పాపులతో, సుంకరులతో కలిసి భోజనం చేయడం పరిసయ్యులను ఇబ్బంది పెట్టింది. (2:15-16).
పాపులను పిలవడానికి తాను వచ్చానని యేసు చెప్పాడు. (2:17).
యెహాను శిష్యులు, పరిసయ్యుల శిష్యులు ఉపవాసమున్నప్పుడు?న శిష్యులు ఎందుకు ఉపవాసము ఉండరు అని కొందరు యేసును అడిగారు. (2:18).
పెళ్ళికుమారుడు తమతో ఉన్నంతకాలం వారు ఉపవాసం ఉండరు, అయితే పెళ్ళికుమారుడు వారి దగ్గరనుండి తీసి వేయబడివ్పుడు వారు ఉపవాసముంటారు అని యేసు వారితో చెప్పాడు. (2:19-20).
విశ్రాంతి దినాన్న యేసు శిష్యులు పంటచేలలో కంకులు తెంపుకొని తిన్నారు. (2:23-24).
ఆకలి గొని యాజకులు తప్ప మరెవ్వరూ తినకూడని సన్నిధి రొట్టెలు తిని తనతో ఉన్నవారికి ఇచ్చిన దావీదును గురించిన ఉదాహరణ యేసు ఇచ్చాడు? (2:25-26).
విశ్రాంతి దినం మనుషుల కోసం చెయ్య బడిందని యేసు చెప్పాడు? (2:27).
తాను విశ్రాంతి దినమునకు కూడా ప్రభువని యేసు చెప్పాడు. (2:28).
ఆయన మీద నింద మోపడానికి విశ్రాంతి దినాన్న యేసు స్వస్థత చేస్తాడేమో అని వారు చూస్తూ ఉన్నారు. (3:1-2).
విశ్రాంతి దినాన మేలు చేయడమా కీడు చేయడమా ఏది ధర్మం అని యేసు వారిని అడిగాడు. (3:4).
వారు నెమ్మదిగా ఉన్నారు, యేసు వారిని కోపగించుకున్నాడు. (3:4-5).
పరిసయ్యులు బయటకు వెళ్లి యేసును ఎలా చంపాలో అని కుట్ర పన్నారు. (3:6).
గొప్ప జనసమూహం ఆయనను వెంబడించారు. (3:7-9).
యేసు దేవుని కుమారుడని అపవిత్రాత్మలు యేసుని చూచి అరిచారు. (3:11).
వారు ఆయనతో కూడా ఉండునట్లును, దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును యేసు పన్నెండు మంది అపోస్తలులను నియమించాడు. (3:14-15).
యేసును మోసగించబోవు అపోస్తలుడు యూదా ఇస్కరియోతు. (3:19).
ఆయనకు మతి చలించినదని ఆయన ఇంటివారు తలంచారు? (3:21).
దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని యేసును నిందించారు. (3:22).
తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ రాజ్యము నిలువనేరదని యేసు చెప్పాడు. (3:23-26).
పరిశుద్డాత్మకు వ్యతిరేకమైన దూషణ క్షమాపణ పొంద నేరదని యేసు చెప్పాడు? (3:28-30).
దేవుని చిత్తము జరిగించు వాడే తన తల్లియు తన సహోదరులును అని యేసు చెప్పాడు? (3:33-35).
ఆయన దగ్గర చాలా పెద్ద జనసమూహం సమకూడినందున యేసు బోధించడానికి దోనె ఎక్కాడు? (4:1).
పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసెను. (4:4).
మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలచి ఎండి పోయాయి. (4:5-6).
ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచి వేసెను. (4:7).
మంచి నేలను పడిన విత్తనాలు పెరిగి పైరై ముప్పదంతలుగాను, అరువదంతలుగాను, నూరంతలుగాను ఫలించెను. (4:8).
దేవుని రాజ్య మర్మము తెలిసికొనుటకు బయటి వారికిగాక ఆ పన్నెండు?మందికి అనుగ్రహింపబడినదని యేసు చెప్పాడు. (4:11).
విత్తనము దేవుని వాక్యము. (1:10).
వాక్యమును విత్తుచుండగా విను వారిని సూచిస్తుంది. అయితే సాతాను వచ్చి దానిని ఎత్తుకొని పోవును. (1:11).
వాక్యమునును విని సంతోషముగా అంగీకరించు వారిని సూచిస్తుంది అయితే శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతర పడతారు. (4:16-17).
వాక్యమును విను వారిని సూచిస్తుంది. అయితే ఈ లోక ఐహిక విచారాలు వాటిని అణచి వేస్తాయి. (4:18-19).
వాక్యమును విని, అంగీకరించి ఫలమును ఫలించు వారిని సూచిస్తుంది. (4:20).
మరుగు చేయబడినవి, రహస్యమయినవి వెలుగు లోనికి తేబడతాయని యేసు చెప్పాడు?(4:22).
మనుష్యుడి విత్తనము చల్లుతాడు, అది పెరుగుతుంది, అతనికి తెలియకుండానే పంట వస్తుంది. దానిని అతడు సమకూరుస్తాడు. (4:26-29).
ఆవగింజ భూమిలో విత్తబడినపుదు భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే చిన్నదే కాని అది ఎదిగి గొప్పదై ఆకాశ పక్షులు దాని నీడను విశ్రమించును. (4:30-32).
పెద్ద తుఫాను రేగి దోనె నీటితో నిండి పోవునట్లుగా అలలు దోనెను కొట్టాయి. (4:35-37).
యేసు నిద్ర పోతూ ఉన్నాడు. (4:38).
తాము నశించి పోతుండగా ఆయనకు చింత లేదా అని యేసును ప్రశ్నించారు. (4:38).
యేసు గాలిని గద్దించి సముద్రమును నిమ్మళ పరచెను. (4:39).
శిష్యులు మిక్కిలి భయపడ్డారు, ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకరు చెప్పుకొనిరి. (4:41).
అపవిత్రాత్మ పట్టినవాడొకడు యేసును కలుసుకున్నాడు. (5:1-2).
ఈ వ్యక్తి సమాధులలో నివసించే వాడు, చేతి సంకెళ్ళను, కట్లను తుత్తునియలుగా చేసేవాడు. ఎల్లప్పుడూ కేకలు వేస్తూ తనను తాను రాళ్ళతో గాయపరచుకొనే వాడు. (5:3-5).
"అపవిత్రాత్మా, ఈ మనుష్యుని విడిచిపొమ్మని చెప్పాడు. (5:8).
ఈ అపవిత్రాత్మ యేసును సర్వోన్నతమైన దేవుని కుమారుడా అని పిలిచింది. (5:7).
ఆ అపవిత్రాత్మ పేరు సేన, ఎందుకంటే వారు అనేకులు. (5:9).
ఆ అపవిత్రాత్మలు బయటకు వచ్చి పందుల గుంపులోనికి ప్రవేశించాయి. ప్రవేశింపగా అవి నిటారుగా ఉన్న ఆ కొండమీద నుండి వేగంగా పరుగెత్తుతూ సరస్సులో పడి చనిపోయాయి. (5:13).
ఆ మనుష్యుడు బట్టలు ధరించుకొని స్వస్త చిత్తుడై యేసుతో కూర్చుండెను. (5:15).
ఆ ప్రజలు భయపడి తమ ప్రాంతాన్ని విడిచి పొమ్మని యేసును బతిమాలుకొన్నారు. (5:15-17).
ప్రభువు తనకు చేసిన కార్యములను తన ఇంటి వారికి తెలియచెప్పమని అన్నాడు. (5:19).
వచ్చి చావ సిద్ధమై ఉన్న తన కుమార్తె మీద చేతులుంచ వలసిందని యాయీరు యేసును అడిగాడు. (5:22-23).
ఆ స్త్రీ పన్నెండు సంవత్సరాలు రక్తస్రావ రోగముతో బాధ పడుతుంది. (5:25).
యేసు వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుతాననుకొంది. (5:28).
యేసు తనలోనుండి ప్రభావము బయటకు వెళ్లిందని తనలో తాను గ్రహించి తనను తాకినదెవరో చూడడానికి చుట్టూ చూసాడు. (5:30,32).
తన విశ్వాసము ఆమెను స్వస్థ పరచెను, సమాధానముతో వెళ్ళమని చెప్పాడు. (5:34).
యాయీరు కుమార్తె చనిపోయింది. (5:35).
భయపడకుము, నమ్మిక మాత్రముంచుమని యేసు యాయీరుతో చెప్పాడు. (5:36).
యాయీరు కుమార్తె నిద్రించుచున్నదని యేసు చెప్పినపుడు?ంటిలోని ప్రజలు యేసుని చూచి అపహసించారు. (5:40).
యేసు ఆ చిన్నదాని తండ్రిని, తల్లిని, పేతురు, యాకోబు, యోహానులను తీసుకొని వెళ్ళాడు. (5:37,40).
ఆ చిన్నది లేచి నడచినప్పుడు ప్రజలు ఉక్కిరిబిక్కిరై ఎంతో విస్మయ మొందారు. (5:42).
ఈ బోధ, జ్ఞానం, ఆయన అద్భుతాలు యేసుకు ఎక్కడనుండి వచ్చాయి అని ప్రజలకు అర్ధం కాలేదు. (6:2).
ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటివారిలోను ఘనహీనుడుగా ఉంటాడని యేసు చెప్పాడు. (6:4).
తన స్వగ్రామములోని ప్రజలలోని అవిశ్వాసమును చూసి యేసు ఆశ్చర్య పడ్డాడు?(6:6).
పన్నెండుమంది శిష్యులను బయటకు పంపునప్పుడు యేసు వారికి అపవిత్రాత్మల మీద అధికారాన్ని ఇచ్చాడు. (6:7).
పన్నెండుమంది చేతికర్ర, చెప్పులు, ఒక అంగీని వారితో తీసుకొని వెళ్ళారు(6:8).
వారిమీద సాక్షముగా ఉండుటకు వారి పాదముల క్రింద ధూళి దులిపి వేయాలని యేసు పన్నెండు మందికి చెప్పాడు. (6:11).
యేసు బాప్తిస్మమిచ్చు యోహాను అని, ఏలియా అని, ప్రవక్త అని ప్రజలు అనుకొంటున్నారు. (6:14-15).
హేరోదు తన సహోదరుని భార్యను పెండ్లి చేసుకోవడం న్యాయం కాదని హేరోదుతో బాప్తిస్మమిచ్చు యోహాను చెప్పాడు? (6:18).
యోహాను మాటలు వినిన ప్రతీసారి హేరోదు కలవరపడినా సంతోషముతో అతని మాటలు వినుచుండెను. (6:20).
తన రాజ్యములో సగము మట్టుకు తనను ఏమి అడిగినను ఇచ్చెదనని ఆమెకు ప్రమాణం చేసాడు. (6:23).
బాప్తిస్మమిచ్చు యోహాను తల ఒక పళ్ళెములో ఇప్పించమని అడిగింది.(6:25).
హేరోదు బహుగా విచార పడ్డాడు, అయితే తన అతిధుల ఎదుట తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తము ఆమె మనవిని నిరాకరించలేదు. (6:26).
అనేకులు వారిని గుర్తుపట్టారు, పరుగెత్తి వారికంటే ముందుగా వచ్చారు. (6:31-33).
వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికర పడ్డాడు. (6:34).
వారు వెళ్లి రెండు దేనారముల విలువైన రొట్టెలను కొనాలని తలంచారు. (6:37).
శిష్యుల వద్ద ఇంతకుముందే ఐదు రొట్టెలు, రెండుచేపలు ఉన్నాయి.
రొట్టెలను, చేపలను తీసుకొని యేసు ఆకాశమువైపు కన్నులెత్తి, ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి, తన శిష్యులకు ఇచ్చాడు. (6:41).
అందరు తిని తృప్తి పొందిన తరువాత చేపలును, రొట్టె ముక్కలును పండ్రెండుగంపలు మిగిలాయి. (6:43).
ఆ రొట్టెలు తినిన వారు అయిదు వేల మంది పురుషులు. (6:44).
శిష్యులను కలుసుకోడానికి యేసు సరస్సు పై నడుచుకుంటూ వచ్చాడు? (6:48).
ధైర్యము తెచ్చుకొని, భయపడకుడని యేసు తన శిష్యులకు చెప్పాడు?(6:50).
వారి హృదయాలు బండబారిపోయి ఉన్నాయి కాబట్టి రొట్టెల గురించిన అద్భుతమును శిష్యులు అర్ధం చేసుకోలేదు. (6:52).
రోగులను మంచాల మీద తీసుకొని వచ్చారు, ఆయన ఎక్కడున్నాడని తెలిస్తే అక్కడికి చేరారు. (6:55).
యేసు వస్త్రపు చెంగును ముట్టుకున్న వారు స్వస్థత పొందారు. (6:56).
యేసు శిష్యులలో కొందరు అపవిత్రమయిన చేతులతో భోజనం చేస్తున్నారు. (7:2,5).
భోజనానికి ముందు చేతులు, గిన్నెలు, కుండలు, ఇత్తడి పాత్రలు భోజన పాత్రలు నీటితో కడగడం పెద్దల ఆచారం (7:3-4).
పరిసయ్యులు, శాస్త్రులు వేషధారులు అనియు, వారు మానవ కల్పిత నియమాలను దేవుని ఉపదేశాలుగా బోధిస్తున్నారని యేసు చెప్పాడు(7:6-9).
వారి తల్లి దండ్రులకు ప్రయోజన కరమైన ధనమును అది కోర్బాను అని ఇచ్చే వారికి చెప్పడం ద్వారా దేవుని ఉపదేశాన్ని త్రోసివేస్తున్నారు. (7:10-13).
వెలుపలినుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్త్రునిగా చేయగలుగునది ఏదియు లేదని యేసు చెప్పాడు. (7:15,18-19).
లోపలినుండి బయలు వెళ్ళునవే మనుష్యుని అపవిత్ర పరచునని యేసు చెప్పాడు. (7:15,20-23).
అన్ని భోజన పదార్ధాలు పవిత్రమని యేసు ప్రకటించాడు. (7:19).
దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారము, లోభము, చెడుతనము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము అనునవి లోపలినుండి బయలు వెళ్లి మనుష్యుని అపవిత్ర పరచును. (7:21-22).
అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల స్త్రీ గ్రీసు దేశస్థ్తురాలు. (7:25-26).
కుక్క పిల్లలు కూడ బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టెముక్కలు తినును కదా అని ఆ స్త్రీ చెప్పింది. (7:28).
అ స్త్రీ కుమార్తె నుండి అపవిత్రాత్మను వెళ్ళగొట్టాడు. (7:29-30).
యేసు అతని చెవులలో వ్రేళ్ళు పెట్టి, ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి చూసి, తెరువబడమని చెప్పాడు. (7:33-34).
ఆయన చెప్పవద్దని వారి కాజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేసారు. (8:1-2).
తనను వెంబడిస్తున్న జనసమూహము తినదానికి ఏమీ లేనందున వారి పట్ల యేసు జాలి చూపించాడు. (8:1-2).
శిష్యుల యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి (8:5).
యేసు ఏడు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతా స్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యుల కిచ్చెను. (8:6).
ఇంచుమించు నాలుగు వేల మంది పురుషులు తిని తృప్తి చెందారు. (8:9).
అందరు తిన్న తరువాత ఏడు గంపలనిండా భోజనం మిగిలింది (8:8).
ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపుమని పరిసయ్యులు యేసును అడిగారు. (8:11).
పరిసయ్యుల పులిసిన పిండి విషయంలో యేసు తన శిష్యులను హెచ్చరించాడు? (8:15).
తాము రొట్టెలు తేవడం మర్చిపోయిన దాని గురించి మాట్లాడుతున్నాడని శిష్యులు తలంచారు. (8:16).
అయిదు వేల మందికి ఆహారం పెట్టడం, నాలుగు వేలమందికి ఆహారం పెట్టడం గురించి వారికి జ్ఞాపకం చేసాడు. (8:19-21).
యేసు మొదట అతని కన్నులమీద ఉమ్మివేసి, వాని మీద చేతులుంచాడు, తరువాత అతని కన్నుల మీద చేతులుంచాడు.(8:23-24).
యేసు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, ఏలియా అనియు, ప్రవక్తలలో ఒకడని జనులు చెప్పుకొంటున్నారు?(8:28).
యేసే క్రీస్తు అని పేతురు చెప్పాడు (8:29).
మనుష్య కుమారుడు?నేక హింసలు పొందాలి, ఉపేక్షించ బడాలి, చంపబడాలి, మూడు దినములైన తరువాత లేపబడాలనే సంగతుల గురించి యేసు వారికి బోధించాడు. (8:31).
"సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను కాదు" అని యేసు పేతురుతో చెప్పాడు. (8:33).
తనను వెంబడింప గోరువాడు తనను తాను ఉపేక్షించు కొని తన సిలువనెత్తుకోవాలని యేసు చెప్పా డు. (8:34).
"ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వాని కేమి ప్రయోజనము?" అని యేసు అన్నాడు. (8:36).
ఆయన వచ్చునపుడు తన గురించి, తన మాటల గురించి సిగ్గుపడువారి గురించి తాను సిగ్గుపడతాడని యేసు చెప్పాడు? (8:38).
అక్కడ ఆయనతో నిలిచియున్నవారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని యేసు చెప్పాడు. (9:1).
యేసు రూపాంతరం చెందాడు, ఆయన వస్త్రాలు ప్రకాశమానముగా మారాయి. (9:2-3).
ఏలియా, మోషేలు యేసుతో మాట్లాడుతున్నారు. (9:4).
"ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి" అని చెప్పింది. (9:7).
మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు వారు చూచిన దానిని ఎవరితోనూ చెప్పవద్దని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. (9:9).
ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్క బెట్టునని, ఏలియా ముందే వచ్చాడని యేసు చెప్పాడు. (9:11-13).
ఆ తండ్రి కుమారునిలో నుండి అపవిత్రాత్మను వెళ్ళగొట్ట లేక పోయారు. (9:17-18).
అపవిత్రాత్మ ఆ బాలుని అగ్నిలోనికి, నీళ్ళ లోనికి త్రోసి నాశనం చేయాలని ప్రయత్నిస్తుంది. (9:22).
"నమ్ముచున్నాను, అపనమ్మకముండకుండ సహాయము చేయుమని" తండ్రి అడిగాడు. (9:23-24).
ప్రార్ధన వలననే దాని అది వెళ్ళ గొట్టబడును గనుక శిష్యులు దానిని వదలగొట్ట లేక పోయారు? (9:28-29).
తాను మరణమునకు అప్పగింపబడతాడని, మూడు దినముల తరువాత తిరిగి లేస్తాడని వారికి చెప్పాడు. (9:31).
వారిలో ఎవరు గొప్ప వారు?ని శిష్యులు వాదించుచున్నారు. (9:33-34).
అందరికీ పరిచారకుడైన వాడు మొదటివాడు అని యేసు అన్నాడు. (9:35).
ఎవరైనా యేసు నామం లో ఒక చిన్న బిడ్డను చేర్చు కొంటె వారు చేర్చుకుంటున్నారు, అంతే కాకుండా యేసును పంపిన వానిని కూడా చేర్చుకుంటున్నారు. (9:36-37).
చిన్నవారిలో ఒకని అభ్యంతర పరచు వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు. (9:42).
నిన్ను అభ్యంతర పరచు దేనినైనను నరికి వెయ్యాలని యేసు చెప్పాడు. (9:47).
నరకంలో వాని పురుగు చావదు, అగ్ని ఆరదు అని యేసు చెప్పాడు?9:48).
పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని పరిసయ్యులు యేసును అడిగారు. (10:2).
ఒకడు పరిత్యాగ పత్రిక వ్రాయించి తన భార్యను విడనాడవచ్చునని మోషే సెలవిచ్చాడు. (10:4).
వారి హృదయ కఠినత్వాన్ని బట్టి యూదులకు ఈ ఆజ్ఞలను మోషే రాసి ఇచ్చాడు. (10:5).
వివాహము గురించి దేవుని ఆరంభ ప్రణాళికను పరిసయ్యులకు యేసు చెపుతున్నపుడు ఆరంభం లో స్త్రీ, పురుషుడు సృష్టి చెయ్యబడిన సంఘటనను ప్రస్తావించాడు. (10:6).
వారిద్దరూ ఏక శరీరమౌతారని యేసు చెప్పాడు. (10:7-8).
దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరు పరచకూడదని యేసు చెప్పాడు. (10:9).
యేసు శిష్యులను కోపగించుకున్నాడు, చిన్న బిడ్డలను తన వద్దకు రానివ్వమని వారితో చెప్పాడు. (10:13-14).
దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే దానిని చిన్నబిడ్డవలె అంగీకరించాలి అని యేసు చెప్పాడు. (10:15).
నరహత్య చేయవద్దు, వ్యభిచారించవద్దు, దొంగిలవద్దు, అబద్ద సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించాలి అని యేసు ఆ వ్యక్తికి చెప్పాడు. (10:19).
తనకు కలిగినవన్నియు అమ్మి ఆయనను వెంబడించాలని చెప్పాడు. (10:21).
అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ వ్యక్తి విచారపడుతూ వెళ్ళిపోయాడు. (10:22).
ఆస్థిపరులు దేవుని రాజ్యం లోనికి ప్రవేశించడం కష్టతరం అని యేసు చెప్పాడు. (10:23-25).
మనుష్యులకు ఇది అసాధ్యం గాని దేవునికి అన్నీ సాధ్యమే అని యేసు చెప్పాడు. (10:26-27).
వారు ఐప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా రాబోవు లోకమందును నిత్య జీవమును పొందుదురని చెప్పాడు. (1:10).
యేసును ఆయన శిష్యులును యెరుషలేము వెళ్ళు మార్గమున పోవుచున్నారు. (10:32).
తనకు మరణశిక్ష విధించబడబోతున్నదని, మూడు దినములైన తరువాత తిరిగి లేపబదతాడని తన శిష్యులకు యేసు చెప్పాడు. (10:33-34).
తన మహిమయందు ఆయన కుడివైపున ఒకడునును, ఎడుమవైపు ఒకడును కూర్చుండునట్లు దయచేయమని యేసును అడిగారు. (10:35-37).
తాను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, తాను పొందుచున్న బాప్తిస్మము తీసుకోనుట యైనను వారి చేతనగునాయని వారిని అడిగాడు. (10:39).
లేదు. తన కుడివైపున, ఎడుమవైపున కూర్చుండ నివ్వడం తన వశములో లేదని చెప్పాడు. (10:40).
అన్యజనులలోని అధికారులు తమ ప్రజల మీద ప్రభుత్వం చేస్తారని ప్రభువు చెప్పాడు. (1:10).
ఎవడైనను గొప్పవాడై ఉండగోరితే వాడు పరిచారము చేయవలెనని ప్రభువు చెప్పాడు. (10:43-44).
"దావీదు కుమారుడా నన్ను కరుణించు" మని మరి బిగ్గరగా కేకలు వేసాడు. (10:48).
బర్తిమయి విశ్వాసము అతనిని బాగు చేసిందని యేసు చెప్పాడు. (10:52).
ఎవరూ ఎన్నడూ కూర్చుండని గాడిద పిల్లను తన వద్దకు తీసుకు రమ్మని వారిని పంపాడు. (11:2).
వారేమి చేయుచున్నారని కొందరు అడిగారు, అందుకు శిష్యులు యేసు వారికాజ్ఞాపించినట్టు చెప్పారు, అప్పుడు వారు దానిని పోనిచ్చారు. (11:5-6).
ప్రజలు తమ బట్టలను దారి పొడుగునా పరచారు, కొందరు పొలములో నరికిన కొమ్మలు పరచిరి. (11:8).
తమ తండ్రి అయిన దావీదు రాజ్యము రాబోతున్నాదని కేకలు వేస్తున్నారు. (11:10).
చుట్టూ సమస్తమును చూచి బేతనియకు వెళ్ళాడు. (11:11).
"ఇక మీదట ఎన్నటికిని నీ పండ్లు ఎవరును తినకుందురు గాక అని అంజూరపు చెట్టుతో అన్నాడు. (11:14).
క్రయ విక్రయములను చేయువారిని వెళ్ళగొట్టాడు, దేవాలయము గుండా ఏ పాత్రయైనను ఎవనిని తేనియ్యకుండెను. (11:15-16).
దేవాలయము సమస్తమైన జనములకు ప్రార్థన మందిరము అనబడును అని యేసు చెప్పాడు. (11:17).
మందిరాన్ని దొంగల గుహగా చేసారని యేసు చెప్పాడు. (11:18).
ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసును చంపడానికి ప్రయత్నించారు. (11:20).
యేసు మాట్లాడిన అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి పోయింది. (11:20).
ప్రార్థన చేయుచున్నప్పుడు మనము అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్మాలి, అప్పుడవి మనకు కలుగును. (11:24).
పరలోకమందున్న తండ్రి మనలను క్షమించునట్లు ఒకని మీద విరోధ మేదైనను కలిగిఉన్నయెడల వారిని క్షమించాలి. (11:25).
ఏ అధికారము వలన తాను చేయుచున్న పనులను చేయుచున్నాడని తెలుసుకోగోరారు. (11:27-28).
యోహాను బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా లేక మనుష్యుల నుండి కలిగినదా అని అడిగాడు. (11:30).
యోహానును ఎందుకు నమ్మలేదని యేసు అడుగుతాడని వారు జవాబు చెప్పలేదు. (11:31).
వారు ప్రజలకు భయపడ్డారు, యోహాను ఒక ప్రవక్త అని వారు ఎంచారు గనుక వారు జవాబు చెప్పలేదు. (11:32).
ద్రాక్ష తోటను నాటించి దాని చుట్టూ కంచె వేయించిన తరువాత దాని యజమాని ప్రయాణమై వెళ్ళాడు. (12:1).
ఆ రైతులు వారిని కొట్టి వట్టి చేతులతో పంపి వేసారు. కొందరిని చంపివేశారు. (12:3-5).
యజమాని రైతుల వద్దకుకు చివరిగా తన ప్రియ కుమారుని పంపాడు. (1:10).
ఆ రైతులు అతనిని పట్టుకొని, చంపి, ద్రాక్ష తోట వెలుపల పారవేసారు. (12:8).
యజమాని వచ్చి అ రైతులను సంహరించి ఆ ద్రాక్షా తోటను ఇతరులకు ఇచ్చును. (12:9).
కట్టు వారు నిషేధించిన రాయి మూలకు తల రాయి అవుతుంది. (12:10).
కైసరుకు పన్ను ఇవ్వడం న్యాయమా కాదా అని అడిగారు. (12:14).
కైసరువి కైసరుకును, దేవునివి దేవునికిని చెల్లించమని చెప్పాడు. (12:17).
సద్దూకయ్యులు పునరుత్థానములో నమ్మకముంచరు. (12:18).
ఆ స్త్రీకి ఏడుగురు భర్తలు ఉన్నారు?(12:22).
పునరుత్థానమందు వారిలో ఎవరికీ ఆమె భార్యగా ఉంటుంది అని అడిగారు. (12:23).
సద్దూకయ్యులు లేఖనములను గాని, దేవుని శక్తిని గురించి గాని ఎరుగరు అని చెప్పాడు. (12:24).
మృతులలో నుండి లేచునపుడు?ెండ్లి చేసుకోరు, పెండ్లి కియ్యబడరు అని పరలోకమందున్న దూతల వలె ఉంటారు. (12:25).
నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు? అందరూ ఇంకా సజీవులుగానే ఉన్నారని దేవుడు చెప్పిన దానిని ప్రస్తావించాడు. (12:26-27).
నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెననునది ప్రధానమైన ఆజ్ఞ అని యేసు చెప్పాడు. (12:29-30).
నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలెననునది రెండవ ఆజ్ఞ అని యేసు చెప్పాడు (12:31).
ఇవన్నియు జరుగు వరకు అంతము గతింపదని యేసు చెప్పాడు. (13:30).
ఆయన మాటలు గతింపవు అని యేసు చెప్పాడు. (13:32).
తండ్రి తప్ప మరి ఎవరికీ ఆ దినం గానీ, గంట గానీ తెలియవు అని చెప్పాడు (13:32).
దావీదు క్రీస్తును ప్రభువని చెప్పుచున్నాడు, ఆయన ఏలాగు అతని కుమారుడగును అని యేసు అడిగాడు. (12:35-37).
శాస్త్రులు మనుష్యుల చేత గౌరవింప బడాలని కోరతారు, అయితే వారు విధవరాండ్ర ఇండ్లు దిగ మింగుతారు, ప్రజలు చూడాలని దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. (12:38-40).
ఆమె తన లేమిలో తనకు కలిగినదంతటిలో వేసింది అయితే ఇతరులు తమకు కలిగిన సమృద్దిలోనుండి వేసారు అని యేసు చెప్పాడు. (12:44).
రాతిమీద రాయి యొకటియైనను నిలిచి యుండకుండ పడద్రోయబడునని యేసు చెప్పాడు. (13:2).
ఇవి ఎప్పుడు పెరుగుతాయి, వాటి గురుతులు ఏవి అని అడిగారు. (13:4).
ఎవడును వారిని మోసపుచ్చకుండా చూచుకోవాలని యేసు తన శిష్యులకు చెప్పాడు. (13:5-6).
వేదనలకు ప్రారంభం యుద్ధాలు, యుద్ధ సమాచారములు, భూకంపములు, కరువులు అని యేసు చెప్పాడు. (13:7-8).
శిష్యులు సభలకు అప్పగింపబడతారు, సమాజ మందిరాలలో దెబ్బలు తింటారు. సాక్షార్ధమై అధిపతులు, రాజుల ఎదుట నిలువ బెట్టబడతారు అని యేసు చెప్పాడు. (13:9).
సకల జనులలో సువార్త ముందుగా ప్రకటింపబడాలి అని యేసు చెప్పాడు. (13:10).
కుటుంబములోని ఒక సభ్యుడు మరొకరిని మరణానికి అప్పగిస్తారు?ని యేసు చెప్పాడు. (13:12).
అంతము వరకు సహించిన వాడే రక్షించ బడును అని యేసు చెప్పాడు. (13:13).
నాశనకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు చూచినపుడు యూదావారు కొండలకు పారిపోవాలి అని యేసు చెప్పాడు. (13:14).
ఏర్పరచబడిన వారి నిమిత్తము శ్రమల దినములను ప్రభువు తక్కువ చేసాడని యేసు చెప్పాడు. (13:20).
అబద్దపు క్రీస్తులు, అబద్దపు ప్రవక్తలు లేచి ప్రజలను మోసపరుస్తారని యేసు చెప్పాడు? (13:22).
సూర్య చంద్రులను చీకటి కమ్ముతుంది, ఆకాశము నుండి నక్షత్రాలు రాలుతాయి, ఆకాశ మందు శక్తులు కదిలించ బడతాయి. (13:24-25).
మనుష్య కుమారుడు మహా ప్రభావముతోను, మహిమతోను మేఘవాహనుడై వచ్చుట చూస్తారు. (13:26).
మనుష్య కుమారుడు వచ్చినపుడు భూమ్యంతము మొదలుకొని ఆకాశము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకోనిన వారిని పోగుచేయించును. (13:27).
మెలకువ కలిగి జాగ్రత్త కలిగి ఉండాలని యేసు చెప్పాడు. (13:33,35,37).
మాయోపాయము చేత ఆయనను ఎలా పట్టుకొని చంపుదామా అని ఆలోచిస్తున్నారు. (14:1).
పండుగ సమయములో ప్రజలలో అల్లరి కలుగునేమో అని ఆందోళన చెందారు. (14:2).
మిక్కిలి విలువ కలిగిన అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసింది. (14:3).
ఆ అత్తరు ఎక్కువకు అమ్మి ఆ డబ్బును బీదలకియ్యవచ్చు గదా, అని గద్దించారు. (14:5).
ఆ స్త్రీ తన భూస్థాపాన నిమిత్తము ఆయన శరీరమును అభిషేకించిందని యేసు చెప్పాడు. (14:8).
సర్వ లోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింప బడునో అక్కడ ఆ స్త్రీ చేసినవి జ్ఞాపకార్ధముగా ప్రకటింపబడునని వాగ్డానము చేసాడు. (14:9).
యేసును వారికి పట్టివ్వడానికి ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళాడు? (14:10).
వారు పట్టణములోనికి వెళ్లి అక్కడ నీళ్ళ కుండ మోయుచున్న వానిని వెంబడించి, వారు భుజించుటకు విడిది గది ఎక్కడ అని అతనిని అడుగమని యేసు తన శిష్యులకు చెప్పాడు. (14:12-14).
శిష్యులలో ఒకడు తన్ను అప్పగించబోతున్నాడని యేసు చెప్పాడు. (14:18).
తనతో పాటు పాత్ర లో చెయ్యి ముంచు శిష్యుడే తనను అప్పగించబోతున్నాడని యేసు చెప్పాడు. (14:20).
ఆ మనుష్యుడు పుట్టియుండని యెడల వానికి మేలు అని యేసు చెప్పాడు. (14:21).
"మీరు తీసుకొనుడి, ఇది నా శరీరము" అని యేసు చెప్పాడు? (14:22).
"ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము" అని యేసు చెప్పాడు. (14:24).
దేవుని రాజ్యములో ద్రాక్షా రసమును కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని యేసు చెప్పాడు. (14:25).
తన నిమిత్తము శిష్యులందరూ అభ్యంతరపడతారని యేసు ముందుగా చెప్పాడు. (14:27).
ఆరోజు కోడి రెండు సార్లు కూయక ముందే తనను ఎరుగనని పేతురు మూడు సార్లు అబద్ధం చెబుతాడని యేసు చెప్పాడు. (14:30).
వారు ఎక్కడ ఉండి ప్రార్ధించమని వారితో యేసు చెప్పాడు. (14:32-34).
ఆ గడియ తన వద్ద నుండి తొలగిపోవాలని ప్రార్ధించాడు. (14:35).
తండ్రి చిత్తము ఏదైనప్పటికీ అంగీకరించడానికి యేసు ఇష్టం చూపాడు. (14:36).
తన ముగ్గురు శిష్యులు నిద్రపోవడం ఆయన చూసాడు. (14:37).
తన ముగ్గురు?ిష్యులు నిద్రపోవడం ఆయన చూసాడు. (14:40).
తన ముగ్గురు?ిష్యులు నిద్ర పోవడం ఆయన చూసాడు. (14:41).
యూదా యేసును ముద్దు పెట్టడం ద్వారా ఆ వ్యక్తి యేసు అని చూపించ గోరాడు. (14:44-45).
బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను పట్టుకొన వచ్చినందున లేఖనము నేరవేరినదని యేసు చెప్పాడు. (14:48-49).
యేసుతో ఉన్నవారు ఆయనను విడిచి పారిపోయారు. (14:50).
ఆ పడుచువాడు నారబట్ట విడిచి, దిగంబరుడై పారిపోయాడు. (14:51-52).
పేతురు సైనికుల కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకొంటున్నాడు. (14:53-54).
యేసుకు వ్యతిరేకంగా ఇవ్వబడిన సాక్ష్యం అబద్దము, అవి ఒకదానికొకటి సరిపడలేదు. (14:55-59).
పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు తానేనా అని ప్రధాన యాజకుడు యేసును అడిగాడు. (14:61).
పరమాత్ముని కుమారుడవైన క్రీస్తు తానేనని యేసు జవాబిచ్చాడు. (14:62).
దేవదూషణ చేసిన కారణంగా యేసు దోషి అని ప్రధాన యాజకుడు చెప్పాడు. (14:64).
వారు ఆయన మీద ఉమ్మివేసి, ఆయనను గుద్దుచూ కొట్టారు. (14:65).
తనకు తెలియదనీ, ఆమె అంటున్నది తనకు బోధ పడలేదనీ పేతురు బాలికతో చెప్పాడు. (14:66).
యేసును ఎరుగనని శపించు కొనుటకు, ఒట్టు పెట్టుకొనుటకు మొదలు పెట్టెను. (14:71).
మూడవ సారి పేతురు జవాబిచ్చిన తరువాత రెండవ సారి కోడి కూసింది. (14:72).
కోడి కూత వినిన తరువాత పేతురు కృంగి పోయి ఏడ్చాడు. (14:72).
ఉదయం కాగానే వారు యేసును బంధించి, పిలాతుకు అప్పగించారు. (15:1).
యేసు ఏ జవాబు చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్య పడ్డాడు. (15:5).
పండుగ సమయాలలో జనసమూహం కోసం పిలాతు సాధారణంగా ఒక ఖయిదీని విడుదల చేస్తుండే వాడు. (15:6).
ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించితిరని పిలాతు తెలుసుకున్నాడు. (15:10).
బరబ్బాను విడుదల చెయ్యమని వారు కేకలు వేసారు, అతడు హంతకుడు. (15:7,11).
యూదుల రాజు సిలువ వేయబడాలని జనసమూహం కేకలు వేసారు. (15:12-14).
సైనికులు యేసుకు ఊదారంగు వస్త్రాన్ని ధరింప చేసారు, ముండ్ల కిరీటాన్ని తలపై పెట్టారు. (15:17).
కురేనియుడైన సీమోను యేసు సిలువను మోయడానికి బలవంత పెట్టబడ్డాడు. (15:21).
యేసును సిలువ వెయ్యడానికి తీసుకొని వచ్చిన స్థలము పేరు గొల్గోత. (15:22).
యేసు వస్త్రముల కొరకు సైనికులు చీట్లు చేసారు?(15:24).
సైనికులు ఆ చెక్క పై "యూదులకు రాజు" అని రాసారు. (15:26).
తనని తాను రక్షించు కొని సిలువ మీద నుండి కిందికి దిగి రమ్మని ఆయనను సవాలు చేస్తున్నారు. (15:29).
తాము నమ్మునట్లు యేసును సిలువ మీదనుండి దిగి రమ్మని ప్రధాన యాజకులు అడుగుతున్నారు. (15:31-32).
ప్రధాన యాజకులు ఆయనను క్రీస్తు అని, ఇశ్రాయేలుకు రాజు అని పిలిచారు. (15:32).
ఆరవ గంట సమయములో ఆ దేశమంతటను చీకటి కమ్మింది. (15:33).
"నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి" అని బిగ్గరగా కేక వేసాడు. (15:34).
ఆయన గొప్ప కేక వేసి ప్రాణము విడిచాడు. (15:37).
దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగింది. (15:38).
నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని శతాధిపతి సాక్ష్యమిచ్చాడు. (15:39).
విశ్రాంతి దినమునకు ముందు రోజున యేసు చనిపోయాడు? (15:42).
అరిమతయి యోసేపు పిలాతును యేసు దేహమును తనకిమ్మని అడిగాడు, సిలువనుండి ఆయనను దించి, నార బట్టతో ఆయనను చుట్టి, సమాధి యందు ఆయనను ఉంచాడు, ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. (15:43,46).
వారంలో మొదటి రోజున సూర్యోదయమైనప్పుడు స్త్రీలు సమాధి యొద్దకు వెళ్ళారు. (16:2).
సమాధి వద్ద ఉన్న రాయిని ఎవరో దొరలించి వేసారు. (16:4).
తెల్లని అంగీ ధరించు కొనియున్న ఒక యువకుడు కుడి వైపున కూర్చుండుట చూసారు. (16:5).
యేసు లేచి ఉన్నాడు, అక్కడ లేడు అని ఆ యువకుడు చెప్పాడు (16:6).
శిష్యులు యేసును గలలియలో కలుసుకోవచ్చని యువకుడు చెప్పాడు. (16:7).
యేసు పునరుత్థానుడైన తరువాత మొదట మగ్దలేనే మరియకు కనిపించాడు. (16:9).
శిష్యులు నమ్మలేదు. (16:11).
శిష్యులు నమ్మలేదు (16:13).
వారి అపనమ్మిక నిమిత్తము వారిని గద్దించాడు. (16:14).
సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని యేసు ఆజ్ఞాపించాడు. (16:15).
నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షించబడుదురని యేసు చెప్పాడు. (16:16).
నమ్మని వానికి శిక్ష విధించబడునని యేసు చెప్పాడు. (16:16).
నమ్మిన వారు దయ్యములను వెళ్ళ గొట్టుడురు, కొత్త భాషలు మాట్లాడుతారు, మరణకరమైనదేదియు వారికి హాని చెయ్యదు. వారు ఇతరులను స్వస్థత పరచుదురు. (16:17-18).
శిష్యులతో మాట్లాడిన తరువాత ఆయన పరలోకమునకు కొనిపోబడ్డాడు, దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. (16:19).
శిష్యులు బయలు దేరి సువార్త ప్రకటించారు. (16:20).
ప్రభువు వారికి సహకారుడై సూచక క్రియల వలన వారి వాక్యమును స్థిర పరచుచుండెను. (16:20).
లూకా ప్రస్తావించిన "కన్నులారా చూసినవారు" ఆరంభము నుండి ఉన్న వాక్యసేవకులైన వారు(1:1-2).
మన మధ్య నెరవేరిన కార్యాలను వివరముగా రాయడానికి పూనుకున్నారు(1:2)
యేసు బోధించిన విషయాలను గూర్చిన సత్యాలను ధీయోఫిల తెలుసుకోవాలని లూకా కోరుకున్నాడు(1:4).
వారు దేవుని ఆజ్ఞలకు లోబడ్డారు గనుక దేవుడు వారిని నీతిమంతులని తీర్చాడు(1:6).
ఎలీసనేతు గొడ్రాలు గనుక ఆమెకు పిల్లలు పుట్టలేదు. ఇప్పుడు వారిద్దరూ ముసలివారయ్యారు(1:7).
జెకర్యా దేవాలయంలో యాజక ధర్మం జరిగిస్తున్నాడు(1:8).
జెకర్యా దేవాలయములో ధూపము వేస్తున్నాడు(1:9).
ప్రజల సమూహము దేవాలయము వెలుపల ప్రార్దన చేస్తున్నారు(1:10).
అతడు దేవాలయములో ఉండగా దేవుని దూత ప్రత్యక్షమయ్యాదు(1:11).
దూతను చూసినప్పుడు జెకర్యా తొందరపడి భయపడ్డాడు(1:12).
జెకర్యాను భయపడవద్దనీ, అతని భార్య ఎలీసబెతుకు కొడుకు పుడతాడనీ, అతనికి యోహాను అని పేరు పెట్టాలని చెప్పాడు(1:13).
యోహాను ఇశ్రాయేలు కుమారులలో అనేకులను దేవుని వైపు తిప్పుతాడని దూత చెప్పాడు(1:16).
ప్రభువు కోసం సిద్ధపడేవారి అతడు బోధలు చేస్సాడు(1:17).
దూత పేరు గబ్రియేలు, అతడు దేవుని సముఖంలో నివసిస్తాడు(1:19).
బాలుడు పుట్టే వరకు జెకర్యా మాటలు రాక మూగవాడుగా ఉంటాడని దూత చెప్పాడు(1:21).
దావీదు వంశీకుడైన యోసేపుకు ప్రధానం చేయబడిన మరియ ఆమె వద్దకు వచ్చింది(1:27).
మరియ గర్భం ధరించబోతున్నదని దూత చెప్పాడు(1:31).
ఆయన యాకోబు వంశస్తులను యుగయుగాలు ఏలుతాడు గనుక ఆయనకు యేసు అనే పేరు పెడతారు(1:31,33).
పరిశుద్ధాత్మ మరియ పైకి వస్తుందని, సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకొంటుందని దూత చెప్పాడు(1:35).
బాలుడు దేవుని కుమారుడుగా అని పిలువబడతాడని దూత చెప్పాడు(1:35).
దేవునికి సమస్తమూ సాధ్యమే(1:35).
ఎలీసబెతు గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసాడు(1:41,44).
మరియ, ఆమె గర్భంలోని శిశువు ఆశీర్వదించబడిన వారని ఎలీసబెతు చెప్పింది(1:42).
అబ్రాహము, అతని వారసులకు దేవుడు ఇచ్చిన వాగ్దాన నెరవేర్పు అని మరియ చెప్పింది(1:54).
జెకర్యా(1:59).
"అతని పేరు యోహాను" అని జెకర్యా అని రాశాడు. అప్పటినుండి అతడు మాటలాడడం ప్రారంభించాడు(1:63-64).
దేవుని హస్తం అతనికి తోడై యున్నదని వారు అనుకున్నారు(1:66).
దేవుడు ప్రజలకు విమోచన కలిగించబోతున్నాడని జెకర్యా దేవుణ్ణి స్తుతించాడు(1:68).
ప్రజలు తమ పాపాలకు క్షమాపణ పొందాలని యోహాను బోధిస్తాడని జెకర్యా ప్రవచించాడు(1:77).
అతడు అరణ్య ప్రాంతంలో ఉంటూ పెరిగాడు(1:80).
ప్రజలంతా తమ తమ సొంత పట్టణాలకు వెళ్ళాలి(2:3).
యోసేపు దావీదు గోత్రానికి చెందినవాడు కావడం వల్ల మరియతో కలసి బెత్లెహేము వెళ్ళాడు(2:4).
శిశువు పుట్టిన తరువాత పశువుల తొట్టిలో ఉంచింది (2:7).
తమ మందలను కాచుకొంటున్న కాపరులకు దేవదూత ప్రత్యక్షమయ్యాడు (2:8-9).
దేవదూతను చూసిన గొర్రెల కాపరులు ఎంతో భయపడ్డారు(2:9).
రక్షకుడైన క్రీస్తు ప్రభువు పుట్టాడని దేవదూత గొర్రెల కాపరులకు చెప్పాడు(2:11).
గొర్రెల కాపరులు శిశువు పుట్టిన బేత్లేహేముకు వెళ్లి శిశువును చూశారు(2:15-16).
యేసు పుట్టిన ఎనిమిదవ రోజున సున్నతి జరిగింది(2:21).
మోషే ధర్మశాస్త్రములో చెప్పబడిన ప్రకారము తమను శుద్ధి చేసుకొని శిశువును ప్రతిష్ట చేయడానికి యోసేపు, మరియలు యెరూషలేములోని దేవాలయానికి బాలుడైన యేసును తీసుకు వెళ్ళారు(2:22-24).
ప్రభువైన క్రీస్తును చూసేంతవరకు అతడు మరణించడని పరిశుద్ధాత్మ బయలుపరిచాడు(2:26).
యేసు అన్యజనులకు దేవుని బయలు పరిచే వెలుగుగా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగా ఉండబోతున్నాడని సుమెయోను చెప్పాడు(2:32).
మరియ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుపోతుందని సుమెయోను చెప్పాడు(2:35).
అన్న దేవుని కొనియాడి అక్కడ ఉన్నవారందరితో ఆ బాలుని గూర్చి చెప్పడం మొదలు పెట్టింది(2:38).
బాలుడు జ్ఞానముతో నిండుతూ, ఎదిగి బలం పొందుతున్నాడు. దేవుని దయ ఆయన మీద ఉంది(2:40).
యేసు తమతోనే కలసి ప్రయాణిస్తున్నాడని వారు భావించారు(2:43-44).
దేవాలయములో బోధకుల మధ్యన కూర్చుని వారి మాటలు వింటూ, ప్రశ్నలు అడుగుతూ ఉన్న యేసును చూసారు(2:46).
యేసు "నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా?" అని మరియకు జవాబిచ్చాడు(2:49).
యేసు తన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు(2:51).
యేసు జ్ఞానంలో, వయస్సులో, దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లుతున్నాడు(2:52).
యోహాను పాప క్షమాపణ నిమిత్తము, మారుమనస్సు విషయమై ప్రకటిస్తున్నాడు(3:3).
యోహాను ప్రభువు కోసం మార్గం సిద్ధపరుస్తున్నానని చెప్పాడు(3:4).
మారుమనస్సుకు తగిన ఫలాలు ఫలించాలని యోహాను బోధించాడు(3:8).
మంచి ఫలాలు ఫలించని చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందని యోహాను చెప్పాడు(3:9).
నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని యోహాను సుంకరులకు చెప్పాడు(3:13).
రాబోయే వాడు పరిశుద్దాత్మలో, అగ్నిలో బాప్తిస్మమిస్తాడని యోహాను చెప్పాడు(3:16).
హేరోదు తన తమ్ముని భార్యను వివాహం చేసుకొనడాన్నిబట్టి. అతడు చేస్తున్న చెడ్డ కార్యాలనుబట్టి అతణ్ణి గద్దించాడు(3:19).
హేరోదు యోహానును చెరసాలలో వేయించాడు(3:20).
యోహాను యేసుకు బాప్తిస్మమిచ్చినప్పుడు ఆకాశము తెరువబడి పరిశుద్ధాత్మ పావురం రూపంలో క్రిందికి దిగి వచ్చాడు(3:21-22).
"నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేను ఆనందించుచున్నాను" అనే స్వరం వినబడింది(3:22).
యేసు బోధించడం మొదలుపెట్టినప్పుడు ఆయన వయస్సు దాదాపు ముప్పై ఏళ్లు(3:23).
యేసును పరిశుద్ధాత్మ అరణ్యములోకి నడిపించాడు(4:1).
యేసు అరణ్యములో అపవాదిచే నలభై రోజులు శోధింపబడ్డాడు(4:2).
రాళ్ళను రొట్టెలుగా మార్చమని సాతాను యేసును శోధించాడు(4:3).
మనిషి రొట్టె వలన మాత్రము జీవించడు అని యేసు జవాబిచ్చాడు(4:4).
సాతాను యేసుకు భూలోక రాజ్యములన్నిటిని చూపించాడు(4:5).
సాతాను తనకు మ్రొక్కి ఆరాధించాలని యేసును కోరాడు(4:7).
నీ దేవుడైన ప్రభువును మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించాలని యేసు చెప్పాడు(4:8).
అక్కడినుండి కిందికి దూకమని అపవాది యేసుతో చెప్పాడు(4:9).
నీ దేవుడైన ప్రభువును శోధించకూడదని యేసు చెప్పాడు(4:12).
అపవాది కొంతకాలము ఆయనను విడిచిపెట్టి వెళ్ళాడు(4:13).
యేసు యెషయా ప్రవచనం చదివాడు(4:17).
ఆ రోజున యెషయా గ్రంథం నుండి చదవబడిన ప్రవచనం నేరవేరిందని యేసు చెప్పాడు(4:21).
ఏ ప్రవక్తా తన స్వదేశంలో హితుడు కాడని యేసు చెప్పాడు(4:24).
దేవుడు సీదోనులో ఉన్న సారెపతు అనే ఊరికి పంపించాడు(4:26).
దేవుడు సిరియాలోని నయమానుకు సహాయం చేయడానికి పంపించాడు(4:27).
ఆ ప్రజలు ఆగ్రహంతో నిండుకొని ఆయనను తలక్రిందులుగా పడవేయాలని చూసారు(4:28-29).
యేసు వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాడు(4:30).
యేసు దేవుని పరిశుద్దుడని బిగ్గరగా పలికాడు(4:34).
అక్కడి ప్రజలు ఆశ్చర్యపడి ఒకరితో ఒకరు దాని గురించి మాట్లాడుకున్నారు(4:36).
యేసు నానా విధములైన రోగులమీద చేతులుంచి వీరిని స్వస్థపరిచాడు(4:40).
దయ్యములు యేసు దేవుని కుమారుడని కేకలు వేసినప్పుడు ఆయన యేసు అని వాటికి తెలిసినందువల్ల వాటిని గద్దించి మాట్లాదనియ్యలేదు(4:41).
యేసు దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి పంప బడ్డానని చెప్పాడు(4:43).
దోనెను లోతుకు నడిపించి చేపలు పట్టడానికి వలలు వేయమని చెప్పాడు(5:4).
అతడు యేసు మాటకు లోబడి వలలు వేశాడు(5:5).
వారు వలలు వేసి వలలు పిగిలిపోయేటంత విస్తారంగా చేపలు పట్టారు(5:6).
సీమోను యేసును తాను పాపాత్ముడు కనుక తనను విడిఛి వెళ్ళిపొమ్మని కోరుకున్నాడు(5:8).
సీమోను ఇప్పటినుంచి మనుషులను పట్టే జాలరి అవుతాడని యేసు చెప్పాడు(5:10).
బహు జనసమూహములు ఆయన వద్దకు వచ్చారు (5:15).
యేసు అతనితో, మనుష్యుడా, నీ పాపములు క్షమించబడియున్నవి అని చెప్పాడు (5:20).
ఎందుకంటే, ఒక్క దేవునికి మాత్రమే పాపాలు క్షమించే అధికారం ఉన్నది (5:21).
యేసు పక్షవాయు రోగిని స్వస్థపరచడం ద్వారా తనకు లోకంలో పాపాలు క్షమించే అధికారం ఉందని తెలియజేసాడు(5:24).
మారుమనస్సు పొందడం కోసం పాపులను పిలవడానికి లోకానికి వచ్చానని యేసు చెప్పాడు(5:32).
తాను వారి మధ్య నుండి కొనిపోబడినప్పుడు శిష్యులు ఉపవాసం ఉండాలని చెప్పాడు(5:35).
పాత గుడ్డకు కొత్త దానితో మాసిక వేస్తే అది దానితో కలవదు, పాత గుడ్డను కొత్తది చింపివేస్తుంది(5:36).
కొత్త ద్రాక్షా రసము పాత తిత్తులను పిగులుస్తుంది, ద్రాక్షారసం పాడైపోతుంది(5:37).
కొత్త ద్రాక్షారసం కొత్త తిత్తులలో పోయ్యాలని యేసు చెప్పాడు(5:38).
యేసు శిష్యులు వెన్నులు తుంచి, చేతులతో దులుపుకుని తింటున్నారు(6:1).
యేసు తాను విశ్రాంతి దినమునకు యజమానినని చెప్పుకున్నాడు(6:5).
వారు తీవ్రమైన కోపంతో నిండుకొని యేసును ఏమి చేయుదమా అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు(6:11).
యేసు వారిని "అపొస్తలులు" అని పిలిచాడు(6:13).
పేదవారు, ఆకలిగొన్నవారు, ఏడ్చుచున్నవారు, మనుష్యకుమారుని కొరకు ద్వేషించబడినవారు ధన్యులు(6:20-22).
ఎందుకంటే వారి ఫలము పరలోకంలో అధికం అవుతుంది(6:23).
శిష్యులు తమ శత్రువులను ప్రేమించి, వారి పట్ల మంచి పనులు చెయ్యాలి(6:27,35).
కృతజ్ఞత లేనివారికి, దుష్టులకు దేవుడు ఉపకారియై ఉన్నాడు(6:35-36).
మనం వేషదారులమై ఉండకుండునట్లు మొదటగా మనం మన కంట్లో ఉన్న దూలమును తీసుకోవాలని యేసు చెప్పాడు(6:42).
సజ్జనుడి హృదయమను మంచి ధననిధి నుండి సద్విషయములు బయటికి తెస్తాడు(6:45).
దుర్జనుడు హృదయమను చెడ్డ ధననిధి నుండి దుర్విషయములు బయటికి తెస్తాడు(6:45).
యేసు మాటలు విని, వాటి చొప్పున జరిగించాడు(6:47).
యేసు మాటలు వినియు, వాటి చొప్పున చేయలేదు(6:49).
యేసును తన ఇంటికి వచ్చి తన సేవకుణ్ణి స్వస్థపరచమని కోరుకున్నాడు(7:3).
యేసు తన ఇంటికి వచ్చేందుకు తాను యోగ్యుడను కానని శతాధిపతి చెప్పాడు(7:6).
యేసు ఒక మాట చెప్పి తన దాసుణ్ణి స్వస్థపరచాలని కోరుకున్నాడు(7:7).
ఇశ్రాయేలీయులలోనైనా ఇంతటి విశ్వాసం తనకు కనబడలేదని యేసు చెప్పాడు(7:9).
యేసు ఆమెను చూసి ఆమెయందు కనికరపడ్డాడు(7:13).
మనలో గొప్ప ప్రవక్త బయలుదేరాడనీ, దేవుడు తన దర్శనము అనుగ్రహించాడని అక్కడి ప్రజలు అనుకున్నారు(7:16).
యేసు గుడ్డివారిని, కుంటివారిని, కుష్టురోగులను, చేవిటివారిని స్వస్థపరిచాడు. చనిపోయిన వారిని బతికించాడు(7:22).
యోహాను ప్రవక్త కంటే గొప్పవాడని యేసు చెప్పాడు(7:26).
వారు తమ విషయమైన దేవుని సంకల్పాన్ని నిరాకరించారు(7:30).
వారు అతణ్ణి "దయ్యము పట్టినవాడు" అని పిలిచారు(7:33).
వారు యేసును తిండిబోతు అనీ, మద్యపాని అనీ పిలిచారు(7:34).
ఆమె తన కన్నీళ్ళతో ఆయన పాదములను తడిపి, తన తలవెంట్రుకలతో తుడిచి, ఆయన పాదములను ముద్దుపెట్టుకుని అత్తరును వాటికి పూసింది(7:38).
ఆమె విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె పాపాలు క్షమించబడ్డాయి(7:47).
వారు "పాపములు క్షమించుటకు ఇతడు ఎవరు" అని తమలో తాము అనుకున్నారు(7:49).
వారు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి(8:3).
విత్తబడినది దేవుని వాక్యం(8:11).
త్రోవ పక్కన ఉండువారు, వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములోనుండి వాక్యమును ఎత్తికొని పోవును(8:12).
వారు సంతోషముగా వాక్యము వింటారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు(8:13).
వారు విని, కాలము గడచిన కొలది ఈ జీవసంబంధమైన విచారముల చేత, ధనభోగముల చేత అణచివేయబడి ఫలించరు(8:14).
వారు యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంభించి ఓపికతో ఫలిస్తారు(8:15).
దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించేవారే తన తల్లి, తండ్రి అని చెప్పాడు(8:21).
వారు, "ఈయన గాలికిని, నీళ్లకును ఆజ్ఞాపించగా అవి లోబడుచున్నవి. ఈయన ఎవరో" అనుకున్నారు(8:25).
వాడు దయ్యములు పట్టినవాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకోకుండా, సమాధులలో నివసిస్తూ గొలుసులతో, కాలిసంకెళ్లతో కట్టబడి ఉన్నాడు(8:27,29).
ఆ దయ్యం ఆ వ్యక్తిని విడిచిపోయి పందులలో చొరబడింది గనుక, ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వాడిగా పరిగెత్తి ఊపిరి తిరుగక చచ్చెను(8:33).
యేసు అతనితో, "ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గోప్పకార్యాలను చేసెనో తెలియజేయుమని" చెప్పాడు(8:39).
యేసుపై ఆమెకు ఉన్న విశ్వాసమే ఆమెను స్వస్థపరచింది(8:48).
చనిపోయిన యాయీరు కుమార్తెను యేసు బతికించాడు(8:55).
దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుటకు, రోగులను స్వస్థపరచుటకు యేసు తన శిష్యులను పంపించాడు(9:2).
యేసును గూర్చి కొందరు ఆయన బాప్తిస్మమిచ్చు యోహాను మృతుల్లో నుండి లేచాడని, కొందరు ఏలీయా కనబడ్డాడనీ, మరికొందరు పూర్వకాలపు ప్రవక్త లేచాడనీ చెప్పుకున్నారు(9:7-8).
యేసును వెంబడించిన జనసమూహంలో అయిదు వేలకు మించి పురుషులు ఉన్నారు(9:14).
శిష్యుల వద్ద అయిదు రొట్టెలు, రెండు చిన్న చేపలు ఉన్నాయి(9:13,16).
యేసు వాటిని తీసుకుని పరలోకమందున్న తండ్రికి ప్రార్థించి, వాటిని ఆశీర్వదించి ముక్కలుగా చేసి ప్రజలకు పంచమని శిష్యులకు ఇచ్చాడు(9:16).
పన్నెండు నిండు గంపలు మిగిలిపోయాయి(9:17).
పేతురు యేసుతో, "నీవు దేవుని క్రీస్తువు" అని జవాబిచ్చాడు(9:20).
ఆయనను వెంబడించగోరేవాడు తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ఆయనను వెంబదించాలని యేసు చెప్పాడు(9:23).
యేసు ముఖరూపము మారిపోయింది. ఆయన వస్త్రాలు తెల్లనివై ధగధగ మెరిశాయి (9:29).
జ.మోషే, ఎలీయాలు యేసుతో కలసి ప్రత్యక్షమయ్యారు(9:30).
ఆ స్వరం, "ఈయన నేనేర్పరచుకున్న నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి" అని పలికింది(9:35).
వాడు కేకలు వేయుచు, నురుగు కారునట్లు అది వానిని వదలక పీడిస్తుంది(9:39).
యేసు వారితో, "మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోతున్నాడు" అని చెప్పాడు(9:44).
ఎవడు అత్యల్పుడై యుండునో వాడే గొప్పవాడు అని యేసు చెప్పాడు(9:48).
ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు సిద్ధపరచుకున్నాడు(9:51).
అలాంటివాడు వెనుకకు తిరిగి చూడకూడదు(9:26).
వారు సంచి గానీ, జోలె గానీ, చెప్పులను గానీ తమ వెంట తీసుకు వెళ్లకూడదని యేసు చెప్పాడు(10:4).
అక్కడ ఉన్న రోగులను స్వస్థపరచి, దేవుని రాజ్యము సమీపించియుయున్నదని ప్రకటించాలని యేసు చెప్పాడు(10:9).
అది సొదొమ పట్టణానికి పట్టిన గతికంటే అధ్వానంగా మారుతుంది(10:12).
యేసు, "మీ పేర్లు పరలోకమందు వ్రాయబడియున్నవని సంతోషించుడి" అని చెప్పాడు(10:20).
పరలోక రాజ్య విషయాలు జ్ఞానులకు వివేకులకు తెలియబడుట కంటే పసిబాలురకు తెలియబడుట తండ్రియైన దేవునికి సంతోషం కలిగిస్తుంది(10:21).
నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ భక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెను. నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను(10:27).
అతడు గాయపడిన వ్యక్తిని చూసి ప్రక్కగా వెళ్ళిపోయాడు(10:31).
అతడు గాయపడిన వ్యక్తిని చూసి ప్రక్కగా వెళ్ళిపోయాడు(10:32).
అతడు గాయపడిన వ్యక్తిని చూసి అతని గాయములు కడిగి, తన వాహనము మీద ఎక్కించుకుని ఒక పూటకూళ్లవాని ఇంటికి తీసికొనిపోయి అతనిని పరామర్శించెను(10:34).
ఉపమానంలో చెప్పబడినట్టు సమరయుడు చూపినట్టు ఇతరులపట్ల జాలి చూపమని చెప్పాడు(10:37).
మరియ యేసు పాదాల వద్ద కూర్చుని ఆయన చెప్పేది వింటున్నది(10:39).
మార్త విస్తారమైన పని పెట్టుకుని యేసుకు భోజనం సిద్ధం చేస్తుంది(10:40).
మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకున్నదని యేసు చెప్పాడు(10:42).
ఆయన, "తండ్రీ, నీ నామము పరిశుద్దపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయుము. మేము మాకచ్చియున్న ప్రతివానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేకుము" అని ప్రార్థించాడు(11:2-4).
అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుతూ ఉండడంవల్ల ఇచ్చాడు(11:8).
ఆయన తన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు(11:13).
యేసు దయ్యాలను వెళ్ళగొట్టడం చూసిన కొందరు ఆయన దయ్యాలకు అధిపతియైన బయోల్జెబూలు వలన దయ్యాలను వెళ్ళగొడుతున్నాడని చెప్పుకున్నారు(11:15).
ఆయన దేవుని వేలితో దయ్యాలను వెళ్ళగొడుతున్నానని యేసు చెప్పాడు(11:20).
అతని అంతిమ స్థితి మొదటికంటే మరింత అధ్వానంగా ఉంటుంది(11:26).
దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరింత ధన్యులని యేసు చెప్పాడు(11:28).
సోలోమోను మరియు యోనా(11:31-32).
పరిసయ్యులు న్యాయాన్ని, దేవుని ప్రేమను నిర్ల్యక్షం చేశారు(11:42).
వారు మోయశక్యముగాని బరువులను మనుషుల మీద మోపుతారు కానీ వారు ఒక వేలితోనైనను ఆ బరువులు ముట్టరు అని చెప్పాడు(11:46).
లోకము పుట్టినది మొదలు చిందింపబడిన ప్రవక్తల రక్తము నిమిత్తము వారు విచారింపబడతారు(11:50).
వారు ఆయన మీద నేరము మోపవలెనని ఆయన నోట నుండి వచ్చు ఏ మాటయైనను పట్టుకోవాలని చూసారు(11:54).
ఆ మాటలు వెలుగులో వినబడతాయి(12:3).
నరకములో పడద్రోయు శక్తీ గలవానికి మనం భయపడాలి(12:5).
యేసును ఒప్పుకున్న వ్యక్తిని యేసు దేవుని ఎదుట, దూతల ఎదుట ఒప్పుకుంటాడు(12:8).
మన జీవితాలు సంపదలు విస్తరించుటకు తావియ్యకూడదు(12:15).
అతడు తన కొట్లు విప్పి, వాటికంటే గొప్పవాటిని కట్టించి అందులో ధాన్యమంతటిని తినుచు త్రాగుచు సుఖించాలనుకున్నాడు(12:18-19).
దేవుడు, "వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు. నీవు సిద్ధపరచినవి ఎవరికి దక్కుతాయి" అన్నాడు(12:20).
మనం ఆయన రాజ్యమును వెదకాలి(12:31).
మనం మన ధననిధిని పరలోకంలో దాచుకోవాలి. ఎందుకంటే, అక్కడ దొంగ రాడు, చిమ్మెట కొట్టదు(12:33).
ప్రభువు వచ్చినప్పుడు ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొంటాడో ఆ దాసులు ధన్యులు(12:37).
తెలియదు(12:40).
యజమాని వచ్చి వారిని నరికించి అపనమ్మకస్తులతో వారికి పాలు నియమించును(12:46).
ఎక్కువగా ఇయ్యబడిన వారినుంచి ఎక్కువగా తీసుకుంటారు(12:48).
ఒకే ఇంటిలో ఒకరికి ఒకరు విరోధులుగా ఉంటారు(12:52-53).
అతని చేతిలో నుండి తప్పించుకొనడానికి దారిలోనే ప్రయత్నం చెయ్యాలి(12:58).
కాదు(13:3).
చెట్టు చుట్టూ తవ్వి ఎరువు వేసి మరో సంవత్సరంపాటు కనిపెట్టి అప్పటికీ కాపు రాకపోతే నరికివేయబడాలి(13:8-9).
ఆమెను బలహీనపరిచే దయ్యము పట్టి పీడుస్తుంది(13:11,16).
విశ్రాంతి దినం నాడు యేసు ఆ కార్యం చేశాడు కనుక(13:14).
విశ్రాంతి దినమున తమ ఎద్దును గానీ, గాడిదను గానీ తోలుకుని వెళ్ళి నీళ్ళు పెడతారు. అయితే దయ్యము పీడిస్తున్న స్త్రీని ఆ రోజున స్వస్థపరిస్తే ప్రశ్నిస్తారు అని గుర్తు చేశాడు(13:15).
ఆవగింజ పెరిగి వృక్షం అవుతుంది. ఆకాశ పక్షులు దాని కొమ్మల్లో నివసిస్తాయి(13:19).
యేసు, "ఇరుకు ద్వారమున ప్రవేసింప పోరాడుడి. అనేకులు ప్రవేశించాలని చూస్తారు గాని వారివలన కాదు" అని చెప్పాడు(13:24).
జ.అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, సకల ప్రవక్తలు, ఇంకా తూర్పు, పడమర, ఉత్తర దక్షిణ దిక్కులనుండి వచ్చినవారు(13:28-29).
ఆయన యెరూషలేములో తప్పక చంపబదతానని యేసు చెప్పాడు(13:33).
కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలా చేర్చుకుంటుందో అలాగే యెరూషలేము ప్రజలను చేర్చుకోవాలని యేసు ఆశించాడు(13:34).
యెరూషలేము ప్రజలు ఆయనను తిరస్కరించారు(13:34).
యేసు, "ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడువబడుచున్నది.'ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక' అని మీరు చెప్పువరకు మీరు నన్ను చూడరు" అని ప్రవచించాడు(13:35).
యేసు "విశ్రాంతి దినమందు స్వస్థపరచుట న్యాయమా, కాదా?" అని అడిగాడు(14:3).
వారు జవాబు చెప్పకుండా మిన్నకుండిపోయారు(14:4).
విశ్రాంతి దినమున వారి ఎవరి కుమారుడు గానీ, గాడిద గానీ గుంటలో పడిపోతే బయటకు తీయకుండా ఉంటారా అని యేసు వారికి గుర్తుచేశాడు(14:5).
తనను తాను హెచ్చించుకొనేవాడు తగ్గించబడతాడు(14:11).
తనను తాను తగ్గించుకొనేవాడు హెచ్చించబడతాడు(14:11).
జ.వీరు నీతిమంతుని పునరుత్థానములో ప్రత్యుపకారము పొందుతారు(14:14).
ముందుగా పిలువబడినవారు తాము విందుకు రాకుండా సాకులు చెప్పసాగారు(14:18).
పేదలను, అంగహీనులను, గుడ్డివారిని, కుంటివారిని విందుకు ఆహ్వానించాడు(14:21).
ఎవరైనా తన ప్రాణాన్ని, కుటుంబాన్ని ద్వేషించి, తమ సిలువనెత్తికొని, వారికున్నదంతా విదిచిపెట్టకపోతే వారు యేసు శిష్యులు కాలేరు(14:26-27,33).
అతడు ముందుగా దాని ఖర్చు బేరీజు వేసుకుంటాడు(14:28).
దానిని పారవేస్తారు.(14:35).
అతడు తన తొభై తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రెను వెదకి కనుగొని ఆనందంగా తిరిగివచ్చాడు(15:4-5).
మారుమనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగుతుంది(15:7,10).
వారసత్వంగా తనకు సంక్రమించే ఆస్తి తనకు ఇవ్వమని అడిగాడు(15:12).
అతడు వేరొక వ్యక్తి వద్ద పందులు మేపే పనికి కుదిరాడు(15:15).
అతడు తండ్రి వద్దకు వెళ్లి తన తప్పు ఒప్పుకుని, తండ్రి వద్ద ఉన్న పనివారిలో ఒకడిగా చేర్చుకొమ్మని అడగాలని నిర్ణయించుకున్నాడు(15:18-19).
తండ్రి పరుగెత్తుకొని వెళ్లి తన కుమారుణ్ణి ముద్దుపెట్టుకున్నాడు(15:20).
తండ్రి తన కుమారునికి ప్రశస్త వస్త్రము తొడిగించి, ఉంగరము పెట్టి, చెప్పులు తొడిగించాడు. విందు ఏర్పాటు చేసాడు(15:22-23).
అతడు కోపం తెచ్చుకొని లోపలికి వెళ్ళలేదు(15:28).
తాను ఇంతకాలం నుండి తండ్రిని సేవిస్తూ, అతడి ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నప్పటికీ తన స్నేహితులతో కలసి సంతోషించుటకు ఒక మేకపిల్లను కూడా ఇవ్వలేదని పెద్ద కుమారుడు ఫిర్యాదు చేశాడు(15:29).
జ.తండ్రి తన పెద్ద కుమారునితో, "కుమారుడా, నీవెల్లప్పుడును నాతో ఉన్నావు. నావన్నియు నీవే" అన్నాడు(15:31).
ఎందుకంటే చిన్న కుమారుడు తప్పిపోయి దొరికాడు(15:32).
గృహనిర్వాహకుడు తన యజమాని ఆస్తిని పాడుచేస్తున్నాడన్న వార్త విన్నాడు(16:1).
గృహనిర్వాహకుడు తన యజమాని ఋణస్తులను పిలిపించి వారి బాకీలు తగ్గించాడు(16:5-7).
గృహనిర్వాహకుడు యుక్తిగా నడుచుకున్నాడని యజమాని మెచ్చుకున్నాడు(16:8).
యేసు, "అన్యాయపు సిరివలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొనును" అని చెప్పాడు(16:9).
అతడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉంటాడని యేసు చెప్పాడు(16:10).
మనం దేవుణ్ణి గానీ, సిరిని గానీ ఎంచుకోవాలి(16:13).
బాప్తిస్మమిచ్చు యోహాను రాక పూర్వం ధర్మశాస్త్రము, ప్రవక్తలు ఉన్నారు(16:16).
దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతుంది(16:16).
అతడు వ్యభిచారి అని పిలువబడతాడు(16:18).
లాజరు అబ్రాహము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను(16:22,25).
అతడు పాతాళమునకు వెళ్ళాడు(16:23).
అతడు, "తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడుచున్నాను" అని అడిగాడు(16:24).
అబ్రాహాము, "మాకును మీకును గొప్ప అగాథముంచబడినది" అని జవాబిచ్చాడు(16:26).
అతడు, "నా సహోదరులు ఈ వేదనకరమైన చోటుకు రాకుండా వారిని హెచ్చరించడానికి లాజరును పంపించు" అని కోరుకున్నాడు(16:27-28).
అబ్రహాము, "వారి యొద్ద మోషెయు, ప్రవక్తలును ఉన్నారు. వారి మాటలు వినవలెను" అని చెప్పాడు(16:29).
జ.మృతులలో నుండి ఒకడు లేచి చెప్పినప్పటికీ నమ్మరని అబ్రహాము చెప్పాడు(16:31).
మనం తప్పక అతణ్ణి క్షమించాలి(17:4).
మనము, "మేము నిష్ ప్రయోజకులమైన దాసులము. మేము చేయవలసినవే చేసియున్నాము" అని చెప్పాలి(17:10).
వారు, "యేసు ప్రభువా, మమ్ము కరుణించుము" అని కేకలు వేశారు(17:13).
వారు వెళ్లి యాజకులకు కనపరచుకోవాలని యేసు చెప్పాడు(17:14).
వారు వెళ్ళుచుండగా శుద్దులయ్యారు(17:14).
ఒక్కడు మాత్రమే(17:15).
అతడు సమరయ ప్రాంతానికి చెందినవాడు(17:16).
దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నదని చెప్పాడు(17:21).
ఆకాశము కింద ఒక దిక్కునుండి మెరుపు మెరిసి, ఆకాశము క్రింద మరియొక దిక్కున ఏలాగు ప్రకాశించునో ఆ రోజు అలా ఉంటుందని యేసు చెప్పాడు(17:24).
ముందుగా ఆయన అనేక హింసను పొంది ఈ తరము వారిచేత ఉపేక్షించబడతాడని చెప్పాడు(17:25).
అనేకులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు నుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారినందరినీ నాశనము చేసెను(17:27).
మనం ఈ లోక సంపదల కోసం వెనక్కు తిరగాకూడదు. లోతు భార్య అలా చేసి దానిని పోగొట్టుకుంది(17:31-32).
ఎక్కడ పీనుగులు ఉన్నవో అక్కడ గద్దలు పోగవును(17:37).
ఆమెకు, ఆమె ప్రతివాదికి న్యాయము తీర్చమని కోరుతుంది(18:3).
అతడు, "ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమెకు న్యాయం తీర్చుదును" అనుకున్నాడు(18:5).
వారు విసుగక నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలని, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చునని, వారి విషయమే ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని బోధించాలని కోరుకున్నాడు(18:1,8).
ఒక పరిసయ్యుడు, ఒక సుంకరి దేవాలయానికి ప్రార్థన చేయడానికి వెళ్ళారు(18:10).
అతడు ఇతర ప్రజలకంటే నీతిమంతుడనని భావించుకుంటున్నాడు(18:9,11-12).
సుంకరి "దేవా, పాపినైన నన్ను కరుణించుమని" ప్రార్థించాడు(18:13).
దేవుని ఎదుట సుంకరి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు(18:14).
దేవుని రాజ్యము చిన్నబిడ్డలకు చెందినదని యేసు చెప్పాడు(18:16-17).
అతనికి ఉన్న ఆస్తినంతా అమ్మి పేదలకు ఇవ్వమని యేసు చెప్పాడు(18:22).
అతడు మిక్కిలి ధనవంతుడు కనుక వ్యసనపడి అక్కడినుండి వెళ్ళిపోయాడు(18:23).
వారికి ఇహమందు చాల రెట్లును, పరమందు నిత్యజీవమును పొందుతారని యేసు వాగ్దానం చేశాడు(18:30).
అన్యజనులకు ఆయన అప్పగింపబడును, వారు ఆయనను అపహసించి, అవమానపరచి, కొరడాలతో కొట్టి చంపుదురు. మూడవ దినమున ఆయన మరల లేచును(18:32-33).
ఆ గుడ్డివాడు, "యేసూ, దావీదు కుమారుడా, నన్ను కరుణించు" అని కేకలు వేశాడు(18:38-39).
ప్రజలందరూ దేవుని స్త్రోత్రము చేశారు(18:43).
అతని పేరు జక్కయ్య. అతడు సంపన్నుడు, పన్నులు వసూలుదారుడు(19:2).
"ఈయన పాపియైన మనుష్యుని ఇంటికి వెళ్లేనని" ప్రజలు సణుగుకొన్నారు(19:7).
యేసు, "నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది" అని చెప్పాడు(19:9).
దేవుని రాజ్యము వెంటనే అగపడునని ప్రజలు ఆశించారు(19:11).
అతడు రాజ్యము సంపాదించుకొని మరల రావాలని ప్రయాణం చేస్తున్నాడు(19:12).
ఆ సేవకులకు రాజకుమారుడు పట్టణాలను అప్పగించాడు(19:17,19).
అతడు రాజకుమారుడు కఠినమైనవాడని తలంచాడు(19:21).
రాజకుమారుడు అతని వద్ద ఉన్న మీనాను లాక్కున్నాడు(19:24).
వారిని సంహరించమని రాజకుమారుడు చెప్పాడు(19:27).
దానిమీద ఇంతవరకు ఏ మనుష్యుడూ కూర్చోలేదు(19:30).
ప్రజలు, "ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతించ బడు గాక" అంటూ కేకలు వేశారు(19:38).
ప్రజలు కేకలు వేయకపోతే రాళ్ళు కేకలు వేస్తాయని యేసు చెప్పాడు(19:40).
యేసు పట్టణం విషయమై ఏడ్చాడు(19:41).
'నీలో రాతి మీద రాయి నిలిచి యుండనియ్యని దినములు వచ్చునని' యేసు చెప్పాడు(19:44).
ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజల అధికారులు యేసును చంపాలని కోరుకున్నారు(19:47).
ప్రజలు వాక్యము వింటూ, ఆయనను హత్తుకొని ఉండడంవల్ల యేసును చంపలేకపోయారు(19:48).
యేసు వారిని "యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా మనుష్యులచేత కలిగినదా" అని ప్రశ్నించాడు(20:4).
యేసు "అలాగైతే మీరందుకు నమ్మలేదు" అని అడుగుతాడని అనుకున్నారు(20:5).
ప్రజలు తమను రాళ్ళతో కొడతారని వారు అనుకున్నారు(20:6).
వారు ఆ దాసుని కొట్టి వట్టిచేతులతో పంపివేశారు(20:10-12).
యజమాని తన ప్రియమైన కుమారుణ్ణి పంపించాడు(20:13).
జ.వారు ఆ కుమారుణ్ణి బయటకు నెట్టివేసి కొట్టి చంపారు(20:15).
యజమాని ఆ కాపులను సంహరించి తోటను వేరొకరికి అప్పగించాడు(20:16).
శాస్త్రులు, ప్రధాన యజకులను ఉద్దేశించి ఈ ఉపమానం చెప్పాడు(20:19).
కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించాలని యేసు జవాబిచ్చాడు(20:25).
సద్దోకయ్యులు మృతుల పునరుత్థానమును నమ్మరు(20:27).
ఈ లోకంలోనే పెండ్లి ఉంటుంది గాని, పరలోకంలో పెండ్లి అనేది ఉండదు అని యేసు చెప్పాడు(20:34-35).
యేసు పొదను గురించిన భాగం ఉదాహరిస్తూ, ప్రభువు అబ్రాహము ఇస్సాకు దేవుడని చెప్పుచు, మృతులు లేతురని మోషే సూచించెను అని చెప్పాడు(20:37).
యేసు "నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠంగా ఉంచు వరకు నీవు నా కుడుపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను" అనే భాగం ప్రస్తావించాడు(20:42-43).
వారు విధవరాండ్ర ఇళ్ళను ఆక్రమిస్తూ, మాయవేషముగా దీర్ఘ ప్రార్థనలు చేస్తారు(20:47).
వారు మరి విశేషముగా శిక్ష పొందుతారని యేసు చెప్పాడు(20:47).
పేద విధవరాలు తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినదని యేసు అలాచెప్పాడు(21:4).
యెరూషలేములోని దేవాలయము రాతి మీద రాయి ఉండకుండ అవి పడద్రోయబడుతుందని యేసు చెప్పాడు(21:6).
ప్రజలు, "ఇది ఎప్పుడు జరుగును? ఇవి జరగబోవునని సూచన ఏమిటి?" అని అడిగారు(21:7).
వారు, "నేనే ఆయననియు, కాలము సమీపించెనని" చెప్పుదురు(21:8).
యుద్ధములు, భూకంపములు, కరువులు, తెగుళ్ళు, ఆకాశము నుండి మహా భయోత్పాతములు సంభవిస్తాయని యేసు చెప్పాడు(21:9,11).
విశ్వాసులకు ఇది సాక్ష్యార్ధమై ఇది సంభవిస్తుంది(21:13).
యెరూషలేము దండుల చేత చుట్టబడుచున్నది కనుక త్వరలో పతనం కాబోతున్నది(21:20).
వారు కొండలకు పారిపోవలెను, వారి మధ్యనుండువారు వెలుపలికి పోవలెను, పల్లెటూళ్ళలోనివారు దానిలో ప్రవేశించకూడదు(21:21).
లేఖనములలో వ్రాయబడిన వన్నియు నేరవేరుటకై అవి ప్రతిదండన దినములు అని పిలిచాడు(21:22).
అన్య్జజనముల కాలములు సంపూర్ణమగువరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడుతుంది(21:24).
సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు, జనములకు శ్రమలు వస్తాయని యేసు చెప్పాడు(21:25).
అంజూరపు వృక్షము చిగురించుటను గూర్చిన ఉపమానము యేసు చెప్పాడు(21:30).
ఆకాశము, భూమి గతిస్తాయని యేసు చెప్పాడు(21:33).
యేసు మాటలు ఎన్నటికీ గతించవు(21:33).
వారి హృదయము ఒకవేళ తిండివలనను, మత్తువలన, ఐహిక విచారముల వలనను మందముగా ఉంచుకొనకుండా ఉండాలని యేసు హెచ్చరించాడు(21:34).
ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండాలని యేసు హెచ్చరించాడు(21:36).
పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించింది(22:1).
జనసమూహము లేనప్పుడు ఆయనను పట్టుకుని ప్రధాన యాజకులకు అప్పగించాలని ఎదురుచూస్తున్నారు(22:6).
సిద్ధపరచబడిన మేడగదిలో పస్కా విందు ఆచరించారు(22:10-12).
దేవుని రాజ్యము పరలోకములో నెరవేరిన తరువాత పస్కా ఆచరిస్తానని యేసు చెప్పాడు(22:16).
యేసు, "ఇది మీ కొరకు ఇయ్యబడుతున్న నీ శరీరము, నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి" అని చెప్పాడు(22:19).
యేసు, "ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తమువలననైన క్రొత్త నిబంధన" అని చెప్పాడు(22:20).
తెలియదు(22:23).
అవును(22:22).
పరిచర్య చేసేవాడే గొప్పవాడని యేసు చెప్పాడు(22:26).
వారి మధ్య ఆయన సేవకుడుగా జీవించాడు(22:27).
శిష్యులు సింహాసనములపై కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రములవారికి తీర్పు తీరుస్తారు(22:30).
పేతురు కోడి కూయక మునుపు తనను ఎరుగనని మూడుసార్లు అబద్ధం చెబుతాడని యేసు చెప్పాడు(22:34).
"ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను" అని లేఖనములలో వ్రాయబడిన ప్రవచనము నెరవేరింది(22:37).
శిష్యులు శోధనలో ప్రవేశించకుండేలా ప్రార్థన చేయాలని చెప్పాడు(22:40).
యేసు "తండ్రీ, ఈ గిన్నె నా యొద్దనుండి తొలగించుము. అయినను నీ ఇష్టము కాదు, నీ చిత్తమే సిధ్ధించునుగాక" అని ప్రార్థించాడు(22:42).
వారు నిద్రపోతున్నారు(22:45).
యేసుని ముద్దు పెట్టుకున్నాడు(22:47-48).
యేసు అతని చెవిని తాకి స్వస్థపరిచాడు(22:51).
యేసు తాను ప్రతిరోజూ దేవాలయములో ఉంటానని చెప్పాడు(22:53).
వారు యేసును ప్రథాన యాజకుని వద్దకు తీసుకువెళ్ళారు(22:54).
పేతురు, "అమ్మాయీ, నేనతని ఎరుగను" అన్నాడు(22:57).
యేసు ఎవరో తనకు తెలియదని పేతురు మూడవసారి బొంకిన వెంటనే కోడి కూసింది(22:60).
పేతురు బయటకు వెళ్లి సంతాపపడి ఏడ్చాడు(22:62).
వారు యేసును అపహసించి, కొట్టి, ముఖం కప్పివేశారు(22:63-65).
వారు నమ్మరని యేసు చెప్పాడు(22:67).
ఎందుకంటే యేసు స్వయంగా తన నోటితో తానే క్రీస్తునని చెప్పాడు(22:71).
యేసు జనములను తిరగాబడేలా ప్రేరేపిస్తున్నాడని, కైసరుకు పన్ను చెల్లించవద్దనీ, తానే క్రీస్తుననీ, రాజుననీ చెప్పుకుంటున్నాడని నేరారోపణ చేశారు(23:2).
పిలాతు, "ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనబడలేదు" అని చెప్పాడు(23:4).
హేరోదు యేసు ఏదైనా సూచక క్రియ చేసినప్పుడు చూడాలని కోరుకున్నాడు(23:8).
యేసు హీరోదుకు ఎలాంటి జవాబు చెప్పలేదు(23:9).
పిలాతు, "మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు" అని చెప్పాడు(23:14).
జనులు నేరస్తుడైన బరబ్బను విడుదల చేయాలని కోరుకున్నారు(23:18).
జనులు యేసును సిలువ వేయమని కేకలు వేశారు(23:21).
పిలాతు, "ఇతనియందు మరణమునకు తగిన నేరమేమీ నాకు కనబడలేదు" అని చెప్పాడు(23:22).
ప్రజల ఎడతెగని అల్లరి కారణంగా పిలాతు అలా చేశాడు(23:24).
కురేనీయుడైన సీమోను అనే వ్యక్తి సిలువ మోశాడు(23:26).
ఆ స్త్రీలు యేసు గురించి కాక, తమ కోసం, తమ పిల్లలకోసం ఏడవాలని చెప్పాడు(23:28).
యేసుతోపాటు మరో ఇద్దరు దొంగలను సిలువ వేశారు(23:32).
"తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు" అని ప్రార్థించాడు(23:34).
వారు యేసును తనను తాను రక్షించుకోవాలని సవాలు చేశారు(23:35,37,39).
"ఇతడు యూదుల రాజు" అని వ్రాయబడింది(23:38).
ఆ దొంగ యేసును, "నీవు నీ రాజ్యముతో వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో" అని వేడుకున్నాడు(23:42).
యేసు "నేడు నీవు నాతోకూడా పరదైసులో ఉంటావు" అని వాగ్దానం చేశాడు(23:43).
అప్పుడు దేశమంతా చీకటి కమ్మింది, దేవాలయపు తెర మధ్యకు చిరిగింది(23:44-45).
అతడు, "ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడు" అన్నాడు(23:47).
పిలాతు అనుమతితో యేసు దేహాన్ని సమాధి చేశాడు(23:52-53).
ఆ సమయం విశ్రాంతి దినం ఆరంభం(23:54).
వారు ఆజ్ఞ ప్రకారం విశ్రాంతి దినమున విశ్రాంతి తీసుకున్నారు(23:56).
ఆదివారమున తెల్లవారుచుండగా స్త్రీలు సమాధి వద్దకు వెళ్ళారు(24:1).
సమాధి రాయి దొర్లింపబడి ఉండడం, యేసు అక్కడ లేకపోవదం వారు కనుగొన్నారు(24:2-3).
వారు యేసు తిరిగి లేచాడని చెప్పారు(24:6)_.
వెర్రి మాటలుగా అనిపించడం వాళ్ళు ఆ మాటలు నమ్మలేదు(24:11).
సమాధిలో నారబట్టలు మాత్రమే పేతురుకి కనబడ్డాయి(24:12).
యేసును గుర్తుపట్టలేకుండా వారి కళ్ళు మూయబడ్డాయి(24:16).
ఆయన ఇశ్రాయేలీయులను శత్రువుల నుండి విడిపిస్తాడని వారు నిరీక్షించారు(24:21).
లేఖనాలలో తన గురించి రాయబడిన విషయాలను చెప్పాడు(24:27).
ఆయన వారికి అదృశ్యుడయ్యాడు(24:31).
అయన వారితో, "మీకు సమాధానమవునుగాక" అని చెప్పాడు(24:36).
ఆయన తన చేతులు, పాదములు చూసి, అయనను పట్టుకుని పరిశీలించమన్నాడు. వారితో కలిసి కాల్చిన చేప ముక్కలు తిన్నాడు(24:39-43).
ఆయన తన చేతులు, పాదములు చూసి, అయనను పట్టుకుని పరిశీలించమన్నాడు. వారితో కలిసి కాల్చిన చేప ముక్కలు తిన్నాడు(24:39-43).
యేసు వారి మనసులు తెరిచినందువల్ల శిష్యులు లేఖనాలను గ్రహించడం మొదలుపెట్టారు(24:45).
సర్వలోకమునకు మారుమనసు, పాపక్షమాపణ ప్రకటింపబదాలని యేసు శిష్యులకు చెప్పాడు(24:47).
శిష్యులు పైనుండి శక్తి పొందేవరకు పట్టణంలో నిలిచి ఉండాలి(24:49).
ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యాడు(24:51).
వారు ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్త్రోత్రము చేయుచుండిరి(24:53).
ఆదియందు వాక్కు ఉన్నాడు. (1:1)
వాక్కు దేవుని వద్ద ఉన్నాడు. (1:1-2)
వాక్కు దేవుడై ఉన్నాడు.
సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదీ ఆయన లేకుండ కలుగలేదు. (1:3)
ఆయనలో జీవమున్నది. (1:4)
అతని పేరు యోహాను. (1:6)
అతని మూలముగా అందరు విశ్వసించునట్లుగా అతడు అ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు సాక్షి గా వచ్చెను. (1:7)
యోహాను సాక్ష్యమిచ్చుటకు వచ్చిన వెలుగును లోకము తెలుసుకొనలేదు, ఆ వెలుగు స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. (1:10-11)
తనను అంగీకరించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. (1:12)
దేవుని మూలమున పుట్టినవారు కావడం ద్వారా వారు దేవుని పిల్లలు అయ్యారు. (1:13)
లేదు! తండ్రి యొద్ద నుండి వచ్చిన వాక్కు ఒకే ఒక విశిష్ట మైన వ్యక్తి. (1:14)
ఆయన పరిపూర్ణత లోనుండి మనమందరం కృప వెంబడి కృపను పొందితిమి. (1:16)
యేసు క్రీస్తు ద్వారా కృపయు, సత్యమును కలిగెను. (1:17)
ఎవడైనను ఎప్పుడైనను తండ్రిని చూడలేదు. (1:18)
తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను మనకు బయలు పరచెను. (1:18)
యెషయా ప్రవక్త చెప్పినట్టు "ప్రభువు త్రోవను సరాళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము" అని యోహాను తన గురించి చెప్పుకొన్నాడు. (1:19-23)
"ఇదిగో లోక పాపములు మోసుకుపోవు దేవుని గొర్రెపిల్ల" అని అన్నాడు. (1:29)
దేవుని గొర్రెపిల్లయైన యేసు లోక పాపములు తీసివేయడానికి, ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్ష్యమవడానికి, యోహాను నీళ్ళతో బాప్తిస్మమిచ్చాడు. (1:31)
ఎవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడు అను గురుతు యోహానుకు ఇవ్వబడింది. (1:32-34)
వారు యేసును వెంబడించారు. (1:35-37)
ఆ ఇద్దరిలో ఒకని పేరు అంద్రెయ. (1:40)
"మేము మెస్సీయాను కనుగొంటిమి" అని సీమోను కు చెప్పాడు. (141)
సీమోను "కేఫా" (దాని అర్ధము "పేతురు") అని పిలువబడతాడని యేసు చెప్పాడు (1:42)
పేతురు, అంద్రెయల పట్టణము బేత్సయిదా. (1:42)
"బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు" అని నతనయేలు అన్నాడు. (1:49)
ఆకాశము తెరువబడుటయు, దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును, దిగుటయును చూతురని నతనయేలు తో చెప్పాడు. (1:51)
గలిలయ లోని కానా లోని వివాహములో యేసు, ఆయన తల్లి, ఆయన శిష్యులు ఉన్నారు. (2:1,11)
ఆ పరిస్థితి లో యేసు ఏదైనా చేస్తాడని ఆమె ఎదురు చూచి యేసుకు చెప్పింది. (2:5)
నీటి బానలను నీళ్ళతో నింపమని మొదట చెప్పాడు. తరువాత కొంచెము "నీరు" తీసుకొని విందు ప్రధాని యొద్దకు తీసుకొని వెళ్ళమని చెప్పాడు. (2:7-8)
"ప్రతివాడును మొదట మంచి ద్రాక్షా రసము పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును, నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షా రసము ఉంచుకొని ఉన్నావు" అని విందు ప్రధాని అన్నాడు. (2:10)
ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాస ముంచిరి. (2:11)
రూకలు మార్చు వారిని, ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని చూసాడు. (2:14)
ఆయన త్రాళ్ళతో కొరడాలు చేసి, గొర్రెలను ఎడ్లనన్నిటిని దేవాలయములోనుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు జల్లివేసి, వారి బల్లలు పడద్రోసాడు. (2:15)
పావురములను అమ్మువారితో యేసు "వీటిని ఇక్కడ నుండి తీసికోనిపొండి, నా తండ్రి యిల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడి" అని చెప్పాడు.(2:16)
"నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను చూపుదువు" అని అడిగారు. (2:18)
"ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదును" అని వారికి సమాధాన మిచ్చాడు. (2:19)
ఆయన తన సరీరమను దేవాలయమును గురించి ఈ మాట చెప్పాడు. (2:21)
అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. (2:23)
యేసు అందరిని ఎరిగిన వాడు కనుక ఆయన తన్ను తాను వారి వశము చేసుకోలేదు, మనుష్యుని ఆంతర్యమును గూర్చి ఎవరూ ఆయనకు చెప్పనవసరం లేదు. (2:24-25)
నికోదేము పరిసయ్యుడు, యూదుల అధికారి. (3:1)
"బోధకుడా, నీవు దేవునినుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుడుము, దేవుడతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడు" అని నికోదేము యేసు తో అన్నాడు. (3:2)
"ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింప గలదు? రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింప గలడా?, ఈ సంగాతులేలాగు సాధ్యమగును?" అని నికోదేము యేసును ప్రశ్నించాడు. (3:4,9)
"నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? అని నికోదేమును గద్దించాడు, "భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు, పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన యెడల ఏలాగు నమ్ముదురు?" అని మరలా గద్దించాడు. (3:10-12)
పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేదు. (3:13)
విశ్వసించు ప్రతీవాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. (3:114-15)
ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన తన జనితైక కుమారుని ఈ లోకానికి ఇవ్వడం ద్వారా తన ప్రేమను కనుపరిచాడు. (3:16)
లేదు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకు దేవుడాయనను పంపెను. (3:17)
వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు చీకటినే ప్రేమించారు గనుక వారు తీర్పులోనికి తేబడ్డారు. (3:19)
దుష్కార్యములు చేయు ప్రతీవాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండేలా వెలుగు నొద్దకు రారు. (3:20)
సత్య వర్తనులు తమ క్రియలు దేవునిమూలముగా చేయబడియున్నవని ప్రత్యక్ష్య పరచబడునట్లు వెలుగు నొద్దకు వస్తారు. (3:21)
"ఆయన హెచ్చవలసి యున్నది, నేను తగ్గవలసి యున్నది" అని అన్నాడు. (3:26,30)
యోహాను కంటే యేసు ఎక్కువమంది శిష్యులనుగా చేసికొని వారికి బాప్తిమమిచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ఆయనకు తెలిసినప్పుడు యేసు యూదయ విడిచి గలిలయకు వెళ్ళాడు (4:1-3)
సమరయ లోని సుఖారను ఊరిలో యాకోబు బావి వద్ద ఆగాడు. (4:5-6)
ఒక సమరయ స్త్రీ నీళ్ళు చేదుకొనుటకు అక్కడికి వచ్చింది. (4:7)
ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళారు. (4:8)
"నాకు దాహమునకిమ్మని" సమరయ స్త్రీని యేసు అడిగాడు. (4:7)
యూదులు సమరయులతో సాంగత్యము చేయని కారణంగా ఆమె ఆశ్చర్య పడింది. (4:9)
దేవుని వరమును, తనకు దాహమునకిమ్మని అడుగుచున్న వాడెవరో అదియు ఆమె ఎరిగియుంటే ఆమె ఆయనను అడుగును, ఆయన ఆమెకు జీవజలమిస్తాడని చెప్పాడు. (4:10)
"అయ్యా ఈ బావి చాలా లోతైనది, చేదుకొనుటకు నీకేమియు లేదే, ఆ జీవజలము ఏలాగు నీకు దొరుకును" అని జవాబిచ్చింది. (4:11)
తానిచ్చు నీళ్ళు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడని, ఆయన వాని కిచ్చు నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని యేసు ఆ స్త్రీ తో చెప్పాడు. (4:14)
ఆమె దప్పిగొనకుండునట్లు, చేదుకొనడానికి బావి వద్దకు రాకుండునట్లు ఆ నీళ్ళు దయ చేయుమని అడుగుతుంది. (4:15)
"నీవు వెళ్లి నీ పెనిమిటిని పిలుచుకొని రమ్ము" అని ఆ స్త్రీతో చెప్పాడు. (4:16)
తనకు పెనిమిటి లేడని ఆ స్త్రీ చెప్పింది. (4:17)
ఆమెకు ఐదుగురు పెనిమిటులు ఉన్నారు, ఇప్పుడున్న వాడు ఆమె పెనిమిటి కాదు అని ఆయన చెప్పాడు. (4:18-19)
ఆమెకు ఐదుగురు పెనిమిటులున్నారు, ఇప్పుడున్నవాడు ఆమె పెనిమిటి కాదు అని ఆమెతో చెప్పాడు. (4:18-19)
సరైన ఆరాధనా స్థలం ఎక్కడ అనే వివాదాస్పదమైన అంశాన్ని తీసుకొని వచ్చింది. (4:20)
దేవుడు ఆత్మ, నిజమైన ఆరాధకులు ఆయనను ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెనని చెప్పాడు. (4:23-24)
ఆమెతో మాట్లాడుచున్న తానే మెస్సీయనని యేసు చెప్పాడు. (4:25-26)
ఆ స్త్రీ తన కుండ విడిచి పెట్టి ఊరిలోనికి వెళ్లి ప్రజలతో "మీరు వచ్చి నేను చేసినవన్నియూ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాదా" అని చెప్పింది. (4:28-29)
వారు తమ పట్టణమును విడిచి యేసు నొద్దకు వచ్చారు. (4:30)
తనను పంపిన వాని చిత్తము నేరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయును తనకు ఆహారమై ఉన్నదని యేసు చెప్పాడు. (4:34)
విత్తువాడును, కోయువాడును కూడా సంతోషించు నట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్ధమైన ఫలము సమకూర్చుకొనును. (4:36)
ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి, యేసు మాటలు వినినందున ఇంకనూ అనేకులు విశ్వసించారు. (4:39,41)
ఆయన నిజముగా లోక రక్షకుడని తెలిసికొని నమ్మారు. (4:42)
యెరూషలేములో పండగ సమయంలో ఆయన చేసిన కార్యములన్నియూ వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినపుడు వారు ఆయనను చేర్చుకొనిరి. (4:45)
ఒక ప్రధాని కుమారుడు రోగియై యుండెను. అయన వచ్చి తన కుమారుణ్ణి స్వస్థ పరచవలేనని అతడు ఆయనను వేడుకొనెను. (4:46-47)
సూచక క్రియలు, మహాత్కార్యములు చూడకుంటే వారెంత మాత్రము నమ్మరని యేసు చెప్పాడు. (4:48)
ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. (4:50)
ప్రధాని యు అతని ఇంటివారుందరునూ యేసును నమ్మిరి. (4:53)
కోనేరు పేరు బేతస్థ (5:2)
ఆ మంటపము లో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచచేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారు. (5:3-4)
ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గలవాడై అక్కడ పడియుండుట చూచి, వాడప్పటికి బహు కాలమునుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి "స్వస్థపడ గోరుచున్నావా?" అని అడిగాడు. (5:6-7)
ఆ రోగి "అయ్యా, నీళ్ళు కదిలించబడి నప్పుడు కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరియొకడు నా కంటే ముందుగా దిగునని" యేసుతో చెప్పాడు. (5:7)
వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. (5:8-9)
విశ్రాంతి దినమందు అతను తన పరుపెత్తుకొన తగదే అని వారు ఇబ్బంది పడ్డారు. (5:9-10)
"ఇదిగో స్వస్థత నొందితివి , మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుము" అని అతనితో చెప్పాడు. (5:14)
వాడి వెళ్లి, తనను స్వస్థపరచిన వాడు యేసు అని యూదులకు తెలియ చెప్పాడు. (5:15)
"నా తండ్రి ఇదివరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నాను" అని యేసు వారితో చెప్పాడు. (5:17)
యేసు విశ్రాంతి దినాచారమును మీరుట మాత్రమే గాక (వారి ఆలోచన ప్రకారము), దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తనను దేవునితో సమానునిగా చేసికొనెను. (5:18)
తండ్రి ఏది చేయుట ఆయన చూచెనో దానినే చేసాడు. (5:19)
తండ్రి మృతులను ఎలాగు లేపి బ్రతికించునో ఆలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. (5:20-21)
తండ్రిని ఘనపర్చునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి ఇచ్చాడు. (5:22-23)
కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. (5:23)
ఆ విధంగా విశ్వాసముంచిన యెడల నీకు నిత్య జీవముంటుంది, నీవు తీర్పు లోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నావు. (5:24)
కుమారుడు తనంతట తానే జీవము గలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. (5:26)
సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దము విని మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వస్తారు. (5:28-29)
ఆయన తన ఇష్టప్రకారము గాక, తండ్రి చిత్త ప్రకారం చెయ్య డానికే చూస్తాడు గనుక ఆయన తీర్పులు యథార్థమైనవి. (5:30)
నెరవేర్చుటకు తండ్రి ఏ క్రియలను ఆయనకు ఇచ్చియున్నాడో ఆ క్రియలు యేసు దేవుని కుమారుడని సాక్ష్యమిస్తున్నాయి, అంతే కాకుండా ఆయనను పంపిన తండ్రియే ఆయనను గురించి సాక్ష్యమిస్తున్నాడు. (5:34-37)
యూదుల నాయకులు ఏ కాలమందైనను ఆయన స్వరము విననలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. (5:37)
లేఖనముల యందు వారికి నిత్య జీవమున్నదని తలంచుచు వారు లేఖనములను పరిశోధించుచున్నారు. (5:39)
లేఖనములు యేసును గురించి సాక్ష్యమిచ్చుచున్నవి(5:39)
యూదుల నాయకులు అద్వితీయ దేవుని మెప్పును కోరడం లేదు. (5:44)
మోషే యూదుల నాయకుల మీద తండ్రి యెదుట నేరము మోపును. (5:45)
యూదుల నాయకులు మోషే ను నమ్మిన యెడల వారు తనను నమ్ముదురు, ఎందుకంటే మోషే తన గురించి రాసాడు అని యేసు చెపుతున్నాడు (5:46-47)
గలిలయ సముద్రము తిబెరయ సముద్రము అని కూడా పిలుస్తారు. (6:1)
రోగుల యెడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహు జనులు ఆయనను వెంబడించిరి. (6:2)
బహు జనులు తన యొద్దకు వచ్చుట అయన చూసాడు. (6:4-5)
ఫిలిప్పును పరీక్షించుటకు యేసు అతనిని అడిగాడు. (6:5-6)
"వారిలో ప్రతీవాడును కొంచెము కొంచెము పుచ్చుకోనుటకైనను రెండువందల దేనారముల రొట్టెలు చాలవు" అని ఫిలిప్పు చెప్పాడు. (6:7)
"ఇక్కడ ఉన్న యొక చిన్నవాని యెద్ద అయిదు యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి గాని ఇవి ఏమాత్రము" అని చెప్పాడు. (6:8-9).
దాదాపు ఐదు వేలమంది పురుషులు అక్కడ ఉన్నారు. (6:10)
యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను, ఆలాగుననే చేపలు కూడా వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను. (6:11)
వారు తమకిష్టమైనంత వరకు భుజించిరి. (6:11)
వారు భుజించిన తరువాత వారియొద్ద మిగిలిన అయిదు యవల రొట్టెల ముక్కలు పోగు చేసి పండ్రెండు గంపలు నింపిరి. (6:13)
ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను (ఐదువేలమందికి ఆహారం పెట్టడం) చూచి రాజుగా చేయుటకు వారు తనను బలవంతంగా పట్టుకొనబోవుచున్నారని యేసు తెలుసుకొని అక్కడనుండి వెళ్ళిపోయాడు. (6:14-15)
అప్పుడు పెద్ద గాలి విసరగా, సముద్రము పొంగడం ఆరంభించింది. (6:18)
యేసు సముద్రము మీద నడచుచు తమ దోనే దగ్గరకు వచ్చుట చూచి వారు భయపడిరి. (6:19)
"నేనే, భయపడకుడి" అని వారితో చెప్పాడు. (6:20)
వారు సూచనలను చూచుట వలననే కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొండుటవలననే ఆయనను వెదకుచున్నారని యేసు చెప్పాడు. 61:26)
క్షయమైన దానికొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి అని యేసు చెప్పాడు. (6:27)
"ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ" అని జనులతో యేసు చెప్పాడు. (6:29)
లోకమునకు నిత్య జీవమునిచ్చు దేవుని నుండి పంపబడిన నిజమైన జీవాహారము గురించి యేసు మాట్లాడుతున్నాడు. తరువాత తానే జీవాహారమని చెపుతున్నాడు. (6:30-35)
తండ్రి యేసుకు అనుగ్రహించువారందరూ ఆయన వద్దకు వస్తారు. (6:37)
తండ్రి యేసుకు అనుగ్రహించిన దాని యంతటిలో ఆయనేమియూ పోగోట్టుకొనక, తండ్రి ఆయనకు ఇచ్చిన వారందరికీ అయన నిత్య జీవం ఇవ్వాలనీ, అంత్య దినమున వారిని లేపుతాడని అయన చిత్తం. (6:39-40)
జ తండ్రి వాని ఆకర్షించితేనే గాని ఎవడును యేసు నొద్దకు రాలేదు. (6:44)
దేవుని యొద్దనుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచియుండ లేదు. (6:46)
యేసు ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన ఆయన శరీరమే . (6:51)
మీరు జీవము గలవారు కావలెనంటే మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగవలెను. (6:53)
మనము ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగిన యెడల ఆయన మన యందు, మనము ఆయన యందు నిలిచి యుంటాము. (6:56)
తండ్రి మూలముగా యేసు జీవిస్తూ ఉన్నాడు.(6:57)
తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును యేసు నొద్దకు రాలేడు. (6:44)
సీమోను పేతురు యేసుకు జవాబిచ్చాడు. "ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము ? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్దుడవని మేము విశ్వసించి ఎరిగియున్నాము" అని చెప్పాడు. (6:67-69)
సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా పండ్రెండు మందిలో ఒకడై యుండి ఆయన నప్పగింపబోవుచుండెను గనుక వాని గూర్చియే ఆయన ఈ మాట చెప్పెను. (6:70-71)
యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదయలో సంచరించడానికి ఇష్టపడలేదు. (7:1)
ఆయన చేయుచున్న క్రియలు ఆయన శిష్యులు చూచునట్లు ఆ స్థలము విడిచి యూదయకు వెళ్ళమని అడిగారు. (7:2-4)
ఆయన సమయమింకను రాలేదు, ఆయన సమయము పరిపూర్ణము కాలేదు అని తన సహోదరులకు చెప్పాడు. (7:6,8)
లోకము క్రియలు చెడ్డవని యేసు సాక్ష్యమిచ్చినందున లోకము ఆయనను ద్వేషించుచున్నది. (7:7)
ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్లక రహస్యముగా వెళ్ళాడు. (7:10)
""కొందరు ఆయనను మంచి వాడనిరి, మరి కొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చు వాడనిరి. (7:12)
యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడును బహిరంగముగా మాట్లాడలేదు. (7:13)
సగము పండుగైనప్పుడు యేసు దేవాలయములోనికి వెళ్లి బోధింప నారంభించెను. (7:14)
ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయుంచుకొనిన యెడల ఆ బోధ దేవుని వలన కలిగినదో, తనంతట తాను చేస్తున్నాడో తెలుసుకుంటారని యేసు చెప్పాడు. (7:17)
ఆ మనుష్యుడు సత్య వర్తనుడు, అతనిలో ఏ దుర్నీతియు లేదు అని చెప్పాడు. (7:18)
యేసు అభిప్రాయం ప్రకారం ధర్మశాస్త్రమును గైకొనువాడు ఎవడునూ లేదు. (7:19)
"మోషే ధర్మశాస్త్రము మీరకుండునట్లు విశ్రాంతి దినమున మీరు సున్నతి చేస్తారు, నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణ స్వస్థత గల వానిగా చేసినందున మీరు నా మీద ఆగ్రహపడుచున్నారు" అని యేసు వాదన చేస్తున్నాడు. (7:22-23)
వేలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చాలని యేసు చెప్పాడు. (7:24)
యేసు ఎక్కడివాడో యెరుగుదుము, క్రీస్తు వచ్చునప్పుడు ఆయన ఎక్కడివాడో ఎవడును యెరగడని మనుష్యులు చెప్పుకొనిరి. (7:27)
ప్రధాన యాజకులు, పరిసయ్యులు యేసును పట్టుకోడానికి అధికారులను పంపారు.(7:32)
వారి సంభాషణలను బట్టి వారు యేసు మాటలను అర్ధం చేసుకోలేదని తెలుస్తున్నది. (7:35-36)
తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. (7:39)
"ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవరుడును ఎన్నడును మాటలాడలేదు" అని అన్నారు. (7:45)
"ఒక మనుష్యుని మాట వినక మునుపును, వాడు చేసినది తెలిసికొనక మునుపును మన ధర్మశాస్త్రము తీర్పు తీర్చునా?"అని వారిని అడిగాడు. (7:50-51)
వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యను నిలువబెట్టి యేసు ఏమంటాడో అని ఆయనను అడిగారు. (8:2-3)
ఆయన మీద నేరము మోప వలెనని ఆయనను శోధించడానికి ఆ స్త్రీను యేసునొద్దకు తీసుకొని వచ్చారు. (8:6)
"మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును" అని శాస్త్రులతో, పరిసయ్యులతో చెప్పాడు. (8:7)
వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకరు బయటికి వెళ్ళారు. (8:9)
వెళ్లి ఇక పాపము చేయ వద్దని యేసు చెప్పాడు. (8:11)
యేసు తనను గూర్చి తానే సాక్ష్యము చెప్పుకొనుచున్నాడు, ఆయన సాక్ష్యము సత్యము కాదని నేరము మోపారు.(8:13)
వారి ధర్మ శాస్త్రములో ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని రాయబడి ఉన్నదని చెప్పాడు. తానును, తనను పంపిన తండ్రియు ఇద్దరు సాక్ష్యమిస్తున్నట్లు చెప్పాడు. (8:17-18)
వారు క్రిందివారు అని, తాను పైనుండు వాడు అని ఎరిగి వారిని గురించిన ఆయన జ్ఞానమును బట్టి ఆయన మాటను ఆధారం చేసుకున్నాడు. (8:23-24)
నేను ఆయనని మీరు విశ్వసించని యెడల మీరు మీ పాపములలోనే చనిపోవుదురని యేసు వారితో చెప్పాడు. (8:24)
తండ్రి యొద్ద వినిన సంగతులనే ఆయన లోకానికి చెప్పాడు. (8:26-27)
తండ్రి కిష్టమైన కార్యములను ఎల్లప్పుడు చేయుచున్నందున తండ్రి యేసును ఒంటరిగా విడిచి పెట్టక తోడుగా ఉన్నాడు. (8:29)
వారు తన వాక్యమందు నిలిచినవారైతే నిజముగా ఆయన శిష్యులుగా ఉంటారని యేసు చెప్పాడు. (8:31)
దాసులుగా ఉండడము, బందీలుగా ఉండడము గురించి యూదులు తలంచారు. (8:33)
పాపము నుండి దాసులుగా ఉండుట నుండి స్వతంత్రులగుట గురించి ఆయన మాట్లాడుతున్నాడు.(8:34)
వారిలో ఆయన వాక్యమునకు చోటు లేని కారణంగా వారు ఆయనను చంపుటకు చూచుచున్నారు. (8:37)
వారు అబ్రాహాము పిల్లలు కాదు ఎందుకంటే వారు అబ్రాహాము చేసిన క్రియలు చెయ్యక యేసును చంప చూచుచున్నారు. (8:39-40)
"దేవుడు మీ తండ్రియైన యెడల మీరు నన్ను ప్రేమింతురు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి యున్నాను, నా అంతట నేనే వచ్చి యుండ లేదు, ఆయన నన్ను పంపెను" అని యేసు వారితో చెప్పాడు. (8:42)
వారి తండ్రి అపవాది అని యేసు చెప్పాడు. (8:44)
అపవాది ఆదినుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును బట్టియే మాటలాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అని యేసు అపవాది గురించి చెప్పాడు. (8:44)
దేవుని సంబంధి అయినవాడు దేవుని మాట వినును. (8:47)
యేసు మాట గైకొనిన యెడల వాడెన్నడును మరణము పొందడు. (8:51)
శరీరము యొక్క భౌతిక మరణము గురించి వారు తలంచారు, అబ్రాహాము, ప్రవక్తలును చనిపోయారు (వారి భౌతిక శరీరములు). (8:52-53)
"మీ తండ్రియైన అబ్రాహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను" అని యేసు చెప్పాడు. "అబ్రాహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" అని యేసు చెప్పాడు. (8:56-58)
వాడు గుడ్డివాడుగా పుట్టుటకు కారణము వాడు పాపము చేసి ఉండటం గాని వాని కన్నవారు పాపము చేసి ఉండటం గాని అయి ఉండవచ్చు అని శిష్యులు ముందుగా నిర్ధారించారు. (9:2)
దేవుని క్రియలు వాని యందు ప్రత్యక్ష్య పరచబడుటకే వాడు గ్రుడ్డివాడుగా పుట్టాడని యేసు చెప్పాడు. (9:3)
యేసు నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని" యేసు చెప్పాడు. (9:6-7)
చూపు గలవాడయ్యాడు. (9:7)
అతడు ఆ వ్యక్తిని తానే అని సాక్ష్యమిచ్చాడు. (9:9)
వారు ఆ మనుష్యుని పరిసయ్యుల దగ్గరకు తీసుకొని వెళ్ళారు. (9:13)
గుడ్డి వానికి స్వస్థత విశ్రాంతి దినమందు జరిగింది. (9:14)
నీవు చూపు ఏ విధంగా పొందావు అని ప్రశ్నించారు. (9:15)
కొందరు పరిసయ్యులు యేసు విశ్రాంతి దినము ఆచరించుట లేదు (విశ్రాంతి దినమున స్వస్థ పరచాడు) గనుక దేవుని యొద్దనుండి వచ్చినవాడు కాదు అని అన్నారు, మరికొందరు పాపియైన మనుష్యుడు ఈలాటి సూచక క్రియలు ఎలాగు చెయ్యగలడు అన్నారు. (9:16)
"యేసు ఒక ప్రవక్త" అని ఇంతకు ముందు గుడ్డివాడు యేసును గురించి చెప్పాడు. (9:17)
వాడు గ్రుడ్డివాడై యుండి చూపు పొందెనని యూదులు నమ్మలేదు గనుక వారు అతని తలిదండ్రులను పిలిపించారు. (9:18-19)
ఆ మనుష్యుడు నిజముగా వారి కుమారుడే అని అతడు పుట్టు గ్రుడ్డివాడుగా పుట్టాడని చెప్పారు. (9:20)
ఇప్పుడు వాడు ఏలాగున చూచుచున్నాడో వారికి తెలియదు, ఎవడు వాని కన్నులు తెరిచినో అదియును తెలియదని చెప్పారు. (9:21)
వాని తలిదండ్రులు యూదులకు భయపడి ఆలాగు చెప్పారు, ఎందుకంటే ఆయన క్రీస్తు అని ఎవరైనను ఒప్పుకొనిన యెడల వానిని సమాజమందిరములోనుంది వెలివేతురని యూదులు అంతకుమునుపు నిర్ణయించుకొని యుండిరి. (9:22)
"దేవుని మహిమ పరచుము, ఈ మనుష్యుడు పాపి యని మేమెరుగుదుము" అని చెప్పారు. (9:24)
"ఆయన పాపియో కాడో నేనెరుగను, ఒకటి మాత్రము నేనెరుగుదును, నేను గ్రుద్దివాడనై యుండి ఇప్పుడు చూచుచున్నాను" అని జవాబిచ్చాడు. (9:25)
"ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినక పోతిరి. మీరెందుకు మరల వినగోరుచున్నారు? మీరునూ ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి" అని వారిని అడిగినందుకు పరిసయ్యులు అతనిని దూషించారు.(9:26-28)
"ఆయన ఎక్కడ నుండి వచ్చెనో మీరెరుగక పోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరచెను. దేవుడు పాపుల మనవి ఆలకించడని యెరుగుదుము, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన మనవి ఆలకించును. పుట్టుగ్రుడ్డివాని కన్నులెవరైనా తెరచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని యెడల ఏమియూ చేయ నేరడు" అని వారికి బదులిచ్చాడు. (9:30-33)
నీవు కేవలం పాపివై పుట్టినావు, నీవు మాకు బోధింప వచ్చితివా అని అతనితో అన్నారు. తరువాత అతనిని సమాజమందిరము లోనుండి వెలివేసారు. (9:34)
అతనిని వెదకుచూ వెళ్లి అతనిని కను గొనెను. (9:35)
నీవు దేవుని కుమారునియందు విశ్వాసముంచు చున్నవా అని గ్రుడ్డి వాడైన మనుష్యుని యేసు అడిగాడు. (9:35-36)
గ్రుడ్డి వాడైన మనుష్యుడు విశ్వసించుచున్నానని చెప్పాడు, యేసు ను ఆరాధించాడు. (9:38)
"మీరు గ్రుడ్డి వారైతే మీకు పాపము లేకపోవును, గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి యున్నది" అని యేసు వారితో చెప్పాడు. (9:41)
గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు, దోచుకొనువాడునై యున్నాడు. (10:1)
ద్వారమున ప్రవేశించు వాడు గొర్రెల కాపరి. (10:2)
గొర్రెలకు అతని స్వరము తెలుసు గనుక అవి అతనిని వెంబడించును. (10:3-4)
లేదు. గొర్రెలు అన్యుని వెంబడించవు. (10:5)
యేసుకు ముందు వచ్చినవారందరూ దొంగలును దోచుకొనువారునై యున్నారు. (10:7)
ద్వారమైన యేసు ద్వారా ప్రవేశించు వారు రక్షించబడుదురు, వారు లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేతను కనుగొంటారు. (10:9)
మంచి కాపరియైన యేసు తన ప్రాణమును పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన తన గొర్రెలకు తన ప్రాణాన్ని అర్పించాడు. (10:11,15)
ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు ఆయనకు ఉన్నాయి, వాటిని కూడా తీసుకొని రావాలని యేసు చెప్పాడు. అవి ఆయన స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. (10:16)
యేసు మరల తీసుకొనునట్లు ఆయన తన ప్రాణమును పెట్టుచున్నాడు, ఇందు వలన తండ్రి ఆయనను ప్రేమించుచున్నాడు. (10:17)
లేదు. ఆయన అంతట ఆయనే తన ప్రాణమును పెట్టుచున్నాడు. (10:18)
తన తండ్రి వలన యేసు ఈ ఆజ్ఞ పొందాడు. (10:18)
అనేకులు "వాడు దయ్యము పట్టిన వాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారనిరి, మరికొందరు - ఇది దయ్యము పట్టినవాని మాటలు కావు, దయ్యము గుడ్డివారి కన్నులు తెరువగలడా" అనిరి.(10:19-21)
"ఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పస్టముగా చెప్పు" అన్నారు. (10:24)
అయన వారితో తాను (క్రీస్తునని) ఇంతకు ముందే చెప్పానని యూదులతో చెప్పాడు. వారు ఆయన గొర్రెలలో చేరినవారు కారు కనుక వారు నమ్మరని వారితో చెప్పాడు. (10:25-26)
తన గొర్రెలకు నిత్యజీవాన్ని ఇస్తాడని యేసు చెప్పాడు, అవి ఎప్పటికిని నశింపవు , ఎవడునూ వాటిని ఆయన చేతిలోనుండి అపహరింపడు. (10:28)
గొర్రెలను యేసుకు ఇచ్చినది తండ్రి (10:29)
తండ్రి అందరికంటే గొప్పవాడు. (10:29)
యేసు దేవదూషణ చేయుచున్నాడు, తనను తాను దేవునితో సమానునిగా చేసుకొనుచున్నాడని యూదులు నమ్మారు. (10:30-33)
"మీరు దైవ సమానులని నేనంటినని మీ ధర్మ శాస్త్రములో వ్రాయబడి యుండ లేదా ? లేఖనము నిరర్ధకము కానేరదు కదా, దేవుని వాక్యమెవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన యెడల - నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తనను ప్రతిష్ట చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా ?" అని తనని తాను సమర్ధించు కొన్నాడు. (10:34-36)
తన క్రియలను చూడుడని యూదులతో యేసు చెప్పాడు, ఆయన తండ్రి క్రియలు చేయని యెడల తనను నమ్మకుడి అని చెప్పాడు, చేసిన యెడల తనను నమ్ముడని వారితో చెప్పాడు. (10:37-38)
తండ్రి యేసునందును, యేసు తండ్రి యందును ఉన్నారని వారు గ్రహించి తెలిసికొన గల్గునట్లు యేసు చేసిన క్రియలను నమ్ముడని చెప్పాడు. (10:38)
వారు మరల ఆయనను పట్టుకొన చూసారు. (10:39)
యోహాను మొదట బాప్తిస్మమిచ్చుచుండిన యొర్దాను అద్దరిని ఉన్న స్థలమునకు వెళ్ళాడు. (10:40)
అనేకులు ఆయన వద్దకు వచ్చి "యోహాను ఏ సూచక క్రియను చేయ లేదు గాని యీయన గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నియు సత్యమైన"వనిరి, అక్కడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి. (10:41-42)
లాజరు బేతనియ అనే గ్రామానికి చెందిన వాడు. మరియ, మార్త అతని సహోదరీలు. ఈ మరియ ప్రభువునకు అత్తరు పూసి తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియయే. (11:1-2)
"యీ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది" అని చెప్పాడు. (11:4)
యేసు తానున్న చోటనే ఇంక రెండు దినములు నిలిచెను. (11:6)
"బోధకుడా యిప్పుడే యూదులు నిన్ను రాళ్ళతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా?" అని యేసును అడిగారు. (11:8)
ఒకడు పగటివేళ నడచిన యెడల ఈ లోకపు వెలుగును చూచును గనుక వాడు తొట్రు పడడు, అయితే రాత్రివేళ ఒకడు నడచిన యెడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడును అని యేసు చెప్పాడు. (11:9-10)
వారు లాజరు నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొని "ప్రభువా అతడు నిద్రించిన యెడల బాగుపడు"ననిరి.(11:11-12)
లాజరు నిద్రించెను అని చెప్పడములో యేసు లాజరు మరణము గురించి మాటలాడెను. (11:13)
"లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండ లేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను" అని యేసు అన్నాడు. (11:15)
తామంతా చనిపోతామని తోమాా తలంచాడు. (11:16)
నాలుగు రోజులుగా లాజరు సమాధిలో ఉన్నాడు.(11:17)
యేసు వచ్చుచున్నాడని మార్త వినినపుడు ఆయనను ఎదుర్కొనడానికి బయటకు వెళ్ళింది. (11:20)
"ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకనుగ్రహించును" అని మార్త యేసుతో అన్నది. (11:22)
"అంత్య దినమున పునరుత్థానమున లేచునని ఎరుగుదునని" యేసు తో మార్త చెప్పింది. (11:24)
ఆయన యందు విశ్వసించు వారు చనిపోయినను బ్రతుకును. బ్రతికి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు అని యేసు చెప్పాడు. (11:25-26)
"అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువు" అని యేసు తో చెప్పింది. (11:27)
ఆమెతో ఉన్న యూదులు ఆమె సమాధి యొద్దకు ఏడ్చుటకు వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్లారు. (11:31)
మరియ యేసును కలుసుకొనుటకు వెళ్ళుచున్నది. (11:29,32)
మరియ ఏడ్చుటయు ఆమెతో కూడివచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు కన్నీళ్లు విడిచాడు. (11:33-35)
యేసు లాజరును ఎలాగు ప్రేమించేనో చూడుడి అని యూదులు అనుకొన్నారు(11:36)
"ప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని" ఆయనతో చెప్పింది. (11:39)
"నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా?" అని మార్తతో అన్నాడు. (11:40)
యేసు కన్నులెత్తి బిగ్గరగా తండ్రికి ప్రార్ధన చేసాడు. (11:41)
తన చుట్టూ ఉన్న ప్రజల నిమిత్తము, తండ్రి తనను పంపెనని వారు నమ్మునట్లును యేసు బిగ్గరగా ప్రార్ధన చేసాడు. (11:42)
చనిపోయిన వాడు ప్రేతవస్త్రములతో కట్టబడి, బయటకు వచ్చాడు. అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. (11:44)
ఆయన చేసిన కార్యమును చూచినా యూదులలో అనేకులు ఆయనలో విశ్వాసముంచిరి, వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. (11:45-46)
మన జనమంతయు నశింపకుండు నట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనుడని వారితో చెప్పాడు. (11:50-51)
వారు ఆయనను చంపనాలోచించు చుండిరి. (11:53)
యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగముగా సంచరించక అక్కడ నుండి అరణ్యమునకు సమీప ప్రదేశాములోనున్న ఎఫ్రాయిమను ఊరికి వెళ్లి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను. (11:54)
ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసియున్న యెడల తాము ఆయనను పట్టుకొనగలుగుటకు తమకు తెలియ జేయవలెనని ఆజ్ఞాపించారు. (11:57)
బెతనియకు పస్కా పండుగకు ఆరు దినములు ముందుగా వచ్చెను. (12:1)
మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసికొని యేసు పాదములకు పూసి తన తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను.(12:3)
అతను చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయి యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలుచు వచ్చెను గనుక ఆలాగు చెప్పెను. (12:4-6)
జనులు యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడ వచ్చిరి. (12:9)
లాజరును బట్టి యూదులనేకులు తమ వారిని విడిచి యేసు నందు విస్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును చంపాలని చూసారు. (12:10,11)
ఖజ్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొన బోయి "జయము, ప్రభువు పెరట వచ్చు చున్న ఇశ్రాయేలు రాజు స్తుతింప బడును గాక" అని బిగ్గరగా కేకలు వేసారు. (12:13)
"సీయోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిదపిల్ల మీద ఆసీనుడై వచ్చు చున్నాడు" అని ఆయన గురించి వ్రాయ బడిన అంశములను జ్ఞాపకము చేసుకున్నారు. (12:13-16)
ఆయన లాజరును సమాధిలోనుండి పిలిచి మృతులలో నుండి అతని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసేనని జనులు విని ఆయనను ఎదుర్కొన బోయిరి. (12:17-18)
"మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చియున్నది" అని యేసు వారితో చెప్పాడు. (12:23)
గోదుమ గింజ భూమిలో పడి చచ్చిన యెడల అది విస్తారముగా ఫలించును అని చెప్పాడు. (21:24)
ఈ లోకములో తన ప్రాణమును ప్రేమించు వాడు దానిని పోగొట్టుకొనును, తన ప్రాణమును ద్వేషించు వాడు దానిని నిత్య జీవము కొరకు కాపాడుకొనును అని యేసు చెప్పాడు. (12:25)
తండ్రి అతని ఘనపరచును. (12:26)
"నేను దానిని మహిమపరచితిని, మరల మహిమ పరతును" అని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. (12:28)
"ఈ శబ్ధము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను" అని యేసు వారితో చెప్పాడు. (12:30)
ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది, ఇప్పుడు ఈ లోకాదికారి బయటకు త్రోసివేయబడును" అని యేసు చెప్పాడు. (12:31)
తాను ఏ విధముగా మరణము పొందవలసి యుండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. (12:33)
లేదు. వారి ప్రశ్నలకు యేసు తిన్నగా సమాధానం చెప్పలేదు. (12:35-36)
"ఇంకా కొంత కాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి .....మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగనే వెలుగు నందు విశ్వాసముంచుడి" అని యేసు చెప్పాడు. (12:35-36)
"ప్రభువా, మా వర్తమానము నమ్మినవాడేవాడు? ప్రభువుయొక్క బాహువు ఎవరికీ యయలుపరచ బడెను" అని ప్రవక్తయైన యెషయా ప్రవచనము నెరవేర్చా బడునట్లు వారు ఆయన యందు విశ్వాసముంచ లేదు. (12:37-38)
యెషయా చెప్పినట్టు "వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడ కుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠిన పరచెను" అను కారణము గా వారు నమ్మలేక పోయిరి. (12:39-40)
యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. (12:41)
అధికారులలో కూడా అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి గాని, సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొన లేదు. (12:42-43)
"నా యందు విశ్వాస ముంచు వాడు నా యందు కాదు నన్ను పంపిన వానియందే విశ్వాసముంచు చున్నాడు, నన్ను చూచు వాడు నన్ను పంపినవానినే చూచు చున్నాడు. (12:44-45)
ఈ లోకమును రక్షించుటకె వచ్చానని యేసు చెప్పాడు. (21:47)
ఆయనను నిరాకరించి ఆయన మాటలను అంగీకరింపని వానిని యేసు పలికిన మాటయే అంత్య దినమందు తీర్పు తీర్చును. (12:48)
లేదు. తాను ఏమి మాట్లాడవలెనో దీనిని గూర్చి తనను పంపిన తండ్రియే ఆయనకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. (12:49)
తండ్రి ఆజ్ఞ నిత్య జీవమని యేసు ఎరుగును గనుక యేసు ఆ విధముగా చేయుచున్నాడు. (12:50)
వారిని అంతము వరకు ప్రేమించాడు. (13:1)
ఆయనను అప్పగింప వలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఆలోచనను పుట్టించెను. (13:2)
తండ్రి యేసు చేతికి సమస్తము అప్పగించెను. (13:3)
తాను దేవుని యొద్ద నుండి వచ్చాడు, తండ్రి యొద్దకు వెళ్ళు చున్నాడు. (13:3)
ఆయన లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి, యొక తువాలు తీసికొని నడుముకు కట్టుకొనెను, అంతట పళ్ళెములో నీళ్ళు పోసి శిష్యుల పాదములు కడుగుటకును, తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. (13:4-5)
"నేను నిన్ను కడగని యెడల నాతో నీకు పాలు లేదు" అన్నాడు. (13:8)
తనను అప్పగించు వానిని ఎరిగేను గనుక యేసు ఈ మాట అన్నాడు. (13:11)
తాను వారికి చేసిన విధముగా వారును చేయ వలెనని యేసు తన శిష్యుల పాదాలను కడిగాడు. (13:14-15)
దాసుడు యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తనను పంపినవాని కంటే గొప్పవాడు కాడు. (13:16)
ఆయనతో కూడా భోజనముచేయువాడు ఆయనకు విరోధముగా తన మడమ ఎత్తెను. (13:18)
అది జరిగినప్పుడు నేనే ఆయననని వారు నమ్మునట్లు అది జరుగక మునుపు ఆయన వారికి చెప్పాడు (13:19)
ఆయనను చేర్చుకొనువాడు తనను పంపిన వానిని కూడా చేర్చుకొనువాడగును. (13:20)
ఎవరిని గురించి యీలాగు చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు యేసు ప్రేమించిన శిష్యుని అడిగాడు. (13:24)
"నేనొక ముక్క ముంచి ఎవనికిచ్చెదనో వాడే" అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకు ఇచ్చెను.(13:20)
వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను, వెంటనే వాడు బయటికి వెళ్ళాడు. (13:20)
దేవుడు మనుష్యకుమారుని యందు మహిమ పరచబడి యున్నాడు, దేవుడును ఆయనయందు మహిమ పరచబడిన యెడల దేవుడు తనయందు ఆయనను మహిమ పరచును.(13:31)
వారు ఒకరినొకరు ప్రేమింప వలెనని వారికి ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చాడు. (13:34)
ఒకరిని ఒకరు ప్రేమింప వలెననెడి ఆజ్ఞకు లోబడిన యెడల దీనిని బట్టి వారు యేసు శిష్యులని అందరు తెలుసుకొంటారు. (13:35)
లేదు. ఎందుకంటే "ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నా" వని యేసును అడిగాడు. (13:33-36)
"నా కొరకు నీ ప్రాణమును పెట్టుదువా ? అయనను ఎరుగనని ముమ్మారు చెప్పక ముందు కోడి కూయదు" అని యేసు జవాబిచ్చాడు.(13:38)
తండ్రి యింటి లో అనేక నివాసములు ఉన్నాయి. (14:2)
యేసు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాడు. (14:3)
యేసు వారి కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళు చున్నాడు. ఆయన యొద్ద ఉండుటకు వారిని తీసుకొని పోవడానికి ఆయన మరల రాబోతున్నాడు. (14:1-3)
తండ్రి యొద్దకు వెళ్ళడానికి ఏకైక మార్గము యేసు. (14:6)
"ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మా కంతే చాలును అని ఫిలిప్పు యేసును అడిగాడు. (14:8)
యేసు తనంతట తాను మాట్లాడడం లేదు తండ్రి ఆయన యందు నివసించుచు తన క్రియలను చేయుచున్నాడు. (14:10)
యేసు క్రియల నిమిత్తమైనను శిష్యులు దీనిని నమ్మాలని యేసు చెప్పాడు. (14:11)
యేసు తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాడు గనుక శిష్యులు గొప్ప కార్యములు చేస్తారని యేసు చెప్పాడు. (14:12)
తండ్రి కుమారుని యందు మహిమ పరచ బడునట్లు యేసు చేస్తాడు. (14:13)
మీరు నన్ను ప్రేమించిన యెడల మీరు నా ఆజ్ఞలు గైకొంటారని యేసు చెప్పాడు. (14:15)
సత్య స్వరూపియగు ఆత్మ అని పిలిచాడు. (14:17)
లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు. (14:17)
సత్య స్వరూపియగు ఆత్మ శిష్యులలో ఉంటాడని యేసు చెప్పాడు . (14:17)
వారు యేసు చేత, ఆయన తండ్రి చేత ప్రేమించ బడతారు, ఆయన వారికి తనను తాను కనుపరచు కొంటాడు. (14:21)
ఆదరణ కర్త, పరిశుద్ధాత్ముడు వారికి సమస్తమును బోధించి యేసు వారితో చెప్పిన సంగతులన్నిటినీ వారికి జ్ఞాపకం చేస్తాడు. (14:26)
యేసు తండ్రి యొద్దకు వెళ్ళు చున్నాడు గనుక శిష్యులు సంతోషించాలి అని యేసు చెప్పాడు, తండ్రి యేసు కంటే గొప్పవాడు. (14:28)
శిష్యులతో ఇక మీదట విస్తరించి మాట్లాడనని చెప్పడానికి కారణం లోకాధికారి వచ్చుచున్నాడని యేసు చెప్పాడు (14:30)
యేసు నిజమైన ద్రాక్షా వల్లి. (15:1)
వ్యయసాయకుడు తండ్రి (15:1)
ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరింత ఫలించు నట్లు దానిలోని పనికిరాని తీగెలను తీసి వేయును. (15:2)
యేసు వారితో చెప్పిన మాటను బట్టి వారు పవిత్రులై ఉన్నారు. (15:3)
మనము తీగెలము. (15:5)
ఫలించాలి అంటే యేసు లో నిలిచి యుండాలి. (15:5)
ఎవరైనను యేసు లో నిలిచియుండని యెడల వాడు తీగె వలె బయట పారవేయబడును. (15:6)
ఆయన యందు మనము నిలిచి యుండాలి, మనయందు ఆయన మాటలు నిలిచి యుండాలి. అప్ప్దుడు మనకేది ఇష్టమో దానిని అడగాలి, అది మనకు అనుగ్రహించ బడుతుంది. (15:7)
మనము బహుగా ఫలించుట వలన తండ్రి మహిమ పరచ బదతాడు, మనము యేసు శిష్యులుగా ఉంటాము. (15:8)
ఆయన ఆజ్ఞలు గైకొనాలి ?(15:10)
తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమగాలవాడెవడును లేడు . (15:13)
ఆయన మనకు ఆజ్ఞాపించు వాటన్నిటిని చేసిన యెడల మనము ఆయన స్నేహితులమగుదుము.(15:14)
ఆయన తన తండ్రి వినిన సంగతులన్నిటిని వారికి తెలియ చేసాడు కనుక వారిని స్నేహితులని పిలచుచున్నాడు. (15:15)
యేసు ను వెంబడించు వారు లోకసంభందులు కారు, యేసు వారిని లోకములోనుంది ఏర్పరచు కొన్నాడు. (15:19)
వారి పాపము విషయం లోకము తప్పించుకోలేకుండా ఉండటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు, ఎవడునూ చెయ్యని క్రియలను చేసాడు. (15:24)
ఆదరణ కర్త అనగా సత్య స్వరూపియగు ఆత్మ, యేసు శిష్యులు ఆయన గూర్చి సాక్ష్య మిస్తారు. (15:26-27)
వారు మొదటి నుండి ఆయనతో ఉండిన వారు గనుక వారును అయన గురించి సాక్ష్య మిస్తారు. (15:27)
వారు అభ్యంతర పడకుండు నట్లు యేసు ఈ మాటలు శిష్యులతో చెప్పుచున్నాడు. (16:1)
వారు తండ్రిని యేసును తెలుసుకోన లేదు గనుక ఈవిధంగా చేస్తారు. (16:3)
ఆయన వారితో ఉన్నాడు గనుక మొదట ఆయన ఈ సంగతులను వారితో చెప్పలేదు. (16:4)
ఆయన వెళ్లి పోవడం వారికి ప్రయోజన కరం, ఆయన వెళ్ళని యెడల ఆదరణ కర్త వారి దగ్గరకు రాడు. ఆయన వెళ్ళిన యెడల ఆదరణ కర్త వారి వద్దకు వస్తాడు. (16:7)
ఆదరణ కర్త పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, అంతిమ తీర్పును గూర్చియు లోకమును ఒప్పింప చేయును. (16:8)
సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినపుడు వారిని సర్వ సత్యములోనికి వారిని నడిపించును, ఆయన తనంతట తాను ఏమియూ బోధించక వేటిని వినునో వాటిని బోధించి సంభావింప బోవు వాటిని వారికి బోధించును. (16:13)
ఆయన యేసు లోనివి తీసుకొని వారికి తెలియ జేయును గనుక యేసు ను మహిమ పరచును. (16:14)
సత్య స్వరూపియగు ఆత్మ తండ్రి వాటిలోనుండి తీసుకుంటాడు, తండ్రికి కలిగియున్నవన్నియు యేసు కు చెందినవే. (16:15)
"కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రి యొద్దకు వెళ్ళు చున్నాను ", "అని యేసు చెప్పిన మాటను వారు అర్ధం చేసుకోలేదు, (16:17-18)
శిష్యుల దు:ఖము సంతోషమౌతుంది. (16:20)
వారు యేసును మరల చూస్తారు, వారు సంతోషిస్తారు. (16:22)
వారి సంతోషము పరిపూర్ణమగునట్లు వారిని ఆ విధంగా చెయ్యమన్నాడు. (16:24)
శిష్యులు యేసు ను ప్రేమించి ఆయన తండ్రి యెద్ద నుండి వచ్చాడని నమ్మారు గనుక తండ్రి తానే వారిని ప్రేమించు చున్నారు. (16:27)
యేసు తండ్రి దగ్గర నుండి బయలు దేరి లోకమునకు వచ్చి యున్నాడు, లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాడు. (16:28)
ఆ గడియలో వారిలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదరిపోయి యేసు ను ఒంటరిగా విడిచి పెడతారని యేసు చెప్పాడు. (16:32)
తండ్రి యేసు తో ఉంటాడు. (16:32)
తాను లోకమును జయించి యున్నాడు గనుక ధైర్యము తెచ్చుకోనుడని శిష్యులతో చెపుతున్నాడు (16:33)
యేసు కు ఇచ్చిన వారికందరికీ నిత్య జీవము అనుగ్రహించు నట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారమును ఇచ్చాడు. (17:2)
అద్వితీయ సత్య దేవుడైన తండ్రిని, ఆయన పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. (17:3)
చేయుటకు తన కిచ్చిన పనిని సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద దేవుని మహిమ పరచాడు. (17:4)
లోకము పుట్టక మునుపు తండ్రి యొద్ద ఆయనకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమను ఆయన కోరుతున్నాడు. (17:5)
లోకమునుండి దేవుడు యేసు కు అనుగ్రహించిన మనుష్యులకు తండ్రి నామమును ప్రత్యక్ష్య పరచాడు. (17:6)
వారు యేసుని మాటలు అంగీకరించారు, ఆయన తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చాడని నిజముగా ఎరిగి తండ్రి ఆయనను పంపాడని వారు నమ్మారు. (17:8)
లోకము కొరకు ప్రార్ధన చెయ్యడము లేదని యేసు చెప్పాడు. (17:9)
వారు ఏకమై ఉండు లాగున తండ్రి నామమందు వారిని కాపాడుమని తండ్రిని అడిగాడు, దుష్టుని నుండి కాపాడుమని ప్రార్ధించాడు, సత్యమునందు ప్రతిష్టించుమని ప్రార్ధించాడు, వారు యేసు నందును, తండ్రి యందును ఉండునట్లు ప్రార్ధించాడు, తండ్రి ఆయనకిచ్చిన వారు అయన ఎక్కడ ఉండునో అక్కడను ఆయనతో ఉండునట్లు ప్రార్ధించాడు. (17:11,15,21,24.)
యేసు వారిని కాపాడాడు. (17:12)
తండ్రి తనకు ఇచ్చిన వారు సత్య మందు ప్రతిష్ష్టించబడునట్లు వారికొరకు తనను తాను ప్రతిష్టించు కొన్నాడు. (17:19)
తండ్రి యేసు కిచ్చిన వారు వాక్యము వలన యేసు నందు విశ్వాసముంచిన వారందరును ఏకమై యుండవలెనని వారి కొరకు ప్రార్ధన చేయుచుండెను. (17:20)
తండ్రి యేసు ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించాడు. (17:23)
తండ్రి యేసు నందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును, యేసు వారి యందు ఉన్డునట్లును, వారికి ఆయన నామమును తెలియచేసాడు, (17:26)
ఆయన తన శిష్యులతో కూడా కేద్రోను వాగు దాటి వెళ్లెను. (18:1)
యేసు తన శిష్యులతో కలిసి తరుచుగా ఆ స్థలానికి వవెల్లుచుండే వారు. (18:2)
యూదా, ప్రధాన యాజకులు పరిసయ్యులు పంపిన సైనికులతో ఆ చోటికి వచ్చారు. (18:3)
"మీరెవరిని వెదకుచున్నారు" అని వారిని అడిగాడు. (18:4)
వారు వెనకకు తగ్గి నేల మీద పడ్డారు. (18:6)
"నీవు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొన లేదని" అయన చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ మాట చెప్పాడు. (18:8-9)
"కత్తి ఒరలో పెట్టుము, తండ్రి నాకు ఇచ్చిన గిన్నె లోనిది నేను త్రాగకుందునా" అని పేతురు తో యేసు చెప్పాడు. (18:10-11)
అన్న వద్దకు తీసుకొని వెళ్ళారు. (18:13)
అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయపకు మామ. (18:13)
ప్రధాన యాజకునికి పరిచయ మైన ఒక శిష్యుడు బయటికి వచ్చి ద్వారా పాలకునితో మాట్లాడి పేతురుని లోపలి తోడుకొని వెళ్ళాడు. (18:16)
కావలి యొద్ద ఒక చిన్నది, కొందరు మంట వేసి చలి కాచుకొంతుండగా , వారిలో పేతురు ఎవని చెవి తెగ నరికినో వాని బంధువును ప్రదానయాజకుని దాసులలో ఒకడును, అందరునూ యేసు తో ఉన్న శిష్యులలో ఒకడివి కాదా అని పేతురును అడిగారు. (18:17)
తాను బహిరంగముగా లోకమునకు మాటలాడితినని చెప్పాడు, తాను బోధించినది విన్న వారిని అడుగుమని ప్రధాన యాజకునికి చెప్పాడు. (18:19-21)
ప్రధాన యాజకుడైన కయప వద్దకు యేసు ను పంపాడు. (18:24)
పేతురు నేనేరుగనని మూడవసారి బొంకి నపుడు వెంటనే కోడి కూసింది. (18:27)
వారు మైల పడకుండా పస్కాను భుజింప వలెనని అధికార మండపము లోనికి వెళ్ళ లేదు. (18:28)
"వీడు దుర్మార్గుడు కాని యెడల వీనిని నీకు అప్పగించియుండమని" చెప్పిరి. (18:29-30)
రోమా అధిపతులనుండి (పిలాతు) అనుమతి లేకుండా ఎవనికైనను మరణ శిక్ష విధించదానికి యూదులకు అధికారము లేదు. (18:31)
యూదులకు నీవు రాజువా అని అడిగాడు, యేసు ఏమి చేసాడని అడిగాడు. (18:33-35)
తన రాజ్యము ఈ లోక సంభంద మైనది కాదు, ఇహ సంబంధ మైనది కాదు అని చెప్పాడు. (18:36)
రాజుగా ఉండుటకు ఆయన జన్మించాడు. (18:37)
"అతని యందు ఏ దోషమును నాకు కనబడ లేదు" అని పిలాతు యూదులతో చెప్పాడు. (18:38)
"ఈ మనుష్యుడు కాదు మాకు బరబ్బా కావాలి" అని మరల బిగ్గరగా కేకలు వేసారు. (18:39-40)
వారు ముళ్ళతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి "యూదుల రాజా, శుభం" అని చెప్పి ఆయనను అర చేతులతో కొట్టిరి. (19:2-3)
ఆయన యందు ఏ దోషము పిలతుకు కనబడ లేదని వారికి తెలియునట్లు యేసును వారి యొద్దకు తీసుకొని వచ్చాడు. (10:4)
ఆయన ముండ్ల కిరీటమును ధరించు కొని ఊదారంగు వస్త్రమును ధరించాడు. (19:5)
"సిలువ వేయుము, సిలువ వేయుము" అని కేకలు వేశారు. (19:6)
"మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెను" అని పిలాతుతో చెప్పారు. (19:7-8)
యేసు పిలాతు ఏ జవాబు ఇవ్వలేదు. (19:9)
"పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు" అని యేసు చెప్పాడు. (19:11)
"నీవు ఇతనిని విడుదల చేసితివా కైసరుకు స్నేహితుడవు కావు, తాను రాజునని చెప్పుకోను ప్రతివాడును కైసరుకు విరోధముగా మాట్లాడు తున్నవాడే" అని యూదులు పిలాతుతో అన్నారు. (19:12)
"కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు" అని అన్నారు. (19:15-16)
వారు యేసు ను గొల్గోత అనే స్థలం లో యేసు సిలువ వేసారు, గొల్గోత అనే మాట కు కపాల స్థలమని అర్ధం. (19:17-18)
లేదు. ఇద్దరు వ్యక్తులు ఆయనకు ఇరువైపులా ఆయనతో పాటు సిలువ వెయ బడ్డారు. (19:18)
"యూదుల రాజైన నజరేయుడగు యేసు" అను పైవిలాసము రాయించి సిలువ మీద పెట్టించెను. (19:19)
అది హెబ్రీ, గ్రీకుం రోమా భాషలలో రాయబడి ఉంది. (19:20)
సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసికొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చునట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి. కుట్టు లేకుండా ఉన్న అయన అంగీ కోసం చీట్లు వేశారు. (19:23-24).
"వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి." అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. (19:23-24)
ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోప భార్య యైన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. (19:25-26)
"అమ్మా యిదిగో నీ కుమారుడు" అని తన తల్లి తో చెప్పాడు. (19:26)
ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చు కొనెను. (19:27)
లేఖనము నెరవేరునట్లు ఆయన అన్నాడు. (19:28)
యేసు ఆ చిరక పుచ్చుకొని - "సమాప్తమైనది" అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. (19:29-30)
ఆ దినము సిద్ధపరచు దినము. మరుసటి విశ్రాంతి దినమున మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినము సిలున మీద ఉండకుండు నట్లు వారి కాళ్ళు విరుగగొట్టించి వారిని తీసి వేయించుమని యూదులు పిలాతును అడిగిరి. (19:31)
ఆయన అంతకు ముందే మృతి నొందుట వారు చూచి అయన కాళ్ళు విరుగ గొట్టలేదు. (19:33)
సైనికులు ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచాడు. (19:34)
"అతని ఎముకలలో ఒకటైనా విరువబడ లేదు" "తాము పొడిచిన వాని తట్టు చూతురు" అను లేఖనములు నెరవేరునట్లు ఇది జరిగెను. (19:36-37)
వారు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడు. (19:35)
యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును తీసికోనిపోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను. (19:38)
నికోదేము అరిమతయి యోసేపు తో వచ్చాడు. (19:39)
వారు సుగంధ ద్రవ్వ్యములు యేసు దేహమునకు పూసి, నార బట్టలు చుట్టిరి. (19:40-41)
ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు ఆమె సమాధి వద్దకు వచ్చింది. (20:1)
సమాధి మీద నుండి రాయి తీయబడి యుండుట ఆమె చూసింది. (20:1)
"ప్రభువును సమాదిలోనుండి ఎత్తి కొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో యెరుగను" అని వారితో చెప్పింది. (20:2)
ఆమె పరుగెత్తు కొని సీమోను పేతురు, యేసు ప్రేమించిన శిష్యుని వద్దకు వచ్చింది. (20:2)
నార బట్టలు పడియుండుట పేతురు చూసాడు, ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టి పెట్టియుండుట చూచాడు. (20:6-7)
అతడు చూచి యేసు ను నమ్మాడు. (20:8)
తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. (20:12)
"అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు?" అని అడిగారు. (20:13)
ఆమె వెనుక తట్టు తిరిగి చూడగా యేసు నిలిచి యుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తు పట్టలేదు. (20:14)
అయన తోటమాలి అని అనుకున్నది. (20:15)
"మరియా" అని యేసు పిలిచినపుడు ఆయనను గుర్తుపట్టింది. (20:16)
తాను తండ్రి యొద్దకు ఇంకనూ ఎక్కిపోలేదు గనుక తనను ముట్ట వద్దని యేసు చెప్పాడు. (20:17)
"నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని " వారితో చెప్పమని చెప్పాడు.(20:17)
యేసు వచ్చి వారి మధ్యన నిలిచెను. (20:19)
ఆయన తన చేతులను, ప్రక్కను వారికి చూపించాడు. (20:20)
తండ్రి తనను పంపిన విధముగా తానును వారిని పంపుచున్నానని వారితో చెప్పాడు. (20:21)
"పరిశుద్దాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించ బడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండ నిత్తురో అవి నిలిచి యుండును" అని వారితో చెప్పాడు. (20:22-23)
యేసు శిష్యుల మధ్య కు వచ్చినపుడు దిదుమ అనబడిన తోమా వారి మధ్య లేదు. (20:24)
తోమా యేసు చేతులలో మేకుల గురుతును చూచి తన వ్రేలు ఆ మేకుల గురుతులలో పెట్టి తన చేతిని ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మడని చెప్పాడు. (20:25)
ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో ఉన్నాడు, తలుపులు మూయబడియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచాడు. (20:26)
"నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసి వై యుండుము" అని తోమా తో చెప్పాడు. (20:27)
"నా ప్రభువా, నా దేవా " అని తోమాా అన్నాడు. (20:28)
"చూడక నమ్మిన వారు ధన్యులు" అని యేసు అన్నాడు. (20:29)
అవును. అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల యెదుట చేసెను, అవి యీ గ్రంథమందు వ్రాయబడి యుండ లేదు. (20:30)
యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందు నట్లును ఇవి వ్రాయబడెను. (20:31)
మరల యేసు తనను తాను ప్రత్యక్ష పరచుకొనినప్పుడు శిష్యులు తిబిరెయ సముద్ర తీరమున ఉన్నారు. (21:1)
సీమోను పేతురు, దిడుమ అనబడిన తోమా, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనియేలును, జేబెదయి కుమారులును, ఆయన శిష్యులలో ఇద్దరును అక్కడ ఉన్నారు. (21:2)
వారు చేపలు పట్టడానికి వెళ్ళారు కాని వారికి చేపలు పడలేదు. (21:3)
చేపలు దొరుకునట్లు దోనే కుడి ప్రక్కన వల వేయమని యేసు చెప్పాడు (21:6)
వారు వల వేసినపుడు చేపలు విస్తారముగా పట్టి నందున వల లాగ లేక పోయిరి. (21:6)
పేతురు వస్త్ర హీనుడిగా ఉన్న కారణముగా పై బట్ట వేసి సముద్రములోనికి దూకాడు. (21:7)
తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోనేలో వచ్చిరి. (21:8)
వారు అప్పుడే పట్టిన చేపలలో కొని తీసికొని రండని వారితో చెప్పాడు. (21:10)
యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్ష్య మైనది ఇది మూడవ సారి. (21:14)
సీమోను వీటికంటే తనను ఎక్కువగా ప్రేమిస్తున్నాడా అని యేసు అడిగాడు. (21:15)
మూడవ సారి యేసు సీమోనును అడిగినప్పుడు సీమోను పేతురు "ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని " అని యేసుకు సమాధానమిచ్చాడు. (21:17)
మూడవ సారి "నా గొర్రెలను మేపుము" అని యేసు పేతురు కు చెప్పాడు. (21:17)
పేతురు ముసలి వాడై నపుడు అతని చేతులు చాచుతాడు, వేరొకడు అతని నడుము కట్టి తనకు ఇష్టము కాని చోటికి తనను మోసికొని పోవును అని చెప్పాడు. (21:18)
అతడు ఎలాటి మరణము వలన దేవుని మహిమ పరచునో దాని సూచింఛి ఆయన ఈ మాట చెప్పెను. (21:19)
"ప్రభువా ఇతని సంగతి ఏమగును?" అని అడిగాడు. (21:21)
"నీవు నన్ను వెంబడించుము" అని యేసు పేతురుతో చెప్పాడు. (21:22)
ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతనిసాక్ష్యము సత్యమని యెరుగుదుము. (21:24)
లూకా సువార్త, అపోస్తలుల కార్యములను లూకా రాసాడు [1:1]
యేసు సజీవునిగా అపోస్తలులుకు ప్రత్యక్షమై దేవుని రాజ్యాన్ని గురించిన సంగతులను చెప్పాడు [1:3].
తండ్రి చేసిన వాగ్దానం కొరకు వేచియుండాలని యేసు తన శిష్యులకు చెప్పాడు [1:4]
అపోస్తలులు కొద్ది దినాల్లో పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందనైయున్నారు [1:5]
కాలములను సమయములను తెలిసి కొనుట మీ పని కాదు అని యేసు వారితో అన్నాడు [1:7].
యేసు అపోస్తలులతో శక్తి పొందనై యున్నారని చెప్పాడు [1:8].
యేసు పైకి ఎత్తబడి, వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను తీసుకుపోయింది [1:9].
యేసు ఏ విధంగా పరలోకానికి వెళ్ళడం మీరు చూశారో అదే విధంగా తిరిగి వస్తారని దేవదూతలు అపోస్తలులతో చెప్పారు[1:11].
వారు ఆసక్తితొ ప్రార్దించారు [1:14].
పరిశుద్ద లేఖనం యూదా ద్వారా నెరవేరిoది [1:16].
యూదా ఒక పొలం కొన్నాడు. అందులోనే అతని శరీరం బద్దలై పగిలిపోయి, పేగులు బయటకు వచ్చాయి [1:18].
యూదా స్థానంలో వేరొకని నియమించాలని కీర్తనలలో రాసి ఉంది [1:20].
యూదా స్థానంలో ఉండే వ్యక్తి అపోస్తలుల సహవాసంలో ఉంటూ, బాప్తిసం ఇచ్చే యోహాను కాలం నుండి, యేసు పునరుత్థానం వరకు సాక్షియై యుండాలి [1:21-22].
అపోస్తలులు ప్రార్ధన చేసి, దేవుడు తన చిత్తాన్ని బయలు పరచాలని చీట్లు వేసారు [1:24-26].
మత్తీయను ఆ పదకొండు మంది అపోస్తలులతో లెక్కించారు.[1:26].
పెంతెకోస్తు దినాన శిష్యులందరూ సమావేశమయ్యారు [2:1].
శిష్యులు ఇతర భాషలలో మాట్లాడసాగారు [2:4].
దైవ భక్తి గల ఆ యూదులు ప్రపంచం నలుమూలల నుండి వచ్చారు [2:5].
జన సమూహాలు శిష్యులు తమ స్వభాషలో మాట్లాడడం విని కలవర పడ్డారు[2:6].
శిష్యులు దేవుని గొప్ప పనులను గూర్చి చెబుతున్నారు[2:11].
అపహాస్యము చేస్తూ వారు కొత్త మద్యంతో నిండి యున్నారని తలంచారు[2:13].
యోవేలు ప్రవక్త ద్వారా చెప్పిన ప్రవచనం ప్రకారం, శరీరులందరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించాడని పేతురు చెప్పాడు [2:16-17].
ప్రభువు పేరున ఎవరైతే ప్రార్ధన చేస్తారో వారందరూ రక్షణ పొందుతారు[2:21].
యేసు పరిచర్యను ఆయన ద్వారా దేవుడు చేసిన అద్బుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలను బట్టి దేవుడు ఆమోదించాడు [2:22].
దేవుడు నిర్దేశించిన ప్రణాళిక ప్రకారంగా యేసును సిలువ వేసారు [2:23].
దేవుడు తన పరిశుద్దుని కుళ్ళిపోనివ్వడని దావీదు చెప్పాడు [2:25,27,31].
దేవుడు దావీదుతొ అతని గర్బఫలంలో ఒకణ్ణి సింహాసనం మీద కూర్చుండ బెడతానని ప్రమాణం చేసాడు [2:30].
యేసు పరిశుద్దుడుగా రాజుగా ప్రవచి౦పబడ్డాడు [2:32].
దేవుడు యేసును ప్రభువుగాను, క్రీస్తుగాను నియమించాడు [2:36].
జనసమూహం పేతురును మేము ఏమి చేయాలి? అని అడిగారు [2:37].
పేతురు జనసమూహాన్ని మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందాలని చెప్పాడు [2:38].
దేవుని వాగ్దానం జనులందరికీ, వారి పిల్లలకును దూరస్థులందరికిని చెందునని వారితో చెప్పాడు [2:39].
ఆరోజు ఇంచుమించు మూడువేల మంది బాప్తిసం తీసుకొన్నారు [2:41].
వీరు అపొస్తలుల బోధలోను సహవాసములోను , రొట్టె విరుచుటలోను ప్రార్థన చేయుటలోను కొనసాగుచుoడిరి [2:42].
విశ్వసించినవారు తమకు ఉన్నవాటిని, ఆస్తులను అమ్మి, అందరికిని వారి వారి అవసరాన్నిబట్టి పంచిపెట్టారు[2:44-45].
విశ్వసించినవారు ప్రతిదినము దేవాలయంలో కలసుకోనేవారు [2:46].
ప్రభువు రక్షణ పొందుతున్నవారిని ప్రతిరోజూ వారితో చేర్చాడు [2:47].
పేతురు యోహానులు దేవాలయానికి వెళ్ళేటప్పుడు పుట్టుక నుండి కుంటివానిగా పుట్టినవాడు దేవాలయపు సింహ ద్వారం దగ్గర అడుక్కోవటం చూసారు [3:2].
పేతురు అతనికి వెండి బంగారాలు ఇవ్వలేదు [3:6].
పేతురు అతనికి నడచే సామర్థ్యం ఇచ్చాడు [3:6,7].
అతను దేవాలయంలోకి వెళ్లి నడుస్తూ, గెంతుతూ దేవుని స్తుతించాడు [3:8].
ప్రజలు అతనిని చూచి విస్మయముతో నిండి పరవశులయ్యారు [3:10].
యేసును తృణీకరించి, పిలాతుకు అప్పగించి, చంపేశారని ప్రజలకు పేతురు గుర్తు చేసాడు [3:13-15].
పేతురు వారితో యేసు నామమందు విశ్వాసము వలన అతడు బాగుపడ్డాడు అని చెప్పాడు[3:16].
పేతురు ప్రజలను పశ్చాత్తాప పడాలని చెప్పాడు [3:19].
అన్నిపరిస్తితులు చక్కబడే కాలము వచ్చే వరకు యేసు పరలోకంలో ఉండుట అవసరమని పేతురు చెప్పాడు [3:21].
దేవుని మాట వినేలా ప్రజలలో తన వంటి ప్రవక్తను పుట్టిస్తాడని మోషే చెప్పాడు [3:22].
యేసు మాట వినని వాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగును [3:23].
దేవుడు అబ్రాహాము సంతానం ద్వారా భూలోక వంశములన్నియు ఆశీర్వదింపబడుననిన వాగ్దానానికి వారసులై యున్నారని ప్రజలకు పేతురు గుర్తు చేసాడు [3:25].
యేసును మొదటిగా యూదుల యొద్దకు పంపి వారిని దుష్టత్వము నుండి మళ్ళించి, ఆశీర్వదించాలని దేవుడు కోరుకొన్నాడు [3:26].
పేతురు యోహానులు దేవాలయంలో, యేసు పునరుత్థానము మరణములను బోధించారు [4:2].
చాలామంది విశ్వసించారు, దాదాపుగా ఐదువేల మంది. [4:4].
వారు పేతురు యోహానులను భందించి, చెరలో పెట్టారు[4:3].
యేసు నామమందు అతడు బాగుపడ్డాడు అని పేతురు వారితో చెప్పాడు [4:10].
యేసు నామముననే రక్షణ పొందాలి గాని, మరి ఏ నామమున రక్షణ పొందలేము అని పేతురు చెప్పాడు[4:12].
స్వస్తత పొందిన వ్యక్తి పేతురు యోహానులతోపాటు నిలబడి ఉండుటవలన యూదుల అధికారులు ఎదురు చెప్పలేకపోయారు [4:14].
యూదుల అధికారులు పేతురు యోహనులకు యేసు నామమున మాట్లాడకూడదని, బోదింపకూడదని ఆజ్ఞాపించారు [4:18].
తాము చూచిన వాటిని, విన్నవాటిని చెప్పకుండా ఉండలేమని పేతురు యోహనులు చెప్పారు [4:20].
వాక్యమును చెప్పే దైర్యమును, యేసు నామములో సూచక క్రియలు, అద్బుతములు చేయాలనీ విశ్వాసులు దేవుణ్ణి అడిగారు [4:29,30].
విశ్వాసులు ప్రార్ధించినపుడు వారు కూడుకొన్న స్టలము కంపించి, పరిశుద్దత్మతో వారు నింపబడి ఎంతో దైర్యముతో వాక్యమును బోధించారు [4:31].
విశ్వాసులు తమకు కలిగినవాటిని అందరితో సమానంగా పంచుకొన్నారు, వారి ఆస్తులను అమ్మి అవసరాన్ని బట్టి పంచారు [4:32,34,35].
"ఆదరణ పుత్రుడు" అను పేరుగల వ్యక్తి బర్నబా [4:36-37].
అననీయ సప్పీరాలు పొలమును అమ్మిన డబ్బు మొత్తం ఇస్తున్నామని అబద్దమాడి కొంత మాత్రమే ఇచ్చారు [5:1-3].
అననీయ సప్పీరాలు పరిశుద్దాత్మతో అబద్దం చెప్పారని పేతురు చెప్పాడు [5:3].
అననీయ సప్పీరాలను దేవుడు చంపివేశాడు [5:5,10].
అననీయ సప్పీరాలకు జరిగినది విన్నవారందరికి, సంఘములోని వారికీ చాలా భయం వేసింది [5:11].
కొందరు పేతురు నీడైనా పడితే నయం అవుతుందని వ్యాధిగ్రస్తులు వీధులలోకి తెచ్చారు, మరికొందరు యెరూషలేం చుట్టునుండు పట్టణములనుండి రోగులను తెచ్చారు [5:15-16].
సద్దుకయ్యులు మత్సరముతో నిండి, అపోస్తలులను చెరసాలలో పెట్టారు[5:17-18].
ఒక దేవదూత వచ్చి చెరసాల తలుపులు తీసి వారిని బయటకు తెచ్చాడు [5:19].
అధికారులు చెరసాల భద్రంగా మూసివేయబడి, లోపల ఎవ్వరూ లేరని కనుగొన్నారు [5:23].
అధికారులు ప్రజలు రాళ్లతో కొడతారని భయపడ్డారు [5:26].
"మనుష్యులకు కాదు మేము దేవునికే లోబడవలెను" అని అపోస్తలులు అన్నారు [5:29].
యేసును చంపినది ప్రధాన యాజకుడు, సిబ్బంది అని అపోస్తలులు అన్నారు [5:30].
మహా సభ వారు గొప్ప కోపంతో నిండిన వారై అపోస్తలులను చంపబోయారు [5:33].
అపోస్తలులను విడిచిపెట్టమని గమలియేలు మహాసభ వారికి సలహా ఇచ్చాడు [5:38].
గమలియేలు మహాసభ వారితో మీరు దేవునితో పోరాడువారవుతారని చెప్పాడు [5:39].
మహా సభ వారు అపొస్తలులను కొట్టించి, యేసు నామ మున బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసారు [5:40].
అపోస్తలులు యేసు నామమునుబట్టి అవమానము పొందుటకు యోగ్యులుగా యెంచబడినందుకు సంతోషించారు [5:41].
అపోస్తలులు ప్రతిదినము దేవాలయంలోనూ, ఇంటింటను ప్రతిదినము బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటిస్తూవచ్చారు [5:42].
గ్రీకుభాష మాట్లాడే యూదులు, వారికీ సంబధించిన విధవరాండ్రను ఆహారము పంచి పెట్టేటప్పుడు చిన్నచూపు చూచారని హెబ్రీయుల మీద ఫిర్యాదు చేసారు [6:1].
శిష్యులు(విశ్వాసులు) యేడుగురు మనుష్యులను ఎన్నుకోన్నారు [6:3,6].
ఆ యేడుగురు మనుష్యులు మంచి పేరు కలిగి ఆత్మతోను జ్ఞానముతోను నింపబడినవారై ఉండాలి [6:3].
అపోస్తలులు ప్రార్థనచేయుటలోను వాక్యపరిచర్యలోను ఎడతెగక యుండిరి [6:4].
అపోస్తలులు వారిపై తమ చేతులు ఉంచి ప్రార్ధన చేసారు [6:6].
అనేకమంది యాజకులతొ సహా శిష్యుల సంఖ్య యెరూష లేములో చాల ఎక్కువగా విస్తరించింది [6:7].
స్తెఫను మాటలలోని జ్ఞానము, ఆత్మ ఎదుట విశ్వసించని యూదులు నిలువలేకపోయిరి [6:10].
స్తెఫనుకు వ్యతిరేకముగామహా సభ వారు ఎదుట అబద్ధ సాక్షులు యేసు పరిశుద్ధ స్థలమును పడగొట్టి, మోషే ఇచ్చిన ఆచారములను మార్చునని స్తెఫను చెప్పగా విన్నామని తప్పుడు సాక్షము చెప్పారు [6:14].
వారు స్తెఫను ముఖము దేవదూత ముఖమువలె ఉండుటను చూచారు [6:15].
స్తెఫను, దేవుడు అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానంతొ మొదలుపెట్టి తమ చరిత్రను వారికి చెప్పసాగాడు [7:2].
దేవుడు అబ్రహాముకు అతని వారసులకు భూమిని స్వాస్థ్యముగా ఇస్తానని వాగ్దానం చేసాడు [7:5].
అబ్రహాముకు సంతానము లేనందున దేవుడుచేసిన వాగ్దానం నెరవేరడం అసాద్యమైనది [7:5].
అబ్రహాము, తన సంతానము నాలుగు వందల సంవత్సరములు పరదేశములో బానిసలుగా ఉంటారని దేవుడు చెప్పాడు [7:6].
నిబంధనతో కూడిన సున్నతిని అబ్రహాముకు ఇచ్చాడు [7:8].
అతని అన్నలు అతనిపట్ల అసూయతో ఈజిప్ట్ కు అమ్మివేసారు [7:9].
దేవుడు యోసేపుకు ఫరో సమక్షములో దయను జ్ఞానమును దయచేసాడు [7:10].
యాకోబు ఐగుప్తు లో ధన్యమున్నదని విని తన కుమారులను అక్కడికి పంపించాడు [7:12-13].
యోసేపు తన అన్నలకు, యకోబును ఐగుప్తు రమ్మని చెప్పి పంపాడు [7:14].
ఇశ్రాయేలీయులు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి[7:17].
ఈజిప్ట్ కొత్త రాజు ఇశ్రాయేలీయుల శిశువులు బ్రదుకకుండ వారిని బయట పారవేయవలెనని బలవంతం చేసాదు [7:19].
ఫరో కుమార్తె అతనిని తీసుకుని తన కుమారునిగా పెంచుకొన్నది [7:21].
మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించాడు [7:22].
మోషే ఇశ్రాయేలీయుని పక్షమున ఐగుప్తీయుని చంపాడు [7:24].
మోషే మిద్యానుకు పారిపోయాడు[7:29].
మోషే మoడుచున్న పొదలో అగ్నిలో దేవదూతను చూసాడు [7:30].
దేవుడు మోషే కు ఐగుప్తుకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు ఎందుకంటే, దేవుడు ఇశ్రాయేలీయులను రక్షింపనై యున్నాడు [7:34].
మోషే ఇశ్రాయేలీయులను అరణ్యములో నలభై సంవత్సరములు నడిపాడు [7:36].
నావంటి ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టిస్తాడని మోషే ఇశ్రాయేలీయులతో చెప్పాడు [7:37].
ఇశ్రాయేలీయులు ఒక బంగారు దూడ ప్రతిమకు బలి అర్పించారు [7:41].
దేవుడు ఇశ్రాయేలీయుల నుండి మళ్లుకొని. ఆకాశసైన్యమును సేవించేలా ఇశ్రాయేలీయులను విడిచిపెట్టాడు [7:42].
ఇశ్రాయేలీయులను బబులోనుకు తీసుకువెళ్తానని దేవుడు చెప్పాడు[7:43].
అరణ్యములో ఇశ్రాయేలీయులు సాక్ష్యపుగుడారమును చేసారు [7:44-45].
దేవుడు ఇశ్రాయేలీయుల ఎదుటనుండి ఇతర జాతి ప్రజలను వెళ్ళగొట్టారు [7:45].
దావీదు దేవునికి ఒక నివాసస్థలము కట్టమని చెప్పాడు కానీ సొలొమోను ఆయనకొరకు మందిరమును కట్టించాడు [7:46-47].
మహోన్నతుని సింహాసనము ఆకాశములో ఉంటుంది [7:49].
పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారని స్తెఫను ప్రజలను గురించి ఆరోపించాడు [7:51].
నీతిమంతుని అప్పగించి హత్య చేసి చంపిన విషయంలో ప్రజలు దోషులయ్యారని చెప్పాడు [7:52].
మహా సభ వారు కోపముతో మండిపడి స్తెఫనును చూచి పండ్లుకొరికిరి [7:54].
యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలబడి యుండుటను చూచుచున్నానని స్తెఫను చెప్పాడు [7:55-56].
మహా సభ వారు స్తెఫనుపై బడి పట్టణపు బయటికి అతనిని వెళ్లగొట్టి, రాళ్లతొ కొట్టారు [7:57-58].
సాక్షులు తమ పైవస్త్రములను సౌలు అను ఒక ¸యవనుని దగ్గర పెట్టారు [7:58].
ఈ పాపమును వారిమీద మోపకుమని స్తెఫను దేవుణ్ణి అడిగాడు [7:58].
స్తెఫను చావుకు సౌలు సమ్మతించాడు [8:1].
స్తెఫను రాళ్ళతో కొట్టబడిన రోజు యెరులేములోని సంఘముకు వ్యతిరేకంగా గొప్ప హింస ఆరంభమయ్యింది [8:1].
యెరులేములోని విశ్వాసులు అందరు యూదయ, సమరయ ప్రాంతాలకు చెదరిపోయారు, శుభవార్తను ప్రకటిస్తూ వెళ్ళారు [8:1,4].
ఫిలిప్పు చేసిన సూచకమైన అద్భుతాలు చూసి సమరయ ప్రజలు అతని మాటలు శ్రద్దగా విన్నారు [8:6].
సీమోను మంత్ర విద్యలు చూసి సమరయ ప్రజలు అతడి మాటలు శ్రద్దగా విన్నారు [8:9-11].
సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొందాడు [8:13].
సమరయలోని విశ్వాసులు పరిశుద్ధాత్మను పొందారు [8:17].
తాను ఎవరి మీదనైన చేతులుంచినపుడు వారికి పరిశుద్ధాత్మను ఇచ్చునట్లు అధికారము పొందునట్లు సీమోను అపోస్తలులకు డబ్బు ఇవ్వజూపాడు [8:18-19].
సీమోను ఘోరదుష్టత్వముతోను, దుర్నీతి బంధకములతోను నిండి యున్నాడని పేతురు చెప్పాడు [8:23].
దక్షిణంగా గాజా వైపు అరణ్య మార్గానికి వెళ్ళమని ఫిలిప్పుకు దూత చెప్పాడు [8:26].
ఫిలిప్పు ఇతియోపియ నుండి గొప్ప అధికారియైన నపుంపసకుణ్ణి కలిసాడు. అతడు రధంలో కూర్చుని ఉండి యెషయాాప్రవక్త గ్రంధం చదువుతూ ఉన్నాడు [8:27-28].
"మీరు చదువుతూ ఉన్నది మీకు అర్ధం అవుతుందా?" అని ఫిలిప్పు అతనిని అడిగాడు [8:30]
ఆ వ్యక్తి ఫిలిప్పును తన రధమెక్కి తనతో కూర్చోమని, తాను చదువుచున్న దానిని వివరించమని అడిగాడు [8:31].
ఆయన గొర్రెలాగా వధకు తేబడ్డాడు, ఆయన తన నోరు తెరువలేదు [8:32].
ప్రవక్త ఇలా చెప్పేది తన విషయమా లేక మరొకరి విషయమా అని ఫిలిప్పును అడిగాడు [8:34].
యెషయా నుండి లేఖనాలలోని వ్యక్తి యేసు అని ఫిలిప్పు ఆ వ్యక్తికి వివరించాడు [8:35].
ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోకి దిగారు. ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాడు [8:38]
నీళ్ళలోనుంచి బయటకు వచ్చినపుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును తీసుకువెళ్ళాడు [8:39].
నీళ్ళలోనుంచి బయటకు వచ్చిన తరువాత నపుంసకుడు ఆనందిస్తూ తన దారిన వెళ్ళాడు [8:39].
తాను దమస్కు వరకు ప్రయాణం చేసి ఈ మార్గమునకు చెందినా వారినెవరినైనా ఖైదుచేసి తీసుకొని రావడానికి లేఖలు వ్రాసి ఇవ్వాలని సౌలు కోరాడు [9:1-2].
దమస్కుకు సమీపించినపుడు, ఆకాశంనుండి వెలుగు రావడం సౌలు చూసాడు [9:3].
"సౌలా, సౌలా, నీవు నన్ను ఎందుకు హింసిస్తూ ఉన్నావు" అని ఆ స్వరం చెప్పింది [9:4].
జవాబు "నీవు హింసించుచున్న యేసునే నేను" [9:5]
సౌలు నేలమీదనుండి లేచినపుడు అతడు ఏమీ చూడలేకపోయాడు [9:8].
అక్కడనుండి సౌలు దమస్కుకు వెళ్ళాడు, అక్కడ మూడు రోజులు ఏమీ తినలేదు, త్రాగలేదు [9:9].
దేవుడు అననీయను వెళ్లి సౌలుకు చూపుకలిగేల తన చేతులను సౌలుమీద ఉంచమని చెప్పాడు [9:11-12].
ప్రభువుపేర ప్రార్ధన చేసేవారందరినీ ఖైదు చెయ్యడానికి సౌలు దమస్కుకు వచ్చాడని అననీయకు తెలుసు కనుక ఆందోళనపడ్డాడు [9:13-14].
సౌలు ఇశ్రాయేలు ప్రజల ఎదుట. ఇతర ప్రజల ఎదుట, వారి రాజుల ఎదుట తన పేరును భరిస్తాడని ప్రభువు చెప్పాడు [9:15].
ప్రభువు పేరు కోసం సౌలు అనేక బాధలు అనుభవించాలని చెప్పాడు [9:16].
అననీయ తన చేతులను సౌలు మీద ఉంచిన తరువాత అతనికి చూపు వచ్చింది, అతడు బాపిస్మం తీసుకున్నాడు, భోజనం చేసాడు [9:19].
సౌలు వెంటనే యేసే దేవుని కుమారుడని యూద సమాజ కేంద్రాలలో ఆయనను గురించి ప్రసంగించడం మొదలు పెట్టాడు [9:20].
సౌలు యెరూషలేముకు వచ్చినపుడు శిష్యులు అతనికి భయపడ్డారు [9:26].
బర్నబా సౌలును శిష్యులవద్దకు తీసుకొని వచ్చి సౌలుకు దమస్కులో జరిగినదానిని వివరించాడు [9:27].
యెరూషలేములో సౌలు ప్రభువైన యేసుని గురించి ధైర్యంగా బోధించాడు [9:29].
సౌలు తార్సుకు పంపబడినపుడు యూదయ, గలలియ, సమరయలోని సంఘం క్షేమాభివృద్ధినొందుచూ సమాధానము కలిగియుండి విస్తరించుచుండెను [9:31].
లుద్దలో పేతురు ఒక పక్షవాయువుగల వానితో మాట్లాడినపుడు యేసు అతనిని స్వస్థపరచాడు [9:33-35].
యొప్పేలో చనిపోయిన తబిత అను స్త్రీ కొరకు పేతురు ప్రార్ధించగా ఆమె తిరిగి బ్రతికింది [9:36-42].
కోర్నేలీ భక్తిపరుడు, దేవునియందు భయభక్తులు గలవాడు, దానధర్మాలు చేయువాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్ధన చేయువాడు [10:2].
కోర్నేలీ ప్రార్ధనలు, పేదవారికి అతడు చేసిన ధర్మములు దేవునిసన్నిదికి జ్ఞాపకార్ధంగా చేరాయని దూత చెప్పాడు [10:4].
పేతురుని పిలిపించుకొని రావడానికి యొప్పేకు మనుషులను పంపమని కోర్నేలీతో దూత చెప్పాడు [10:5].
సకల విధములైన నలుగు కాళ్ళ జంతువులు, పాకే పురుగులు, ఆకాశపక్షులతో కూడిన పెద్ద దుప్పటి వంటి పాత్రను పేతురు చూసాడు [10:11-12].
"నీవు లేచి చంపుకొని తినుము" అని ఆ స్వరం అతనితో చెప్పింది [10:13].
పేతురు తాను నిషిద్ధమైనదానిని, అపవిత్రమైనదానిని ఎన్నడు తినలేదని వాటిని నిరాకరించాడు [10:14].
"దేవుడు పవిత్రం చేసినవాటిని నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు" అని స్వరం చెప్పింది [10:15]
వారితో వెళ్ళమని ఆత్మ పేతురుతో చెప్పాడు [10:20]
కోర్నేలీ వద్దనుండి మనుష్యులు పేతురు కోర్నేలీ ఇంటికి వచ్చి సందేశము ఇవ్వాలని కోరారు [10:22].
పేతురు కోర్నేలీ లేచి నిలువుము, తాను కూడా నరుడనే అని చెప్పాడు [10:26].
పేతురు అన్యజాతి వానితో సహవాసము చేస్తున్నాడు, ఎందుకంటే ఏ మనిషి నిషేదింపదగినవాడనిగానీ, అపవిత్రుడనిగానీ చెప్పకూడదని దేవుడు తనతో చెప్పాడు [10:28].
దేవునికి భయపడి నీతిగా నడచుకోనువానిని దేవుడు అంగీకరించునని పేతురు చెపుతున్నాడు [10:35].
దేవుడు యేసును పరిశుద్దాత్మతోను, శక్తితోను అభిషేకించేనని, దేవుడాయనకు తోడైయుండెను గనుక పీడింపబడినవారినందరినీ స్వస్థపరచెనని యేసును గురించి విన్నారు [10:38].
దేవుడు యేసును మూడవ దినమున లేపేనని పేతురు ప్రకటించాడు, యేసు పునరుద్దానుడైన తరవాత పేతురు ఆయనతో కలసి భోజనం చేసాడు [10:40-41].
యేసు సజీవులకును, మృతులకును న్యాయాదిపతినిగా దేవునిచేత నియమింబడెనని ప్రకటించాలని యేసు ఆజ్ఞాపించాడని పేతురు చెప్పాడు [10:42].
యేసు నందు విశ్వాసముంచు వారందరూ పాప క్షమాపణ పొందుతారని పేతురు చెపుతున్నాడు [10:43]
పేతురు బోధ వినుచున్నవారి మీదికి పరిశుద్ధాత్మ దిగివచ్చాడు [10:44].
సున్నతి పొందిన గుంపుకు చెందిన విశ్వాసులు ఆర్చర్యపోయారు ఎందుకంటే, పరిశుద్ధాత్మ అన్యజనులమీద కూడా కుమ్మరింపబడ్డాడు [10:45].
పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరింప బడ్డాడనే దానిని కనపరచడానికి ప్రజలు ఇతర భాషలతో మాట్లాడుతున్నారు, దేవుణ్ణి స్తుతిస్తూఉన్నారు [10:46].
యేసుక్రీస్తు నామంలో ప్రజలు బాప్తిస్మం పొందాలని పేతురు ఆజ్ఞాపించాడు [10:48]
అన్యజనులు కూడా దేవుని వాక్కును స్వీకరించారని యూదయలోని అపోస్తలులు, సహోదరులు విన్నారు [11:1].
అన్యజనులతో కలసి భోజనం చేస్తున్నాడని యెరుషలేములోని సున్నతి పొందిన గుంపు వారు పేతురును విమర్శించారు [11:2-3].
పెద్ద దుప్పటి విషయమైన దర్శనం, అన్యజనుల యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి వివరించడం ద్వారా పేతురు తనకు వ్యతిరేకంగా ఉన్న విమర్శకు జవాబిచ్చాడు [11:4-16].
దేవుడు అన్యజనులకు కూడా జీవార్ధమైన మారుమనస్సు దయచేసియున్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమ పరిచారు [11:18].
స్తెఫను మరణం తరువాత చెదరిపోయిన అనేకమంది విశ్వాసులు యేసును గురించిన సందేశాన్ని యూదులకు మాత్రమే చెప్పారు [11:19].
యేసును గురించిన సందేశాన్ని గ్రీసు దేశస్తులకు చెప్పినపుడు అనేకమంది విశ్వసించారు [11:20-21].
ప్రభువును స్థిరహృదయంతో హత్తుకోనవలెనని బర్నబా వారిని ప్రోత్సహించాడు [11:22-23].
బర్నబా, సౌలు అంతియొకయలోని సంఘంలో సంవత్సరమంతా గడిపారు [11:26].
అంతియొకయలో మొదటిసారిగా శిష్యులను "క్రైస్తవులు" అనడం జరిగింది [11:26].
లోకమంతటికీ గొప్ప కరవు రాబోతున్నాదని అగబు అను ప్రవక్త ముందుగా చెప్పాడు [11:28]
శిష్యులు యూదయలోని సహోదరులకు సహాయాన్ని బర్నబా, సౌలు ద్వారా పంపారు [11:29-30].
రాజైన హేరోదు యోహాను సహోదరుడైన యాకోబును కత్తితో చంపించాడు [12:2].
రాజైన హేరోదు పేతురుని ఖైదు చేసాడు, పస్కాపండుగ తరువాత ప్రజల ఎదుటికి అతణ్ణి తేవాలని ఉద్దేశించాడు [12:3-4].
సంఘం పేతురు కొరకు మనస్పూర్తిగా ప్రార్ధన చేస్తూఉంది [12:5].
ఒక దేవదూత పేతురుకు కనిపించాడు, అతని చేతులనుండి సంకెళ్ళు ఊడిపడ్డాయి, చెరసాల బయటవరకు దేవదూతను అనుసరించాడు [12:7-10].
రోదే అనే పనిపిల్ల తలుపు తీయడానికి వచ్చింది, ఆమె తలుపు తీయకుండానే పేతురు తలుపు ముందు నిలువబడి ఉన్నాడని విశ్వాసులకు చెప్పింది [12:13-14].
మొదట ఆమెకు మతి తప్పిందని తలంచారు, అయితే వారు తలుపు తెరిచి పేతురును చూసారు [12:15-16].
యాకొబుకూ, సోదరులకూ ఈ సంగతులు తెలియజేయండి అని చెప్పాడు [12:17].
పేతురుకి కావలి కాసిన వారిని హేరోదు ప్రశ్నించాడు, వారిని చంపాలని ఆజ్ఞ ఇచ్చాడు [12:19].
"ఇది ఒక దేవుడి స్వరమే గాని మనిషిది కాదు" అని ప్రజలు అరిచారు [12:22].
హేరోదు దేవుని మహిమపరచలేదు, కనుక ఒక దేవుని దూత అతణ్ణి మొత్తాడు, అతడు పురుగులు పడి చనిపోయాడు [12:23].
దేవునివాక్యం అంతకంతకు వ్యాపిస్తూ విస్తరిల్లుతూ ఉంది [12:24].
బర్నబా సౌలులు మార్కు అను మారు పేరుగల యోహానును వెంటబెట్టుకువెళ్ళారు [12:25]
పరిశుద్ధాత్మ వారితో మాట్ల్లడుతున్నప్పుడు అంతియొకయలోని సంఘం ప్రభువును ఆరాధిస్తూ ఉపవాసం చేస్తూఉంది [13:2].
ఆత్మ బర్నబాను, సౌలునూ పిలిచిన పనికోరకు వారిని ప్రత్యేకించుడని వారితో చెప్పాడు [13:2].
సంఘం ఉపవాసముండి ప్రార్ధన చేసి వారిమీద చేతులుంచి వారిని పంపారు [13:3].
కుప్రలో యోహాను అనబడిన మార్కు వారికి సాయం చేసేవాడిగా వారితో ఉన్నాడు [13:5].
బర్-యేసు సెర్గిపౌలుతో ఉన్న యూదుల అబద్ద ప్రవక్త [13:6-7].
సెర్గిపౌలు దేవుని వాక్యము వినగోరెను గనుక బర్నబా, సౌలూను పిలిపించుకొన్నాడు [13:7].
సౌలుకు ఇవ్వబడిన మరియొక పేరు పౌలు [13:9].
తాను సాతాను కుమారుడని, తాను కొంత కాలము గ్రుడ్డివాడై యుంటాడని బర్ యేసుతో పౌలు చెప్పాడు [13:10-11].
సెర్గి పౌలు విశ్వసించాడు [13:12].
యోహాను పౌలును అతని స్నేహితులను విడిచి యెరూషలేముకు తిరిగి వెళ్ళాడు [13:13].
పిసిదియలోని అంతియొకయలో యూదుల సమాజమందిరంలో ప్రసంగించాలని పౌలును అడిగారు [13:15].
పౌలు తన ప్రసంగంలో ఇశ్రాయేలు ప్రజల చరిత్రను తిరిగి చెపుతున్నాడు [13:17-22].
రాజైన దావీడునుండి దేవుడు ఇశ్రాయేలు రక్షకుని తీసుకు వచ్చాడు [13:23].
రానున్న రక్షకుని మార్గమును సిద్ధపరచువాడని బాప్తిస్మమిచ్చు యోహాను గురించి పౌలు చెప్పాడు [13:24-25]
యేసుకు శిక్షవిధించుటచేత యెరూషలేములోని అధికారులు, ప్రజలు ప్రవక్త యొక్క సందేశాలను నెరవేర్చారు [13:27].
మృతులలోనుండి లేచిన యేసును చూచిన ప్రజలు ఇప్పుడు ఆయనకు సాక్షులైయున్నారు [13:31].
మృతులలోనుండి యేసును లేపుటద్వారా యూదులకు తాను చేసిన వాగ్దానాలను నేరవేర్చియున్నాడని దేవుడు చూపించాడు [13:33].
పరిశుద్ధుని కుళ్ళిపోనివ్వనని దేవుడు వాగ్దానం చేసాడు [13:35].
విశ్వసించు ప్రతివానికి పౌలు పాపక్షమాపణను ప్రకటిస్తున్నాడు [13:38].
దేవుని కార్యమును గురించి వివరించినను ఎంతమాత్రము నమ్మనివారి గురించి ప్రవక్తలచేత ప్రవచించిన వారివలె ఉండకుడి అని పౌలు హెచ్చరికను ఇస్తున్నాడు [13:40-41].
మరుసటి సబ్బాతుదినాన్న దాదాపు ఆ పట్టణమంతయూ దేవుని వాక్యము వినడానికి కూడివచ్చారు [13:44].
యూదులు జనసమూహములను చూచి అసూయతో నిండిపోయారు. పౌలు చెప్పినదానిని కాదంటూ దూషించారు [13:45].
వారికి చెప్పిన దేవుని వాక్యాన్ని యూదులు త్రోసివేసారని పౌలు చెపుతున్నాడు [13:46].
అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమ పరచిరి [13:48].
నిత్య జీవానికి నిర్ణయింప బడిన వారందరూ విశ్వసించారు [13:48].
యూదులు పౌలు, బర్నబాలకు వ్యతిరేకంగా హింసను పురికొల్పారు, వారిని తమ ప్రాంతములనుండి వెళ్ళగొట్టారు [13:50].
పౌలు, బర్నబాలు తమ పాద ధూళిని అంతియొక పట్టణములో తామును బయటకు వెల్లగొ ట్టినవారివైపు దులిపివేసి ఈకొనియకు వచ్చారు [13:51].
అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనస్సులలో సహోదరులమీద పగ పుట్టించారు [14:1-2].
ప్రభువు వారి చేత సూచకక్రియలను, అద్భుతములను చేయించి తన కృపావాక్యమును గురించి సాక్ష్యమిప్పించుచుండెను [14:3].
కొందరు అన్యజనులును, యూదులును తమ అధికారులతో కలిసి వారిమీద పడి పౌలు, బర్నబాలను అవమానపరచి రాళ్ళు రువ్వి చంపాలని చూసారు [14:5-7].
పుట్టుకుంటివాడైన ఒక మనుష్యుని పౌలు స్వస్థపరచాడు [14:8-10].
ద్యుపతియొక్క పూజారి ద్వారా పౌలు, బర్నబాలకు బలులు అర్పించాలని కోరారు [14:11-13,18].
పౌలు, బర్నబాలు తమ వస్త్రములను చించుకొని సమూహము లోనికి చొరబడి వారు వ్యర్ధమైన వాటిని విడిచి సజీవుడైన దేవుని వైపు తిరగాలని గట్టిగా అరిచారు [14:14-15].
ఆయన అకాశమునుండి వర్షమును, ఫలవంతమైన ఋతువులను దయచేయుచు, ఆహారముననుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచున్నాడు [14:16-17]
లుస్త్రలోని సమూహము తరువాత పౌలుమీద రాళ్ళు రువ్వి పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి [14:19].
అతడు లేచి పట్టణములో ప్రవేశించెను [14:20].
అనేక శ్రమలను అనుభవించుట ద్వారా శిష్యులు దేవుని రాజ్యములో ప్రవేశించాలని పౌలు చెప్పాడు [14:22]
ప్రతి సంఘములో పౌలు బర్నబాలు పెద్దలను ఏర్పరచి, ఉపవాసముండి, ప్రార్ధన చేసి వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించారు [14:23].
పౌలు బర్నబాలు అంతియొకయకు తిరిగి వచ్చినపుడు దేవుడు తమకు తోడైయుండి చేసిన కార్యములన్నిటిని, అన్యజనులు విశ్వసించుటకు అయన ద్వారము తెరచిన సంగతి వివరించిరి [14:27].
యూదయనుండి వచ్చిన కొందరు సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించారు [15:1].
పౌలు, బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలులయొద్దకును పెద్దలయొద్దకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించిరి [15:2].
పౌలును అతని సహచారులును అన్యజనులు దేవునివైపు తిరిగిన సంగతి తెలియపరచిరి [15:3].
పరిసయ్యుల తెగలో కొందరు విశ్వాసులు అన్యజనులకు సున్నతి చేయించవలెనని, వారు మోషే ధర్మశాస్త్రమును గైకొనవలెనని తలంచారు [15:5].
దేవుడు అన్యజనులకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు, విశ్వాసము ద్వారా వీరి హృదయాలను పవిత్రపరచాడని పేతురు చెప్పాడు [15:8-9].
యూదులు, అన్యజనులు ప్రభువైన యేసు కృపద్వారా రక్షించబడ్డారని పేతురు చెప్పాడు [15:11].
దేవుడు అన్యజనులలో చేసిన సూచకక్రియలను అద్భుతాలను పౌలు, బర్నబాలు సంఘానికి వివరించారు [15:12].
దేవుడు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టుదునని ప్రవచనం చెపుతున్నది, దీనిలో అన్యజనులు ఉన్నారు [15:13-17].
అన్యజనులలోని విశ్వాసులు విగ్రహాల వల్ల అపవిత్రమైనవాటిని, వ్యభిచారాన్ని విసర్జించాలని, గొంతుపిసికి చంపిన దానిని, రక్తాన్ని తినకూడదని వారికి ఆజ్ఞ ఇవ్వాలని యాకోబు సూచించాడు [15:20]
ఉత్తరాన్ని రాసినవారు, పరిశుద్ధాత్మ ముగింపుమాటలతో అంగీకరించినట్టు కనిపిస్తుంది [15:28].
అ ఉత్తరములోని ప్రోత్సాహాన్నిబట్టి అన్యజనులు సంతోషించారు [15:31].
పౌలు, బర్నబాలు అంతియొకయలో నిలిచి ప్రభువు వాక్యాన్ని బోధించుచు ప్రకటించుచు వచ్చారు [15:35].
ఏయే పట్టణాలలో ప్రభువు వాక్యము ప్రచురపరచారో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరులయొద్దకు తిరిగి వెళ్లాలని బర్నబాతో చెప్పాడు [15:36].
బర్నబా తమతో మార్కును తీసుకొనివెళ్ళాలని కోరాడు, అయితే పౌలు అతనిని తీసుకొని వెళ్ళడం యుక్తము కాదని తలంచాడు [15:37-39].
పౌలు తిమోతికి సున్నతి చేయించాడు, ఎందుకంటే అతని తండ్రి గ్రీసుదేశస్థుడని ఆప్రాంతయూదులందరికి తెలుసు [16:3].
యెరూషలేములోని అపోస్తలులు, పెద్దలు నిర్ణయించిన నియమాలను వారికి అందించాడు [16:4].
మాసిదోనియ దేశస్థుడొకడు సహాయం చెయ్యదానికి రమ్మని పిలిచిన దర్శనాన్ని పౌలు పొందాడు [16:9].
అక్కడ ప్రార్ధన జరుగునని పౌలు తలంచాడు [16:13].
పౌలు మాటలు శ్రద్ధగా వినడానికి ప్రభువు లుదియ హృదయాన్ని తెరిచాడు [16:14].
పౌలు మాట్లాడిన తరువాత లుదియ తన యింటివారందరితోపాటు నదిలో బాప్తిస్మం పొందింది [16:15].
దయ్యం పట్టిన బానిసపిల్ల సోదే చెప్పడం మూలంగా తన యజమానులకు లాభం సంపాదించేది [16:16]
పౌలు ఆమె వైపుకు తిరిగి ఆమెలోనుండి బయటకు రమ్మని యేసు క్రీస్తు నామంలో దురాత్మకు అజ్ఞాపించాడు.[16:17-18].
రోమీయులు అంగీకరించకూడని, పాటించకూడని ఆచారాలను పౌలు సీలలు ప్రకటిస్తున్నారని వారికి వ్యతిరేకంగా నేరం మోపారు [16:21].
వారిని బెత్తాలతో కొట్టారు, చెరసాలలో వేసారు, వారి కాళ్ళు కోయ్యబొండలో బిగించారు [16:22-24].
వారు దేవునికి ప్రార్ధన చేస్తూ స్తుతిపాటలు పాడుతూ ఉన్నారు [16:25].
అక్కడ మహా భూకంపం కలిగింది, చెరసాల పునాదులు కదిలాయి, వెంటనే తలుపులన్నీ తెరచుకున్నాయి, అందరి సంకెళ్ళు ఊడిపోయాయి [16:26].
"అయ్యలారా, పాపవిముక్తి పొందడానికి నేనేం చేయాలి"పౌలు సీలలను చెరసాల అధికారి అడిగాడు [16:30].
"ప్రభువైన యేసునందు నమ్మకముంచుము, అప్పుడు నీవును, నీ ఇంటివారును రక్షణ పొందుతారు" అని పౌలు సీలలు జవాబిచ్చారు [16:31].
ఆ రాత్రి చేరసాల అధికారి, అతని యింటివారు బాప్తిస్మం పొందారు [16:33].
న్యాయవిచారణ లేకుండా ఇద్దరు రోమా పౌరులను బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించిన కారణంగా న్యాయాదిపతులు భయపడ్డారు [16:35-38].
పౌలు సీలలు లుదియ యింటికి వెళ్ళారు, అక్కడ సోదరులను చూచి ప్రోత్సాహపరచి తరువాత వెళ్ళిపోయారు [16:40].
పౌలు తెస్సలోనికకు వచ్చినపుడు లేఖనాలలోనుండి యేసును గురించి మాట్లాడడానికి మొదట యూదుల సమాజకేంద్రం లోనికి వెళ్ళాడు [17:1-2].
క్రీస్తు బాధలు అనుభవించి చనిపోయినవారిలోనుండి లేవడం తప్పనిసరి అని లేఖనాలలోనుండి పౌలు చూపించాడు [17:3].
పౌలు సీలలు చక్రవర్తికాక యేసుఅను మరో రాజు ఉన్నాడని చెపుతూ చక్రవర్తి శాసనాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని వారి మీద నింద వేసారు [17:7].
పౌలు సీలలు బెరయకు వచ్చినపుడు వారు యూదుల సమాజ కేంద్రానికి వెళ్ళారు [17:10].
బెరయవారు వాక్కును అత్యాసక్తితో అంగీకరించి పౌలు చెప్పినది సత్యమో కాదో అని ప్రతి రోజూ లేఖనాలు పరిశోధిస్తూ వచ్చారు [17:11].
తెస్సలోనికలోని యూదులు బెరయలోని జనసమూహములని రేపికదిలించారు కనుక పౌలు ఏథెన్సుకు వెళ్ళాడు [17:13-15]
పౌలు ఏథెన్సుకు వెళ్ళినపుడు యూదుల సమాజకేంద్రానికి, బజారు ప్రదేశానికి యూదులతో చర్చించడానికి వెళ్ళాడు [17:17].
పౌలు బోధను కొనసాగించడానికి పౌలును అరెయోపగస్ సభకు తీసుకొని వచ్చారు [17:19-20].
"తెలియబడని దేవునికి" అని రాయబడిన ఒక బలిపీఠంను పౌలు చూశాడు, దానినే ప్రజలకు వివరించాలని పౌలు కోరాడు [17:23]
సమస్తాన్ని సృజించిన దేవుడు మనుష్యులందరికి జీవితాన్ని, ఊపిరిని అలాంటి వాటన్నిటినీ ప్రసాదిస్తున్నాడు [17:25].
మానవజాతులన్నిటినీ ఒక మనిషి నుండి దేవుడు చేసాడు [17:26].
వాస్తవంగా దేవుడు మనలో ఎవరికీ దూరంగా లేడని పౌలు చెపుతున్నాడు [17:27].
మనము మన ఊహ ప్రకారం నేర్పుతో చెక్కిన విగ్రహం లాంటిదని దేవుణ్ణి తలంచకూడదని పౌలు చెపుతున్నాడు [17:29].
ఇప్పుడైతే పశ్చాత్తాపపడాలని అంతటా మనుష్యులందరికీ దేవుడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు [17:30].
ఈ లోకానికి న్యాయంతో తీర్పు తీర్చబోయే రోజును దేవుడు నిర్ణయించాడు [17:31].
ఆయనను చనిపోయినవారిలోనుంచి సజీవంగా లేపడంవల్ల ఈ సంగతి మనుషులందరికీ ఋజూవు చేసాడు [17:31].
మృతుల పునరుత్థానం గురించి పౌలు మాట్లాడడం కొందరు వినినప్పుడు వారు పౌలును హేళన చేసారు [17:32].
అవును కొందరు, తమతో ఉన్నవారును పౌలు చెప్పిన దానిని విశ్వసించారు [17:34].
తనను తాను పోషించుకోడానికి పౌలు డేరాలు కుట్టేపనిని చేసేవాడు [18:3].
యేసే క్రీస్తని కొరింథులోని యూదులకు పౌలు సాక్ష్యమిచ్చాడు [18:5].
వారి రక్తము వారి తల మీదే ఉంటుందని చెప్పాడు, అన్యజనుల వద్దకు వెళ్ళాడు [18:6].
నిర్భయంగా ఉండి మాట్లాడుతూ ఉండమని ప్రభువు పౌలుకు చెప్పాడు, అక్కడ ఎవరూ తనకు హాని చెయ్యరు [18:9-10].
ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా దేవుణ్ణి ఆరాధించడానికి ప్రజలను పురికొల్పుతున్నాడని పౌలుమీద నేరం మోపారు [18:12-13].
యూదా ధర్మశాస్త్రానికి గురించినవాటిని విచారణ చేయడానికి తనకు ఇష్టంలేదని చెప్పాడు [18:15].
ఆకుల ప్రిస్కిల్ల పౌలుతో పాటు ఎఫెసువరకు ప్రయాణం చేసారు [1818-19].
ఎఫెసును విడిచిన తరువాత పౌలు యెరూషలేముకు వెళ్ళాడు, తరువాత అంతియొకయకు వెళ్ళాడు [18:22].
అపొల్లో ప్రభువు మార్గం విషయం ఉన్నవి ఉన్నట్టుగా అర్ధం చేసుకున్నాడు, అయితే యోహాను ఇచ్చిన బాప్తీస్మం మాత్రమే తనకు తెలుసు [18:25].
ప్రిస్సిల్ల అకులలు అపోల్లోకు స్నేహితులయ్యారు, దేవుని మార్గాన్ని ఇంకా పూర్తిగా వివరించారు [18:26].
యేసే క్రీస్తని లేఖనముల ద్వారా ఋజువు చేస్తూ బహిరంగంగానే యూదుల వాదాలను వమ్ము చేసాడు [18:9-10].
వారు విశ్వసించినపుడు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతి వినలేదని చెప్పారు [19:2].
బాప్తిస్మమిచ్చు యోహాను బాప్తిసం పశ్చాత్తాపాన్ని గురించిన బాప్తిస్మం [19:4]
తన వెనుక వచ్చువానియందు నమ్మకముంచాలని యోహాను చెప్పాడు [19:4].
ప్రభువైన యేసు నామంలో శిష్యులకు పౌలు బాప్తిస్మం ఇచ్చాడు [19:5].
పరిశుద్ధాత్ముడు వారిమీదికి వచ్చాడు, వారు వేరే భాషలతో మాట్లాడారు, దేవునిమూలంగా పలికారు [19:6].
పౌలు వారిని విడిచి శిష్యులను తీసుకువెళ్ళి తురన్నాన్ ప్రసంగశాలలో ప్రతి రోజూ చర్చలు జరిపాడు [19:9].
అతని శరీరానికి తగిలిన చేతి రుమాళ్ళు గాని నడికట్లు గాని రోగుల దగ్గరకు తెచ్చినపుడు రోగాలు పోయాయి, దయ్యాలు వారిని విడిచి వెళ్ళాయి [19:12].
దురాత్మలు యూదులైన స్కెవ కొడుకులు ఏడుగురి మీదికి ఎగిరి దూకి వారిని లొంగదీసి ఓడగొట్టాడు, వారు గాయాలు తగిలి వారు దిగంబరంగా ఆ ఇంటినుంచి పారిపోయారు [19:16].
ఎఫెసులో మంత్రవిద్యనభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకాలు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేశారు [19:19].
యెరూషలేము వెళ్ళిన తరువాత పౌలు తాను రోమ్ కూడా చూడాలి అనుకున్నాడు [19:21].
చేతులతో చేసిన దేవతలు దేవతలే కావని, అర్తెమి మహాదేవి నిరుపయోగం అని పౌలు ప్రజలకు బోధిస్తున్నాడని దేమేత్రియస్ అనే కంసాలి వాడు ఆందోళన చెందాడు [19:26].
ప్రజలు కోపోద్రేకంతో నిండిపోయి "ఎఫేసువారి అర్తెమి గొప్పది" అని కేకలు పెట్టారు, నగరమంతా గందరగోళం అయిపోయింది [19:28-29].
శిష్యులు, స్థానిక అధికారులు పౌలు ప్రజల సభ వద్దకు వెళ్ళడానికి అనుమతించ లేదు [19:30-31].
ప్రజలు అల్లరికి బదులు వారి పిర్యాదులు తేవాలని పట్టణపు కరణం చెప్పాడు [19:38].
జరిగిన అల్లరికి సరైన కారణం లేదు కనుక దానిని గురించి వారిమీద నేరం మోపడం జరుగుతుందేమో అని భయపడ్డాడు [19:40]
పౌలును ఇతర అపోస్తలులును వారంలో మొదటి రోజున రొట్టె విరవడానికి కలుసుకోనేవారు [20:7].
ఆ యువకుడు మూడో అంతస్తు నుంచి క్రింద పడి చనిపోయాడు. పౌలు అతనిమీద పడుకున్నాడు. ఆ యువకుడు మరల బ్రతికాడు [20:9-10].
పెంతెకోస్తు రోజు యెరూషలేములో ఉండాలని పౌలు ఆతురత పడుతున్నాడు [20:16].
దేవుని పట్ల పశ్చాత్తాపపడి ప్రభువైన యేసుక్రీస్తు మీద నమ్మకం ఉంచాలని యూదులు, గ్రీసు దేశస్థులను హెచ్చరిస్తూ వచ్చానని పౌలు చెపుతున్నాడు [20:18-20].
సంకెళ్ళు బాధలు తనకోసం కాచుకొని యున్నాయని ప్రతి పట్టణములో పౌలుకు పరిశుద్ధాత్మ సాక్ష్యం చెపుతూ ఉన్నాడు [20:23].
దేవుని కృపను గురించిన శుభవార్తను తెలియజేయడం పౌలు పొందిన పరిచర్య [20:24].
దేవుని సంకల్పమంతా వారికి ప్రకటించాడు కనుక వారు నాశనమైతే తాను బాధ్యుడను కాను అని పౌలు చెపుతున్నాడు [20:27].
మంద అంతటి గురించి జాగ్రతగా ఉండుడని పెద్దలను ఆజ్ఞాపించాడు [20:28].
శిష్యులను తమ వెంట లాక్కుపోవాలని వారిలోని పెద్దలలో కొందరు కుటిలమైన మాటలు చెపుతారు అని పౌలు చెప్పాడు [20:30].
పౌలు ఎఫెసు పెద్దలను దేవునికి అప్పగించాడు[20:32].
పౌలు తన అక్కరలు తనతో ఉన్నవారి అక్కరలు తీర్చడానికి తన చేతులతో పనిచేసాడు, బలహీనులకు సాయం చేసాడు [20:34-35].
ఇకమీదట నా ముఖం చూడరని పౌలు చెప్పిన మాటకు ఎఫెసు పెద్దలందరూ విశేషంగా దు:ఖించారు [20:38].
వారు పౌలును యెరూషలేము వెళ్ళవద్దని ఆత్మమూలంగా చెప్పారు [21:4].
ఫిలిప్పు నలుగురు కుమార్తెలు కన్యలు. వారు ప్రవచించువారు [21:9].
యెరూలేములోని యూదులు పౌలును బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని చెప్పాడు [21:11].
యెరుషలేములో బంధింపబడుటకే కాక ప్రభువైన యేసు నామము నిమిత్తము చనిపోవుటకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు [21:13].
యెరూషలేముకు వచ్చిన తరువాత పౌలు పెద్దలందరిని కలిసాడు [21:18].
అన్యజనులలో ఉన్న యూదులకు మోషేను విడిచిపెట్టమని పౌలు చేపుతున్నాడని యూదులు నేరం మోపారు [21:21].
పౌలు ధర్మశాస్త్రంను గైకొని యధావిధిగా నడుచుకొనుచున్నాడని అందరు తెలిసికొనునట్లు వారు కోరారు [21:24].
విగ్రహాలకు అర్పితమైనవాటినీ రక్తాన్నీ గొంతుపిసికి చంపిన దానినీ తినకుండా జారులు కాకుండా ఉండాలని యాకోబు చెప్పాడు [21:25].
ధర్మశాస్త్రంకు వ్యతిరేకంగా బోధిస్తున్నాడని, గ్రీసు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకొనివచ్చి ఆ పవిత్ర స్థానాన్ని ఆశుద్దం చేసాడని నేరం మోపారు [21:28].
పౌలును పట్టుకొని దేవాలయంలోనుంచి బయటికి ఈడ్చుకుపోయారు [21:31].
యెరూషలేంలో అల్లరిగా ఉందని తెలిసినప్పుడు పటాలం అధికారి పౌలుని పట్టుకొని రెండు సంకెళ్ళతో బంధించి, అతను ఎవరు, ఏమిచేసాడు అని అడిగాడు [21:33].
"వాణ్ణి చంపెయ్యండి" అని సమూహం అరిచారు [21:36].
ప్రజలతో మాట్లాడడానికి తనకు అనుమతి ఇవ్వమని పౌలు కోరాడు [21:39].
యెరూషలెంలో పౌలు ప్రజలతో హెబ్రీ భాషలో మాట్లాడాడు [21:40].
పౌలు హెబ్రీ భాషలో మాట్లాడడం ప్రజలు వినినప్పుడు వారు మౌనం వహించారు [22:2].
పౌలు యెరూషలెంలో చదువుకున్నాడు, గమలీయేల్ అతని ఉపాధ్యాయుడు [22:3].
మార్గాన్ని అనుసరించేవారిని మరణమయ్యేవరకు హింసిస్తూ, వారిని చెరసాలలో వేయిస్తూ వచ్చాడు [22:4].
"సౌలా, సౌలా, నీవు నన్ను ఎందుకు హింసిస్తూ ఉన్నావు?" అని ఆకాశంనుండి వచ్చిన స్వరం పౌలుతో చెప్పింది [22:7].
పౌలు నజరేయుడైన యేసును హింసిస్తూ ఉన్నాడు [22:8].
దమస్కుకు చేరినపుడు ఆ కాంతి తేజస్సు కారణంగా పౌలు ఏమీ చూడలేకపోయాడు [22:11].
భక్తిపరుడైన అననియ అను పేరుగల వ్యక్తి పౌలు వద్ద నిలిచి "సోదరుడా సౌలూ, దృస్టి పొందు" అని చెప్పాడు [22:12-13].
లేచి తన పాపాలు కడిగివేసుకునేందుకు బాప్తిసం పొందమని అననియ పౌలుకు చెప్పాడు [22:16].
యూదులు పౌలు సాక్ష్యమును అంగీకరింపరు అని చెప్పాడు [22:18].
అన్యజనులవద్దకు వద్దకు యేసు పౌలును పంపాడు [22:21].
ప్రజలు అరుస్తూ తమ పైబట్టలు తీసిపారవేస్తూ ఆకాశం వైపు దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు [22:23].
పౌలు పుట్టుకతోనే రోమ్ పౌరుడు అయ్యాడు [22:28].
పైఅధికారి అతని సంకెళ్ళు తీసివేసి ప్రముఖయాజులూ యూదా సమాలోచన సభావారూ అంతా సమావేశం కావాలని ఆజ్ఞ జారీ చేసాడు [22:30].
దేవుని ఎదుట మంచి మనస్సాక్షిగలవాడై ఉన్నానని చెప్పిన కారణంగా ప్రధాన యాజకుడు కోపగించి అలా ఆజ్ఞాపించాడు [23:1-2].
చనిపోయినవారు తిరిగిలేస్తారనే ఆశాభావం గురించి తాను విచారణకు గురి అయ్యాడని పౌలు చెప్పాడు [23:3-6].
పరిసయ్యులు పునరుద్ధానం ఉందని చెపుతారు, సద్దూకయ్యులు పునరుద్దానం లేదని చెపుతారు, ఈ కారణంగా వారిమధ్య అలజడి రేగింది [23:7-8].
సభలోని సభ్యులు పౌలును చీల్చివేస్తారేమో అని పై అధికారి భయపడ్డాడు [23:10].
ధైర్యంగా ఉండాలని, యెరూషలేంలోను, రోమ్ లోను పౌలు సాక్షిగా ఉండాలని దేవుడు చెప్పాడు [23:11].
సుమారు నలభై మంది యూదులు తాము పౌలును చంపేవరకు అన్నపానాలు తీసుకోబోమని ఒట్టుపెట్టుకున్నారు [23:12-13].
పౌలు ఆ సభవరకు రాకముందే తాము అతణ్ణి చంపగలుగునట్లు పౌలుని విచారణ సభకు తీసుకురావాలని ప్రధాన యాజకులు, పెద్దలను అడిగారు [23:14-15].
పౌలు మేనల్లుడు ఈ ప్రణాలికను గురించి విని దానిని పైఅధికారికి చెప్పాడు [23:16-21].
పౌలును రాత్రి తొమ్మిది గంటలకు అధిపతియైన ఫేలిక్సు వద్దకు పౌలును సురక్షితంగా తీసుకొని వెళ్ళడానికి పెద్ద సైన్యాన్ని సిద్ధపరచమని ఆజ్ఞాపించాడు [23:23-24].
పౌలు మరణశిక్షకు గాని చెరసాలకు గాని పాత్రుడు కాదు, అయితే తమ ధర్మశాస్త్ర వివాదాలను గురించి చేసిన నేరారోపణలే [23:29].
అధిపతియైన ఫెలిక్స్ పౌలు విషయాన్ని తనమీద నేరం మోపేవారు కూడా వచ్చినపుడు విచారణ చేస్తానని చెప్పాడు [23:35].
పౌలును తన విచారణ వరకు హేరోదు భవనంలో ఉంచారు [23:35].
యూదులందరినీ కలహానికి రేపేవాడు, దేవాలయాన్ని అపవిత్రం చేయడానికి పూనుకున్నాడని న్యాయవాది తెర్తుల్లు పౌలుకు వ్యతిరేకంగా నేరాలు మోపాడు [24:5-6].
పౌలు నజరేయుల మత శాఖకు నాయకుడు అని న్యాయవాది తెర్తుల్లు చెప్పాడు [24:5].
తాను ఎవరితోనూ వాదించ లేదు, ప్రజల మధ్య అల్లరి రేపలేదని పౌలు చెప్పాడు [24:12].
ధర్మశాస్త్రంలో ఉన్నదానంతటి విషయంలో నమ్మకంగా ఉన్నాడని పౌలు చెప్పాడు [24:14].
చనిపోయిన న్యాయవంతులేమి, దుర్మార్గులేమి లేస్తారని వారికి ఆశాభావం ఉందని పౌలు చెప్పాడు [24:15].
తన స్వప్రజలకు దానధర్మాలు ఇవ్వడానికి కానుకలు అర్పించడానికి వచ్చానని చెప్పాడు [24:17].
తాను శుద్ధిచేసుకొని దేవాలయంలో ఉంటె వారు తనను చూసారని పౌలు చెప్పాడు [24:18].
మార్గం విషయం అధిపతియైన ఫేలిక్సు కు బాగా తెలుసు [24:22].
పై అధికారియైన లూసియస్ వచ్చిన తరువాత పౌలు సంగతిని నిర్ణయిస్తానని ఫేలిక్సు చెప్పాడు [24:22].
పౌలు క్రీస్తు యేసు మీద నమ్మకాన్ని గురించి చెప్పాడు, న్యాయం, ఆశానిగ్రహం, రానున్న తీర్పును గురించి చెప్పాడు [24:24-25].
ఫేలిక్సు భయకంపితుడయ్యాడు, తన వద్దనుండి పౌలును పంపించి వేశాడు [24:25].
యూదులచేత మంచివాడనిపించుకోవాలనే ఉద్దేశంతో ఫేలిక్సు పౌలును ఖైదీగానే ఉంచి వెళ్ళిపోయాడు [24:27].
పౌలును దారిలో చంపడానికి అతనిని యెరూషలేముకు పిలిపించమని అడిగారు [25:3].
ఫేస్తు వారిని తాను వెళుతున్నసీజరియకు తనతో పాటు రమ్మని చెప్పాడు, అక్కడ వారు పౌలు మీద నేరారోపణ చెయ్యవచ్చు అని వారితో చెప్పాడు [25:5].
పౌలు యెరూషలేముకు వెళ్లి విచారించబడడం తనకు ఇష్టమేనా అని అడిగాడు [25:9].
యూదులచేత మంచివాడనిపించుకోవడం కొరకు ఫేస్తు ఈ ప్రశ్న పౌలును అడిగాడు [25:9].
తాను యూదులకి అన్యాయమేమియూ చేయలేదని, సీజరు ఎదుట తాను చెప్పుకుంటానని పౌలు చెప్పాడు [25:10-11].
పౌలు సీజరు పేరు చెప్పినందుకు సీజరు దగ్గరకే పంపడానికి నిర్ణయించాడు [25:12].
నిందితుడైన వ్యక్తి తనమీద మోపిన వారికి ముఖాముఖిగా నిలబడి తనమీద మోపిన నేరాన్ని గురించి సంజాయిషీ చెప్పుకోడానికి అవకాశం రోమనులు ఇస్తారని చెప్పాడు [25:16].
తమ మతం గురించి, చనిపోయిన యేసు అనే వ్యక్తిని గురించి మాత్రమే అతనితో వివాదాలు ఉన్నట్టు చెప్పాడు, అయితే ఆ యేసు బతికి ఉన్నాడని పౌలు చెపుతున్నట్టు చెప్పాడు [25:19].
పౌలు విచారణను చక్రవర్తి వద్దకు తీసుకొని వెళ్ళడానికేదైనా రాయడానికి రాజైన అగ్రిప్ప వద్దకు తీసుకొని వచ్చాడు [25:26].
ఖైదీ మీద మోపిన నేరాలేవో సూచించక పౌలును అలాగే చక్రవర్తి వద్దకు పంపడం సరి అయిన పని కాదని ఫేస్తు చెప్పాడు [25:27].
అగ్రిప్పకు యూదుల సంబంధమైన ఆచారాలు, వివాదాలు బాగా తెలుసు కాబట్టి అగ్రిప్ప రాజు ఎదుట తన సంగతిని చెప్పుకోగల్గుతున్నందుకు పౌలు సంతోషంగా ఉన్నాడు [26:3].
తన మతంలోని తెగలన్నిటిలో ఎక్కువ నిష్టానియమాలు ఉన్న తెగ ప్రకారం పరిసయ్యుడిగా జీవించాడని చెప్పాడు [26:5].
దేవుడు చనిపోయినవారిని సజీవంగా లేపుతాడనే వాగ్దానం గురించి తానును యూడులును ఎదురుచూచుచున్నారని పౌలు చెపుతున్నాడు [26:6-8].
చాలామంది పవిత్రులను చెరసాలలో వేయించాడు, చంపడానికి సమ్మతించాడు, విదేశీపట్టణాలకు వెళ్లి వారిని హింసిస్తూ వచ్చాడు [26:9-11].
సూర్యకాంతి కంటే దేదీప్యమానమైన వెలుగు ఆకాశం నుంచి ప్రకాశించడం చూసాడు [26:13].
జ:"సౌలా, సౌలా నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు?" అనే స్వరాన్ని పౌలు విన్నాడు [26:14].
దమస్కు మార్గంలో యేసు పౌలుతో మాట్లాడుతున్నారు [26:15].
ఒక సేవకునిగాను, అన్యజనులకు సాక్షి గాను యేసు పౌలును నియమించాడు [26:16-17].
అన్యజనులు పాపక్షమాపణను, దేవుని వద్దనుండి స్వాస్త్యమును పొందాలని కోరుతున్నాడని యేసు చెప్పాడు [26:18].
ప్రజలు పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగాలి, పశ్చాత్తాపాన్ని రుజువుపరచే క్రియలు చేయాలని బోధిస్తున్నట్టు పౌలు చెపుతున్నాడు [26:20].
క్రీస్తు బాధలు అనుభవించి చనిపోయి, మరణం నుండి లేవాలి, యూదా ప్రజలకు, అన్యజనులకు వెలుగు ప్రకటిస్తాడు అని మోషే, ప్రవక్తలు చెప్పారు [26:22-23].
పౌలు వెఱ్రివాడయ్యాడని ఫేస్తు పౌలు గురించి తలంచాడు [26:24-25].
రాజైన అగ్రిప్ప క్రైస్తవుడుగా మారాలని పౌలు కోరిక [26:28-29].
పౌలు మరణానికి గాని, ఖైదుకు గాని తగిన నేరం ఏదీ చేయలేదు, చక్రవర్తి ఎదుట చెప్పుకొంటాననకపోతే అతణ్ణి విడుదల చేసేవాళ్ళమే అని అనుకొన్నారు [26:31-32].
శతాధిపతియైన జూలియన్ పౌలును దయతో చూసాడు, స్నేహితుల వద్దకు వెళ్లి తన అక్కరలు తీర్చుకొనేలా పౌలును అనుమతించాడు [27:3].
క్రేతు ద్వీపం వద్ద ఓడ కష్టంతో ప్రయాణం చేసింది [27:7-8].
నావికుడూ, ఓడ యజమానీ చెప్పిన దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. కనుక శతాధిపతియైన జూలియన్ పౌలు హెచ్చరికలను అనుసరించ లేదు [27:10-11].
ప్రయాణంలో నెమ్మదైన ఆరంభం తరువాత పెనుగాలి ఓడ మీద కొట్టింది [27:14].
చాలా రోజుల తరువాత ఓడ సిబ్బంది తాము బతికి బయట పడతామనే ఆశ వదులుకున్నారు [27:20].
పౌలును, తనతో పాటు ఓడలో ప్రయాణం చేస్తున్నవారు బ్రతుకుతారు, ఓడను కోల్పోతారు అని దేవదూత పౌలుతో చెప్పాడు [27:22-24].
ఓడ ఏదో దేశాన్ని సమీపిస్తున్నట్టు నావికులు భావించారు [27:27].
ఓడను వదిలి పెట్టాలని నావికులు చూస్తున్నారు [27:30].
వారు ఓడలో ఉంటేనే తప్ప వారు తప్పించుకోలేరని శతాధిపతికి, ఇతర సైనికులకు పౌలు చెప్పాడు [27:31].
ప్రతి ఒక్కరూ భోజనం చేయాలని పౌలు బతిమిలాడాడు [27:33].
నావికులు ఓడను ఒడ్డుకు చేర్చాలని నిశ్చయించుకొన్నారు, ఓడను ఒడ్డుకు నడిపారు, అయితే ఓడ ముందు భాగం మట్టిలో కూరుకుపోయింది, ఓడ వెనుక భాగం బ్రద్ధలైపోతూ వచ్చింది [27:39-41].
ఖైదీలలో ఎవడూ ఈదుకొని తప్పించుకోకుండా వారిని చంపాలని సైనికులు తలంచారు [27:42].
పౌలును రక్షించాలనే ఉద్దేశంతో సైనికుల ప్రణాళికను శతాధిపతి ఆపివేసాడు [27:43].
ఈత వచ్చినవారందరూ మొదట సముద్రములో దూకారు, మిగిలిన వారు పలకల మీద, ఓడ చెక్కల మీద ఎక్కారు [27:44].
ద్వీపవాసులు వారి పట్ల చూపిన దయ ఇంతింత కాదు [28:2].
పౌలు తప్పక హంతకుడై ఉండాలి, సముద్రం నుంచి తప్పించుకొన్నా ధర్మదేవత అతణ్ణి బతకనివ్వడం లేదు, అని తలంచారు [28:4].
పౌలు దేవుడని వారు తలంచారు [28:6].
ద్వీపంలో ఉన్న తక్కిన రోగులు కూడా వచ్చి బాగయ్యారు [28:8-9].
పౌలును, నావికులు ను మెలితే ద్వీపంలో మూడు నెలలు ఉన్నారు [28:11].
రోమ్ నుండి వచ్చిన సోదరులను చూచినపుడు పౌలు దేవునికి కృతజ్ఞత చెప్పాడు, ధైర్యం తెచ్చుకున్నాడు [28:15].
పౌలుకు తనను కావలి కాస్తున్న సైనికుడితో పాటు ప్రత్యేకంగా ఉండడానికి సెలవు దొరికింది [28:16].
ఇస్రాయెల్ ప్రజల ఆశాభావాన్ని బట్టి తాను సంకెళ్ళ పాలయ్యాడని రోమాలోని యూదా నాయకులకు పౌలు చెప్పాడు [28:20].
ఈ మతశాఖను గురించి అందరూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని రోమ్ లోని యూదా నాయకులకు తెలుసు [28:22].
మోషే ధర్మశాస్త్రం నుంచి ప్రవక్తల వ్రాతలలో నుంచి యేసును గురించి వారిని ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు [28:23].
కొందరు యూదా నాయకులు పౌలు చెప్పిన దానిని నమ్మారు, కొందరు నమ్మలేదు [28:24].
ఎప్పుడూ వింటూనే ఉంటారు గాని అర్ధం చేసుకోరు, ఎప్పుడూ చూస్తూనే ఉంటారు గాని గ్రహించరు అనే లేఖనాన్ని పౌలు ప్రస్తావించాడు [28:25-27].
దేవుడు ప్రసాదించిన రక్షణ అన్యజనులకు పంపడం జరిగింది, వారు దానిని వింటారు అని పౌలు చెప్పాడు [28:28].
పౌలు దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ, యేసే క్రీస్తుని గురించి ధైర్యంగా బోధించాడు.
అతనిని ఎవ్వరూ ఆపలేదు [28:31].
దేవుడు ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసాడు(1:1-2).
శరీరమును బట్టి దేవుని కుమారుడు దావీదు సంతానముగా పుట్టాడు. (1:3)
యేసు క్రీస్తు మృతులలో నుండి పునరుత్థానుడైనందున దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు(1:4)
సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా పౌలు కృపను, అపోస్తలత్వం పొందాడు. (1:5)
వారి విశ్వాసము సర్వ లోకమునకు ప్రచురము చేయబడింది గనుక పౌలు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు (1:8).
వారు స్థిరపరచ బడేలా వారికి ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా ఇవ్వడానికి పౌలు చూడగోరాడు. (1:11)
ఇది వరకు ఆటంకం కలిగిన కారణంగా రోమాలోని విశ్వాసులను పౌలు దర్శించలేక పోయాడు(1:13)
నమ్ము ప్రతివానికి సువార్త దేవుని శక్తియై యున్నది అని పౌలు చెపుతున్నాడు.(1:16)
"నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు" అనే లేఖనాన్ని పౌలు ప్రస్తావిస్తున్నాడు (1:17)
దేవుని గూర్చి తెలియశక్యమైనది విశదపరచ బడినపుడు భక్తి హీనులు, అనీతిమంతులు దానిని దుర్నీతి చేత అడ్డగిస్తారు. (1:18-19)
దేవుని అదృశ్య లక్షణములు సృష్టింపబడిన వస్తువుల ద్వారా తేటపడుతున్నాయి. (1:20)
ఆయన నిత్యశక్తి, దేవత్వము తేటపడుతున్నాయి. (1:20)
దేవుని మహిమ పరచక, ఆయనకు కృతజ్ఞత చెల్లించని వారు తమ ఆలోచనలలో వ్యర్థులయ్యారు, వారి హృదయాలు అంధకారమయ్యాయి. (1:21)
వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. (1:23-24)
స్త్రీలు ఒకరి యెడల ఒకరు కామతప్తులయ్యారు, పురుషులు ఒకరి యెడల ఒకరు కామతప్తులయ్యారు. (1:26-27)
తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లని వారిని చేయ రాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ఠ మనస్సుకు వారిని అప్పగించాడు. (1:28)
భ్రష్ఠ మనస్సు కలిగిన వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరముతో నిండి యుంటారు. (1:29)
భ్రష్ఠ మనస్సు కలిగి ఇట్టి కార్యములు చేయువారు తాము మరణమునకు తగినవారు అని అర్ధం చేసుకున్నారు. (1:32)
ఎరిగి యుండి కూడా అవినీతి కార్యాలే చేయుచున్నారు, వాటిని అభ్యసించు వారితో సమ్మతించుచున్నారు (1:32)
దేని విషయములో ఇతరులకు తీర్పు తీర్చుచున్నారో అట్టి కార్యములనే వారు చేయుచున్నారు గనుక వారు తీర్పు తీర్చునప్పుడు సాకు చెప్పలేని స్థితిలో ఉన్నారు(2:1)
దుర్నీతిని చేయువారిని దేవుడు సత్యమును అనుసరించి తీర్పు తీరుస్తాడు(2:2)
దేవుని సహనము, అనుగ్రహము మారుమనస్సు పొందుటకు ఒక వ్యక్తిని ప్రేరేపిస్తుంది. (2:4)
దేవుని విషయమై కఠినులైన, మార్పు పొందని వారు దేవుని న్యాయమైన తీర్పు బయలుపడే దినమందు దేవుని ఉగ్రతను సమకూర్చుకొంటున్నారు. (2:5)
సత్క్రియలు ఓపికగా చేయు వారు నిత్య జీవమును పొందుతారు. (2:7)
దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రత, రౌద్రము వస్తాయి, వారికి శ్రమ, వేదన కలుగుతాయి. (2:8-9)
యూదునికి గ్రీసు జాతి వాడికి దేవుని తీర్పు విషయంలో ఏ పక్షపాతం చూపడు. పాపం చేస్తే ఇద్దరూ నశిస్తారు (2:12).
ధర్మ శాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే దేవుని ఎదుట నీతిమంతులుగా ఎంచ బడుదురు. (2:13)
ధర్మశాస్త్ర సంబంధ క్రియలు చేసిన యెడల అన్యుడు ధర్మశాస్త్రంతన హృదయములో రాయబడినట్టు చూపించ గలడు (2:14-15)
ధర్మ శాస్త్రమును ఆశ్రయించి దానిని ఇతరులకు బోధించు యూదులు తమకు తాము బోధించుకోవాలని పౌలు సవాలు చేస్తున్నాడు. (2:17-21)
దొంగతనము, వ్యభిచారం, గుళ్ళను దోచుకోవడం లాంటి పాపాలను విడిచి పెట్టాలని పౌలు చెపుతున్నాడు. (2:21-22)
యూదా ఉపదేశకులు ధర్మ శాస్త్రమును మీరుట వలన దేవుని నామము అన్యజనుల మధ్య అవమానపరచ బడుతుంది (2:23-24)
ఒక యూదుడు ధర్మ శాస్త్రమును అతిక్రమించిన వాడైతే అతని సున్నతి అతనికి సున్నతి కాక పోవును. (2:25)
సున్నతి లేనివాడు ధర్మ శాస్త్రపు నీతి విధులు గైకొనిన యెడల అతడు సున్నతి లేనివాడై యుండియు సున్నతి గలవాడుగా ఎంచ బడును. (2:26)
హృదయ సంబంధమైన సున్నతి కలిగి అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు అని పౌలు చెపుతున్నాడు. (2:28-29)
నిజమైన యూదుడు దేవుని వలననే మెప్పు పొందును. (2:29)
యూదులకు కలిగిన గొప్పతనములలో మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడడమే. (3:1-2)
ప్రతి మనుష్యుడు అబద్దికుడు అయినప్పటికిని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. (3:4)
దేవుడు నీతిమంతుడు కనుక ఆయన లోకమునకు తీర్పు తీర్చ గలడు. (3:5-6)
"మేలు కలుగుటకు మనము కీడు చేయుదము" అని చెప్పువారి మీదకు తీర్పు వచ్చును (3:8)
నీతి మంతుడు లేదు, ఒక్కడును లేడు అని రాసి ఉంది. (3:9-10)
రాసి ఉన్న దాని ప్రకారం గ్రహించు వాడు లేడు, దేవుని వెదకు వాడు లేడు. (3:11)
ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ మనుష్యుడును నీతిమంతుడుగా తీర్చ బడడు.(3:20)
ధర్మశాస్త్రంమూలముగా పాపమనగా ఎట్టిదో తెలియు చున్నది. (3:20)
ధర్మశాస్త్రమును, ప్రవక్తల సాక్ష్యము చేత ఇపుడు దేవుని నీతి బయలు పడుచున్నది. (3:21)
ధర్మశాస్త్రంలేకయే యేసు క్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికి దేవుని నీతి బయలు పడు చున్నది. (3:22)
నమ్మువారు ఆయన కృప చేతనే, క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చ బడుతున్నాడు. (3:24)
క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా అనుగ్రహించాడు (3:25)
యేసునందు విశ్వాసము గలవానిని నీతి మంతునిగా తీర్చువాడునై యుండుటకు అయన అలా చేశాడు. (3:26)
ఒక వ్యక్తి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము ద్వారా నీతిమంతునిగా తీర్చబడుచున్నాడు. (3:28)
ఇద్దరినీ దేవుడు విశ్వాసము ద్వారా దేవుడు నీతిమంతులనుగా తీర్చుచున్నాడు (3:30)
విశ్వాసము ద్వారా మనము ధర్మశాస్త్రమును స్థిర పరచుచున్నాము. (3:31)
అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చ బడిన యెడల అతనికి అతిశయ కారణము కలుగును. (4:2)
అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచ బడెను అని లేఖనము చెప్పుచున్నది. (4:3)
భక్తి హీనులను దేవుడు నీతిమంతులుగా చేస్తాడు. (4:5)
దావీదు చెప్పిన ప్రకారం, తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడు, తనపాపంలకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ప్రభువు చేత దీవించ బడినవాడు. (4:6-8)
అబ్రాహాము విశ్వాసము అతను సున్నతి పొందడానికి ముందే నీతిగా ఎంచబడినది. (4:9-10)
సున్నతి పొందిన వారైనను, సున్నతి పొందని వారైనను విశ్వసించు ప్రతివారికీ అబ్రాహాము తండ్రి గా ఉన్నాడు. (4:11-12)
విశ్వాసము వలనైన నీతి ద్వారా లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రాహాము సంతానమునకు ఇవ్వబడినది. (4:13)
లోకమునకు వారసుడగునను వాగ్దానము ధర్మ శాస్త్రంవలన కలిగినదైతే విశ్వాసము వ్యర్ధమగును, వాగ్దానమును నిరర్ధకమగును. (4:14)
కృప చేత, దృఢం కావలెనని వాగ్దానము విశ్వాస మూలముగా ఇవ్వబడింది. (4:16)
దేవుడు మృతులను సజీవులనుగా చేస్తాడు, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుస్తాడు. (4:17)
దేవుడు అబ్రహముకు వాగ్దానము చేసినపుడు అబ్రాహాము రమారమి నూరేండ్ల ప్రాయము గలవాడు, శారా గర్భము మృతతుల్యమైనదిగా ఉంది. (4:18-20)
అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని విశ్వసించాడు. (4:18,20)
అబ్రాహాము వృత్తాంతము అతని నిమిత్తమును, మన నిమిత్తమును రాయబడింది. (4:23-24)
దేవుడు మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపెనని, ఆయన మన అపరాధంల నిమిత్తము అప్పగించబడ్డాడని, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెనని నమ్ముతున్నాము. (4:25)
విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చ బడినకారణంగా విశ్వాసులు మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి యున్నారు. (5:1)
శ్రమ సహనమును, అనుభవాన్ని, ఆశాభావాన్ని కలిగిస్తుంది. (5:3-4)
దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు, మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మనకొరకు చనిపోయాడు. (5:8)
క్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చ బడిన విశ్వాసులు దేవుని ఉగ్రత నుండి రక్షించ బడ్డారు. (5:9)
యేసు ద్వారా అవిశ్వాసులైన వారు దేవుని తో సమాధాన పరచ బడక మునుపు శత్రువులు గా ఉన్నారు. (5:10)
ఒక మనుష్యుని ద్వారాపాపంను,పాపం ద్వారా మరణమును లోకములో ప్రవేశించెను, మరణంఅందరికీ వాటిల్లింది. (5:12)
ఆదాము అను మనుష్యుని ద్వారాపాపం లోకములోనికి ప్రవేశించినది. (5:14)
ఆదాము అపరాధం వలన అనేకులు చనిపోయారు, అయితే దేవుని కృపావరం అనేకులకు విస్తరించింది. (5:15)
ఆదాము అపరాధం నుండి శిక్షా విధి కలిగినది, దేవుని కృపావరం మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణ మాయెను. (5:16)
ఆదాము అపరాధం నుండి మరణంఏలినది, దేవుని కృపావరం పొండువారు జీవము గలవారై యేసు క్రీస్తు ద్వారా ఏలుదురు. (5:17)
ఆదాము అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏమి చేయబడ్డారు, క్రీస్తు విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయ బడ్డారు. (5:19)
అపరాధం విస్తా రించు నట్లుగా ధర్మ శాస్త్రంప్రవేశించింది. (5:20)
దేవుని కృప అపరాధం కంటే ఎక్కువగా విస్తరించింది. (5:20)
అలా ఎప్పటికి జరగకూడదు. (6:1-2)
క్రీస్తు యేసు లోనికి బాప్తిసం పొందిన వారు ఆయన మరణంలోకి బాప్తిస్మము పొందారు. (6:3)
విశ్వాసులు నూతన జీవము గలవారై నడుచుకోవాలి. (6:4)
బాప్తిస్మము ద్వారా అయన మరణము, పునరుద్ధానము లలో విశ్వాసులు క్రీస్తుతో ఐక్య పరచ బడ్డారు. (6:5)
మనమిక మీదట పాపానికిదాసులము కాకుండు నట్లు మన ప్రాచీన పురుషుడు క్రీస్తు తో సిలువ వేయబడ్డాడు, (6:6)
క్రీస్తు మరణంలోనుండి లేచినకారణంగా మరణం ఆయన మీద ప్రభుత్వము చేయదు. (6:9)
క్రీస్తుపాపం విషయమై ఒక్క సారే అందరికొరకు చనిపోయాడు. (6:10)
పాపం విషయములో ఒక విశ్వాసి మృతునిగా ఎంచు కోవాలి. తన గురించి ఏ విధంగా ఎంచు కోవాలి (6:10-11)
ఒక విశ్వాసి దేవుని కొరకు జీవించాలి. (6:10-11)
ఒక విశ్వాసి తన అవయవములను దేవునికి నీతి కొరకు సాధనములుగా సమర్పించు కోవాలి. (6:13)
పాపంమీద ఏలునట్లు ఒక విశ్వాసి కృపకు లోనైనా వాడిగా ఉంటాడు. (614)
పాపానికితనను తాను దాసునిగా చేసుకున్న వ్యక్తి యొక్క అంతిమ ఫలితం మరణం. (6:16,21)
దేవునికి తనను తాను దాసునిగా చేసుకున్న వ్యక్తి యొక్క అంతిమ ఫలితం నీతి. (6:16,18-19)
దేవుని దాసులైనవారి ఫలము పరిశుద్ధత కొరకే. 6:22)
పాపం కు వచ్చు జీతము మరణము. (6:23)
దేవుని కృపావరం నిత్య జీవము. (6:23)
ఒక మనుష్యుడు బ్రతికినంత కాలము అతని మీద ప్రభుత్వము చేస్తుంది. (7:1)
ధర్మశాస్త్రం వలన వివాహమైన స్త్రీ భర్త బ్రతికినంతకాలము అతనికే బద్ధురాలై ఉంటుంది. (7:2)
ధర్మ శాస్త్రం నుండి ఒకసారి విడుదల పొందిన తరువాత ఆ స్త్రీ వేరొక పురుషుని వివాహం చేసికొన వచ్చును. ఏమి చెయ్య వచ్చును. (7:3)
క్రీస్తు శరీరము ద్వారా విశ్వాసులు ధర్మ శాస్త్రమునకు మృతులయ్యారు. (7:4)
ధర్మ శాస్త్రమునకు మృతులయిన విశ్వాసులు క్రీస్తును చేర గలిగారు. (7:4)
ధర్మ శాస్త్రంపాపమును తెలియ పరచుచున్నది. (7:7)
ఆజ్ఞను హేతువు చేసుకొనిపాపం సకలవిధములైన దురాశలను పుట్టిస్తుంది. (7:8)
ధర్మ శాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధ మైనది,నీతి గలది, ఉత్తమమైనదియునై ఉన్నది. (7:7,12)
పాపం ధర్మ శాస్త్రంద్వారా అతనికి మరకరమైనదని పౌలు చెపుతున్నాడు. (7:13)
పౌలు తాను ఇచ్చయింపని తాను చేసిన యెడల ధర్మశాస్త్రం శ్రేస్టమైనదని ఒప్పుకొనుచున్నాడు. (7:16)
పౌలు చేయుచున్న, చేయ గోరని పనులను తనలో నివసించు చున్న పాపమే చేయుచున్నాది. (7:17,20)
తన శరీరమందు మంచిది ఏదీ నివసించదు. (7:18)
మేలు చేయగోరు తనకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము పౌలుకి కనబడు చున్నది. (7:21-23)
అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మ సాస్త్రమునండు పౌలు ఆనందించుచున్నాడు, అయితే తన అవయములలో నున్న పాపనియమము పౌలును చెరపట్టి లోబరచు కొనుచున్నది. (7:23,25)
పౌలు యేసు క్రీస్తు ద్వారా దేవునికి అయన విడుదల కొరకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాడు. (7:25)
క్రీస్తు యేసునందు జీవము నిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణ నియమము నుండి పౌలును విడిపించినది. (8:2)
ధర్మ శాస్త్రంశరీరము ద్వారా బలహీనమైనది కనుక చేయ్య లేక పోయింది. (8:3)
ఆత్మాను సారులైన మనుష్యులు ఆత్మ సంబంధమైన వాటి మీద తమ మనసు నుంచుతారు(8:4-5)
శరీరానుసారమైన మనసుకు దేవునికి విరోధమై యున్నది, అది ధర్మ శాస్త్రమునకు లోబడదు. (8:7)
క్రీస్తు ఆత్మ దేవునికి చెందని వారిలో నివసించడు. (8:9)
చావునకు లోనైన విశ్వాసుల శరీరములలో దేవుడు తన ఆత్మ ద్వారా జీవాన్ని ఇస్తాడు, ఆ ఆత్మ విశ్వాసిలో నివసిస్తాడు. (8:11)
దేవుని కుమారులు దేవుని ఆత్మ చేత నడిపించ బడతారు. (8:13-14)
దత్తత ద్వారా ఒక విశ్వాసి దేవుని ఇంటిలో ఎలా కలుపబడతాడు. (8:15).
దేవుని కుమారులుగా దేవుని ఇంటిలో విశ్వాసులు దేవుని వారసులుగా ఉంటారు, క్రీస్తు తోడి వారసులుగా ఉంటారు. (8:17)
దేవుని కుమారులు ప్రత్యక్ష్య పరచ బదడినపుడు క్రీస్తు తో మహిమ పరచ బడుటకై ప్రస్తుత కాల ఈ శ్రమలను సహించాలి. (8:17-19)
ప్రస్తుత కాలమందు సృష్టి వ్యర్ధ పరచబడు దాస్యములో ఉన్నది. (8:21)
దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము లోనికి విడిపించబడబోతుంది. (8:21)
దేహముల విమోచనము కొరకు విశ్వాసులు నిరీక్షణ తోను ఒపికతోను కనిపెట్టాలి. (8:23-25)
పరిశుద్దుల బలహీనతలో సహాయం చెయ్యాడానికి ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేస్తాడు. (8:26-27)
దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగేలా దేవుడు పనిచేస్తాడు. (8:28)
దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. (8:29)
దేవుడు ముందుగా ఎవరిని నిర్ణయించెనొ వారిని పిలిచాడు, నీతిమంతులుగా చేసాడు, మహిమ పరచాడు. (8:30)
మన అందరి కొరకు దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించాడు కనుక దేవుడు వీటన్నిటిని ఉచితంగా ఇచ్చాడని విశ్వాసులు తెలుసుకుంటారు. (8:32)
దేవుని కుడిపార్స్వమున క్రీస్తు యేసు మన కొరకు విజ్ఞాపనము చేయు చున్నాడు. (8:34)
విశ్వాసులు తమను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయాన్ని పొందుతున్నారు. (8:35-37)
సృష్టింప బడిన ఏదైనను విశ్వాసిని దేవుని ప్రేమ నుండి వేరు పరచ లేదని పౌలు రూడిగా ఒప్పించా బడ్డాడు, నమ్మాడు. (8:39)
దేహసంబందులైన అతని సహోదరులు, ఇశ్రాయేలీయుల కొరకు పౌలు బహు దుఃఖము, మానని వేదన కలిగి యున్నాడు. (9:1-4)
దత్త పుత్రత్వమును, మహిమయు, నిబందనలును, ధర్మ శాస్త్ర ప్రధానమును, అర్చనాచారాలును, వాగ్దానములును వీరివి. (9:4)
ఇశ్రాయేలు సంబందులందరూ ఇశ్రాయేలీయులు కారు, అబ్రాహాము సంతానమైనంత మాత్రము చేత అందరును పిల్లలు కారు అని పౌలు చెపుతున్నాడు. (9:6-7)
శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు. (9:8)
వాగ్దాన సంబంధులైన పిల్లలు దేవుని సంతానమని ఎంచబడుచున్నారు. (9:8)
రిబ్కా కు ఇవ్వబడిన మాట వెనుక ఉన్న కారణం ఏమిటి ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము. (9:10-12)
దేవుని వరాలైన జాలి, కరుణల వెనుక కారణం దేవుని సంకల్పం. (9:14-16)
దేవుని వరాలైన జాలి, కరుణల వెనుక ఉన్నకారణం పొంద గోరువానిలోనైనను, ప్రయాసపడు వానిలోనైనను కాదు(9:16)
"ఓ మనుష్యుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవేవడవు ?" అని జవాబిచ్చాడు. (9:20)
నాశనమునకు సిద్ధపడిన వాటి విషయం దేవుడు దీర్ఘ శాంతముతో సహించాడు. (9:22)
దేవుడు వారికి తన మహిమైస్వర్యమును కనుపరచాడు. (9:23)
దేవుడు యూదులలో నుండియూ, అన్య జనులలో నుండియూ తాను కరుణించిన వారిని పిలిచాడు. (9:24)
ఇశ్రాయేలీయులందరిలోనుండి శేషమే రక్షించ బడుదురు. (9:27)
నీతిని వెంటాడని అన్య జనులు దానిని విశ్వాసము వలనైన నీతిని పొందారు. (9:30)
నీతి కారణమైన నియమమును విశ్వాస మూలముగా కాకుండా క్రియల మూలముగా వెంటాడిన కారణము చేత ఇశ్రాయేలీయులు దానిని పొందలేదు. (9:31-32)
ఇశ్రాయేలీయులు అడ్డురాయిని , తొట్రుపాటు బండను తగిలి పడిరి. (9:32-33)
తొట్రు పడకయు విశ్వసించు వారు సిగ్గుపడరు. (9:33)
ఇశ్రాయేలీయుల కొరకు పౌలు కున్న హృదయాభిలాష వారి రక్షణ. (10:1)
ఇశ్రాయేలీయులు తమ స్వనీతిని స్థాపించాలని చూచుచున్నారు. (10:3)
ఇశ్రాయేలీయులు దేవుని నీతిని ఎరుగరు (10:3)
క్రీస్తు ధర్మశాస్త్రమునాకు సమాప్తియై యున్నాడు(10:4)
పౌలు ప్రకటించు చున్న విశ్వాస వాక్యము నోటను, హృదయములోను ఉన్నది. (10:8)
ఒక వ్యక్తి యేసు ప్రభువును తన నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలోనుండి ఆయనను లేపేనని హృదయములో విశ్వసించాలి. (10:9)
ప్రభువు నామమును బట్టి ప్రార్ధన చేయు వాడెవడో వాడు రక్షించ బడును. (10:13)
ఒక వ్యక్తి ప్రభువు నామము బట్టి ప్రార్ధన చేయునట్లు మొదట ప్రకటించు వారు పంపబడాలి, సువార్త వినిపించ బడాలి, విశ్వసించ బడాలి. (10:14-15)
విశ్వాసము కలుగునట్లు క్రీస్తును గురించిన మాట వినబడాలి. (10:17)
అవును ఇశ్రాయేలీయులు సువార్తను విన్నారు, దానిని తెలుసుకున్నారు. (10:18-19)
తనను వెదకని వారికి ఆయన దొరకడం ద్వారా ఇశ్రాయేలీయులకు రోషమును కలుగ చేస్తానని దేవుడు చెప్పాడు. (10:19-20)
దేవుడు ఇస్రాయేలీయులను సమీపించినపుడు ఆయన అవిధేయులై ఎదురాడు ప్రజలను కనుగొన్నాడు. (10:21)
దేవుడు తన ప్రజలను ఎప్పటికీ విసర్జించక పోవచ్చును. (11:1)
అలాగుననే అప్పటికాలమందు సయితము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలియున్నది అని పౌలు చెపుతున్నాడు. (11:5)
ఇశ్రాయేలీయులలో ఎంపిక చేయబడిన వారు రక్షణను పొందారు, మిగిలిన వారు కఠినచిత్తులైరి. (11:7)
నిద్ర మత్తు గల మనసు దానిని పొందిన వారు చూడలేకుండను, వినలేకుండను చేసింది. (11:8,10)
రక్షణ అన్య జనుల వద్దకు వచ్చింది. (11:11-12)
వేరు ఇశ్రాయేలు, అడవి ఒలీవ కొమ్మలు అన్యజనులు. (11:3-14,17)
అడవి ఒలీవ కొమ్మలు విరిచి వేయబడిన కొమ్మల మీద అతిశయ పడే వైఖరిని విడిచిపెట్టాలని పౌలు చెపుతున్నాడు. (11:18-20)
దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచి పెట్టని యెడల అవిశ్వాసము లోనికి పడిన యెడల అడవి ఒలీవ కొమ్మలనూ విదడిచిపెట్టడని పౌలు హెచ్చరించుచున్నాడు. (11:20-22)
స్వాభావిక కొమ్మలు తమ అవిశ్వాసము లో నిలువక పోయిన యెడల దేవుడు వాటిని ఒలీవ చెట్టుకు అంటు కడతాడు. (11:23-24)
ఇశ్రాయేలుకు ఉండే కఠిన మనసు అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఉంటుంది. (11:25)
వారి పితరులను బట్టి, దేవుడు తన పిలుపు విషయములో మార్పు లేనివాడు గనుక ఇశ్రాయేలీయులు దేవుని చేత ప్రేమించ బడుతూనే ఉన్నారు. (11:28-29)
యూదులు, అన్యజనులు అవిదేయులుగా కనబడు తున్నారు. (11:30-32)
అవిదేయులైన యూదులు, అన్యజనులు ఇద్దరికీ దేవుడు తన కరుణ కనుపరచుచున్నాడు. (11:30-32)
ఎవరునూ ప్రభువు మనస్సును ఎరిగలేదు, ఆయనకు ఆలోచన చెప్పలేరు. (11:33-34)
సమస్తమూ దేవుని నుండి, దేవుని ద్వారా ఆయన నిమిత్తమును కలిగినవి. (11:36)
సజీవ యాగాముగా తనను తాను దేవునికి సమర్పించు కొనుటయే విశ్వాసి దేవునికి చేసే ఆత్మీయ సేవ. (12:1)
ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్త మేదో తెలుసు కొనునట్లు విశ్వాసిని బల పరుస్తుంది. (12:2)
ఒక విశ్వాసి తనను తాను ఎంచుకొన తగిన దాని కంటే ఎక్కువగా ఎంచుకొన కూడదు. (12:3)
అనేకమైన విశ్వాసులు క్రీస్తు లో ఒక్క శరీరము, ఒకరికోకారము ప్రత్యేక అవయవాములై ఉన్నారు. (12:4-5)
ప్రతీ విశ్వాసి తమ విశ్వాస ప్రమాణము చొప్పున వారికివ్వబడిన కృపావరంలను వినియోగించ వలెను. (12:6)
విశ్వాసులు ఒకనియందోకరు అనురాగము కలిగి ఒకరినొకరు గౌరవించు కొనవలెను. (12:10)
విశ్వాసులు పరిశుద్ధుల అవసరముల పాలు పొంపులు పొందాలి. (12:13)
హింసించు వారిని దీవించాలి, శపించ కూడదు. (12:14)
విశ్వాసులు బాధలలో ఉన్నవారిని అంగీకరించాలి. (12:16)
విశ్వాసులు సాధ్యమైనంత వరకు సమస్తమైన వారితో సమాధానముగా ఉండాలి. (12:18)
పగ తీర్చుట దేవుని పని గనుక విశ్వాసులు పగతీర్చుకొ కూడదు. (12:19)
మేలు చేత కీదుని జయించాలి. (12:21)
భూసంబంధమైన అధికారులు దేవుని చేత నియమించా బడ్డారు, దేవుని నుండి తమ అధికారాన్ని పొందారు. (13:1)
భూసంబంధమైన అధికారమును ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుంటారు. (13:2)
పరిపాలించు అధికారులకు భయపడకుండునట్లు ఉండాలంటే మేలు చేయాలని పౌలు చెపుతున్నాడు. (13:3)
కీడును అణచివేయడానికి అధికారులు ఖడ్గము ధరించుటకు, కీడు చేయువారి మీద ఆగ్రహము చూపునట్లు కావలసిన అధికారమును వారికి ఇచ్చాడు. (13:4)
డబ్బును గురించి అధికారులకు దేవుడు పన్ను చెల్లింపు లను స్వీకరించే అధికారమును వారికి ఇచ్చాడు. (13:6)
ఒక్క ప్రేమ విషయములో విశ్వాసులు ఒకరికొకరు అచ్చి యుండాలని పౌలు చెప్పాడు(13:8)
తన పొరుగు వానిని ప్రేమించుట ద్వారా విశ్వాసి ధర్మ శాస్త్రమును పాటించు చున్నాడు. (13:8,10)
వ్యభిచరించ వద్దు, నరహత్య చేయ వద్దు, దొంగిల వద్దు, ఆసించ వద్దు అను ఆజ్ఞలను ధర్మశాస్త్రములో భాగముగా పౌలు చెపుతున్నాడు. (13:9)
చీకటి క్రియలను విసర్జించి, తేజోసంబంధ మైన యుద్దోపకరణములను ధరించు కోవాలని పౌలు విశ్వాసులకు చెపుతున్నాడు. (13:12)
అల్లరితో కూడిన ఆట పాటలు, మత్తు అయినను, కామ విలాసములైనాను, పోకిరి చేష్టలైనను, మత్సరము అసూయలలో నడువ కూడదని పౌలు చెప్పాడు. (13:13)
శరీర కోరికల విషయములో విశ్వాసులు ఆలోచన చేసికొన వద్దని పౌలు చెపుతున్నాడు(13:14)
బలమైన విశ్వాసము కలవాడు ఏ ఆహారమునైనను, బలహీనమైన విశ్వాసము కలవాడు కేవలము కూరగాయాలనే తీసుకొంటాడు. (14:2)
వారు తిను విషయములో ఒకరి విషయములో ఒకరు విభేధించుకొను విశ్వాసులు ఒకరికొకరు తీర్పు తీర్చు కొనకూడదు. (14:1,3)
ఏ ఆహారమునైనను తీసుకొనువానిని, కేవలము కూరగాయాలనే తీసుకొనువానిని ఇద్దరినీ అంగీకరించినది దేవుడే. (14:3-4)
వ్యక్తిగత నమ్మకము గా ప్రస్తావించిన మరియొక అంశము ఒక దినము మరియొక దినము కంటే విలువైనది లేక అన్ని దినములు సమానముగా ఎంచబడినవి. (14:5)
ప్రభువు కొరకు విశ్వాసులు జీవించాలి, చనిపోవాలి. (14:7-8)
అంతిమముగా విశ్వాసులందరూ దేవుని న్యాయ పీఠం ఎదుట నిలుస్తారు, అక్కడ వారి గురించి లెక్క ఒప్పగించవలెను. (14:10-12)
ఒక సహోదరుడు వ్యక్తిగత అభిప్రాయాల విషయములో మరొక సహోదరునికి ఎటువంటి అడ్డమైనను, ఆటంకమైనను కలుగచేయ కూడదు. (14:13)
ఏదీ నిషిద్దము కాదని పౌలు రూఢిగా నమ్ముతున్నాడు. (14:14)
దేవుని రాజ్యము నీతియు, సమాధానమును పరిశుద్దాత్మ యందలి ఆనందమునై యున్నది. (14:17)
ఆ సహోదరుని ఎదుట మాంసము తినుట, ద్రాక్షారసము త్రాగుట చేయకుండుట మంచిదని పౌలు చెపుతున్నాడు. (14:21)
విశ్వాస మూలము కానిది ఏదో అదిపాపం. (14:23)
బలమైన విశ్వాసము గలవారు బలహీనమైన విశ్వాసము గలవారి క్షేమాభివృద్ది కలగునట్లు వారి దౌర్బల్యములను భరించ వలెను. (15:1-2)
పూర్వ మందు రాసి ఉన్న లేఖనములు మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడియున్నాయి. (15:4)
విశ్వాసులు ఒకనితో ఒకరు మనస్సు కలిగి యుండాలని పౌలు కోరుతున్నాడు. (15:5)
క్రీస్తు తనను తాను సంతోష పరచక ఇతరులకు సేవ చేసాదు. (15:,38-9)
తమ పట్ల దేవుని కరుణను బట్టి అన్య జనులు సంతోషిస్తారు, దేవుని స్తుతిస్తారు, దేవుని యందు నిరీక్షణ ఉంచు తారు అని లేఖనాలు చెపుతున్నాయి. (15:10-12)
పరిశుద్ధాత్మ శక్తి చేత విశ్వాసులు సంతోషము, సమదానముతో నింపబడతారు, విస్తారమయిన నిరీక్షణ గలవారగుడురు. (15:13)
క్రీస్తు యేసు దాసునిగా అన్యజనుల వద్దకు పంపబడుటయే పౌలు పరిచర్య. (15:16)
వాక్యము చేతను, క్రియల చేతను, గురుతులు మహాత్కార్యముల చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు పౌలు ద్వారా తన కార్యములను జరిగించాడు. (15:18-19)
క్రీస్తు నామము ఎరుగని ప్రదేశాలలో సువార్తను ప్రకటించాలని కోరాడు. (15:20-21)
పౌలు స్పెయిను దేశానికి వెళ్లాలని తలస్తున్నాడు, అక్కడ నుండి రోము వెళ్ళగలుగుటకు ఎదురు చూస్తున్నాడు. (15:24-28)
పౌలు అన్యజనులైన విశ్వాసుల నుండి పోగుచేయ్య బడిన కానుకలను యెరూషలేములోని పరిశుద్దులలో బీదలైన వారికి అందివ్వడానికి వెళ్ళుతున్నాడు. (15:25-26)
అన్యజనులైన విశ్వాసులు యూదులైన విశ్వాసుల ఆత్మ సంబంధమైన విషయములలో పాలుపొందారు గనుక అన్యజనులైన విశ్వాసులు శరీర సంబంధమైన విషయములలో యూదయ విశ్వాసులకు ఋణస్తులై ఉన్నారని చెప్పాడు. (15:27)
యూదయలో ఉన్నా అవిదేయుల చేతులలో నుండి పౌలు తప్పించబడాలని పౌలు కోరుతున్నాడు. (15:31)
సోదరి ఫీబే పౌలుకు సహాయకురాలై ఉంది, అనేకులకును సహాయకురాలై ఉన్నది. (16:1-2)
గతములో ఆకుల ప్రిస్చ్కిల్ల పౌలు ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇవ్వడానికి తెగించారు. (16:4)
రోమా లో ఆకుల ప్రిస్సిల్ల గృహములో విశ్వాసులు కలుసుకొనుచున్నారు. (16:5)
గతములో అన్ద్రోనీకు, యూనియలు పౌలు తో సహా ఖైదీలుగా ఉన్నారు. (16:7)
పవితమైన ముద్దు పెట్టుకొని విశ్వాసులు ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి. (16:16)
వారు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా వెళ్తున్నారు, నిష్కపటుల హుర్దయాలను మోసపుచ్చుతున్నారు. (1:3)
భేదములు, ఆటంకములు కలిగించు వారి నుండి తొలగి పోవుడని విశ్వాసులకు పౌలు చెపుతున్నాడు(1:3)
మేలు విషయము లో జ్ఞానులును, కీడు విషయము నిష్కపటులునై యుండాలని పౌలు విశ్వాసులకు చెపుతున్నాడు(16:19)
సమాధాన కర్త యగు దేవుడు సతానును విశ్వాసుల కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక తొక్కించును. (16:20)
వాస్తవానికి ఈ పత్రిక తెర్తియు రాసాడు. (16:22)
విశ్వాసియైన ఎరస్తు పట్టణపు ఖజానాదారుడిగా పని చేయుచున్నాడు. (16:23)
అనాదినుండి రహస్యముగా ఉంచ బడి ఇప్పుడు పౌలు చేత భోధింపబడుతున్న మర్మము యేసు క్రీస్తు సువార్తయే. (16:25-26)
సమస్త మైన అన్య జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు పౌలు బోధిస్తున్నాడు. (16:26)
పౌలుని అపోస్తలుడిగా ఉండుటకు యేసుక్రీస్తు పిలిచాడు[1:1].
మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తునుండి కృపా సమాధానాలు కోరుకున్నాడు[1:3].
ప్రతి విషయంలో - మాట్లాడే సామర్ధ్యంలోనూ జ్ఞానంలోను అన్నివిధాలుగా కొరింథులోని సంఘాన్ని దేవుడు ఐశ్వర్యవంతులుగా చేసాడు[1:5].
వారు ఏ ఆత్మ వరం విషయంలోను కొదువగా లేరు[1:7].
మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చే రోజున వారు నిరపరాధులుగా ఉండేందుకు ఆయన దీనిని చేస్తాడు[1:8].
వారంతా ఒకే మాటమీద ఉండాలని, వారి మధ్యలో విభేదాలు లేకుండా చూసుకోవాలని, యేకమనస్సు, యేక తాత్పర్యంతో కలిసి ఉండాలని పౌలు కోరుతున్నాడు[1:10].
కొరింథులోని సంఘంలో ప్రజల మధ్య జగడాలు ఉన్నట్లు క్లోయే ఇంటివారు పౌలుకు చెప్పారు[1:11].
పౌలు ఈ విధంగా చెప్పాడు: మీలో ప్రతి ఒక్కడు "నేను పౌలు వాడను," "నేను అపొల్లో వాడను," "నేను కేఫా వాడను," "నేను క్రీస్తు వాడను" అంటున్నారు[1:12].
వారు పౌలు నామమున బాప్తిస్మం పొందితిరని ఎవరును చెప్పకుండునట్లు ఈ విషయంలో పౌలు దేవునికి వందనాలు చెపుతున్నాడు[1:14-15].
సువార్త ప్రకటించాలని పౌలును క్రీస్తు పంపించాడు[1:17].
నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనంగా ఉంది[1:18].
రక్షణ పొందుచున్నవారికి సిలువను గూర్చిన వార్త దేవుని శక్తియై ఉంది[1:18].
ఈలోక జ్ఞానంను దేవుడు వెర్రితనంగా మార్చాడు[1:20].
లోకం తన జ్ఞానం చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటన అనే వెర్రితనం చేత నమ్ము వారిని రక్షించుట దేవునికి ఇష్టమయ్యింది[1:21].
అటువంటి వారిలో అనేకులను దేవుడు పిలువలేదు[1:26].
జ్ఞానులను సిగ్గుపరచుటకు, బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు దేవుడు దీనిని చేసాడు[1:27].
దేవుడు నీచులైన వారిని, లోకములో తృణీకరించబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు[1:28-29].
దేవుడు చేసినదాని మూలముగా వారు క్రీస్తుయేసు నందు ఉన్నారు[1:30].
ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనం అయ్యాడు[1:30].
అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి[1:31].
దేవుని రహస్య సత్యం ప్రకటించినపుడు పౌలు మాటకారితనంగాని, గొప్పజ్ఞానంగాని వినియోగించుకోలేదు[2:1].
సిలువ మరణం పొందిన యేసుక్రీస్తు తప్ప ఇంకేమియూ ఎరుగకుండా ఉండాలని పౌలు నిశ్చయించుకొన్నాడు[2:2].
వారి విశ్వాసానికి ఆధారం మనుషుల జ్ఞానం కాకుండా దేవుని బలప్రభావాలే కావాలని పౌలు ఇలా చేసాడు[2:4-5].
వారు ఉపదేశించింది దేవుని రహస్య సత్యంలో ఉన్న జ్ఞానం, ప్రపంచ సృష్టికి ముందే మన ఘనత కోసం దేవుడు నిర్ణయించిన జ్ఞానం[2:7].
పౌలు కాలంలోని అధికారులకు దేవుని జ్ఞానం తెలిసి ఉంటే వారు ప్రభువును సిలువ వేసేవారు కాదు[2:8].
దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచాడు[2:10].
దేవుని సంబంధమైన లోతైన ఆలోచనలు కేవలం దేవుని ఆత్మకే తెలుసు[2:11].
దేవుడు మనకు ఉచితముగా దయచేసినవాటిని తెలిసికొనుటకై వారు దేవుని యొద్ద నుండి ఆత్మను పొందియున్నారు[2:12].
దేవుని ఆత్మకు చెందిన విషయాలు ఆత్మీయంగా లేని వ్యక్తికి వెర్రితనంగా అనిపిస్తాయి, అవి ఆధ్యాత్మికంగా మాత్రమే తెలుస్తాయి[2:14].
యేసును విశ్వసించిన వారికి యేసు మనసు ఉంటుందని పౌలు చెప్పాడు[2:16].
వారు ఇంకా శరీరసంబంధంగా, వారి మధ్య అసూయ, కలహాలతో ఉనారు కనుక పౌలు వారితో ఆధ్యాత్మిక వ్యక్తులుగా మాట్లాడలేకపోయాడు[3:1,3].
వారు పరిచారకులు, దేవుని జత పనివారు. వారి ద్వారా కొరింతువారు క్రీస్తును విశ్వసించారు[3:5,9].
వృద్ధి కలుగ జేయువాడు దేవుడే[3:7].
యేసు క్రీస్తే పునాది[3:11].
అతని పని వెలుగులోను, అగ్నిలోను కనబడుతుంది[3:12-13].
వాని పని ఎట్టిదో అగ్నియే పరీక్షించును[3:13].
ఆ వ్యక్తి జీతం పుచ్చుకుంటాడు[3:14].
అతనికి నష్టం కలుగుతుంది, అయితే తన మట్టుకు తనకు రక్షణ ఉంటుంది గాని అది మంటల్లోనుంచి తప్పించుకొన్నట్టే ఉంటుంది[3:15].
మనము దేవుని ఆలయం, దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడు[3:16].
దేవుని ఆలయాన్ని పాడుచేసిన వానిని దేవుడు పాడు చేయును[3:17].
"వాడు జ్ఞాని అగునట్లు "వెర్రివాడు" కావాలి అని పౌలు చెపుతున్నాడు[3:18].
జ్ఞానుల యోచనలు వ్యర్ధములని ప్రభువుకు తెలుసు[3:20].
అతిశయపడవద్దని పౌలు వారికి చెప్పాడు, "సమస్తమును మీవి," అందుచేత, "...మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవునివాడు"[3:21-23].
వారు క్రీస్తు సేవకులని, దేవుని రహస్య సత్యాల విషయం నిర్వాహకులువలె కొరింతు వారు పౌలును, అతని జతపని వారిని గౌరవించాలని పౌలు చెప్పాడు[4:1].
నిర్వాహకుడు నమ్మకమైన వాడుగా ఉండాలి[4:2].
తనకు తీర్పు తీర్చు వాడు దేవుడే అని పౌలు చెపుతున్నాడు[4:4].
చీకటిలో దాగిఉన్నవాటిని ఆయన వెలుగులోనికి తెస్తాడు, హృదయాలలోని ఆలోచనలను బట్టబయలు చేస్తాడు[4:5].
"లేఖనములయందు రాసియున్న సంగతులను అతిక్రమించకూడదు" అను మాటకు అర్ధాన్ని కొరింతు విశ్వాసులు నేర్చుకొని వారు ఒకని పక్షమున మరియొకరు ఉప్పొంగ కూడదని వారికొరకు దీనిని చేసాడు[4:6].
పౌలును, అతని సహచరులును కొరింతు విశ్వాసులతో కలసి రాజులగునట్లు కొరింతు విశ్వాసులు రాజులు కావాలని పౌలు కోరాడు[4:8].
"మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారం, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనులం, మీరు బలవంతులు, మీరు ఘనులు, మేము ఘనహీనులం" అని పౌలు చెప్పాడు[4:10].
వారు ఆకలి, దప్పిక గలవారు, దిగంబరులు, పిడిగుద్దులు తినుచున్నవారు, నిలువరమైన నివాసం లేనివారు అని పౌలు చెప్పాడు[4:11].
వారు నిందల పాలయినప్పుడు దీవించారు, వారు హింసలకు గురైతే ఓర్చుకున్నారు, అపనిందలు వచ్చినపుడు దయతో మాట్లాడారు(4:12).
తన ప్రియమైన పిల్లలవలె సరిచెయ్యడానికి పౌలు రాశాడు[4:14].
కొరింతు విశ్వాసులు తనను అనుకరించాలని పౌలు చెప్పాడు[4:16].
క్రీస్తునందు పౌలు నడుచుకొను విధమును కొరింతు విశ్వాసులకు గుర్తుచెయ్యాలని పౌలు తిమోతిని పంపాడు[4:17].
పౌలు వారివద్దకు రాడని కొందరు విర్రవీగుచున్నారు[4:18].
దేవుని రాజ్యం శక్తితో కూడుకొన్నది[4:20].
వారిలో వ్యభిచారం ఉన్నట్లు పౌలు విన్నాడు. వారిలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడు[5:1].
తన తండ్రి భార్యను ఉంచుకొనినవాడిని వారి మధ్యనుండి తొలగించాలని పౌలు చెప్పాడు[5:2].
కొరింతులోని సంఘం ప్రభువైన యేసు నామంలో కూడుకొనినపుడు పాపం చేసిన వ్యక్తి శరీరం నాశనమయ్యేలా అతనిని సాతానుకు అప్పగించాలి, ప్రభువైన యేసు వచ్చే రోజున అతనికి విముక్తి కలుగుతుంది[5:4-5].
పౌలు వాటిని పొంగజేసే పదార్ధంతో పోలుస్తున్నాడు[5:8].
నిజాయితి, సత్యం కొరకు పౌలు పొంగని రొట్టెను ఒక రూపకంగా వాడుతున్నాడు[5:8].
కొరింతు విశ్వాసులను వ్యభిచారులతో కలిసిమెలిసి ఉండకూడదని పౌలు రాస్తున్నాడు[5:9].
కొరింతు విశ్వాసులను వ్యభిచారులతో కలిసిమెలిసి ఉండకూడదని పౌలు ఉద్దేశం కాదు, అలాగైతే మీరు లోకములోనుండి వెళ్ళిపోవలసి వస్తుంది[5:10].
క్రీస్తులో సోదరుడు, సోదరి అనిపించుకొంటున్న వారెవరైనా వ్యభిచారి, దురాశా పరుడు, తిట్టుబోతు, త్రాగుబోతు, వంచకుడు, విగ్రహపూజ చేయువారితో కలిసిమెలిసి ఉండకూడదని పౌలు చెప్పాడు[5:10-11].
సంఘంలోపలి వారికి వారు తీర్పు తీర్చాలి[5:12].
సంఘం వెలుపల ఉన్నవారికి దేవుడు తీర్పు తీరుస్తాడు[5:13].
పరిశుద్ధులు లోకమునకు, దేవదూతలకు తీర్పు తీరుస్తారు[6:2-3].
కొరింతులోని విశ్వాసులు పరిశుద్ధుల మధ్య ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములను గూర్చి తీర్పు తీర్చగలరని పౌలు చెప్పాడు[6:1-3].
ఒక విశ్వాసి మరొక విశ్వాసి మీద వ్యాజ్యమాడుతున్నాడు, అవిశ్వాసుల యెదుటనే వారు వ్యాజ్యమాడుతున్నారు[6:6].
వారి విషయం ఇది ఒక అపజయం అని చూపుతుంది[6:7]
అన్యాయస్తులు, జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, పురుషసంయోగులు, ఆడంగి వారు, దొంగలు, లోభులు, త్రాగుబోతులు, దూషకులు, దోచుకొనువారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకొలేరు[6:9-10].
వారు ప్రభువైన యేసుక్రీస్తు పేర దేవుని ఆత్మ వలన శుద్ధి అయ్యారు[6:11].
భోజనం, జారత్వం పౌలు తనను వశపరచుకోనివ్వడు[6:12-13].
వారి శరీరాలు క్రీస్తు అవయవములై యున్నాయి[6:15].
లేదు, అదెంత మాత్రం తగదు[6:15].
అతడు ఆమెతో ఏకశరీరం అవుతాడు[6:16].
అతడు ఆయనతో ఏకాత్మగా ఉన్నాడు[6:17].
జారత్వం చేయువాడు తన స్వంత శరీరమునకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు[6:18].
వారి శరీరాలు పరిశుద్ధాత్మకు ఆలయమ. వారు విలువ పెట్టి కొనబడినవారు కనుక వారు తమ శరీరాలతో దేవుని మహిమ పరచాలి[6:19-20].
అనేక అనైతిక క్రియలకు సంబంధించిన శోధనల కారణంగా ప్రతి పురుషునికీ తన సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి తన సొంత భర్త ఉండాలి[7:2].
లేదు. భర్తకు తన భార్య శరీరంమీద అధికారం ఉంది అలాగే భార్యకు తన భర్త శరీరంమీద అధికారం ఉంది[7:4].
ప్రార్ధన కోసం సావకాశం కలిగించుకోవడం కోసం కొంతకాలం సమ్మతించి ఒకరికొకరు దూరంగా ఉండడం సరియైనది [7:5].
వారు పెళ్ళి చేసికొకుండుట వారికి మంచిదని పౌలు చెపుతున్నాడు[7:8].
ఆశలు అదుపులో ఉంచుకోవడం వారిచేత కాకపోతే వారు పెళ్ళి చేసుకోవడం మంచిది[7:9].
భార్య భర్తకు వేరైపోకూడదు, ఒకవేళ వేరైపోయినా మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా ఉండాలి, లేదా, భర్తతో సమాధానపడాలి. భర్త భార్యను విడిచిపెట్ట కూడదు [7:10-11].
నమ్మని భర్త లేక భార్య వారి భార్యతో గాని లేక భర్తతో కాపురముండడం ఇష్టమైతే నమ్మినవారు విడిచిపెట్టకూడదు[7:12-13].
ఒకవేళ నమ్మని భాగస్వామి విడిచి పెట్టినపుడు విశ్వాసి అతనిని వెళ్ళిపోనివ్వాలి[7:15].
ప్రతి ఒక్కరూ తనకు ప్రభువు నియమించిన ప్రకారం, దేవుడు పిలిచిన పరిస్థితిలో సాగిపోవాలి[7:17].
సున్నతిలేనివాడు సున్నతి పొందకూడదు, సున్నతిగలవాడు సున్నతి గురుతు మాపుకోడానికి పూనుకోకూడదు[7:18].
దేవుడు పిలిచినప్పుడు వాడు బానిసగా ఉన్నయెడల దాని గురించి బెంగ పెట్టుకోవద్దు, గాని ఒకవేళ స్వేచ్ఛగా ఉండడానికి అవకాశం వస్తే దానిని వినియోగం చేసుకోవాలి, బానిసగా ఉన్నప్పుడు ప్రభువులోకి పిలుపు పొందిన వ్యక్తి ప్రభువు చేత విడుదల అయిన వ్యక్తే. వారు మనుషులకు బానిసలు కాకూడదు అని పౌలు చెప్పాడు[7:21-23].
ఇప్పటి కష్టదశ కారణంగా మనిషి తానున్న పరిస్థితిలోనే ఉండడం మంచిదని పౌలు తలంపు[7:26].
ఆ పెళ్ళి నిబంధననుండి విడుదల కోసం ప్రయత్నించకూడదు[7:27]
పెళ్ళిచేసుకున్నవారు జీవితంలో వారికి కలిగే శరీరసంబంధమైన బాధలనుండి తప్పించడం కోసం పౌలు చెప్పాడు[7:28].
ఈ లోక విధానం గతించిపోతున్నది గనుక వారు ఆ విధానంలో ఉండాలి[7:31].
భర్త గాని, భార్య గాని ఈ లోకసంబంధమైన వాటిలో శ్రద్ధ వహిస్తారు గనుక ప్రభువుపట్ల పూర్తి శ్రద్ధ కనపరచడం కష్టం[7:33-34].
పెళ్ళి చేసుకోని వాడు ఇంకా మంచి చేస్తున్నాడు[7:38].
భర్త బ్రతికి ఉన్నంత వరకూ భార్య అతడికి కట్టుబడి ఉంటుంది[7:39].
ఆమెకు నచ్చిన వాడిని వివాహమాడడానికి ఆమెకు స్వేచ్చ ఉంది గాని ప్రభువుకు చెందిన వాణ్ణి మాత్రమే వివాహమాడాలి[7:39].
విగ్రహాలకు అర్పితమైనవాటి విషయం పౌలు రాస్తున్నాడు[8:1,4].
జ్ఞానం ఉప్పొంగజేస్తుంది, ప్రేమ అభివృద్ధిని కలిగిస్తుంది[8:1].
కాదు. లోకంలో విగ్రహం వట్టిది. ఒకే ఒక దేవుడు తప్ప మరో దేవుడు లేడు[8:4].
ఒకే దేవుడున్నాడు, ఆయన తండ్రియైన దేవుడు. ఆయనను బట్టి సమస్తం కలిగింది, మన ఉనికి ఆయన కోసమే[8:6].
ఒకే ప్రభువు ఉన్నాడు, ఆయన యేసు క్రీస్తు. అయన ద్వారానే సమస్తం కలిగింది, మన ఉనికి కూడా ఆయన ద్వారానే కలిగింది[8:6].
వారి మనస్సాక్షి బలహీనమై అపవిత్రమవుతుంది[8:7].
భోజనం మనలను గురించి దేవునికేం చెప్పలేదు. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు[8:8].
మన స్వేచ్చ విశ్వాసంలో బలహీనులకు తప్పటడుగు వేయించే అడ్డు కాకుండా చూసుకోవాలి[8:9].
ఆ సహోదరుని, సోదరిని బలహీనమైన మనస్సాక్షి గలవారుగా చేసి నశింపజేసిన వారిమౌతున్నాము[8:10-11].
క్రీస్తులో ఒక సహోదరుని, సోదరిని వారి బలహీనమైన మనస్సాక్షిని బట్టి తొట్రుపడేవారిగా చేసిన యెడల క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేసిన వారమౌతాం[8:11-12].
తాను చేసిన భోజనం ఒక సహోదరుని, సోదరిని తొట్రుపడేవారిగా చేసినయెడల ఎన్నటికి మాంసం తిననని పౌలు చెపుతున్నాడు[8:13].
కొరింతు విశ్వాసులు ప్రభువునందు తన పనియై ఉన్నారు కనుక వారే తన అపోస్తలత్వముకు రుజువునై ఉన్నారని పౌలు చెపుతున్నాడు[9:1-2].
తినుటకు, త్రాగుటకు వారికి అధికారం ఉన్నదని పౌలు చెపుతున్నాడు, విశ్వాసి అయిన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు అధికారమున్నదని చెపుతున్నాడు[9:4-5].
తమ పని నుండి ప్రయోజనాలు పొందినవారి గురించి పౌలు సైనికులు, ద్రాక్షతోట నాటినవారు, మంద కాచువారిని గురించిన ఉదాహరణలు ఇచ్చాడు[9:7].
పౌలు తన వాదనను బలపరచుకోడానికి "కళ్ళం తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు" అను ఆజ్ఞను ప్రస్తావిస్తున్నాడు[9:9].
కొరింతు విశ్వాసులనుండి శరీరసంబంధమైన ఫలములు కోసికొనుటకు వారికి అధికారం ఉంది. ఎందుకంటే కొరింతువారి మధ్య వారు ఆత్మ సంబంధమైన వాటిని విత్తారు[9:11-12].
సువార్తను ప్రకటించువారు సువార్త వలన జీవించాలని ప్రభువు ఆజ్ఞాపించాడు[9:14].
తాను సువార్త ప్రకటించుచున్నను అతిశయ పడలేదని పౌలు చెప్పాడు, ఎందుకంటే సువార్త ప్రకటించవలసిన భారం తన మీద ఉంది[9:16].
ఎక్కువ మందిని దేవుని కొరకు సంపాదించుకొనుటకై పౌలు అందరికి సేవకుడయ్యాడు[9:19].
యూదునికి యూదునివలె, ధర్మశాస్త్రముకు లోబడినవాని వలె, ధర్మశాస్త్రం లేని వారికి బలహీనుడయ్యాడు, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడయ్యాడు[9:20-22].
సువార్త దీవెనలలో పాలివాడు కావడానికి పౌలు సమస్తం చేసాడు[9:23].
బహుమానం పొందునట్లుగా పరుగెత్తాలని పౌలు చెప్పాడు[9:24].
అక్షయమగు కిరీటాన్ని పొందాలని పౌలు పరుగెత్తుచున్నాడు[9:25].
ఇతరులకు ప్రకటించిన తరువాత తాను భ్రష్టుడై పోతాడేమోనని ఈ విధంగా చేసాడు[9:27].
వారి పితరులందరూ మేఘం క్రింద ఉన్నారు, సముద్రంలో నడిచారు. అందరు మోషేనుబట్టి మేఘంలోను, సముద్రంలోను బాప్తిస్మం పొందారు, ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారు, ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసారు[10:1-4].
ఆత్మీయ బండ అయిన క్రీస్తు వారిని అనుసరించాడు[10:4].
వారు చెడ్డవాటిని ఆశించారు, వ్యభిచారులయ్యారు, ప్రభువును శోధించారు, సణిగారు[10:6-10].
వారు నానా విధాలుగా చనిపోయారు, కొందరు సర్పములచేత, కొందరు సంహారదూత చేత చనిపోయారు, అరణ్యంలో కూలిపోయారు[10:5,8-10].
మనకు బుద్ధి కలుగుటకు దృష్టాంతములుగా మన కొరకు రాసి ఉన్నాయి[10:11].
లేదు. మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ వారికి కలుగలేదు[10:13].
శోధనతో పాటు తప్పించుకొను మార్గాన్ని ఆయన కలుగజేశాడు[10:13].
విగ్రహరాధననుండి కొరింతు విశ్వాసులు పారిపోవాలని పౌలు హెచ్చరిస్తున్నాడు[10:14].
పాత్ర క్రీస్తు రక్తములో సహవాసము, రొట్టె విరచి తినడం క్రీస్తు శరీరంలో సహవాసం[10:16].
వారు దయ్యములకే గాని దేవునికి తమ బలులను అర్పించుట లేదు[10:20].
వారు ప్రభువు పాత్రలోనిది దయ్యాల పాత్ర లోనిదీ త్రాగలేరు, ప్రభువు బల్లమీద ఉన్నదానిలోను దయ్యాల బల్ల మీద ఉన్న దానిలోను పాలు పొందలేరని పౌలు చెపుతున్నాడు[10:20].
ప్రభువుకు రోషం పుట్టించిన వారిమౌతాం[10:22].
లేదు. దానికి బదులుగా ప్రతివాడునూ తన పొరుగువాని మేలుకొరకు చూచుకోనవలెను[10:24].
నీకు వడ్డించినవి ఏవో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక తినాలి[10:27].
నీకు తెలియజేసిన వాని కొరకు నీవు దానిని తీసుకోకూడదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తం నీవు దానిని తీసుకోకూడదు[10:28-29].
మనం భోజనము చేసినను, పానము చేసినను, ఏమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయాలి[10:31].
వారు రక్షణ పొందునట్లు మనం వారికి అభ్యంతరం కలుగజేయ కూడదు [10:32-33].
పౌలును అనుకరించమని పౌలు చెప్పాడు[11:1].
పౌలు క్రీస్తును అనుకరించువాడు[11:1].
వారికి అప్పగించిన కట్టడలను గట్టిగా పట్టుకొనియున్నందున పౌలు వారిని మెచ్చుకుంటున్నాడు[11:2].
క్రీస్తుకు శిరస్సు దేవుడు[11:3].
ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తే[11:3].
స్త్రీకి శిరస్సు పురుషుడే[11:3].
పురుషుడు తన తల మీద ముసుగు వేసుకొని ప్రార్ధిస్తే అతడు తన తలను అవమాన పరచును[11:4].
స్త్రీ తన తల మీద ముసుగు లేకుండా ప్రార్ధిస్తే ఆమె తన తలను అవమాన పరచును[11:5].
పురుషుడు తన తల మీద ముసుకు వేసుకొనకూడదు ఎందుకంటే అతడు దేవుని పోలికయు, మహిమయునై యున్నాడు[11:7].
స్త్రీని పురుషుని కొరకు సృజించడం జరిగింది[11:9].
స్త్రీ పురుషుని మూలంగా కలిగింది, పురుషుడు స్త్రీ మూలంగా కలిగాడు[11:11-12].
జ.స్త్రీలు ముసుకు వేసికొని ప్రార్ధించుట వారి ఆచారం[11:10,13,16].
వారిలో యోగ్యులు స్పష్టం కావడానికి వారిలో భిన్నాభిప్రాయాలు ఉండడం తప్పదు[11:19].
వారు భోజనం చేయునపుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. ఒకడు ఆకలి గొనియున్నాడు, మరియొకడు మత్తుగా ఉన్నాడు[11:21].
"ఇది మీకోరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసికొనుటకు దీనిని చేయుడి" అని చెప్పాడు[11:23,24].
"యీ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకం చేసుకోండి" అని చెప్పాడు[11:25].
ప్రభువు వచ్చు వరకు ఆయన మరణం ప్రచురం చేస్తున్నారు[11:26].
ఆ విధంగా చేసినయెడల వాడు ప్రభువు యొక్క శరీరం గురించియు, రక్తమును గురించియు అపరాధియగును[11:27,29].
అనేకులు బలహీనులును, రోగులునై ఉన్నారు, కొందరు కన్నుమూసారు[11:30].
ఒకరికొకరు కనిపెట్టుకొని యుండాలని పౌలు చెపుతున్నాడు[11:33].
వారు ఆత్మవరాల గురించి తెలుసుకోవాలని పౌలు కోరుతున్నాడు[12:1].
దేవుని అత్మచేత మాట్లాడువాడు "యేసు శాపగ్రస్తుడని" చెప్పలేడు[12:3].
ఎవరైనా పరిశుద్ధాత్మచేత "యేసు ప్రభువు" అని చెప్పగలరు[12:3].
ప్రతి విశ్వాసిలోను దేవుడు నానావిధములైన కృపావరములను, నానావిధములైన పరిచర్యలను, నానావిధములైన కార్యములను జరిగించుచున్నాడు[12:4-6].
మనుష్యులందరి ప్రయోజనంకొరకు కలుగుతుంది[12:7].
బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, స్వస్థపరచు వరం, అద్భుతాలు చేయు వరం, ప్రవచనం, ఆత్మల వివేచనా వరం, నానావిధ భాషలు, భాషల అర్ధం చెప్పు వరం కొన్ని కృపావరాలు[12:8-10].
ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి పంచి ఇస్తాడు[12:11].
మనమందరం ఒక్క శరీరంలోనికి అత్మయందే బాప్తిస్మం పొందాం, ఒక్క ఆత్మను పానం చేశాం[12:13].
శరీరంలోని ప్రతి అవయవంను దేవుడు తన చిత్తం ప్రకారం చక్కగా అమర్చాడు[12:18].
లేదు. శరీరంలో బలహీనంగా కనపడే భాగాలు అవసరమైనవి[12:22].
శరీరంలోని భాగాలన్నిటిను ఏకం చేసాడు, తక్కువదానికే ఎక్కువ ఘనతను కలుగజేశాడు[12:24].
శరీరంలో ఎటువంటి వివాదం లేకుండునట్లు దేవుడు దీనిని చేసాడు, అయితే శరీర భాగాలు ఒకనికొకటి ఆప్యాయంగా చూసుకోవాలి [12:25].
దేవుడు మొదట కొందరిని అపోస్తలులుగా, రెండవది ప్రవక్తలుగా, మూడవది బోధకులుగా, అద్భుతాలు చేయువారినిగా, స్వస్తతలు, ఉపకారం చేయువారినిగా, ప్రభుత్వములు చేయువారినిగా, నానా భాషలు మాట్లాడువారినిగా నియమించాడు[12:28].
శ్రేష్టమైన కృపావరములను వెదకమని పౌలు వారికి చెప్పాడు[12:31].
మరింత శ్రేష్టమైన మార్గాన్ని చూపిస్తానని పౌలు చెప్పాడు[12:31].
మ్రోగెడు కంచును, గణగణలాడు తాళముగా ఉంటాడు[13:1].
వ్యర్దుడవుతాడు[13:2].
ఈ కార్యాలన్నీ చేసినా ప్రేమ లేనివాడు అయితే అతనికేం ప్రయోజనం లేదు[13:2]
ప్రేమ సహిస్తుంది, దయ చూపుతుంది, అది మత్సర పడదు, డంబముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అది అమర్యాదగా నడువదు, స్వప్రయోజనాన్ని విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయం సంతోషపడక సత్యమందు సంతోషిస్తుంది, అన్నిటిని తాళుకొనును, అన్నిటిని నమ్ముతుంది, అన్నిటిని నిరీక్షిస్తుంది, అన్నిటిని ఓర్చుకుంటుంది. ఇది శాశ్వత కాలముంటుంది[13:4-8].
ప్రవచనాలు, జ్ఞానం, పూర్ణము కానిది గతించి పోతాయి, భాషలు నిలిచిపోతాయి[13:8-10].
అంతము లేనిది ప్రేమ[13:8].
పౌలు పెద్దవాడైనప్పుడు పిల్లవాని చేష్టలు మానివేసాడని చెప్పాడు[13:11].
విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుస్తాయి, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే[13:13].
ప్రవచన వరం విషయం మనం ఆపేక్ష కలిగి ఉండాలని పౌలు చెపుతున్నాడు[14:1].
భాషతో మాట్లాడు వాడు మనుష్యులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు[14:2].
భాషలతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగ చేసుకొంటున్నాడు, అయితే ప్రవచించే వాడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేయును. అందుచేత ప్రవచించడం గొప్పది[14:3-5].
స్వరములలో భేదం కలుగాజేయని పిల్లనగ్రోవి, వీణేలతో పౌలు దీనిని సరిపోల్చాడు. స్పష్టం కాని ధ్వని ఇచ్చే బూరతో కూడా పౌలు పోల్చాడు[14:7-9].
సంఘ క్షేమాభివృద్ధి విషయం ఆసక్తి కలిగి ఉండాలని పౌలు చెపుతున్నాడు[14:12].
భాషతో మాటలాడువాడు అర్ధం చెప్పు శక్తిగలవాడగుటకు ప్రార్ధించాలి[14:13].
భాషతో ప్రార్ధన చేయునపుడు తన ఆత్మ ప్రార్ధిస్తుంది, మనసు ఫలవంతంగా ఉండదు అని పౌలు చెపుతున్నాడు[14:14].
తాను ఆత్మతో మాత్రమే కాక, మనసుతోను ప్రార్దిస్తానని, పాడతానని పౌలు చెపుతున్నాడు[14:15].
భాషతో పదివేల మాటలు మాట్లాడం కంటే మనసుతో ఇతరులకు బోధకలుగునట్లు ఐదు మాటలు మేలు అని పౌలు చెప్పాడు[14:19].
భాషలు అవిశ్వాసులకు గుర్తుగా ఉన్నాయి, ప్రవచనాలు విశ్వాసులకు గుర్తుగా ఉన్నాయి[14:22].
విశ్వాసులు వెర్రివారు అని పిలువవచ్చును[14:23].
సంఘమంతయు కూడి అందరు ప్రవచించుచుండగా బయటివాడు, అవిశ్వాసి లోనికి వచ్చినపుడు అందరి బోధ వలన తనకు ఒప్పుదల కలుగుతుంది, అందరి వలన విమర్శలోనికి వస్తాడు[14:24].
అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేస్తాడు, నిజంగా దేవుడు వారి మధ్య ఉన్నాడని ప్రచురం చేస్తాడు[14:25].
ఇద్దరు, అవసరమైన యెడల ముగ్గురు వంతుల చొప్పున మాట్లాడాలని చెప్పాడు, అర్ధం చెప్పువాడు లేనియెడల అతడు సంఘంలో మౌనంగా ఉండాలని పౌలు చెప్పాడు[14:27-28].
ప్రవక్తలు ఇద్దరు, ముగ్గురు మాట్లాడవచ్చును, తక్కినవారు వివేచింపవచ్చును. కూర్చున్న వానికి ఏదైనను తెలిస్తే మొదటి వాడు మౌనంగా ఉండాలి. వారు ఒకరి తరువాత మరొకరు ప్రవచింపవచ్చును అని పౌలు చెప్పాడు[14:29-31].
పరిశుద్ధుల సంఘాలన్నిటిలో స్త్రీలు మాట్లాడుటకు సెలవు లేదని పౌలు చెప్పాడు[14:33-34].
వారు తమ ఇంట తమ భర్తలను అడగాలని పౌలు చెప్పాడు[14:35].
సంఘంలో స్త్రీ మాట్లాడుట అవమానం[14:35].
అతడు పౌలు రాయుచున్నవి ప్రభువు యొక్క అజ్ఞలని దృఢంగా తెలిసికోవాలని పౌలు చెప్పాడు[14:37].
సమస్తం మర్యాదగాను, క్రమంగాను జరగాలి[14:40].
వారికి ప్రకటించిన సువార్తను పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు[15:1].
పౌలు ప్రకటించిన వాక్కును గట్టిగా పట్టుకొనుట ద్వారా కొరింతు వారు రక్షణ పొందగలరని పౌలు వారికి చెప్పాడు[15:2]
లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడు, లేఖనాల ప్రకారమే ఆయనను పాతిపెట్టడం, మూడో రాజున ఆయనను సజీవంగా లేపడమూ జరిగింది అనేవి సువార్తలోని మొదటి ప్రాముఖ్యత కలిగిన అంశాలు[15:3].
క్రీస్తు మృతులలోనుండి లేచిన తరువాత, అయన కేఫాకు, పన్నెండుమంది శిష్యులకు, ఐదువందలమంది సహోదరులు, సోదరీలకు ఒకసారి, యాకోబుకు, అపోస్తలులందరికి, పౌలుకును కనిపించాడు[15:8].
దేవుని సంఘాన్ని హింసించాడు కనుక పౌలు ఇలా చెప్పాడు[15:9].
వారిలో కొందరు మృతులలోనుండి పునరుత్థానం లేదని చెపుతున్నట్టు ఉందని పౌలు సూచిస్తున్నాడు[15:12].
మృతులలోనుండి పునరుత్థానం లేనట్లయితే పౌలును, తనవలె ఇతరుల సందేశం నిరుపయోగం అని, కొరింతువారి విశ్వాసం కూడా నిరుపయోగం అని చెపుతున్నాడు[15:13-14].
వారు నశించిపోయారు[15:18].
ఇది సత్యమైతే మనుష్యులందరిలో మనం దౌర్భాగ్యులం[15:19].
"చనిపోయినవారిలో ఆయన ప్రథమ ఫలం" అని క్రీస్తును పౌలు పిలుస్తున్నాడు[15:20].
ఆదాము మరణాన్ని ఈ లోకం లోనికి తీసుకొని వచ్చాడు, క్రీస్తులో అందరినీ బ్రతికించడం జరుగుతుంది[15:21-22].
క్రీస్తు వచ్చినపుడు ఇడి జరుగుతుంది[15:23].
సమస్త ప్రభుత్వాన్ని సమస్త అధికారాన్ని సమస్త శక్తిని రద్దుచేసి రాజ్యాన్ని తండ్రిఅయిన దేవునికి అప్పగిస్తాడు[15:24].
తన విరోధులందరినీ తన పాదాల క్రింద పెట్టుకొనేవరకు క్రీస్తు రాజ్యం చేయాలి[15:23].
చివరిగా మరణమయ్యే విరోధి మరణం[15:26]
సమస్తమునూ కుమారునికి(తనకు) వశము చేసినవాడు అందులో ఉండడు[15:27].
తండ్రి అయిన దేవుడు సమస్తంలోను సమస్తమై ఉండేలా కుమారుడు కూడా తనకు వశం చేసిన ఆయనకు వశం అవుతాడు[15:28].
"మనం రేపు చనిపోతాము కనుక తిందుము, త్రాగుదము" అని పౌలు ప్రకటించాడు[15:32].
మేల్కొని, నీతి ప్రవర్తన కలిగిని వారై, పాపం చేయవద్దని పౌలు ఆజ్ఞాపించాడు[15:34].
వారిలో కొందరికి దేవుని గూర్చిన జ్ఞానం లేదు అన్నాడు[15:34].
భూమిలో నాటిన విత్తనంతో పోల్చాడు[15:35-42].
అది చావాలి[15:36].
నీవు నాటిన విత్తనం కలుగాబోవు ఆకారాన్ని చూపించదు[15:37].
మాంసమంతయూ ఒక్కటికాదు, మనుష్య మాంసం వేరు, మృగమాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు[15:39].
ఆకాశంలో గ్రహాలున్నాయి, భూమి మీద ఆకారాలున్నాయి [15:40]
సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు, మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరొక నక్షత్రమునకును భేదం కలదు[15:41)]
ఘనహీనతలో, బలహీనతలో సహజసిద్ధమైన శరీరాలుగా విత్తడం జరిగింది[15:42-44].
మృతులలో నుండి లేచిన శరీరం నాశనం కాని శరీరం, మహిమగల స్థితిలో, బలమైన స్థితిలో లేపడం జరిగింది[15:42-44].
అతడు జీవించు ఆత్మ అయ్యాడు[15:45].
అతడు బ్రతికించే ఆత్మ అయ్యాడు[15:45].
మొదటి మానవుడు భూమినుండి వచ్చాడు, మట్టినుండి రూపొందినవాడు. రెండవ మానవుడు పరలోకం నుండి వచ్చాడు[15:47].
మనం ఆ మట్టివాని పోలిక ధరించినట్టే ఆ పరలోక సంభంది పోలిక కూడా ధరించుకొంటాం[15:49].
రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించు కోలేవు[5:50].
మనం మార్పు చెందుతాము[15:51].
చివరి బూర మ్రోగగానే ఒక క్షణంలోనే, రెప్పపాటున ఇది జరుగుతుంది[15:52].
విజయం మరణాన్ని మ్రింగివేస్తుంది[15:54].
మరణపు కొండె పాపం, పాపపు బలం ధర్మశాస్త్రం[15:56].
దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనకు విజయాన్ని ఇచ్చుచున్నాడు[15:57].
ప్రభువులో వారి ప్రయాస వ్యర్ధం కాదని వారికి తెలుసు కనుక దీనిని చెయ్యమని చెపుతున్నాడు[15:58].
కొరింతు సంఘం చేసినట్టు పౌలు గలతియలోని సంఘాలకు పౌలు నియమించాడు[16:1].
ప్రతి ఆదివారంన వారిలో ప్రతివాడును తాను వర్ధిల్లన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువచేయాలని పౌలు చెప్పాడు తద్వారా పౌలు వారి వద్దకు వెళ్ళినపుడు చందా పోగుచేయ్యడం ఉండదు[16:2].
యెరూషలేంలోని పరిశుద్ధులకు ఇది వెళ్తున్నది[16:1,3].
మాసిదోనియా నుండి ప్రయాణం చేస్తున్నప్పుడు తాను వారి దగ్గరకు వస్తానని పౌలు చెప్పాడు[6:5].
వారివద్ద ఎక్కువకాలం ఉండడానికి వారిని దర్శించాలని పౌలు తలంచాడు, వీలయితే శీతాకాలం వారితో ఉండాలని పౌలు తలంచాడు[16:6-7].
పౌలుకు ఎఫెసులో ఫలవంతమైన సేవ చెయ్యడానికి అవకాశం కలిగింది, అక్కడ ఎదిరించువారు అనేకులు ఉన్నారు[16:8-9].
పౌలు చేయుచున్నట్టుగానే ప్రభువు పని చేస్తున్నాడు[16:10]
అతడు వారివద్ద నిర్భయుడిగా ఉండేలా చూసుకొమ్మని పౌలు కొరింతు సంఘానికి చెప్పాడు. అతనిని తృణీకరించవద్దని, సమాధానంతో సాగనంపాలని పౌలు వారికి చెప్పాడు[16:10-11].
కొరింతులోని పరిశుద్ధులను దర్శించమని అపోల్లోను పౌలు బలంగా ప్రోత్సహించాడు[16:12].
స్తెఫను ఇంటివారు పరిశుద్ధులకు సేవ చెయ్యడానికి తమ్మునుతాము అప్పగించుకొన్నారు[16:15].
అటువంటి వారికి లోబడి ఉండాలని పౌలు వారికి చెప్పాడు[16:16].
కొరింతు వారు లేని కొరతను తీర్చి పౌలు ఆత్మకు సుఖాన్ని కలుగచేసారు[16:17-18].
ఆసియాలోని సంఘాలు, ఆకుల, ప్రిస్కిల్ల, సహోదరులు, సోదరీలందరూ కొరింతులోని సంఘానికి శుభములు చెప్పారు[16:19-20].
ఎవడైనను ప్రభువుని ప్రేమించకుంటే వాడు శపించబడతాడు గాక." అని పౌలు చెప్పాడు[16:22].
పౌలు, తిమోతి పత్రిక రాశారు[1:1].
కొరింతులో ఉన్న దేవుని సంఘానికి, ఆకయ ప్రాంతంలో ఉన్న పరిశుద్ధులందరికి ఈ పత్రిక రాయడం జరిగింది[1:1].
దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి, కరుణామయుడైన తండ్రి, అన్ని విధాల ఆదరణను అనుగ్రహించే తండ్రి గా పౌలు వివరిస్తున్నాడు[1:3].
దేవుడు ఏ ఆదరణతో మమ్మును ఆదరించుచున్నాడో అలాంటి ఆదరణతో ఎలాంటి కష్టాలలో ఉన్నవారినైనా ఆదరించడానికి శక్తిగలవారమవుటకు ఆయన మా కస్టాలన్నిటిలో మమ్మును ఆదరించుచున్నాడు [1:4].
వారి బలానికి మించిన విపరీతమైన ఒత్తిడి వారి మీదికి వచ్చింది. వారు తమ ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు[1:8-9].
తమ మీద కాక దేవుని మీద నమ్మకం ఉంచేలా వారికి మరణం విధించినట్టు అనిపించింది[1:9].
కొరింతు సంఘం వారి ప్రార్ధనల ద్వారా తమకు సాయం చేసిందని పౌలు చెప్పాడు[1:11].
వారు ఈ లోక జ్ఞానాన్ని అనుసరించకుండ, దేవుడు అనుగ్రహించు పరిశుద్ధత, నిజాయితితో దేవుని కృపను అనుసరించి లోకములో నడుచుకొన్నారని, ప్రత్యేకించి కొరింతు సంఘం విషయంలో నడచుకున్నారని వారి మనస్సాక్షి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారు అతిశయపడుతున్నారు[1:12].
ఆ రోజున కొరింతు పరిశుద్ధులు అతిశయానికి కారణమౌతారని పౌలు, అతని అనుచరులు స్థిరంగా ఉన్నారు[1:14].
పౌలు వారిని దర్శించాలని రెండు సార్లు సిద్ధపడ్డాడు[1:15].
ఆయన మనకు ఇవ్వబోతున్న దానికి హామీగా మన హృదయంలో తన ఆత్మను అనుగ్రహించాడు[1:22].
వారిని నొప్పించడం ఎందుకని పౌలు కొరింతుకు రాలేదు[1:23].
వారి విశ్వాసం మీద పెత్తనం చెయ్యడం లేదని పౌలు చెపుతున్నాడు, అయితే వారి ఆనందం కోసం కొరింతు సంఘంతో కలసి పనిచేస్తున్నట్లు పౌలు వారికి చెప్పాడు[1:24].
బాధాకరమైన పరిస్థితులనుండి తప్పించుకోవడానికి పౌలు కొరింతు సంఘానికి రాకుండా అగుతున్నాడు[2:1].
పౌలు వారి వద్దకు వచ్చినపుడు తనకు సంతోషాన్ని కలిగించవలసిన వారు విచారాన్ని కలిగించకూడదని ముందు అలా రాశాడు[2:3].
పౌలు ఎంతో బాధతో, హృదయవేదనతో ఉన్నాడు[2:4].
కొరింతు వారిపట్ల పౌలుకున్న అత్యధిక ప్రేమ వారు తెలుసుకోవాలని వారికి రాశాడు[2:4].
వారు అతనిని క్షమించి ఆదరించాలని పౌలు చెప్పాడు[2:6-7].
వారు శిక్షించినవాడు అత్యధిక విచారంలో మునిగి పోతాడేమో అని పౌలు అలా చెప్పాడు[2:7].
వారిని పరీక్షించడానికి, వారు అన్నింటిలో విధేయత కలిగి ఉంటారో లేదో అని తెలుసుకోడానికి పౌలు రాశాడు[2:9].
సాతాను వారిని ఏమాత్రం మోసపరచకూడదని పౌలు చెప్పాడు[2:11].
త్రోయలో తన సోదరుడైన తీతు కనబడలేదు కనుక పౌలుకు మనసు నెమ్మది లేదు[2:13].
పౌలు అతని అనుచరుల ద్వారా దేవుడు ప్రతిచోట క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచాడు[2:14-15].
పౌలు, అతని సహచరులు దేవునినుండి వచ్చినవారు, పవిత్రమైన ఉద్దేశాలతో, దేవుని ఎదుటే క్రీస్తులో మాట్లాడేవారు[2:17].
మనుషులందరూ గుర్తించి చదవగలిగే కొరింతు పరిశుద్దులే వారి సిఫారసు లేఖ[3:2].
వారి సొంత సామర్ధ్యం మీద వారికి నమ్మకం లేదు కాని దేవుడు అనుగ్రహించిన సామర్ధ్యం మీద వారి నమ్మకం ఉంది[3:4-5].
మనుష్యులను చంపు అక్షరం కాక జీవమునిచ్చు ఆత్మమీద నూత నిబంధన ఆధారపడింది[3:6].
మోషే ముఖంమీద కనిపించిన మహిమా ప్రకాశం తగ్గిపోయేదైనా వారు చూడలేక పోయారు[3:7].
ఆత్మ సంబధమైన పరిచర్య ఎంతో మహిమ గలది. నీతికి కారణమైన పరిచర్య ఎంతో అత్యధిక మహిమ కలది. శాశ్వతమైన దానికి ఎక్కువ మహిమ ఉంది [3:8-11].
నేటి వరకూ మోషే గ్రంథాన్నిచదివినప్పుడల్లా వారి హృదయాలకు ముసుకు ఉంది[3:15].
ఇశ్రాయేలు ప్రజలు ప్రభువువైపు తిరిగినప్పుడు మాత్రమే వారి హృదయాలు తెరచుకుంటాయి, వారి ముసుకు తొలగిపోతుంది [3:14,16].
ప్రభువు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది[3:17].
వారు మహిమనుండి అధిక మహిమలోనికి ప్రభువైన ఆత్మ చేత ఆ ప్రభువు పోలికగా మారుతూ ఉన్నారు[3:18].
వారు కలిగిఉన్న సేవను బట్టి, వారు పొందిన కరుణను బట్టి వారు నిరుత్సాహ పడరు[4:1].
అవమానకరమైన రహస్య విషయాలను విసర్జించారు. కుయుక్తిగా ప్రవర్తించడం లేదు, దేవుని వాక్కును వంచనగా బోధించలేదు[4:2].
సత్యాన్ని వెల్లడి చేస్తూ ఇలా చేస్తున్నారు[4:2].
నశిస్తున్నవారు సువార్త వెలుగును చూడలేక పోతున్నారు[4:3].
ఈ యుగదేవుడు విశ్వాసం లేని వారి మనసులకు గుడ్డితనం కలిగించాడు కనుక నశిస్తున్నవారు సువార్త వెలుగును చూడలేక పోతున్నారు[4:4].
క్రీస్తు యేసు ప్రభువని, తాము యేసు కోసం కొరింతు సంఘానికి సేవకులమని ప్రచురిస్తున్నారు[4:5].
అత్యధిక బలప్రభావం వారిది కాదు, అది దేవునిదే అని వెల్లడి అయ్యేలా వారి ఐశ్వర్యం మట్టి పాత్రలలో ఉంది[4:7].
యేసు జీవం వారి శరీరంలో వెల్లడి కావాలని యేసు మరణాన్ని తమ శరీరాలలో భరిస్తూ ఉన్నారు[4:10].
ప్రభువైన యేసును లేపినవాడు తన సన్నిధిలో పౌలు, అతని సహచరులను, కొరింతు పరిశుద్ధులను తన ఎదుట నిలువబెట్టుకొంటాడు[4:14].
దేవుని కృప అనేకులకు వ్యాపిస్తూ ఉండగా ఆయన మహిమకు కృతజ్ఞతలు సమృద్ధిగా కలుగుతాయి[4:15].
వారు నిరుత్సాహపడటానికి కారణం ఉంది, ఎందుకంటే వారు శారీరకంగా క్షీణించి పోతున్నారు[4:16].
వారు అధైర్యపడరు ఎందుకంటే అంతరంగ పురుషుడు దినదినం నూతనమౌతున్నాడు. క్షణికమైన, చులకనైన బాధలు వాటికి ఎంతో మించిపోయే శాశ్వత మహిమ భావాన్ని కలిగిస్తున్నాయి. చివరిగా వారు నిత్యమూ ఉండే కనిపించని వాటినే గమనిస్తున్నారు[4:16-18].
చేతులతో చేసినది కాని దేవుడు నిర్మించే శాశ్వత కట్టడం పరలోకంలో మనకుంటుందని పౌలు చెప్పాడు[5:1].
మనం ఈ "గుడారం"లో ఉన్నప్పుడు, మనం భారంతో ఉంటాం, వస్త్రాలు ధరించుకోవాలని కోరుకుంటాం, తద్వారా చావుకు లోనయ్యేది జీవంలో మింగివేయబడుతుంది కనుక పౌలు ఇలా చెప్పాడు[5:4].
రాబోతున్నదానికి హామీగా దేవుడు మనకు తన ఆత్మను ఇచ్చాడు?[5:5].
"శరీరాన్ని విడిచివెళ్ళి ప్రభువుతో ఆయన నివాసంలో ఉండడమే మాకు ఇష్టం" అని పౌలు చెప్పాడు[5:8].
ప్రభువును సంతోషపెట్టడమే పౌలు లక్ష్యం[5:9].
మనమందరమూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షంగా కనపడాలి. అప్పుడు ప్రతి ఒక్కరూ శరీరంలో చేసిన క్రియలకు - అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే - తగిన ప్రతిఫలం పొందాలి కనుక పౌలు ప్రభువును సంతోషపెట్టడమే తన లక్ష్యంగా చేసుకున్నాడు [5:10].
వారికి ప్రభువు పట్ల భయభక్తులంటే ఏమిటో తెలుసు కనుక వారు ప్రజలను ఒప్పిస్తున్నారు [5:11].
హృదయంలో ఉన్న విషయాలను బట్టి కాక పై రూపాన్ని బట్టే గర్వపడే వారికి కొరింతు పరిశుద్ధులు జవాబు చెప్పగలిగేలా వారి విషయంలో కొరింతు వారికి అతిశయ కారణం కలిగిస్తున్నారు[5:12].
జీవించు వారు తమ కోసం బ్రతకకుండా చనిపోయి మళ్ళీ సజీవంగా లేచిన వాని కోసం జీవించాలి[5:15].
ఎందుకంటే క్రీస్తు అందరికోసం చనిపోయాడు, మనమికమీదట మనకోసం జీవించం, క్రీస్తు కొరకే జీవిస్తాం[5:15-16].
అతడు నూతన సృష్టి. పాతవి గతించాయి, ఇదిగో క్రొత్తవి వచ్చాయి[5:17].
దేవుడు వారిమీద వారి అపరాధాలు మోపకుండా ఉన్నాడు, వారికి సఖ్యపరచే సందేశాన్ని అప్పగించాడు[5:19].
క్రీస్తు నిమిత్తం దేవునితో సఖ్యపడాలని కొరింతు వారికి చేస్తున్నవారి విన్నపం[5:20].
క్రీస్తులో మనం దేవుని నీతి అయ్యేలా దేవుడు దీనిని చేశాడు[5:21].
వారు పొందిన కృపను వ్యర్ధం చెయ్యవద్దని కొరింతు వారిని వేడుకొంటున్నారు[6:1].
ఇదే అనుకూల సమయం, ఇప్పుడే రక్షణ దినం[6:2].
వారి సేవకు ఎలాంటి నింద కలగకూడదని ఎవరి ఎదుటను అభ్యంతరాలు పెట్టారు[6:3].
వారు దేవుని సేవకులని వారి క్రియలు రుజువు చేస్తున్నాయి[6:4].
వారు బాధలను, కష్టాలను, ఇరుకు పరిస్థితులను, దెబ్బలను, చెరసాలను, అల్లరులను, శ్రమను, జాగరణలను, ఆకలిని సహించుకొన్నారు[6:4-5].
వారు వంచకులు అనే నిందకు గురయ్యారు[6:8].
కొరింతు వారిపట్ల తమ హృదయాలు తెరచి యున్నాయి, దానికి ప్రతిఫలంగా కొరింతు వారి హృదయాలు పౌలు పట్లను అతని సహచరుల పట్లను తెరిచి యుంచాలని పౌలు వారిని కోరాడు[6:11,13].
పౌలు ఈ క్రింది కారణాలను చెపుతున్నాడు: న్యాయానికి అన్యాయానికి వంతు ఏమిటి? వెలుగుకు చీకటితో సహవాసమేమిటి? క్రీస్తుకు బెలియాలు తో సమ్మతి ఏమిటి? నమ్మిన వ్యక్తికి నమ్మని వ్యక్తితో భాగమేమిటి? దేవుని ఆలయానికి విగ్రహాలతో పొందిక ఏమిటి?[6:14-16].
వారిని స్వాగతిస్తానని ప్రభువు చెప్పాడు. ఆయన వారికి తండ్రిగా ఉంటాడు, వారు ఆయనకు కుమారులు కుమార్తెలునై ఉంటారు[6:17-18].
శరీరానికి, ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని మనం పవిత్ర పరచుకోవాలి[7:1].
"మీ హృదయములలో చేర్చుకొనుడి" అని పౌలు వారిని కోరాడు[7:2].
కొరింతు వారు తన హృదయంలోను, తన సహచరుల హృదయంలోను ఉన్నారని పౌలు చెప్పాడు, తామంతా కలసి చనిపోవాలి, కలిసి జీవించాలి. వారియందు గొప్ప నమ్మకం ఉన్నదని, వారిని బట్టి అతిశయపడుతున్నానని పౌలు చెప్పాడు[7:3-4].
తీతు రాకను బట్టి దేవుడు వారిని ఆదరించాడు, కొరింతు పరిశుద్ధుల నుండి తీతు పొందిన ఆదరణను గురించిన మాట చేత, పౌలు కోసం కొరింతు వారి లోతైన ఆసక్తి, వారి శ్రద్ధ, వారి గొప్ప హృదయాభిలాష చేత దేవుడు వారిని ఆదరించాడు[7:6-7].
పౌలు రాసిన ముందు లేఖ కొరింతు పరిశుద్ధులను దుఃఖపెట్టింది ఇది పౌలు రాసిన ముందు లేఖకు దైవసంబంధ స్పందన[7:8-9].
దైవసంబంధమైన విచారం వారిలో మారుమనస్సును తీసుకొనివచ్చింది, వారు నిర్దోషులని రుజువు పరచుకొనే గొప్ప సమర్పణను తీసుకొని వచ్చింది [7:9,11].
పౌలు కోసం, అతని సహచారుల కొరకు కొరింతు పరిశుద్ధులకున్న శ్రద్ధ దేవుని యెదుట కొరింతు పరిశుద్ధులకు స్పష్టం కావాలని రాశానని పౌలు చెప్పాడు[7:12].
కొరింతు పరిశుద్ధుల వల్ల తీతుకు ఊరట కలిగింది[7:13].
కొరింతు పరిశుద్ధులు భయందోళనతో స్వీకరించి విధేయత చూపిన సంగతి తీతు జ్ఞాపకం చేసుకొన్నప్పుడెల్ల వారి పట్ల తీతు వాత్సల్యం అధికమౌతుంది[7:15].
మాసిదోనియ వారికి దేవుడు అనుగ్రహించిన కృపను తెలుసుకోవాలని పౌలు వారిని కోరాడు[8:1].
వారు తమ ఆనంద సమృద్దిలోనుండి అధికమైన ఔదార్యంతో తమంతట తామే ఇవ్వగలిగినదంతా పరిశుద్ధుల పరిచర్యకు ఇచ్చారు[8:2-4].
కొరింతు పరిశుద్ధులలో తాను ఆరంభించిన ఉపకార క్రియను ముగించమని పౌలు తీతును వేడుకున్నాడు[8:6].
ఇతరుల శ్రద్ధాసక్తులతో సరిపోల్చుతూ వారి ప్రేమ భావం ఎంత వాస్తమైనదో రుజువు చెయ్యడానికి పౌలు ఇది చెప్పాడు[8:7-8].
పరిచర్య చెయ్యడంలో సిద్ధమైన మనస్సు మంచిది, అంగీకారమైనదని పౌలు చెపుతున్నాడు[8:12].
లేదు. ప్రస్తుతం వారికున్న సమృద్ధి వారి అక్కరలకు సహాయకరంగా, మరొకప్పుడు వారి సమృద్ధి కొరింతు వారికి సహాయకరంగా ఉండాలని పౌలు భావన[8:13-14].
పౌలు విన్నపాన్ని తీతు అంగీకరించాడు, వారి పట్ల ఎంతో శ్రద్ధాసక్తులు కలిగి తనకు తానే వారి వద్దకు వెళ్ళాడు[8:16-17].
తీతును మాత్రమే కాక శుభవార్త సేవలో ప్రసిద్ధి గాంచిన మరొక సోదరుడిని పౌలు అతని సహచరులు పంపారు. ఈ సోదరుడు, పరీక్షించిన మరొక సోదరుడు ఈ సహాయాన్ని అందివ్వడానికి పంపడం జరిగింది[8:18-22].
సంఘాల ఎదుట బహింరంగంగా వారికి ప్రేమ చూపించాలని, తమపట్ల పౌలుకున్న అతిశయ కారణాన్ని రుజువు చేయాలని పౌలు కొరింతు సంఘానికి చెప్పాడు[8:24].
పరిశుద్ధుల కోసం పరిచర్య గురించి వారికి రాయనవసరం లేదని పౌలు చెపుతున్నాడు[9:1].
కొరింతు పరిశుద్ధుల గురించి తనకున్న అతిశయం వ్యర్ధం కాకూడదని, తాను చెప్పినట్టే వారు సిద్ధంగా ఉండాలని పౌలు సోదరులను పంపాడు[9:3].
ఒకవేళ మాసిదోనియ వారిలో ఎవరైనా పౌలుతో వచ్చి కొరింతువారు సిద్ధంగా లేకపోవడం చూసి వారిపట్ల పౌలుకున్న నమ్మకంవల్ల పౌలుకు అతని సహచరులకు సిగ్గుకలుగుతుందని సోదరులను ముందుగా పంపడం అవసరమని తలంచాడు.[9:4-5].
"కొద్దిగా వెదజల్లే వాడు కొద్ది పంటను కోస్తాడు, విస్తారంగా చల్లేవాడు విస్తార పంటను కోస్తాడు" అని పౌలు తన ముఖ్య అంశం చెప్పాడు[9:6].
ప్రతి ఒక్కరూ సణుక్కోకుండా బలవంతం లేకుండా తన హృదయంలో నిశ్చయించుకొన్న ప్రకారం ఇవ్వాలి[9:7].
అయన చల్లడానికి విత్తనాలు ఇచ్చి వృద్ధి చేసి, వారి నీతి అనే పంట కోతను పెంపొందించే వాడు. వారు అన్ని విషయాల్లో వర్థిల్లుతారు గనుక, వారు ఉదార భావంతో ఉండవచ్చు. [9:10-11].
వారు ఒప్పుకొన్న క్రీస్తు సువార్తకు విధేయత చూపించడం, వారు ఉదారంగా ఇచ్చిన చందాను బట్టి వారు దేవుని మహిమ పరచారు[9:13].
దేవుడు వారి పట్ల చూపిన అత్యధిక కృపను బట్టి వారిని చూడాలని ఎక్కువ కోరిక కలవారై ఉన్నారు[9:14].
తాను కొరింతు వారితో ఉన్నప్పుడు తాను ధైర్యశాలిగా ఉండకుండా వ్యవహరించాలని వారిని వేడుకొంటున్నాను[10:1].
పౌలు,, అతని సహచరులు శరీరానుసారంగా బ్రతుకుతున్నారని అనుకుంటున్నవారిపట్ల ధైర్యంగా వ్యవహరించాలని పౌలు తలంపు[10:2].
పౌలు, అతని సహచరులు యుద్ధం చేయాల్సినపుడు వారు శరీరసంబంధమైన యుద్దోపకరణాలను ఉపయోగించరు[10:4].
కోటలను పడగొట్టడానికి దేవుని ద్వారా బలప్రభావాలు గలవి - తప్పుదారి పట్టించేవాటిని వ్యర్థపరిచేవి. దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ఉన్నతమైన ప్రతి దానిని పడద్రోయగలిగినవి[10:4-5].
కొరింతు పరిశుద్ధుల అభివృద్ధి కోసం దేవుడు పౌలుకు అతని అనుచరులకు అధికారాన్ని ఇచ్చాడు[10:8].
అతడి ఉత్తరాలు గంభీరమైనవి, తీవ్రమైనవి గాని అతడు శరీరరీత్యా దుర్భలుడు, అతడి ప్రసంగాలు కొరగానివి అనుకుంటున్నారు[10:10].
పౌలు కొరింతుపరిశుద్ధులతో లేనప్పుడు ఉత్తరాలలో రాసిన మాటల ప్రకారం ఎలాంటివాడిగా ఉన్నాడో వారితో ఉన్నప్పుడు అలాంటి వాడుగానే ఉన్నాడని చెప్పాడు[10:11].
తమలో ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుంటారు, ఒకడితో ఒకరు పోల్చుకుంటారు, వారికి గ్రహింపు లేదు[10:12].
పౌలు అతిశయం దేవుడు తనకు కొలిచి ఇచ్చిన సరిహద్దుల్లోనే ఉంటుంది, కొరింతువారు ఉన్న సరిహద్దులలోనే, సరిహద్దు దాటి ఇతరుల కష్టఫలంలో వారికి వంతు ఉన్నట్టు అతిశయంగా చెప్పుకోరు[10:13,15,16].
ప్రభువు మెచ్చుకొనేవాడే యోగ్యుడు[10:18].
పౌలు వారిని ఒకే పురుషునికి ప్రధానం చేసాడు, వారిని క్రీస్తు కోసం పవిత్ర కన్యగా అప్పగించాలని వారిపట్ల దైవిక ఆసక్తి ఉంది[11:2].
వారి ఆలోచనలు క్రీస్తు పట్ల ఉన్న నిజాయితి నుంచి పవిత్రభక్తి నుండి తొలగిపోతాయేమోనని భయపడ్డాడు[11:3].
ఒకడు వచ్చి పౌలు,, ఇతర సహచరులు ప్రకటించిన యేసును కాక వేరే యేసును ప్రకటిస్తే, వేరే శుభవార్తను ప్రకటిస్తే వారు ఓర్చుకున్నారు[11:4].
కొరింతు ప్రజలకు శుభవార్తను ఉచితంగా ప్రకటించాడు[11:7].
ఇతర సంఘాలనుంచి జీతం తీసుకోవడం వల్ల వారిని దోచుకుంటున్నాడు[11:8].
వారు సాతాను సేవకులు, వాస్తవమైన క్రీస్తురాయబారులు కాదు, మోసకారులైన పనివారు, క్రీస్తురాయబారులు అనిపించుకోవాలని మారు వేషం వేసుకొనేవారు అని పౌలు వివరించాడు[11:13-15].
సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకున్నాడు[11:14].
తాను అతిశయంగా కొంత చెప్పుకోనేలా తనను తెలివితక్కువవానిగా స్వీకరించాలని పౌలు కోరాడు[11:16].
వారు తెలివి తక్కువవారిని, వారిని బానిసలుగా చేసిన వారిని, వారి మధ్య విభజనలు చేసేవారిని, వారి నుండి లాభం కోరే వారిని, తమని తాము గోప్ప చేసుకోనే వారిని, వారి ముఖాల మీద కొట్టే వారిని సంతోషంతో చేర్చుకుంటారని పౌలు చెప్పాడు[11:19-20].
తాము యూదులమనీ, అబ్రాహాము సంతానమని చెప్పుకొనేవారితో సమానంగా పౌలు తానుకూడా తను అబ్రాహాము సంతానమని అతిశయ పడ్డాడు. వారి కంటే ఎంతో ఎక్కువగా క్రీస్తు సేవకుడిని అని, ఎక్కువగా ప్రయాసపడ్డానని, అనేక సార్లు ఖైదు పాలయ్యానని, లెక్కలేనన్నిసార్లు దెబ్బలు తిన్నానని, తరచుగా ప్రాణాపాయాలలో ఉన్నానని అతిశయించాడు[11:22-23].
పౌలు యూదుల చేత అయిదుసార్లు 39 కొరడా దెబ్బలు తిన్నాడు. మూడుసార్లు బెత్తం దెబ్బలు తిన్నాడు. ఒకసారి రాళ్ళతో కొట్టడం జరిగింది. మూడుసార్లు తానున్న ఓడలు పగిలిపోయాయి. ఒకసారి పగలూ రాత్రి సముద్రంలో గడిపాడు. నదుల వల్ల అపాయాలు, దోపిడీ దొంగల వల్ల అపాయాలు, స్వజనం వల్ల అపాయాలు, ఇతరజనాలవల్ల అపాయాలు, పట్టణాలలో అపాయాలు, అరణ్యాలలో అపాయాలు, సముద్రంలో అపాయాలు, కపటసోదరుల వల్ల అపాయాలు. దమస్కు అధికారి నుండి కూడా పౌలుకు ప్రమాదం ఉంది[11:24-26,32].
ఎవరైనా పాపంలో పడే కారణం కలిగిస్తే పౌలు తనలో మండి పడతాడు [11:29].
పౌలు తన బలహీనతల గురించిన విషయాలలోనే అతిశయ పడతాడు[11:30].
ప్రభువు దర్శనాలను గురించి, ప్రత్యక్షతల గురించి అతిశయ పడతానని పౌలు చెప్పాడు[12:1].
అతణ్ణి మూడో ఆకాశం లోనికి తీసుకు వెళ్ళిపోవడం జరిగింది, పరమానంద నివాసం లోనికి తీసుకు వెళ్ళడం జరిగింది, వివరించడానికి వీలుకాని విషయాలు అతడు విన్నాడు[12:2-4].
తాను అతిశయ పడడం బుద్ధిహీనం కాదు అని పౌలు అన్నాడు ఎందుకంటే పౌలు సత్యం పలుకుతున్నాడు[12:6].
పౌలు తనని తాను గొప్ప చేసుకోకుండా తన శరీరంలో ఒక ముల్లు ఉంచడం జరిగింది[12:7].
"నా కృప నీకు చాలు, నా బలప్రభావాలు పరిపూర్ణం అయ్యేది బలహీనతలోనే" అని ప్రభువు పౌలుకు చెప్పాడు[12:9].
క్రీస్తు బలప్రభావాలు తనలో నిలిచియుండేలా అది మంచిదని పౌలు చెప్పాడు[12:9].
క్రీస్తు రాయబారుల సూచనలు, సూచక క్రియలు, వింతలూ, అద్భుతాలు పూర్తి సహనంతో వారి మధ్య జరిగాయి[12:12].
పౌలు వారి సొత్తును కోరడం లేదు. వారినే కోరుతున్నాడని వారికి కనపరచునట్లు వారికి చెప్పాడు [12:14].
వారి అత్మల కోసం ఎంతో సంతోషంతో ఖర్చు చేస్తానని, ఖర్చు అవుతానని పౌలు చెప్పాడు[12:15].
కొరింతు పరిశుద్ధుల ఆధ్యాత్మికాభివృద్ధి కొరకే పౌలు ఈ సంగాతులన్నీ చెప్పాడు12:19.
వారి మధ్యలో కలహం, అసూయ, కోపం, జగడాలు, అపనిందలు, గుసగుసలు, మిడిసిపాటు, కలతలు ఉంటాయేమోనని పౌలు భయపడ్డాడు[12 :20].
దేవుడు కొరింతువారి మధ్యలో తలవంపులు తెస్తాడేమోనని పౌలు భయపడ్డాడు[12:21].
ఇంతకుముందు పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వం, అల్లరి క్రియల నిమిత్తం మారుమనస్సు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అని పౌలు భయపడుచున్నాడు[12:21].
కొరింతియులకు 2వ పత్రిక రాయడానికి ముందు పౌలు రెండు సార్లు కొరింతు పరిశుద్ధుల వద్దకు వచ్చాడు[13:1-2].
పౌలు ద్వారా క్రీస్తు మాట్లాడుతున్నాడనే దానికి రుజువుకోసం కొరింతు పరిశుద్ధులు వెతుకుచున్నారు కాబట్టి పౌలు ఇలా చెప్పాడు [13:3].
వారు విశ్వాసంలో ఉన్నారో లేదో అంది కొరింతు పరిశుద్ధులను పౌలు తమను తాము పరిశోధించుకొని పరీక్షించుకోవాలని పౌలు చెప్పాడు[13:5].
తాము ఆమోదం లేనివారు కాదని కొరింతు పరిశుద్ధులు కనుగొంటారని అతడు నిబ్బరంగా ఉన్నాడు[13:6].
వారు సత్యానికి వ్యతిరేకంగా ఏమీ చెయ్యలేమని చెప్పాడు[13:8].
తాను వారితో ఉన్నప్పుడు వారిని కఠినంగా చూడకూడదని పౌలు అలా చేసాడు[13:10].
వారిని పడద్రోయ డానికి కాక వారిని కట్టుటకే ప్రభువు ఇచ్చిన అధికారాన్ని వినియోగించాలని పౌలు కోరుతున్నాడు[13:10].
సంతోషించుడి, పరిపూర్ణులు కావడానికి ప్రయాసపడండి, ఏకమనస్సు కలిగి ఉండండి, సమాధానంగా ఉండండి, పవిత్రమైన ముద్దుపెట్టుకొని వందనాలు చెప్పుకోండని పౌలు వారిని కోరుతున్నాడు[13:11-12].
అందరు ప్రభువైన యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం కలిగి ఉండాలని పౌలు కోరాడు[13:14].
యేసు క్రీస్తు ద్వారా, తండ్రి అయిన దేవుని ద్వారా పౌలు అపోస్తలునిగా అయ్యాడు (1:1).
విశ్వాసులను యేసు క్రీస్తు ప్రస్తుత దుష్ట యుగం నుండి విడిపించాడు (1:4).
వారు ఇంత త్వరగా వేరొక సువార్త వైపుకు తిరిగి పోవడం చూసి పౌలు నిర్ఘాంత పోతున్నాడు (1:6).
సత్య సువార్త ఒక్కటే ఉంది. అది క్రీస్తు సువార్త (1:7).
వేరు సువార్త బోధించేవారు శాపానికి గురి అవుతారని పౌలు చెబుతున్నాడు (1:8,9).
క్రీస్తు సేవకులు ముందుగా దేవుని ఆమోదం పొందాలి
క్రీస్తు సువార్త జ్ఞానాన్ని పౌలు నేరుగా యేసు క్రీస్తు నుండి పొందాడు (1:12)
అతడు యూదు మతాన్ని ఆసక్తిగా అనుసరిస్తూ దేవుని సంఘాన్ని హింసించేవాడు (1:13,14).
పౌలును తన అపోస్తలునిగా తల్లి గర్భం నుండే ఎంపిక చేయడం దేవునికి ఇష్టం అయింది (1:15).
పౌలు అన్యజనుల మధ్య క్రీస్తును ప్రకటించాలని దేవుడు పౌలును తన అపోస్తలునిగా ఎంపిక చేసుకున్నాడు (1:19)
చివరికి మిగతా అపోస్తలులు కేఫా, యాకోబులను కలుసుకునేందుకు పౌలు యెరూషలేము వెళ్ళాడు (1:19).
గతంలో సంఘాన్ని హింసించిన పౌలు ఇప్పుడు విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడని యూదయలోని సంఘాలు విన్నాయి (1:22-23)
పౌలు నాయకులతో వ్యక్తిగతంగా మాట్లాడి తాను ప్రకటిస్తున్న సువార్త గురించి వివరించాడు (2:1).
తీతు సున్నతి చేసుకోనవసరం లేదు (2:3).
వారు పౌలును అతని సహచరులను ధర్మశాస్త్రానికి బానిసలుగా చేయగోరారు (2:4).
లేదు. పౌలు సందేశానికి వారేమీ కలపలేదు (2:6).
పౌలు ముఖ్యంగా సున్నతి లేని వారికి సువార్త చెప్పడానికి పంపబడ్డాడు (2:7-8).
పేతురు ముఖ్యంగా సున్నతి ఉన్నవారికి సువార్త చెప్పడానికి పంపబడ్డాడు (2:7-8).
యెరూషలేములో ఉన్న సంఘ నాయకులు పౌలుకు, బర్నబాకు సహవాస సూచనగా తమ కుడి చేతిని ఇవ్వడం ద్వారా తమ ఆమోదాన్ని తెలియపరిచారు (2:9).
సున్నతి పొందిన వారికి భయపడి యూదేతరులతో కలిసి భోజనం చేయడం మానుకున్నాడు (2:11,12).
కేఫాయే యూదేతరునిలాగా జీవిస్తూ యూదేతరులు యూదుల్లాగా జీవించాలని ఎలా బలవంతం చేస్తావు అని ప్రశ్నించాడు (2:14).
ధర్మ శాస్త్ర క్రియల మూలంగా ఎవరూ నిర్దోషులుగా తీర్చబడరు అని పౌలు అన్నాడు (2:16).
దేవుని ఎదుట నిర్దోషిగా తీర్చబడేది క్రీస్తు యేసులో విశ్వాసముంచిన వారే (2:18).
అతడు నిజానికి ధర్మ శాస్త్రాన్ని మీరే వాడు అవుతాడు అని పౌలు అంటున్నాడు (2:18)
ప్రస్తుతం తనలో క్రీస్తు నివసిస్తున్నాడు అని పౌలు అంటున్నాడు (2:20).
దేవుని కుమారుడు తనను ప్రేమించి, తనను తాను పౌలు కోసం సమర్పించుకున్నాడని పౌలు అంటున్నాడు (2:20).
అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా లెక్కలోకి వచ్చింది (3:6).
దేవుణ్ణి నమ్మిన వారు అబ్రాహాము పిల్లలు (3:7).
యూదేతరులు విశ్వాసం మూలంగా నీతిపరులుగా తీర్చబడతారని లేఖనాలు నిర్దేశించాయి (3:8).
ధర్మశాస్త్ర క్రియలపై ఆధారపడిన వారు శాపం కింద నీతిపరులుగా తీర్చబడతారు (3:10)
ధర్మశాస్త్ర క్రియలపై ఆధారపడి ఎవరూ నీతిపరులుగా తీర్చబడలేదు (3:11).
అబ్రాహము దీవెన యూదేతరులపైకి రావాలని క్రీస్తు మనకోసం శాపంగా అయి మనలను విమోచించాడు (3:14).
అబ్రాహాముకు ఇచ్చిన వాగ్దానంలో చెప్పిన "సంతానం" అంటే క్రీస్తు (3:16)
లేదు. ధర్మశాస్త్రం దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానాలను వమ్ము చేయలేదు (3:17)
అబ్రాహాము సంతానం వచ్చే దాకా పాపాల మూలంగా ధర్మశాస్త్రం వచ్చింది (3:19).
లేఖనాల్లో ధర్మశాస్త్రం అందరినీ పాపం కింద బంధించింది (3:22).
క్రీస్తు యేసు లో విశ్వాసం మూలంగా ధర్మ శాస్త్రం చెర నుండి మనం విడుదల పొందాము (3:23-26).
క్రీస్తులోకి బాప్తిసం పొందిన వారంతా క్రీస్తును ధరించుకున్నారు (3:27).
యూదులు, గ్రీకులు, స్వేచ్ఛ గల వారు, బానిసలూ, అడ, మగ అందరూ యేసు క్రీస్తులో ఒకటిగా అయ్యారు (3:28).
ఆస్తికి వారసుడు బాలుడుగా ఉన్నప్పుడు తండ్రి నియమించిన సమయం వచ్చేదాకా సంరక్షకుల, నిర్వాహకుల కింద ఉంటాడు (4:12)
సరియైన సమయానికి దేవుడు ధర్మశాస్త్రం కింద ఉన్న వారిని విడిపించడానికి తన కుమారుణ్ణి పంపాడు (4: 4,5).
ధర్మశాస్త్రం కింద ఉన్నవారిని దేవుడు తనకు దత్తపుత్రులుగా చేసుకున్నాడు (4:5).
తన పిల్లల హృదయాల్లోకి దేవుడు తన కుమారుని ఆత్మను పంపాడు పంపాడు (4:6).
దేవుణ్ణి ఎరగక ముందు మనం ఈ లోకాన్ని ఏలుతున్న ఆత్మలకు బానిసలం. వీరు ఎంతమాత్రం దేవుళ్ళు కారు (4:3,8).
గలతీయులు ఈ లోకాన్నేలే ఆత్మలకు తిరిగి మళ్ళుతున్నారని పౌలు ఆశ్చర్యపోతున్నాడు (4:9).
గలతీయులు మరలా బానిసలై పోతారేమోనని, తాను పడిన కష్టమంతా వృథా అయిపోతుందేమోనని భయపడుతున్నాడు (4:9,11).
పౌలు మొదట గలతీయుల దగ్గరికి వచ్చినప్పుడు అతనికి శరీర బలహీనత ఉంది (4:13).
పౌలుకు సమస్య ఉన్నా గలతీయులు అతణ్ణి దేవుని దూత లాగా, అతడు క్రీస్తు యేసు అయినట్టు చేర్చుకున్నారు (4:14).
అబద్ధ బోధకులు గలతీయులను పౌలు నుండి వేరు చేయాలనుకుంటున్నారు (4:17).
అబద్ధ బోధకులు గలతీయులను తిరిగి ధర్మశాస్త్రం కింద ఉంచాలనుకుంటున్నారు (4:21).
అబ్రాహాము ఇద్దరు కొడుకులను ఒకణ్ణి బానిస స్త్రీ వల్లా, ఒకణ్ణి స్వతంత్రురాలైన స్త్రీ వల్ల, కన్నాడు (4:22).
పైనున్న యెరూషలేము స్వతంత్రురాలైన స్త్రీ పౌలుకు, విశ్వాసులైన గలతీయులకు అలంకారికంగా తల్లి (4:26).
క్రీస్తులో విశ్వాసం ఉంచిన వారు వాగ్దాన రీతి సంతానం (4:28).
వాగ్దాన పుత్రులను పీడించినది శరీర రీతిగా పుట్టిన సంతానం (4:29).
బానిస స్త్రీ వల్ల పుట్టిన వారు స్వతంత్రురాలైన స్త్రీకి పుట్టిన వారితో సమానంగా వారసత్వం పొందరు (4:30).
క్రీస్తులో నమ్మకం ఉంచినవారు స్వతంత్రురాలైన స్త్రీకి పుట్టినవారే (4:31).
క్రీస్తు మనలను విడిపించింది స్వతంత్రులుగా చేయడానికే (5:1).
గలతీయులు సున్నతి పొందితే వారికీ క్రీస్తు వల్ల ఎలాటి ప్రయోజనమూ ఉండదని పౌలు హెచ్చరించాడు (5:2).
ధర్మశాస్త్రం పాటించడం ద్వారా నిర్దోషులుగా తీర్చబడాలని చూసే గలతీయులు క్రీస్తునుండి వేరైపోతారని, కృప నుండి తొలిగి పోతారని పౌలు హెచ్చరించాడు (5:4).
క్రీస్తు యేసులో నిజంగా అర్థవంతమైన సంగతి ప్రేమ ద్వారా కార్యం జరిగించే విశ్వాసమే (5:6)
సువార్త విషయం గలతీయులను తప్పుదారి పట్టించిన వారు దేవుని తీర్పు ఎదుర్కొంటారని పౌలు నిస్సందేహంగా నమ్ముతున్నాడు (5:10).
సున్నతి సిలువ అనే అడ్డు బండ విషయంలో అభ్యంతరాన్ని తీసివేస్తుందని పౌలు చెప్పాడు (5:11).
విశ్వాసులు క్రీస్తులో తమ స్వేచ్ఛను ఒకరినొకరు ప్రేమతో సేవించుకోడానికి ఉపయోగించాలి (5:13).
"నిన్ను వలె నీ సాటి మనిషిని ప్రేమించాలి" అనే ఒక్క ఆజ్ఞలో ధర్మశాస్త్రం అంతా నిక్షిప్తమై ఉంది (5:14).
ఆత్మ ద్వారా జీవించడం ద్వారా విశ్వాసులు శరీర కోరికలను తీర్చుకోకుండా ఉండగలుగుతారు (5:16).
విశ్వాసిలో ఆత్మ, శరీరం ఒక దానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి (5:17).
ఇక్కడ ఇచ్చిన జాబితా లోవన్నీశరీర క్రియలకు ఉదాహరణలే. లైంగిక అవినీతి, అశుద్ధత, కామవికారం, విగ్రహ పూజ, మంత్ర విద్య, వ్యతిరేక భావం, కలహం, అసూయ, ముక్కోపం, విరోధం, అభిప్రాయ భేదాలు, చీలికలు, మాత్సర్యం, తాగుబోతు తనం, విచ్చలవిడి తనం (5: 20-21).
శరీర క్రియలు జరిగించే వారు దేవుని రాజ్యాన్ని వారసత్వంగా పొందలేరు (5:21)
ఆత్మ ఫలాలు ప్రేమ, సంతోషం, శాంతి, సహనం, దయ, మంచితనం, విశ్వాసం, మృదుత్వం, సంయమనం (5:22,23).
క్రీస్తు యేసుకు చెందినవారు తమ శరీరం, దాని కోరికలను సిలువ వేశారు (5:24)
అత్మసంబంధులైన వారు అ వ్యక్తిని మృదువుగా తిరిగి మంచిదారికి తీసుకు రావాలి (6:1).
ఆత్మసంబంధులైన వారు తామూ శోధనలో పడతామేమో నని చూసుకోవాలి (6:1).
ఒకరి భారాలు ఒకరు మోయడం ద్వారా విశ్వాసులు క్రీస్తు నియమాన్ని నెరవేర్చాలి (6:2).
ఎవరైనా తన పని గురించి తానే అతిశయ పడడానికి తనను ఎవరితోనూ పోల్చుకోకుండా తన పనిని పరీక్షించుకోవాలి (6:4).
వాక్యం నేర్చుకున్న వాడు తనకు నేర్పించిన వాడికి అన్ని మంచి విషయాల్లో భాగం ఇవ్వాలి (6:6).
ఒకడు ఆత్మ సంబంధంగా నాటిన వాటినే పంట కోసుకుంటాడు (6:7).
శరీర రీతిగా నాటినవాడు శరీరం నుండి నాశనం అనే పంట కోసుకుంటాడు (6:8).
ఆత్మలో నాటినవాడు ఆత్మ సంబంధమైన నిత్య జీవం అనే పంట కోసుకుంటాడు (6:8).
ఎడతెగకుండా మంచినే చేస్తూ ఉండే విశ్వాసి పంట కోసుకుంటాడు (6:9).
విశ్వాసులు విశ్వాస గృహానికి చెందిన వారి పట్ల మేలు చేయాలి (6:10).
విశ్వాసులు సున్నతి పొందాలని బలవంత పెట్టే వారు క్రీస్తు సిలువ నిమిత్తం బాధలు పొందడానికి ఇష్టపడరు (6:12).
మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువ విషయం గర్వ పడుతున్నాను అంటున్నాడు (6:14).
నూతన జన్మ ప్రాముఖ్యం (6:15).
నూతన సృష్టి నియమం ప్రకారం, ఇశ్రాయేలు దేవునిలో జీవించే వారికి పౌలు శాంతి కరుణలు కలగాలని కోరుతున్నాడు (6:16).
పౌలు తన శరీరంలో క్రీస్తు ముద్రలు కలిగి ఉన్నాడు
ఈ లేఖ అందుకోబోతున్న వారిని పౌలు దేవునికి ప్రత్యేకించబడిన వారని, నమ్మకంగా క్రీస్తు యేసుపై ఆధార పడిన వారని వర్ణించాడు (1:1).
తండ్రి అయిన దేవుడు క్రీస్తులో పరలోక స్థలాల్లోని ప్రతి ఆత్మ సంబంధమైన దీవెనలతో విశ్వాసులను దీవించాడు (1:3).
క్రీస్తులో విశ్వాసముంచిన వారిని తండ్రి అయిన దేవుడు సృష్టికి ముందే ఎన్నుకున్నాడు (1:4).
తండ్రి అయిన దేవుడు విశ్వాసులను తన దృష్టిలో పవిత్రంగా నిర్దోషంగా ఉండాలని ఎన్నుకున్నాడు (1:4).
దేవుడు విశ్వాసులను ముందుగా ఎందుకు నిర్ణయించాడంటే అది ఆయనకు ఇష్టమైంది. అంతేగాక తన మహిమ గల కృపకు కీర్తి కలగాలని అలా చేసాడు (1:5,6).
క్రీస్తు రక్తం మూలంగా విశ్వాసులకు విమోచన, పాప క్షమాపణ లభించింది (1:7).
భూమి పైనా, ఆకాశంలోనూ ఉన్న వాటన్నిటిని దేవుడు క్రీస్తుకు లోబరుస్తాడు (1:10).
విశ్వాసులు వాగ్దానం చేయబడిన ఆత్మ అనే ముద్రను పొందారు (1:13).
ఆత్మ విశ్వాసులు పొందనైయున్న వారసత్వానికి హామీ (1:14).
ఎఫెసీయులు వారి పిలుపులోని నిబ్బరాన్ని, వారి వారసత్వంలోని సౌభాగ్యాన్ని, వారిలో ఉన్న దైవ శక్తి లోని గొప్పదనాన్ని అర్థం చేసుకోవడానికి తెలివి పొందాలని పౌలు ప్రార్థించాడు (1:18,19).
అదే ప్రభావం క్రీస్తు ను చనిపోయిన వారిలో నుండి లేపి, ఆయనను పరమ స్థలాల్లో దేవుని కుడి వైపున కూర్చో బెట్టింది (1:20).
క్రీస్తు పాదాల కింద దేవుడు సమస్తాన్నీ ఉంచాడు (1:22).
సంఘంలో అన్నిటికీ క్రీస్తు శిరస్సు (1:22).
సంఘం క్రీస్తు శరీరం (1:23).
అవిశ్వాసులంతా తమ అతిక్రమాల్లో పాపాల్లో చనిపోయి ఉన్నారు (2:1).
అవిధేయత పిల్లల్లో వాయు సంబంధమైన అధిపతుల నాయకుడు పని చేసున్నాడు (2:2).
స్వతహాగా అవిశ్వాసులందరూ ఉగ్రత పుత్రులు (2:3).
దేవుడు కొందరు అవిశ్వాసులను తన అధిక కరుణ, గొప్ప ప్రేమల మూలంగా క్రీస్తులో నూతన జీవానికి తెచ్చాడు (2:4-5).
దేవుని కృప మూలంగా విశ్వాసులు రక్షణ పొందారు (2:5).
విశ్వాసులు పరమ స్థలాల్లో క్రీస్తు యేసుతో కూర్చుని ఉన్నారు (2:6).
విశ్వాసులను రాబోయే యుగాల్లో వారి పట్ల తన కృప అనే మహా భాగ్యాన్ని కనుపరచాలని దేవుడు రక్షించి లేపాడు (2:7).
ఏ విశ్వాసి తన సత్క్రియల గురించి గొప్పలు చెప్పుకోకూడదు. ఎందుకంటే దేవుని కానుకగా అతడు పొందిన కృప వల్ల రక్షణ పొందాడు. (2:8-9).
వారు సత్క్రియల్లో నడుచుకోవాలని దేవుడు క్రీస్తు యేసులో విశ్వాసులను సృష్టించాడు (2:10).
విశ్వాసం లేని యూదేతరులు క్రీస్తు నుండి వేరై పోయారు. ఇశ్రాయేలుకు దూరమై పోయారు. వారు నిబంధనకు అపరిచితులు. దేవుడు గానీ ఆశాభావం గానీ లేని వారు (2:12).
విశ్వాసం లేని యూదేతరులు కొందరిని దేవునికి దగ్గరగా తీసుకు వచ్చింది క్రీస్తు రక్తం (2:13).
క్రీస్తు తన శరీరం ద్వారా యూదేతరులను యూదులను ఒక్క ప్రజగా చేసాడు. వారిని వేరు చేస్తున్న శత్రుత్వాన్ని నాశనం చేశాడు (2:14).
యూదేతరులకు యూదులకు మధ్య శాంతి స్థాపించడానికి క్రీస్తు ఆజ్ఞలతో, కట్టడలతో కూడిన ధర్మశాస్త్రాన్ని నాశనం చేసాడు (2:15-16).
పరిశుద్ధాత్మ మూలంగా విశ్వాసులకు తండ్రి చెంతకు ప్రవేశం ఉంది (2:18).
క్రీస్తే మూల రాయిగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాదిపై దేవుని కుటుంబం కట్టబడింది (2:20).
యేసు ప్రభావం నిర్మాణం మొత్తాన్నిచక్కగా అమర్చి అభివృద్ధి కలిగిస్తున్నది (2:21).
దేవుని కుటుంబం అనే కట్టడం ప్రభువుకు ప్రత్యేకపరచబడిన ఆలయం (2:21).
దేవుడు ఆత్మ ద్వారా విశ్వాసిలో నివసిస్తున్నాడు (2:22).
యూదేతరుల ప్రయోజనం కోసం దేవుడు పౌలుకు వరం ఇచ్చాడు (3:1-2)
గడిచిన తరాల్లో దేవుడు మానవజాతికి చెప్పకుండా దాచిన సంగతి క్రీస్తును గూర్చిన రహస్య సత్యం (3:35).
క్రీస్తును గూర్చిన రహస్య సత్యాన్ని దేవుడు తన అపోస్తలులకు ప్రవక్తలకు వెల్లడి చేశాడు (3:5).
వెల్లడి అయిన రహస్య సత్యం ఏమిటంటే యూదేతరులు కూడా సాటి వారసులు, శరీరంలో భాగస్తులు. క్రీస్తు యేసు వాగ్దానాల్లో భాగం పంచుకునే వారు (3:6).
దేవుని కృప అనే వరం పౌలుకు ఇవ్వబడింది (3:7).
దేవుని ప్రణాళిక గూర్చి యూదేతరులకు వివరించ దానికి పౌలు పంపబడ్డాడు (3:9).
దేవుని సంక్లిష్టమైన జ్ఞానం సంఘం మూలంగా వెల్లడి అవుతుంది (3:12).
క్రీస్తులో విశ్వాసం మూలంగా విశ్వాసులకు ధైర్యం, నిబ్బరంతో కూడిన ప్రవేశం ఉందని పౌలు చెప్పాడు (3:12).
భూమి మీదా, ఆకాశంలో ఉన్న ప్రతి కుటుంబం తండ్రి పేరున సృష్టి అయి ఆయన పేరు పెట్టబడింది (3:14-15).
వారిలో నివసిస్తున్న దేవుని ఆత్మ మూలంగా శక్తి పొంది విశ్వాసులు బలం పొందాలని పౌలు ప్రార్థించాడు (3:16-17).
విశ్వాసులుక్రీస్తు ప్రేమ వెడల్పు, పొడవు, ఎత్తు, లోతు అర్థం చేసుకోగలగాలని పౌలు ప్రార్థించాడు (3;18).
సంఘంలో, క్రీస్తు యేసులో అన్ని తరాల్లోనూ తండ్రికి మహిమ కలుగుతుంది అని పౌలు ప్రార్థించాడు (3:21).
విశ్వాసులు నమ్రతగా, మృదుత్వంతో, సహనంతో, ఒకరినొకరు ఆమోదించుకుంటూ జీవించాలని పౌలు హెచ్చరించాడు (4;1-2)
ఒక్కటే శరీరం, ఒక్కటే ఆత్మ, నిరీక్షణ గురించిన నిబ్బరం ఒక్కటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం, బాప్తిసం ఒక్కటే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే (4:4-6).
క్రీస్తు వరాల పరిమాణం ప్రకారం ప్రతి విశ్వాసికి ఆయన వరం ఇచ్చాడు (4:7-8).
క్రీస్తు తన శరీరానికి ఇచ్చిన 5 అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు (4;11).
శరీరానికి ఇచ్చిన ఈ 5 వరాలు విశ్వాసులను సేవ కోసం సిద్ధ పరచడానికి, శరీరం క్షేమాభివృద్ధి చెందడం నిమిత్తం పని చేయాలి (4:12).
మనుషుల కపటం మూలంగా తప్పుదారి పట్టించే మోసం మూలంగా అటు ఇటు కొట్టుకు పోతూ, ఉండడంలో విశ్వాసులు చిన్న పిల్లల్లాగా బేలగా ఉంటున్నారు (4:4).
ప్రతి ఒక్కరూ ప్రేమలో ఎదుగుతూ ఉండేటందుకు, శరీరంలో ప్రతి భాగం క్షేమాభివృద్ధి చెందడం నిమిత్తం కీళ్ళ ద్వారా అమరి, అతికి ఉంది (4:16).
యూదేతరులు తమ ఆలోచనల్లో అంధకారం లో ఉండి, దేవునికి దూరమై అపవిత్ర చర్యలకు తమను అప్పగించుకున్నారు (4:17,19)
విశ్వాసులు పాడై పోయిన పాత స్వభావాన్ని తీసేసి, నీతిమూలంగా సృష్టి అయిన నూతన స్వభావం ధరించుకోవాలి (4:22-24)
విశ్వాసి సూర్యాస్తమయం తరువాత కూడా కోపం ఉంచుకుంటే సాతానుకు అవకాశం కలుగుతుంది.
అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడం కోసం విశ్వాసులు కష్టపడి పని చెయ్యాలి (4:28).
చెడ్డమాటలు ఏవీ విశ్వాసి నోట రాకూడదు. ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించే మాటలే రావాలి (4:29).
విశ్వాసి పరిశుద్దాత్మను దుఃఖపెట్టకూడదు (4:30).
దేవుడు విశ్వాసిని క్రీస్తులో క్షమించాడు గనక విశ్వాసి ఇతరులను క్షమించాలి (4:32).
పిల్లలు తండ్రిని అనుకరించినట్టు విశ్వాసులు తండ్రి అయిన దేవుణ్ణి అనుకరించాలి (5:1).
క్రీస్తు తనను విశ్వాసుల కోసం దేవునికి బలిగా అర్పణగా ఇచ్చేశాడు (5:2).
లైంగిక దుర్నీతి, అపవిత్రత, శరీర దురాశ విశ్వాసులమధ్య ప్రస్తావించ కూడదు (5:3).
కృతజ్ఞతాపూర్వకమైన ప్రవృత్తి విశ్వాసుల్లో కనిపించాలి (5:4).
లైంగిక దుర్నీతి, అపవిత్రత, శరీర దురాశగల వారికి దేవుని రాజ్యంలో క్రీస్తు రాజ్యంలో వారసత్వం లేదు (5:5).
అవిధేయుల మీదికి దేవుని ఉగ్రత వస్తున్నది (5:6).
మంచితనం, నీతి, సత్యం అనే ఫలం దేవునికి ఇష్టం.
అలాటి వాటిలో విశ్వాసులు పాల్గొనకూడదు. చీకటి పనులను వారు బట్టబయలు చెయ్యాలి (5:11).
వెలుగు అన్నిటినీ బహిర్గతం చేస్తుంది (5:13)
దినాలు చెడ్డవి గనక విశ్వాసులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి (5:16).
తాగి మత్తెక్కడం నాశనానికి నడుపుతుంది (5:18).
విశ్వాసులు ఒకరితో ఒకరు పాటలతో, కీర్తనలతో, ఆధ్యాత్మిక గీతాలతో మాట్లాడుకోవాలి (5:19).
ప్రభువుకు లోబడినట్టుగా భార్యలు భర్తలకు లోబడాలి (5:22).
భర్త భార్యకు శిరస్సు.? క్రీస్తు సంఘానికి శిరస్సు(5:23).
వాక్కు అనే నీటితో స్నానం చేయించడం ద్వారా క్రీస్తు తన సంఘాన్ని పవిత్రంగా ఉంచుతాడు (5:26-27).
భర్తలు తమ స్వంత శరీరాలను ప్రేమించుకున్నట్టే భార్యలను ప్రేమించాలి (5:28).
ఒక మనిషి తన స్వంత శరీరాన్ని చక్కగా పోషించుకుంటాడు (5:29).
ఒక మనిషి తన భార్యతో కలిస్తీ వారిద్దరూ ఏక శరీరం అవుతారు (5:31).
అందులో క్రీస్తు ఆయన సంఘం గురించిన సత్యం దాగి ఉంది (5:32).
క్రైస్తవ పిల్లలు తమ తల్లిదండ్రులను గౌరవించి ఘన పరచాలి (6:1-2).
క్రైస్తవ తండ్రులు తమ పిల్లలను క్రమశిక్షణలో ప్రభువు బోధలో పెంచాలి (6:4).
క్రైస్తవ బానిసలు తమ యజమానులకు తమ హృదయంలో యధార్థత కలిగి ప్రభువుకు చేసినట్టుగా సంతోషంతో తమ యజమానులను సేవించాలి (6:5-7).
ఏ మంచి పని చేసినా తనకు ప్రతిఫలం ప్రభువు నుండే కలుగుతుందని భావించాలి (6:8).
క్రైస్తవ యజమాని తనకు, తన సేవకునికి యజమాని పరలోకంలో ఉన్నాడని గుర్తుంచుకుని ఆయనలో ఏ పక్షపాతం లేదని గ్రహించాలి (6:9).
సైతాను కుతంత్రాల నుండి తనను కాపాడుకోవడానికి విశ్వాసి దేవుని సర్వాంగ కవచం ధరించాలి (6:11,13,14).
దుష్ట అంధకార లోకపు పరిపాలకులతో, ఆత్మ సంబంధమైన ప్రభుత్వాలతో పోరాడాలి (6:12).
దేవుని కవచంలో సత్యం అనే బెల్టు, నీతి అనే ఛాతీ కవచం, సువార్తకోసం సన్నద్ధం అనే చెప్పులు, విశ్వాసం అనే డాలు, రక్షణ శిరస్త్రాణం, ఆత్మ ఖడ్గం ఉన్నాయి (6:14-17)
ఆత్మ ఖడ్గం దేవుని వాక్కు (6:17).
అన్ని సమయాల లోనూ, దేవుని జవాబు కోసం ఎదురు చూస్తూ ఎడతెగక ప్రార్థించాలి (6:18).
తను సువార్త చెప్పేటప్పుడు ధైర్యంతో కూడిన వాక్కు తనకు అనుగ్రహించ బడేలా కోరుతున్నాడు (6:19-20).
ఈ లేఖ రాసినప్పుడు పౌలు చెరసాలలో ఉన్నాడు
దేవుడు వారికి శాంతి, విశ్వాసంతో కూడిన ప్రేమ, కృప ఇమ్మని దేవుణ్ణి అడుగుతున్నాడు (6:23-24).
పౌలు ఈ ఉత్తరo ఫిలిప్ఫీలో ఉంటూ క్రీస్తు యేసులో ప్రత్యేకపరచిన వారికీ, సంఘనాయకులకూ పరిచారకులకూ వ్రాశాడు(1:1).
శుభవార్త విషయంలో మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఫిలిప్పీయులు భాగస్వాములవటం వల్ల పౌలు దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాడు(1:5).
ఫిలిప్పీయుల్లో మంచి పని మొదలు పెట్టిన వాడే దాన్ని ముగిస్తాడని పౌలు నమ్మకం(1:6).
పౌలు చెరసాలలో ఉండి సువార్త విషయంలో తనను గురించి వాదించుకుంటూ ఒప్పిస్తూ ఉన్నప్పుడు ఫిలిప్పీయులు పౌలు జత పనివారుగా ఉన్నారు(1:7).
ఫిలిప్పీయుల్లో అంతకంతకూ ప్రేమ అభివృద్ధి కావాలని పౌలు ప్రార్ధిoచాడు(1:9).
ఫిలిప్పీయులు నీతిఫలాలతో నిండాలని పౌలు కోరుకుంటున్నాడు(1:11).
పౌలు చెర క్రీస్తు కోసమే అని అందరికి బాగా తెలిసిoది. ఇప్పుడు అనేక మంది సోదరులు ఎక్కువ ధైర్యంతో మాట్లాడటo వల్ల శుభవార్త బాగా వ్యాపించింది(1:12-14).
స్వార్ధంతో కపటమైన భావాలతో క్రీస్తును ప్రకటించే వారు ఖైదులోని పౌలుకు మరిన్ని కష్టాలు కలుపుతూ ఉన్నారు(1:17).
నిజమైన క్రీస్తు బోధకూ, కపటమైన క్రీస్తు బోధకు పౌలు స్పందన ఏ విధంగానైనా క్రీస్తు ప్రకటన జరుగుతూ ఉందని ఆనందిస్తున్నాడు(1:18).
చావు ద్వారా గాని బ్రతుకు ద్వారా గాని క్రీస్తుకు మహిమ తీసుకురావలని పౌలు కోరుకుంటున్నాడు(1:21).
బ్రతకడం క్రీస్తే, చావైనా లాభమే అని పౌలు చెప్పాడు(1:21).
మరణించి క్రీస్తుతో ఉండడమా లేక బ్రతికి ఉండి తన పరిచర్య కొనసాగించడమా అనే రెండు ఎంపికలు అతణ్ణి రెండు వైపులకు లాగాయి (1:22,24).
విశ్వాసంలో ఫిలిప్పీయుల అభివృద్ధి, ఆనందాల కోసం ఉండాలని పౌలు నిబ్బరంగా ఉన్నాడు(1:25)
ఫిలిప్పీయులతో ఉన్నా వారికి దూరంగా ఉన్నా వారు శుభవార్త విశ్వాసం కోసం ఏకాత్మలో స్టిరంగా నిలిచి ఏకమనస్సుతో పెనుగులాడుతుండటం వినాలని కోరుకుంటున్నాడు(2:27).
ఫిలిప్పీయులు భయపడకుండా ఉంటే అది వారి శత్రువుల నాశనానికి, వారి రక్షణకీ సూచన (1:28).
ఫిలిప్పీయులు క్రీస్తును నమ్మాలని, అయన పక్షంగా బాధలు అనుభవించాలని దేవుడు నిర్దేశించాడు (1:29).
ఫిలిప్పీయులు ఒకే భావం, ఒకే ప్రేమ కలిగి, ఆత్మలోనూ మనస్సులోనూ కలిసి ఉండాలని పౌలు చెబుతున్నాడు(2:2).
ఫిలిప్పీయులు ఒకరినొకరు తమ కంటే ఇతరులు ఎక్కువ వారిగా ఎంచుకోవాలని పౌలు చెపుతున్నాడు(2:3).
క్రీస్తు యేసుకు కలిగిన మనసు కలిగి ఉండాలని పౌలు చెపుతున్నాడు(2:5-6).
క్రీస్తు యేసు దేవుని స్వరూపంలో ఉన్నాడు(2:6).
క్రీస్తు యేసు మనిషి పోలికలో కనపడి దాసుని స్వరూపం తీసుకొన్నాడు(2:7).
యేసు తనను తానే సిలువపై మరణం పొందేటంతగా విధేయత చూపి తగ్గించుకున్నాడు(2:8).
దేవుడు ఆయనను ఎంతో గొప్పగా హెచ్చించి అన్ని పేర్లు కంటే ఉన్నతమైన పేరు ఆయనకు ఇచ్చాడు(2:9).
ప్రతి నాలుకా యేసు క్రీస్తే ప్రభువని ఒప్పుకోవాలి(2:11).
ఫిలిప్పీయులు రక్షణను భయంతోనూ వణుకుతోనూ కొనసాగాలని పిలిచాడు(2:12).
విశ్వాసుల్లో దేవుడు తనకు ఇష్టమైన ఉద్దేశం ప్రకారం సంకల్పించడానికీ చేయడానికీ పనిచేస్తున్నాడు(2:13).
సణుగులూ వివాదాలు లేకుండా ప్రతిదీ జరగాలి (2:14).
ఫిలిప్పీయుల విశ్వాససంబంధమైన సేవలోనూ విశ్వాసయాగంలోనూ పౌలు తన జీవితాన్ని ధార పోశాడు(2:17).
పౌలు సంతోషతో కూడిన గొప్ప ఆనందo కలిగి ఉన్నాడు, ఫిలిప్పీయులు అలాంటి వైఖరే కలిగి ఉండాలని పిలిచాడు(2:17-18).
తిమోతి తన స్వలాభం కోసం కాక ఫిలిప్ఫీయుల కోసం నిజమైన శ్రద్ధ తీసుకోడం వల్ల పౌలుకి తిమోతి ఒక ప్రత్యేకమైన సహకారి(2:20-21).
అవును, త్వరలో ఫిలిప్ఫీయులను చూడటానికి పౌలు ఎదురు చూస్తున్నాడు(2:24).
పౌలు అవసరాలకు కావలసిన వాటినీ ఏర్పాటు చేస్తూ క్రీస్తు పనికై ఎపఫ్రోదితు చనిపోయేoతగా పాటుబడ్డాడు (2:30).
కుక్కలనూ, దుష్టులైన పనివారినీ, ఛేదన ఆచరించే వారిని విశ్వాసులు జాగ్రత్తగా కనిపెట్టాలని పౌలు హెచ్చరించాడు(3:2).
శరీరం మీద నమ్మకం పెట్టుకొనక క్రీస్తు యేసు మహిమలో దేవుని ఆత్మలో ఆరాధించే వారిదే నిజమైన సున్నతి అని పౌలు చెప్పాడు (3:3).
ధర్మశాస్త్ర నీతి ప్రకారం పౌలు తన గత ప్రవర్తన విషయంలో తప్పులేని వాడినని చెపుతున్నాడు(3:6).
పౌలు తన శరీర సంబంధంమైన గత విశ్వాసం ఇప్పుడు క్రీస్తు ద్వారా విలువలేనిదిగా లెక్కిస్తున్నాడు(3:7).
ఇప్పుడు క్రీస్తును సంపాదించుకోడం వల్ల పౌలు తన గత ప్రవర్తన విషయలన్ని అర్ధం పర్దం లేని చెత్త అని తలస్తున్నాడు(3:8).
క్రీస్తునందు విశ్వాసం ద్వారా పౌలు ఇప్పుడు దేవుని నీతి కలిగి ఉన్నాడు(3:9).
క్రీస్తు శ్రమల్లో పౌలు సహవాసం కలిగి ఉన్నాడు(3:10).
పౌలు ఎడతెగక ముందుకు కొనసాగుతున్నాడు(3:12).
క్రీస్తు యేసులో దేవుని ఉన్నతమైన పిలుపుకు చెందే బహుమతి కోసం గురి వైపు పౌలు కొనసాగుతున్నాడు(3:14).
తన ఆదర్శాన్ని, నడకను వారు అనుకరించాలని పౌలు కోరాడు (3:17).
ఎవరి కడుపు వారికి దేవుడో, ఎవరు లోక విషయాలపై మనస్సు ఉంచుతారో వారి అంతం నాశనమే (3:19).
విశ్వాసుల పౌరసత్వం పరలోకంలో ఉందని పౌలు చెప్పాడు(3:20).
క్రీస్తు విశ్వాసుల దీన శరీరాలను ఆయన మహిమ శరీరo వలె మారుస్తాడు(3:21).
వారు ప్రభువులో స్థిరంగా నిలబడాలని పౌలు కోరుతున్నాడు (4:1).
యువోదియ, సుంటుకేలిద్దరూ ఏక మనస్సు కలిగి ఉండాలని పౌలు కోరుతున్నాడు?
ఎల్లప్పడు ప్రభువులో ఆనందించమని వారికి చెప్పాడు(4:4).
కలత చెందటానికి బదులు మనకు అవసరమైన వాటిని దేవునికి కృతజ్ఞతతో ప్రార్ధనలో ఆయనకు చెప్పాలని పౌలు చెప్పాడు(4:6).
ఈ విధంగా చేస్తే, మన హృదయాలకు తలంపులకు దేవుని శాంతి కావలిగా ఉంటుంది(4:7).
గౌరవిoచదగినవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, అందమైనవి, మంచి పేరుగలవి, శ్రేష్టమైనవి, మెప్పుకు తగిన వాటి పైన మనసు పెట్టాలని పౌలు చెపుతున్నాడు(4:8).
ఇప్పుడు ఫిలిప్పీయులు పౌలు పట్ల తమ శ్రద్ధను నూతన పరచ గలుగుతున్నారు (4:10).
కలిమిలోనూ లేమిలోనూ కూడా తృప్తిగా ఉండడం నేర్చుకున్నాడు (4:11,12).
పౌలు అన్ని పరిస్థితుల్లోనూ క్రీస్తు తనను బలపరచిన కొద్దీ తృప్తిగా జీవించ గలుగుతున్నాడు (4:13).
పౌలు తన అవసరాల కోసం ఫిలిప్పీయులు సమకూర్చి ఇస్తున్న వాటికి ప్రతిఫలంగా వారి లెక్కకు విస్తార ఫలాలు రావాలని పౌలు కోరుకుంటున్నాడు(4:4-17).
పౌలు కోసం ఫిలిప్పీయులు పంపిన కానుక దేవునికి ఇష్టమైన అర్పణ లాగా ఉన్నది(4:18).
దేవుడు క్రీస్తు యేసులో ఉన్న తన దివ్యమైన ఐశ్వర్యం ప్రకారం ఫిలిప్ఫీయుల అక్కరలన్నీ తీరుస్తాడని పౌలు చెప్పాడు(4:19).
పౌలు ఫిలిప్పీయులకు కైసరు ఇంటివారి అభినందనలు చెపుతున్నాడు(4:22).
క్రీస్తు యేసు అపోస్తులుడుగా పౌలు దేవుని చిత్తం వలన అయ్యాడు(1:1).
పౌలు ఈ లేఖ కొలొస్సయిలో ఉన్న దేవుని కోసం ప్రత్యేకపరచుకొనిన వారికీ, విశ్వాసులైన సోదరులకు వ్రాశాడు(1:1)
కొలొస్సయులు కలిగివున్న నమ్మకమైన ఆశాభావం గూర్చి శుభవార్త అనే సత్య వాక్కులో విన్నారు(1:5).
శుభవార్త లోకంలో ఫలిస్తూ ఎదుగుతున్నదని పౌలు చెపుతున్నాడు(1:6).
శుభవార్త కొలొస్సయులకు నమ్మకమైన క్రీస్తు సేవకుడు ఎపఫ్రా పరిచయం చేశాడు(1:7).
కొలొస్సయులు ఆత్మ సంబంధమైన వివేకం, దేవుని చిత్తం గూర్చిన సంపూర్ణ జ్ఞానంతో నిండాలని పౌలు ప్రార్ధిస్తున్నాడు(1:9).
కొలొస్సయులు తమ జీవితంలో ప్రభువుకు తగిన విధంగా నడుస్తూ, ప్రతి మంచి పనిలో ఫలిస్తూ, దేవుని జ్ఞానంలో వృద్ధి చెందాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు(1:10).
దేవుని కోసం ప్రత్యేకించినవారు వెలుగులో ఉన్న వారసత్వంలో పాలిభాగస్థ్హులవటానికి యోగ్యులయ్యారు(1:12).
ఆయన కోసం ప్రత్యేకించినవారిని తండ్రి చీకటి పరిపాలన నుంచి విడిపించి ఆయన కుమారుని రాజ్యoలోకి తెచ్చాడు(1:13).
క్రీస్తులో విమోచన అంటే మన పాపాలకు క్షమాపణ(1:14).
కుమారుడు కనిపించని దేవుని స్వరూపం(1:15).
యేసుక్రీస్తు ద్వారా, ఆయన కోసం అన్నీoటినీ సృష్టించడం జరిగింది(1:16).
దేవుడు తానే అన్నిటిని తన కుమారుని రక్తం ద్వారా సమాధానంతో సంధి చేసుకొని సఖ్యపరచుకొన్నాడు(1:20).
కొలస్సయులు శుభవార్తను నమ్మకముoదు దేవునికి పరాయివారునూ, ఆయనకు శత్రువులైయున్నారు(1:21).
కొలస్సయులు నిరంతరం శుభవార్తలో నమ్మకముంచి విశ్వాసంలో స్థిరంగా ఉoడాలి (1:23).
పౌలు సంఘం కోసం బాధలు పడుతూ వాటిలో ఆనందిస్తున్నాడు(1:24).
యుగాల నుండి దాగి ఉన్న రహస్యం ఇప్పుడు మీలో ఉన్న క్రీస్తులో వెల్లడయ్యింది, ఆయనే మహిమకు ఆశాభావం(1:27).
పౌలు ఉపదేశమూ హెచ్చరికల లక్ష్యం క్రీస్తులో ప్రతి ఒక్కరినీ సంపూర్ణులుగా సమర్పించడం (1:28).
దేవుని రహస్యం క్రీస్తు(2:2).
క్రీస్తులో జ్ఞానవివేకాల నిధులన్నీ దాగి ఉన్నాయి(2:3).
కొలొస్సయులు ఒప్పింప చేసే మాటలతో మోసపోతారేమోనని పౌలు కలత చెందాడు(2:4).
కొలొస్సయులు క్రీస్తు యేసును స్వీకరించిన విధంగానే నడుచుకోవాలని పౌలు పిలిచాడు(2:6).
అర్ధంలేని వట్టి మోసాలు, మానవ ఆచారాల పైన, లోకంలోని పాపభూయిష్టమైన వ్యవస్థలపైనా ఆధారపడి ఉన్నాయి(2: 8).
క్రీస్తులో దేవుని స్వభావo సంపూర్తిగా నివసిస్తున్నది(2: 9).
ప్రభుత్వాలకూ ఆధిపత్యాలకూ అధికారి క్రీస్తు(2:10).
క్రీస్తు సున్నతి ద్వారా శరీర సంబంధమైన పాప స్వభావాన్ని తొలగించాడు(2:11).
బాప్తిసంలో ఒక వ్యక్తిని క్రీస్తుతో కూడా పాతిపెట్టడం జరిగింది(2:12).
క్రీస్తు ఒకని సజీవంగా చేయక ముoదు ఆ వ్యక్తి అపరాధాలలో చనిపోయి ఉన్నాడు(2:13).
మనకు విరోధంగా ఉన్న రుణపత్రం తొలగించి దానిని సిలువకు మేకులతో కొట్టాడు(2:14).
క్రీస్తు ప్రధానులనూ అధికారులనూ తొలగించి జయోత్సం ఊరేగింపులో వారిని నడిపించి బహిరంగంగా కనపడేలాచేసాడు (2:15).
రాబోయే వాటికి నీడలు అన్నపానాలు, పండుగలు, విశ్రాంతి రోజులని పౌలు చెపుతున్నాడు(2:17).
నీడలు క్రీస్తులోని వాస్తవాన్ని చూపుతున్నాయి(2:17).
శరీరమంతా క్రీస్తు అనే శిరస్సు వలన కలసి అమరి ఉన్నది(2:19).
ముట్టుకోవద్దు, రుచి చూడవద్దు, తాకవద్దు అనే వాటికీ సంబంధించిన ఆజ్ఞలు లోకసంబంధమైన నమ్మకాల్లో భాగాలు (2: 20-22).
శరీర వాంఛలతో పోల్చుకుంటే మానవ కల్పిత మతనియమాలకు విలువ లేదు (2:23).
క్రీస్తు దేవుని కుడి చేతి ప్రక్కన కూర్చోడానికి లేపబడ్డాడు(3:1).
విశ్వాసులు పైవాటిని వెదకాలి, భూలోక విషయాలు కాదు(3:1-2).
దేవుడు విశ్వాసి జీవాన్ని క్రీస్తులో దాచి ఉంచాడు(3:3).
క్రీస్తు కనిపించినపుడు విశ్వాసులు కూడా మహిమలో కనిపిస్తారు(3:4).
విశ్వాసి భూసంబంధమైన పాప కోరికలను చంపెయ్యాలి(3:5).
దేవునికి అవిధేయులైన వారి పైకి దేవుని ఉగ్రత వస్తుంది(3:6).
పాత స్వభావానికి సంబంధించి విశ్వాసులు కోపం, ఆగ్రహం, చెడు ఉద్దేశ్యాలు, అవమానించడం, చెడు మాటలు, అబద్దాలు వదులుకోవాలని పౌలు చెపుతున్నాడు(3:8-9).
విశ్వాసులు నూతన స్వభావo క్రీస్తు పోలికలో సృష్టించడం జరిగింది(3:10).
నూతన స్వభావానికి సంబంధిoచి విశ్వాసులు జాలి గల మనసునూ దయనూ వినయాన్నీ సాత్వికాన్నీ ఓర్పునూ ధరించుకోవాలని పౌలు చెపుతున్నాడు(3:12).
ప్రభువు అతనిని క్షమిoచిన విధానంలో క్షమిoచాలి(3:13).
విశ్వాసుల మధ్య పరిపూర్ణమైన బంధం ప్రేమే(3:14).
విశ్వాసి హృదయoలో క్రీస్తు శాంతి పరిపాలిస్తూ ఉండాలి(3:15).
విశ్వాసిలో క్రీస్తు వాక్కు సమృద్ధిగా జీవించాలి(3:16).
విశ్వాసి వైఖరి, పాట, మాట, పనులు దేవునికి ఇవ్వడంలో కృతజ్ఞత పూర్వకంగా ఉండాలి(3:15-17).
భార్య తన భర్తకు లోబడి ఉండాలి(3:18).
భర్త తన భార్యను ప్రేమిస్తూ ఆమెతో కఠినంగా ప్రవర్తించకూడదు(3:19).
పిల్లలు తమ తల్లితండ్రులకు అన్నీ విషయాలలో విధేయులై ఉండాలి (3:20).
తండ్రి తన పిల్లలకు కోపం పుట్టించకూడదు(3:21).
విశ్వాసులు చేసే పని ఏదైన ప్రభువు కోసమే చేయాలి(3:23-24).
ఏం చేసినా ప్రభువు సేవ కోసం చేసేవాడు వారసత్వాన్ని పొందుతాడు (3:24).
అక్రమం చేసేవాడు తను చేసిన దానికి ప్రతిఫలం పొందుతాడు. (3:25).
భూసంబంధమైన యజమానులకు కూడా పరలోకంలో యజమానుడొకడు ఉన్నాడని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు(4:1).
కొలొస్సయులు ప్రార్థనలో నిలకడగా ఉండాలని పౌలు కోరుతున్నాడు(4:2).
క్రీస్తు రహస్యం, వాక్కు చెప్పుటకు ఆయన తలుపు తెరిచేలా ప్రార్దించమని పౌలు కొలొస్సయులను కోరుతున్నాడు(4:3).
సంఘం బయట ఉన్నవారి యెడల జ్ఞానంగా జీవిస్తూ దయతో మాట్లాడి ఆదరించాలని కొలస్సయులకు పౌలు ఉపదేశిస్తున్నాడు(4:5-6).
తుకికుకూ ఒనేసిములకు పౌలు తనను గూర్చిన విషయాలు కొలొస్సయులకు తెలియజేసే పని అప్పగించాడు(4:7-9).
కొలొస్సయుల దగ్గరకు మార్కు వస్తే అతన్ని స్వీకరించoడని పౌలు వారికీ చెప్పాడు (4:10).
కొలొస్సయులు దేవుని సంకల్పంలో పూర్తి నిశ్చయతతో సుస్థిరంగా నిలిచి ఉండాలని ఎపఫ్రా ప్రార్ధిస్తున్నాడు(4:12).
పౌలుతో పాటుగా ఉన్న వైద్యుని పేరు లూకా (4:14).
లవొదికయలోని సంఘo ఇంట్లో సమావేశమయ్యేది (4:15).
లవొదికయలోని సంఘానికి కూడా పౌలు ఉత్తరం వ్రాయటం జరిగింది (4:16).
పౌలు ఈ లేఖ చివరన తన స్వదస్తూరితో సంతకం చేశాడు (4:18).
వారి విశ్వాస క్రియలనూ, వారి ప్రేమపూర్వక ప్రయాసనూ, ఓపికతో కూడిన నిరీక్షణనూ జ్ఞాపకం చేసుకుంటున్నాడు (1: 3).
తెస్సలోనికయుల దగ్గరకు సువార్త మాటతో, ప్రభావంతో, పరిశుద్ధాత్మతో, గొప్ప నిబ్బరంతో వచ్చింది (1: 5).
అనేక బాధల్లో ఉండి తెస్సలోనికయులు వాక్కును విన్నారు (1: 6).
పరిశుద్ధాత్మ లోని ఆనందంతో తెస్సలోనికయులు వాక్కును స్వీకరించారు (1: 6)
వారి విశ్వాసం వెళ్ళిన చోటల్లా వాక్కు ప్రతిధ్వనించింది (1: 8).
నిజ దేవుణ్ణి నమ్ముకోక ముందు తెస్సలోనికయులు విగ్రహాలను పూజించేవారు (1: 9)
పౌలు, తెస్సలోనికయులు పరలోకం నుంచి యేసు రాకడ కోసం ఎదురు చూస్తున్నారు (1: 10).
రానున్న ఉగ్రత నుండి విడిపిస్తాడు.
వారు బాధల పాలై, అవమాన కరమైన అనుభవాలు పొందారు (2: 2)
పౌలు తన సువార్త బోధన మూలంగా దేవుణ్ణి మాత్రమే సంతోషపరచ గోరుతున్నాడు (2: 4- 6)
పౌలు ముఖస్తుతి మాటలను, దురాశను కనుపరచలేదు.
తమ స్వంత పిల్లలతో తల్లి, తండ్రి ఎలా ఉంటారో అలా మృదువుగా పౌలు తెస్సలోనికయుల పట్ల ప్రవర్తించాడు [2:7-8,11].
తెస్సలోనికయులకు భారంగా ఉండకూడదని పౌలు అతని అనుచరులు పగలూ రాత్రీపని చేశారు [2:9].
వారిని తన రాజ్యానికీ మహిమకు పిలిచిన దేవునికి తగినట్టుగా తెస్సలోనికయులు నడుచుకోవాలని పౌలు చెప్పాడు (2: 12)
మానవ వాక్కుగా కాక దేవుని వాక్కుగా తెస్సలోనికయులు స్వీకరించారు (2: 13).
నమ్మని యూదులు యూదయ లోని సంఘాలను హింసించారు. యేసును ప్రవక్తలను చంపారు. పౌలును వెళ్ళగొట్టారు. అతడు యూదేతరులతో మాట్లాడడం నిషేధించారు (2: 14- 16)
సాతాను అతణ్ణి ఆటంక పరచినందువల్ల అతడు రాలేక పోయాడు (2: 17- 18).
ప్రభువు రాకడ సమయంలో తెస్సలోనికయులు పౌలు పాలిట నిరీక్షణ, ఆనందం, మహిమ కిరీటంగా ఉంటారు (2: 19- 20)
తెస్సలోనికలోని విశ్వాసులను బలపరచడానికి, ఆదరించడానికి తిమోతిని పంపాడు (3: 1: 2).
తాను బాధలు అనుభవించడం కోసమే నియమితుడయ్యాడని చెప్పాడు (3: 3).
తెస్సలోనికయులను శోధకుడు తప్పు దారి పట్టించాడేమోననీ, తన ప్రయాస అంతా వ్యర్థం అయిపోతుందేమో అనీ పౌలు అందోళనగా ఉన్నాడు (3: 5).
తెస్సలోనికయుల విశ్వాస ప్రేమల గురించిన వార్త, వారు తనను చూడాలని ఆశిస్తున్నారనే వార్త విని పౌలు ఆదరణ పొందాడు (3: 6- 7)
వారు ప్రభువులో స్థిరంగా నిలబడితే తాను బతికిపోతానని పౌలు చెప్పాడు (3: 10).
తను తెస్సలోనికయులను చూడాలని, వారి విశ్వాసంలో కొరతగా ఉన్నదాన్ని పూర్తి చేయాలనీ పౌలు రేయింబవళ్ళు ప్రార్థిస్తున్నాడు (3: 10).
తెస్సలోనికయులు ఒకరి పట్ల ఒకరు, అందరి పట్ల ప్రేమలో వర్థిల్లాలని ఆశిస్తున్నాడు (3: 12).
యేసు ప్రభువు తన పరిశుద్ధులందరితో కలిసి వచ్చేటప్పుడు తెస్సలోనికయులు అయన రాక కోసం సిద్ధంగా ఉండాలని పౌలు కోరుతున్నాడు (3: 13).
తెస్సలోనికయులు దేవునితో నడక కొనసాగిస్తూ ఆయన్ని సంతోషపరుస్తూ, దాన్ని మరింత ఎక్కువగా చేయాలని పౌలు కోరుతున్నాడు (4: 1-2).
తెస్సలోనికయుల విషయంలో దేవుని సంకల్పం వారు పరిశుద్ధులు కావడమేనని పౌలు అన్నాడు (4: 3)
భర్తలు తమ భార్యలను పరిశుద్ధతతో గౌరవపూర్వకంగా చూసుకోవాలి (4: 4).
లైంగిక అవినీతి విషయంలో తప్పటడుగు వేసిన సహోదరునిపై ప్రభువే ప్రతీకారం చేస్తాడు (4: 6).
పరిశుద్ధతకై పిలుపును త్రోసిపుచ్చిన వ్యక్తి ప్రభువునే తిరస్కరిస్తున్నాడు (4: 8).
తెస్సలోనికయులు మరింతగా ఒకరినొకరు ప్రేమించుకోవాలని పౌలు కోరాడు (4: 9,10).
తెస్సలోనికయులు నెమ్మది గలిగి తమ స్వంత పనులు చూసుకుంటూ తమ చేతులతో పని చేస్తూ ఉండాలి (4: 11-12).
కన్నుమూసిన వారికి ఏమి అవుతుందనే విషయంలో బహుశా తెస్సలోనికయులు అపార్థంలో ఉన్నారు (4-1:13).
క్రీస్తులో నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా తీసుకు వస్తాడు (4:1- 4).
ఆర్భాటంతో దేవుని బూర శబ్దంతో ప్రభువు పరలోకం నుండి దిగి వస్తాడు (4: 1- 6).
క్రీస్తులో మృతులు మొదట లేస్తారు. ఆపైన సజీవులు వారితో బాటు ఎత్తబడతారు (4:16-17).
లేచిన వారు మధ్యాకాశంలో ప్రభువును కలుసుకుంటారు. శాశ్వతంగా వారు ఆయనతో ఉంటారు (4:17).
తన ఉపదేశంతో వారు ఒకరినొకరు ఆదరించుకోవాలని పౌలు చెప్పాడు (4:18).
ప్రభువు దినం రాత్రి వేళ దొంగ వచ్చినట్టు వస్తుందని చెప్పాడు (5:2).
కొందరు వినాశం తమ పైకి వచ్చినప్పుడు "శాంతి, భద్రత" అంటూ ఉంటారు (:53).
ఎందుకంటే వారు చీకటిలో లేరు. వారు వెలుగు సంతానం. కాబట్టి ప్రభువు దినం దొంగ వలే విశ్వాసులపైకి విరుచుకుపడకూడదు (5:45).
మెలకువ గలవారై అప్రమత్తంగా ఉండి విశ్వాసం ప్రేమ నిరీక్షణలను ధరించుకోవాలని చెబుతున్నాడు (5:6- 8).
యేసు క్రీస్తులో రక్షణయే విశ్వాసుల అంతిమ గమ్యం (5:9).
అలాటి వారిని విశ్వాసులు ఎల్లప్పుడూ ప్రేమ పూర్వకమైన గౌరవం చూపాలి అని పౌలు అంటున్నాడు (5:12- 13).
తమకు కీడు జరిగితే ప్రతికీడు చేయకూడదని చెప్పాడు (5:15).
అన్ని విషయాల్లో కృతజ్ఞతలు చెల్లించాలని పౌలు చెప్పాడు. ఎందుకంటే వారి విషయంలో అది దేవుని చిత్తం (5:18).
ప్రవచనాలను చులకన చేయవద్దని, అయితే అన్నిటినీ పరీక్షించి మేలైన దానిని పరిగ్రహించాలని చెప్పాడు (5: 20-21).
ఆత్మలో మనసులో దేహంలో దేవుడు విశ్వాసులను పరిపూర్ణంగా పవిత్రపరచాలని పౌలు ప్రార్థించాడు (5: 23).
యేసు క్రీస్తు ప్రభువు కృప విశ్వాసులతో ఉండాలి అని పౌలు ప్రార్థించాడు (5:28).
ఒకరిపట్ల ఒకరు కనపరచుకునే విశ్వాస ప్రేమల విషయంలో పౌలు దేవునికి కృతఙ్ఞతలు చెల్లిస్తున్నాడు (1: 3).
తెస్సలోనికలో విశ్వాసులు శ్రమలు, ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు (1: 4).
వారు దేవుని రాజ్యానికి వారసులుగా ఎంచబడతారు (1: 5).
విశ్వాసులను బాధించే వారిని దేవుడు బాధిస్తాడు. అగ్ని జ్వాలల్లో శిక్షిస్తాడు (1:6, 8).
యేసు క్రీస్తు పరలోకం నుండి ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసులకు బాధలనుండి విడుదల కలుగుతుంది (1: 7).
దేవుణ్ణి ఎరుగని వారికి శిక్ష శాశ్వత కాలం ఉంటుంది (1: 9).
దేవుణ్ణి ఎరుగని వారు తమకు కలిగే శిక్షలో భాగంగా దేవుని సన్నిధి నుండి వేరై పోతారు (1: 9)
క్రీస్తు తన దినాన రావడం చూసినప్పుడు విశ్వాసులు అబ్బుర పడతారు (1: 10).
దేవుని శక్తితో విశ్వాసులు జరిగించిన సత్క్రియల ఫలితంగా యేసు క్రీస్తు నామానికి మహిమ కలుగుతుంది (1: 11-12).
ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువు రాక గురించి తాను రాయబోతున్నట్టు పౌలు చెబుతున్నాడు (2: 1)
ప్రభువు దినం గతంలోనే వచ్చిందని చెబితే నమ్మవద్దని పౌలు చెబుతున్నాడు (2: 2).
ప్రభువు దినానికి ముందు పతనం సంభవించి ధర్మవిరోధి వెల్లడి అవుతాడు (2: 3).
ధర్మ విరోధి దేవుణ్ణి వ్యతిరేకించి తనను దేవునికి పైగా హెచ్చించు కుంటాడు. తనను దేవుడుగా ఎంచుకుని దేవాలయంలో కూర్చుంటాడు (2: 4)
సమయం ఆసన్నమైనపుడు అతనిని అడ్డగించేది తొలిగి పోయినప్పుడు ధర్మవిరోధి వెల్లడి అవుతాడు (2: 6-7).
యేసు ప్రత్యక్షమైనప్పుడు ధర్మవిరోధిని సంహరిస్తాడు (2:8).
ధర్మవిరోధి అద్భుతాలు, సూచనలు చేసేలా ధర్మవిరోధికి శక్తి ఇచ్చి అతనితో కలిసి పని చేసేది సాతాను (2:9).
రక్షణ పొందేలా సత్యాన్ని గురించిన ప్రేమ కొందరిలో ఉండదు గనుక వారు మోసపోతారు (2: 10).
మోసపోయి నాశనమవుతున్న వారు అవినీతిలో ఆనందిస్తారు (2: 12).
సువార్త మూలంగా తెస్సలోనికయులు యేసు క్రీస్తు ప్రభువు మహిమను పొందాలని దేవుడు ఎంపిక చేసాడు (2: 13-14).
వారు నేర్చుకున్న సంప్రదాయాలను గట్టిగా చేపట్టి స్థిరంగా నిలబడాలని పౌలు తెస్సలోనికయులను కోరాడు (215).
తెస్సలోనికయులు ప్రతి సత్క్రియలోను, వాక్కులోనూ స్థిరపడాలని పౌలు కోరాడు (2:17).
ప్రభువు వాక్కు త్వరగా వ్యాపించేలా మహిమ పొందేలా తెస్సలోనికయులు ప్రార్థన చేయాలని పౌలు కోరాడు (3:2).
విశ్వాసం లేని దుష్టుల చేతుల్లో నుండి విడుదల పొందాలని పౌలు కోరాడు (3: 2).
తను వారికి ఆజ్ఞాపించిన క్రియలు కొనసాగించాలని పౌలు తెస్సలోనికయులకు చెప్పాడు (3: 4).
సోమరితనంగా బ్రతికే సహోదరునికి తెస్సలోనికయులు దూరంగా ఉండాలని పౌలు ఆజ్ఞాపించాడు (3: 6).
పౌలు తాను ఎవరికీ భారంగా ఉండకూడదని తన పోషణ నిమిత్తం రేయింబవళ్ళు పని చేసేవాడు (3:7-9).
పని చేయడానికి ఇష్ట పడని వారు భోజనం చేయకూడదని పౌలు ఆజ్ఞాపించాడు (3: 10).
సోమరులు నెమ్మదిగా పని చేసుకుంటూ తమ స్వంత ఆహారం తింటూ ఉండాలని పౌలు ఆజ్ఞాపించాడు (3: 12).
ఈ లేఖలో పౌలు రాసిన సూచనలను పాటించని వారితో సహోదరులు ఎలాటి పొత్తు పెట్టుకోకూడదు (3: 14).
తెస్సలోనికయులకు దేవుడు అన్ని కాలాల్లో శాంతి ఇవ్వాలని పౌలు కోరాడు (3: 16).
ఈ లేఖను తాను రాశానని చూపడానికి పౌలు తన స్వహస్తాలతో అభినందనలు చెబుతూ సంతకం చేశాడు (3: 17).
పౌలు దేవుని అజ్ఞానుసారంగా యేసు క్రీస్తు అపోస్తలునిగా అయ్యాడు. (1:1).
విశ్వాసంలో పౌలు నిజకుమారుడు తిమోతి (1:2).
తిమోతి ఎఫెసులో నిలిచి ఉండాలి(1:3).
వారు భిన్నబోధలు చేయకూడదని తిమోతి ఆజ్ఞాపించాలి (1:3).
అతని లక్ష్యం పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగే ప్రేమ (1:5).
ధర్మశాస్త్రం ధర్మవిరోధుల కోసం, తిరుగుబాటుదారుల కోసం, భక్తిహీనులకోసం చేశారు (1:9).
వాళ్ళు చేసే పాపాలు హత్యలు, అనైతిక లైoగికత్వం, దోపిడీ, అబద్ధాలు (1:9-10).
గతంలో పౌలు దైవ దూషకుడు, హింసించేవాడు, హానికరుడు(1:13).
మన ప్రభువు కృప పౌలును బలవంతం చేసింది (1:14).
పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు (1: 15).
ఎందుకంటే తాను పాపులందరిలోకీ ముఖ్యుడై కూడా దేవుని కృప పొందాడు గనుక తాను దేవుని కృపకు తార్కాణం అని పౌలు అన్నాడు (1:15,16).
విశ్వాసంతో, మంచి మనస్సాక్షితో తిమోతి చేసే మంచి పోరాటం గురించిన ప్రవచనాలతో పౌలు ఏకీభవిస్తున్నాడు (1:18,19).
వారు దైవదూషణ చేయకుండా వారికీ నేర్పించడం కోసం పౌలు వారిని సాతానుకు అప్పగించాడు (1: 20).
అందరి విషయం, రాజుల, అధికారుల విషయం ప్రార్థించాలని పౌలు కోరాడు (2: 1-2).
క్రైస్తవులు భక్తితో, హుందాగా, ప్రశాంతంగా, నెమ్మదిగా జీవించే అవకాశం వారికి ఉండాలని పౌలు కోరుతున్నాడు (2: 2).
మనుషులంతా రక్షణ పొంది సత్యాన్ని తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు (2: 4).
ఆయన దేవునికి, మనిషికి మధ్యవర్తి (2: 5).
అందరికోసం విమోచన వెలగా ఆయన తనను సమర్పించు కున్నాడు (2:6).
అపోస్తలుడు పౌలు యూదేతరులకు బోధకుడు (2: 7).
పురుషులు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థిoచాలని పౌలు కోరాడు(2 :8).
స్త్రీలు అణుకువతో, తగుమాత్రం వస్త్రాలు ధరించాలని పౌలుకోరాడు(2:9).
స్త్రీలు ఉపదేశించటం, పురుషులపై అధికారం చేయడానికి పౌలు అనుమతించ లేదు(2: 12).
ఆదాము మొదట సృష్టి అయ్యాడని, ఆదాము మోసపోలేదని, ఈ రెండు కారణాలు పౌలు చూపించాడు.
స్త్రీలు విశ్వాసంలో ప్రేమలో స్వస్థ బుద్ధితో కూడిన పవిత్రతలో కొనసాగాలని పౌలు కోరాడు (2:15).
పై విచారణ కర్త పని మంచిది (3:1).
పై విచారణ కర్త బోధించ గలిగి ఉండాలి (3:2).
పై విచారణ కర్త మద్యానికి అలవాటు పడకూడదు. ధనాన్ని ప్రేమించకూడదు (3: 3)
పై విచారణ కర్త పిల్లలు అతనికి లోబడి గౌరవించాలి (3:4).
ఎందువల్లనంటే అతడు తన ఇంటిని చక్కగా నిర్వహించుకోలేక పోతే సంఘం గురించి కూడా అతడు జాగ్రత్త తీసుకోలేడు (3:5).
ప్రమాదం ఏమిటంటే అతడు గర్విష్టిగా అయిపోయి శిక్షకు గురి అవుతాడు (3:6).
సంఘానికి బయట వారి మధ్య పై విచారణ కర్త మంచి పేరు పొంది ఉండాలి (3:7).
పరిచర్య ఆరంభిoచటానికి ముందు పరిచారకులు ఆమోదం పొందాలి(3:11).
భక్తి గల స్త్రీలు గౌరవానికి తగినవారు, అపనిందలు ప్రచారం చేయనివారు, కోరికలు అదుపులో ఉంచుకొనేవారు, అన్ని విషయాలలో నమ్మకైనవారు (3:11).
జ సంఘమే దేవుని గృహం(3:15)
ఆయనను జనాలలో ప్రకటించడం, లోకంలో నమ్మడం, మహిమలో పైకి వెళ్డడం జరిగింది(3:16)
తరువాతి కాలంలో కొందరు మనుషులు విశ్వాసం నుండి తొలిగిపోయి మోసపరిచే ఆత్మలను లక్ష్యపెడతారు (4:1 )
వివాహాన్ని, కొన్ని రకాల ఆహార పదార్థాలను నిషేధిస్తారు (4:4).
మనం తినే ఏదైనా దేవుని వాక్కు మూలంగా, ప్రార్థన మూలంగా పవిత్రం, వాడుకోడానికి ఆమోదయోగ్యం అవుతుంది (4:5).
దైవ భక్తిలో శిక్షణ పొందమని పౌలు తిమోతికి చెబుతున్నాడు (4:7).
దైవ భక్తిలో శిక్షణ పొందడం దేహ వ్యాయామం కన్నా ఎందుకు లాభకరమైనదంటే ఈ జీవితానికి, రాబోయే జీవితానికి అది ప్రయోజనం (4:8).
ఈ విషయాలు ఇతరులకు బోధించమంటున్నాడు (4:6, 11).
ఈ విషయాలు ఇతరులకు బోధించమంటున్నాడు (4:6, 11).
మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, పవిత్రతలో తిమోతి ఇతరులకు ఆదర్శంగా ఉండాలి (4:12).
ప్రవచనం ద్వారా, పెద్దలు అతనిపై చేతులు ఉంచడం ద్వారా తిమోతి తన ఆత్మవరాలను పొందాడు?
అతడు తనను, తన మాటలు వినే వారినీ రక్షిస్తాడు (4:16).
సంఘoలోని ముసలివారిని తండ్రులు గా భావించాలని పౌలు తిమోతితో చెప్పాడు(5 :1).
ఆ పిల్లలు ,పిల్లల సంతానం తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేస్తూ ఆమెను జాగ్రతగా చూచుకోవాలి(5:4).
అతను విశ్వాసం లేని వాని కంటే చెడ్డవాడై విశ్వాసం కాదన్నట్టే(5:8)
విధవరాలు మంచి పనులకు పేరు పొంది ఉండాలి(5:10).
ఆమె తన మొదటి నిశ్చయతను విడిచి పెట్టి తరువాత పెళ్లి చేసుకోవాలి అనుకునే అపాయం ఉంది(5 :11-12).
యువతులు పెళ్లి చేసుకొని, పిల్లలను కని, ఇంటి వ్యవరాలను చూసుకోవాలని పౌలు కోరాడు(5 :14 ).
బాగా పాలన చేసే పెద్దలు రెట్టింపు గౌరవానికి పాత్రులని భావించాలి(5:17).
ఒక పెద్ద మీద నిందారోపణ తీసుకొనే ముందుగా ఇద్దరు లేక ముగ్గురు సాక్షుల సాక్ష్యం తీసుకోవాలి(5:19).
పౌలు తిమోతికి పక్షపాతం లేకుండా ఈ నియమాలను జాగ్ర్రతగా పాటించాలి అని ఆజ్ఞపించాడు (5:21).
కొందరి మనుషుల అపరాధాలు తీర్పు వరకు బయటపడవు(5:24).
బానిసలు తమ యజమానులు మర్యాదకు తగినవారిగా ఎంచాలి అని పౌలు చెప్పాడు(6:3-4).
అలాంటి వ్యక్తి ఏమీ తెలియని గర్విష్టియై దైవభక్తికి అనుగుణమైన ఉపదేశాన్ని, క్షేమకరమైన మాటలును తిరస్కరిస్తాడు(6:3-4).
తృప్తితో కూడిన భక్తి గొప్ప లాభం అని పౌలు అంటున్నాడు (6:6).
ఎందుకంటే మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు. ఏమీ తీసుకు పోలేము (6:7,8).
ధనికులవ్వాలని చూసే వాళ్ళు శోధనలో, ఉచ్చులో పడిపోతారు (6:9).
ధన వ్యామోహం దుష్టత్వమంతటికీ మూలం (6:10).
డబ్బును ప్రేమించిన కొందరు విశ్వాసం నుండి దారి తొలిగి పోయారు (6:10).
విశ్వాసాన్ని గూర్చిన మంచి పోరాటం పోరాడాలని పౌలు తిమోతికి చెప్పాడు(6:12).
ధన్య జీవి, ఏకైక శక్తిమంతుడు సమీపించరాని తేజస్సులో నివసిస్తున్నాడు (6:16).
దేవుడు మాత్రమే నిజమైన సంపదలు ఇస్తాడు గనక ధనికులు అనిశ్చితమైన సంపదల్లో గాక దేవునిలో మాత్రమే ఆశ పెట్టుకోవాలి (6:17).
సత్క్రియల్లో నిమగ్నమయ్యే వారు తమ కోసం మంచి పునాది వేసుకుంటూ నిజమైన జీవాన్ని చేపడతారు (6:19)
పౌలు తిమోతికి అప్పగించబడిన దానిని కాపాడుకోవాలని చెప్పాడు(6:20).
క్రీస్తు అపోస్తులుడుగా పౌలు దేవుని చిత్తం వలన అయ్యాడు(1:1).
నిజమైన విశ్వాసం తిమోతి కంటే ముందు అతని అమ్మకు, అమ్మమ్మకు ఉంది(1: 5).
దేవుడు తిమోతికి క్రమశిక్షణ, ప్రేమ, శక్తిగల ఆత్మను ఇచ్చాడు(1 :7).
పౌలు తిమోతికి ప్రభువును గూర్చిన సాక్ష్యం విషయంలో సిగ్గుపడకూడదని చెప్పాడు(1:8).
దానికి బదులు పౌలు తిమోతికి శుభవార్త కోసం శ్రమలో భాగస్వామి కమ్మని చెప్పాడు(1:8).
దేవుడు తన ప్రణాళిక, కృప యుగాల ఆరంభానికి ముందే మనకు ఇచ్చాడు(1:9).
దేవుడు తన రక్షణ ప్రణాళికను మన రక్షకుడైన క్రీస్తు యేసు ప్రత్యక్షం అవ్వటం వల్ల బయలుపరచాడు(1:10).
యేసు క్రీస్తు ప్రత్యక్షమైనపుడు, జీవ మరణాల విషయాల్లో మరణాన్ని నశింపచేసి, శుభవార్త వలన అంతం లేని జీవాన్ని తెచ్చాడు(1:10).
ఏమైతే తాను దేవునికి అప్పగించుకొనేనో దానిని దేవుడు ఆ రోజు వరకు కాపాడగలడని పౌలు ధృడ విశ్వాసంతో ఉన్నాడు(1:12).
దేవుడు తిమోతికి అప్పగించిన మంచి విషయం పవిత్రాత్మ ద్వారా కాపాడుకోవాలి .
ఆసియాలో పౌలుకు తోడుగా ఉన్న వారందరూ అతన్ని విడిచి పెట్టేశారు(1:15).
ఒనేసిఫోరు ఇంటి వారు అనేక విధాలుగా పౌలుకు సహాయం చేయడం వలన దయ చూపమని ప్రభువును అడిగాడు(1:16-18).
పౌలు ఆత్మీయ కుమారుడు తిమోతి(2:2).
పౌలు బోధించిన ఉపదేశo ఇతరులకు నేర్పించటానికి సామర్ధ్యం గలిగిన నమ్మకమైన మనుషులకు తిమోతి అప్పగించాలి(2:2).
ఒక మంచి సైనికుడు తనకు తాను ఈ జీవన సంబంధాలలో చిక్కుకోడని పౌలు తిమోతికి వివరించాడు(2:4).
ఈ లేఖ పౌలు తిమోతికి వ్రాస్తుండగా సంకెళ్ళతో బందియై కష్టాలు అనుభవిస్తున్నాడు(2:9).
దేవుని వాక్కు సంకెళ్ళపాలై లేదని పౌలు చెపుతున్నాడు(2:9).
క్రీస్తు యేసులో రక్షణ పొందాలని దేవుని వలన ఏర్పరచుకొన్నవారికోసం పౌలు వీటన్నిటిన్నీ ఓర్చుకున్నాడు(2:10).
సహించే వారు క్రీస్తుతో కూడా ఏలతారు(2:12).
క్రీస్తును ఎరగననే వారిని ఆయనా ఎరగనoటాడు(2:12).
ప్రజలు ఏవేవో మాటల గురించి పోట్లాడుకోకూడదని, వాటి వల్ల ప్రయోజనం లేదని తిమోతి హెచ్చరించాలి(2:14).
సత్యం నుండి తొలిగిపోయిన ఇద్దరు పునర్జీవం ముందే జరిగిoదనే తప్పుడు సిద్ధాంతం ఉపదేశిoచారు(2:18).
ప్రతి మంచి పని కోసం విశ్వాసులు ఘనతకు ఉపయోగపడని వాటినుండి తమ్ముతాము శుద్ధి చేసుకొని, సమర్పించుకోవాలి(2:21).
తిమోతి యువకులకు కలిగే చెడు కోరికల నుండి పారిపోవాలి(2:22).
ప్రభు సేవకుడు మర్యాదస్తుడునూ, ఉపదేశిoచగలవాడై ఉండీ, ఓర్చుకొనువాడై, ఎదిరించే వారిని సాత్వికంతో సరిదిద్దాలి(2:24-25).
అవిశ్వాసులకు దయ్యం తన ఇష్ట ప్రకారం చేయడానికి చెరపట్టి మోసం చేస్తుంది(2:26).
చివరి రోజుల్లో అపాయకరమైన కాలములు వస్తాయని పౌలు చెప్పాడు(3:1).
చివరి రోజుల్లో దేవునికి బదులు మనుషులు తమనుతామే ప్రేమిoచుకోనుచూ, డబ్బునీ సుఖాన్నీ ప్రేమిస్తూ ఉంటారు(3:2-4).
కేవలం ఆచారపూర్వకమైన దైవ భక్తిగల వారి నుంచి తొలగి పొమ్మని చెప్పాడు (3:5).
ఈ భక్తిహీనుల్లో కొందరు ఇళ్ళలో చొరబడి వివిధ కోరికలతో కొట్టుకుపోయే స్త్రీలను వశపరచు కుంటారు (3:6).
భక్తిహీనులు పాత ఒడంబడికలో సత్యానికి వ్యతిరేకంగా నిలిచిన యన్నే, యంబ్రేలాగ ఉంటారు.(3:8).
అబద్ద బోధకులకు బదులు తిమోతి పౌలును అనుసరించాడు(3:10-11).
ప్రభువు అన్ని హింసల నుండి పౌలును తప్పించాడు(3:11).
దైవభక్తితో జీవించాలని కోరుకొనే వారు హింసలకు గురవుతారని పౌలు చెప్పాడు(3:12).
చివరి రోజులలో దుర్మార్గులూ వంచకులూ మిక్కిలి చెడ్డవారిగా మారతారు(3:13).
పరిశుద్ధ లేఖనాలు తిమోతికి బాల్యం నుండి తెలుసు(3 :15).
మనిషికి లేఖనాలన్నీ దైవావేశం వల్ల ఇవ్వడం జరిగింది(3:16).
లేఖనాలన్నీ ఉపదేశించుటానికీ, మందలించటానికీ, తప్పులు సరిచేయటానికీ, నీతి న్యాయాలలో తర్ఫీదు ఇవ్వటానికి ప్రయోజనకరంగా ఉన్నాయి(3:16).
ఒక వ్యక్తికి లేఖనాలు తర్ఫీదు ఇవ్వటంలో గల ఉద్దేశ్యం అతను సంసిద్దుడై ప్రతి మంచి పనికి సమర్ధుడై ఉండాలని(3:17).
యేసుక్రీస్తు చనిపోయిన వారికీ, సజీవులకు న్యాయాధిపతి(4:1.
తిమోతి దేవుని వాక్కు ప్రకటించాలని పౌలు ఆజ్ఞాపించాడు(4 :2).
రాబోయే కాలంలో మనుషులు మంచి ఉపదేశాన్ని సహించరు. తమ కామవికారాలకు అనుగుణమైన బోధలే వింటారు (4:5).
తిమోతి కి సువార్తికుని పరిచర్య ఇవ్వబడింది [4:5].
తన జీవితంలో వెళ్ళిపోయే సమయం వచ్చిందని పౌలు చెపుతున్నాడు(4:6).
క్రీస్తు కనపడినప్పుడు ఆయనను ప్రేమించే వారు నీతి కిరీటం బహుమానంగా పొందుతారు(4:8).
ఎందుకంటే దేమాకు ఈలోకం మీద ప్రీతి కలిగి పౌలును విడిచిపెట్టాడు(4:10).
పౌలుకు తోడుగా ఒక్క లూకా మాత్రమే ఉన్నాడు(4 :11).
ఏ మనుషుడైతే తనను వ్యతిరేకించాడో అతని పనుల ప్రకారం ప్రతిఫలం పొందుతాడని పౌలు చెప్పాడు(4:14).
పౌలు మొదటి వాదంలో, దేవుడు పౌలుతో నిలిచాడు(4:16-17).
దేవుడు ఎన్నుకొన్న ప్రజల విశ్వాసం స్థిరపరచడం, సత్యం గురించి జ్ఞానాన్ని స్థిరపరచడం అతని ఉద్దేశం.
ఆయన యుగాల కాలాల ముందే వారికి వాగ్దానం చేసాడు
లేదు
దేవుడు దానిని అపొస్తలుడైన పౌలుకు అప్పగించాడు
వారి ఉమ్మడి విశ్వాసం కారణంగా తీతు పౌలుకు నిజమైన కుమారుడిగా ఉన్నాడు.
అతడు ఏక పత్నీ పురుషుడిగా ఉండాలి, మరియు నిర్లక్ష్యంగల ప్రవర్తన లేదా తిరుగుబాటు విషయంలో నిందితుడు కాకుండా విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉండాలి.
అతడు అహంకారిగా ఉండకూడదు లేదా త్వరగా కోపపడేవాడు, లేదా మద్యానికి అలవాటు పడినవాడు, లేదా దెబ్బలాడేవాడు, లేదా దురాశపరుడుగా ఉండకూడదు.
అతడు దేవుని ఇంటి సేవ నిర్వహించేవాడుగా ఉండాలి.
ఒక పెద్ద అతిథి ప్రియుడు, మంచికి స్నేహితుడు, స్థిరబుద్ధికలవాడు, నీతిపరుడు, పవిత్రుడు, ఆశానిగ్రహం కలవాడుగా ఉండాలి.
అతడు దానిని గట్టిగా చేపట్టాలి. మరియు తద్వారా ఇతరులను ప్రోత్సహించడానికి మరియు ఇతరులను గద్దించడానికి సమర్ధుడుగా ఉంటాడు.
వారు కుటుంబాలు అన్నింటిని పాడుచేస్తున్నారు.
వారు సిగ్గుకరమైన లాభాన్ని కోరుకున్నారు.
అతడు వారిని కఠినంగా గద్దించాలి తద్వారా వారు విశ్వాసంలో స్థిరులుగా ఉంటారు.
వారు యూదుల కల్పనాకథలకూ మరియు మనుషుల ఆదేశాలకూ శ్రద్ధ చూపించకూడదు.
అతని మనసు మరియు మనస్సాక్షి రెండూ అపవిత్రం అయ్యాయి.
అతడు తన పనుల ద్వారా దేవుణ్ణి నిరాకరిస్తున్నాడు.
వారు నిగ్రహం కలిగి, గౌరవపూర్వకంగానూ, స్థిరబుద్ధికలవారుగానూ మరియు విశ్వాసంలో, ప్రేమలో, పట్టుదలలో స్థిరులుగా ఉండాలి.
వృద్ధస్త్రీలు గౌరవప్రదంగా ఉండాలి, కొండెకత్తెలు కాకుండా ఉండాలి మరియు నిగ్రహం కలిగి ఉండాలి, మరియు మంచికి బోధకులుగా ఉండాలి.
వారు తమ భర్తలను ప్రేమించువారుగా, మరియు తమ బిడ్డలను ప్రేమించు వారుగా ఉండాలని బోధించాలి.
అతడు మంచి పనుల విషయంలోనూ, నిష్కళంకంగానూ మర్యాదగానూ ఉండడంలోనూ ఆదర్శంగా ఉండాలి,
అతని ప్రతివాది అతని గూర్చి చెడుమాట యేదియు చెప్పలేడు కనుక సిగ్గుపడతాడు.
వారు బానిసలు తమ సొంత యజమానులకు విధేయులై వాదులాడకుండా సంతోషపెట్టేవారిగా ఉండాలి.
రక్షకుడు అయిన దేవుని గురించిన ఉపదేశానికి అన్ని విధాలుగా కీర్తి తెస్తుంది.
దేవుని కృప ప్రతి ఒక్కరినీ రక్షించగలదు.
భక్తిహీనతనూ, మరియు ఈ లోక సంబంధమైన దురాశలు తిరస్కరించడానికి దేవుని కృప మనకు మనకు శిక్షణ ఇస్తుంది.
విశ్వాసులు శుభప్రదమైన నిరీక్షణ పొందడం కోసం ఎదురుచూస్తున్నారు: మన మహా దేవుడు, మరియు రక్షకుడు యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత.
మనలను సమస్త దుర్మార్గమంతటి నుంచీ విమోచించడం కోసం, మరియు తనకోసం ప్రత్యేక ప్రజలుగా, మంచి పనుల కోసం ఆసక్తి గలవారుగా పవిత్రపరచుకోవడానికి ఆయన మన కోసం తనను తాను అర్పించుకొన్నాడు.
విశ్వాసి వారికి లోబడాలి, మరియు వారికి విధేయులై ఉండాలి, మరియు ప్రతి మంచి పని కోసం సంసిద్ధంగా ఉండాలి.
నానా విధాల కోరికలూ, సుఖానుభవాలు వారిని తప్పుదారి పట్టిస్తాయి, బానిసలుగా చేస్తాయి.
నూతన జన్మ సంబంధమైన స్నానం ద్వారా, మరియు పరిశుద్ధాత్మ చేత నూతన స్వభావం కలిగించడం ద్వారా ఆయన మనలను రక్షించాడు.
మనం దేవుని కనికరం చేత రక్షించబడ్డాము.
దేవుడు మనలను తన వారసులుగా చేస్తాడు.
విశ్వాసులు మంచి పనులు చెయ్యడంలో జాగ్రత్త వహించాలి.
విశ్వాసులు బుద్ధిలేని వాదనలు, వంశావళులు, కలహము, మరియు ధర్మశాస్త్రమును గురించిన విభేధములను తప్పించాలి.
విభజించే వ్యక్తిని మనం విసర్జించాలి.
విశ్వాసులు తప్పనిసరి ఆవసరాల విషయం మంచి పనులలో తాము పాల్గొనడం నేర్చుకోవాలి.
పౌలు ఈ ఉత్తరం వ్రాస్తుoడగా చెరలో ఉన్నాడు(1:1,9,13).
పౌలు ప్రియమైన సోదరుడు, జత పనివాడైన ఫిలేమోనుకు వ్రాశాడు(1:1).
సంఘం ఇంట్లో సమావేశమవుతుంది(1:2).
ఫిలేమోను ప్రేమ గురించి, ప్రభువుపై విశ్వాసం, పరిశుద్ధులందరిపట్ల విశ్వసనీయత గురించి పౌలు విన్నాడు [1: 5].
ఫిలేమోను పరిశుద్ధుల హృదయాలను నూతన పరిచ్చడు [1: 7]
పౌలు ఆజ్ఞాపించుటకు బదులు ఫిలేమోనును ప్రేమనుబట్టి వేడుకొంటున్నాడు(1:9).
పౌలు బంధకాలలో ఉన్నపుడు పౌలు ద్వారా ఒనేసిము కుమారుడయ్యాడు(1:10).
పౌలు ఒనేసిమును తిరిగి ఫిలేమోను దగ్గరకు పంపాడు(1:12).
ఒనేసిము తనకు సహాయం చేయాలని పౌలు ఇష్టపడుతున్నాడు(1:13).
ఫిలేమోను ఒనేసిముకు బానిసగా ఉండటం నుంచి విడుదల, తిరిగి పౌలు దగ్గరకు పంపటానికి అంగీకారాన్ని కోరుతున్నాడు(1:14-16).
ఒనేసిమును ఒక ప్రియమైన సోదరునిగా ఫిలేమోను ఎంచుకోవాలని పౌలు ఫిలేమోనును కోరుకుంటున్నాడు (1:16).
అవును, ఫిలేమోను ఒనేసిమును తిరిగి తన దగ్గరకు పంపుతాడని పౌలు నమ్మకంగా ఉన్నాడు(1:21).
పౌలు చెరసాల నుంచి విడుదలైతే ఫిలేమోను దగ్గరకు వచ్చి అతిధిగా ఉంటాడు.
చాలా కాలం క్రితం దేవుడు అనేక సమయాలలో, నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మాట్లాడాడు[1:1].
దేవుడు ఈ చివరి రోజుల్లో తన కుమారుని ద్వారా మాట్లాడాడు[1:2].
కుమారుని ద్వారానే దేవుడు ఈ విశ్వాన్ని సృజించాడు[1:22].
ఆయన బలప్రభావాలు గల తన వాక్కు చేత అన్నిటినీ వహిస్తూ ఉన్నాడు[1:3].
కుమారుడే దేవుని మహిమతేజస్సు , దేవుని స్వభావ స్వరూపం[1:3].
దేవుని కుమారుడు దేవదూతలకంటే శ్రేష్టుడు[1:4].
కుమారుణ్ణి లోకంలోకి రప్పించినప్పుడు దేవదూతలందరూ ఆయనను ఆరాధించాలని దేవుడు ఆజ్ఞాపించాడు[1:6].
కుమారుడు రాజుగా శాశ్వతకాలం పరిపాలన చేస్తాడు[1:8].
కుమారుడు నీతిని ప్రేమిస్తాడు, అన్యాయాన్ని ద్వేషిస్తాడు[1:9].
ఆకాశం, భూమి వస్త్రం లాగా పాతబడిపోతాయి[1:10-11].
కుమారుని శత్రువులను తన పాదాల క్రింద పీఠంగా దేవుడు చేసే వరకు కుమారుని తన కుడి వైపున కూర్చోమని దేవుడు చెప్పాడు [1:13].
లేదు. దేవదూతలు ఆత్మలు[1:7,14].
రక్షణ అనే స్వాస్థ్యాన్నిపొందబోయే వారి గురించి దేవదూతలు శ్రద్ధ తీసుకుంటారు[1:14].
విశ్వాసులు తాము విన్న సంగతులనుంచి కొట్టుకు పోకుండా శ్రద్ధ తీసుకోవాలి[2:1].
ప్రతీ అతిక్రమం, అవిధేయత న్యాయమైన ప్రతిఫలం పొందుతాయి[2:2].
దేవుడు సూచకక్రియలూ వింతలూ శక్తివంతమైన క్రియలూ పరిశుద్ధాత్మ వరాల చేత సువార్తకు సాక్ష్యం ఇచ్చాడు[2:4].
రానున్న లోకాన్నిదేవదూతలు పాలించరు[2:5].
నరపుత్రుడు రానున్న లోకాన్ని పాలిస్తాడు[2:6-8].
ప్రతిఒక్కరి నిమిత్తం యేసు మరణాన్ని రుచి చూసాడు[2:9].
అనేకమంది కుమారులను మహిమలోకి తేవాలని దేవుడు తలంచాడు[2:10].
పరిశుద్ధ పరచేవాడు, పరిశుద్ధత పొందేవారు ఒకే ఆధారం, దేవుని నుంచి వస్తారు [2:11].
యేసు మరణం ద్వారా సాతాను శక్తిహీనుడయ్యాడు[2:14].
యేసు మరణం ద్వారా మరణభయం నుంచి మనుషులు విడుదల పొందారు[2:15].
ఆయన దేవుని విషయాలలో జాలిగల నమ్మకమైన యాజకుడయ్యే నిమిత్తం, ప్రజల పాపాలకు క్షమాపణ కలగజేయాలని యేసు అన్నింటిలో తన సోదరులలాంటివాడుగా ఉండవలసి వచ్చింది[2:17].
యేసు శోధనలకు గురి అయి బాధ అనుభవించాడు గనుక శోధనలకు గురి అయినవారికి సాయం చెయ్యగలిగినవాడు అయ్యాడు[2:18].
అపొస్తలుడు, ప్రధానయజకుడు అని గ్రంధకర్త యేసుకు బిరుదులు ఇచ్చాడు[3:1].
మోషే దేవుని యిల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు, యేసు యింటిని నిర్మించాడు కనుక యేసు మోషే కంటే ఎక్కువ గౌరవానికి తగినవాడుగా లెక్కకు వచ్చాడు[3:2-3].
దేవుని ఇంటిలో మోషే ఒక సేవకుడు[3:5].
మోషే తరువాత చెప్పబోతున్నదాని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు[3:5].
యేసు దేవుని ఇంటిమీద అధికారి[3:6].
విశ్వాసులు అంతం వరకు తమ ధైర్యాన్నిగట్టిగా పట్టుకొన్నారంటే వారే ఆయన ఇల్లు[3:6].
ఇశ్రాయేలీయులు తమ హృదయాలను కఠినం చేసుకున్నారు[3:7-8].
వారు విశ్రాంతిలో ప్రవేసించరని దేవుడు ప్రమాణం చేసాడు[3:10-11].
నమ్మకంలేని హృదయం ద్వారా దేవుని నుండి తొలగిపోకుండా జాగ్రత్త వహించాలని సోదరులకు హెచ్చరిక ఇవ్వటం జరిగింది[3:12].
అనుదినం సోదరులు ఒకరినొకరు ప్రోత్సాహపరచుకొంటూ ఉండాలి[3:13].
క్రీస్తులో పాలిభాగస్తులుగా విశ్వాసులు మొదట వారికున్న ధైర్యాన్ని అంతం వరకు గట్టిగా చేపట్టాలి[3:14].
అరణ్యంలో పాపం చేసినవారి విషయం దేవుడు నలభై సంవత్సరాలు కోపగించుకున్నాడు[3:17].
వారి మృత దేహాలు అరణ్యంలో కూలిపోయాయి[3:17].
అవిధేయులైన ఇశ్రాయేలీయులు తమ అవిశ్వాసం కారణంగా దేవుని విశ్రాంతిలో ప్రవేశింపలేక పోయారు[3:19].
విశ్వాసులు, ఇశ్రాయేలీయులు ఇద్దరూ దేవుని విశ్రాంతిని గురించిన శుభవార్త విన్నారు[4:2].
ఇశ్రాయేలీయులకు అ శుభవార్త మీద నమ్మకం కుదరలేదు కనుక వారికి ప్రయోజనకరంగా లేదు[4:2].
శుభవార్తను విని దానిని విశ్వసించినవారు దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తారు [4:2-3].
దేవుడు తాను సృష్టించిన వాటిని జగత్తుకు పునాది వేయబడినప్పుడే సంపూర్తి చేసి ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు[4:3-4].
ఇశ్రాయేలీయులు తన విశ్రాంతిలో ప్రవేశించరు అని దేవుడు చెప్పాడు[4:5].
తన విశ్రాంతిలో ప్రవేశించడానికి దేవుడు మనుషులకు "ఈ రోజు" నిర్ణయించాడు(4:7).
దేవుని స్వరం విని హృదయం కఠినం చేసుకోకుండా ఉండాలి.
దేవుని ప్రజలకు సబ్బాతు విశ్రాంతి నిలిచి ఉంది[4:9].
దేవుని విశ్రాంతిలో ప్రవేశించినవాడు తన కార్యాలనుండి విశ్రాంతి పొందుతాడు[4:10].
ఇశ్రాయేలీయులు చేసినట్టు పడిపోకుండా దేవుని విశ్రాంతిలో ప్రవేశించదానికి విశ్వాసులు ఆశపడాలి[4:11].
దేవుని వాక్యం ఎలాంటి ఖడ్గం కంటే కూడా వాడిగలది[4:12].
దేవుని వాక్యం ప్రాణాన్నీ, ఆత్మనూ విభజిస్తూ, కీళ్ళనూ మూలుగునూ వేరు చేస్తుంది[4:12].
దేవుని వాక్యం తలంపులను ఆలోచనలను శోధించగలదు[4:12].
సృష్టి అంతటిలో ఆయనకు కనిపించనిది ఏదీ లేదు[4:13].
దేవుని కుమారుడైన యేసు విశ్వాసులకు గొప్ప ప్రధానయాజకుడుగా ఉన్నవాడు[4:14].
అన్నివిషయాలలో ఆయన శోధనలకు గురి అయ్యాడు కనుక విశ్వాసుసుల బలహీనతలలో యేసు సానుభూతి చూపుతున్నాడు[4:15].
ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు[4:15].
అవసర సమయాలలో విశ్వాసులు ధైర్యంతో కృపాసింహాసనం దగ్గరికి చేరాలి[4:16].
ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల పాపాల కోసం అర్పణలు, బలులు అర్పిస్తాడు[5:1].
ప్రధాన యాజకుడు తన పాపాల నిమిత్తం కూడా బలులు అర్పిస్తాడు[5:3].
అతడు ప్రదానయాజకునిగా ఉండుటకు దేవుని పిలుపు పొందినవాడై ఉండాలి [5:4].
క్రీస్తును ప్రధానయాజకునిగా దేవుడు ప్రకటించాడు[5:5,10].
క్రీస్తు దేవుని ప్రధానయాజకునిగా నిరంతరం ఉంటాడు[5:6].
మెల్కీసెదెకు వరుస ప్రకారం క్రీస్తు ప్రధానయాజకునిగా ఉన్నాడు[5:6,10].
క్రీస్తుకున్న భయభక్తులను బట్టి ఆయన ప్రార్ధనలను దేవుడు విన్నాడు[5:7].
తాను పొందిన శ్రమల వలన క్రీస్తు విధేయతను నేర్చుకున్నాడు[5:8].
తనకు విధేయత చూపిన వారికోసం క్రీస్తు శాశ్విత రక్షణకు కారకుడయ్యాడు[5:9].
ఈ లేఖను పొందినవారు వినడంలో మందబుద్దులయ్యారు, దేవోక్తులలో ఉన్న మొదటి పాఠాలు నేర్చుకొనవలసిన వారుగా ఉన్నారు[5:11-12].
విశ్వాసులు మంచిచెడ్డలు గుర్తించడం సాధన చెయ్యడం ద్వారా ఆత్మీయంగా ఎదుగుతారు[5:14].
హెబ్రీ గ్రంధకర్త విశ్వాసులను సంపూర్ణతకు ముందుకు సాగాలని కోరుతున్నాడు[6:1].
నిర్జీవక్రియల విషయం పశ్చాత్తాపం, దేవునిమీద నమ్మకం, బాప్తిస్మం, చేతులుంచడం, చనిపోయినవారు లేవడమూ, శాశ్వతమైన తీర్పులు మొదలైనవి పునాది బోధలు[6:1-2].
ఒకసారి పరిశుద్దాత్మలో పాలివారై తప్పిపోయినవారిని తిరిగి పశ్చాత్తాప పడేలా చేయడం అసాధ్యం[6:4-6].
వెలుగొందిన ఈ ప్రజలు పరలోక వరాన్ని, దేవుని వాక్కును, రానున్న యుగప్రభావాలను రుచి చూసారు[6:4-5].
వారు తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మళ్ళీ సిలువ వేసారు కాబట్టి వారు పశ్చాత్తాపడేలా సాధ్యం కావడం లేదు[6:6].
వర్షాన్ని పొంది, ముండ్ల తుప్పలూ గచ్చతీగెలూ దానిలో పెరిగితే ఆ భూమి కాల్చివేయడం జరుగుతుంది[6:7-8].
ఈ విశ్వాసులనుండి రక్షణ గురించిన శ్రేష్టమైన విషయాలకోసం రచయత ఎదురుచూస్తున్నాడు[6:9].
వారు చేసిన పనిని, వారి ప్రేమను, పరిశుద్ధులకు వారు చేసిన సేవను దేవుడు మరచిపోడు[6:10].
దేవుని వాగ్దానాలకు వారసులైన వారి విశ్వాసంను, ఓర్పును విశ్వాసులు అనుకరించాలి[6:12].
దేవుడు తనకు వాగ్దానాన్ని సొంతం చేసుకోడానికి అబ్రాహాము ఓపికతో ఎదురుచూడాలి[6:13-15].
మార్పుచెందని తన ఉద్దేశాన్ని చూపించటానికి దేవుడు తన వాగ్దానాన్ని ప్రమాణం ద్వారా స్థిరపరచాడు[6:17].
దేవుడు అబద్ధమాడటం అసాధ్యం[6:18].
దేవునిలో విశ్వాసి నమ్మకం అతని ఆత్మకు భద్రమైనది, సుస్థిరమైన లంగరు వంటిది[6:19].
యేసు విశ్వాసుల కోసం ముందుగా తెర వెనుకకు ప్రవేశించాడు[6:20].
మెల్కీసెదెక్ కు షాలేం పట్టణ రాజు, మహోన్నతుడైన దేవుని యాజకుడు అని పేర్లు [7:1].
అబ్రాహాము మెల్కీసెదెక్ కు అన్నింటిలో పదవ వంతు ఇచ్చాడు[7:2].
మెల్కీసెదెక్ అనే పేరుకు "నీతికి రాజు" అని "శాంతి రాజు" అని అర్ధం[7:2].
మెల్కీసెదెక్ పితరులు లేనివాడు, తన జీవానికి అంతము లేనివాడు[7:3].
ధర్మశాస్త్ర యాజకులు లేవి, అబ్రాహాము సంతానం నుంచి వచ్చారు[7:5].
మెల్కీసెదెక్ గొప్పవాడు ఎందుకంటే అతడు అబ్రాహామును ఆశీర్వదించాడు[7:7].
లేవి మెల్కీసెదెక్ దశమ భాగాన్ని చెల్లించాడు, ఎలాగంటే అబ్రాహాము మెల్కీసెదెక్ దశమ భాగాన్ని ఇచ్చినపుడు లేవి అబ్రాహాము గర్భంలోనే ఉన్నాడు[7:9-10].
మెల్కీసెదెకు వరుసక్రమంలో మరొక యాజకుడు కావలసి వచ్చింది ఎందుకంటే లేవియాజక ధర్మం ద్వారా సంపూర్ణత సాధ్యం కాలేదు[7:11].
యాజక ధర్మం మారినపుడు ధర్మశాస్త్రం కూడా మారడం అవసరం[7:12].
యూదా గోత్రం నుండి యేసు వచ్చాడు, యూదా గోత్రం బలిపీఠం వద్ద ఇంతకు ముందు యాజక ధర్మం చేయలేదు[7:14].
అంతం లేని జీవానికున్న బలం ప్రకారమే యేసు మెల్కీసెదెక్ వరుసక్రమంలో యాజకుడయ్యాడు[7:16].
బలహీనమైనది, పనికిమాలినిది అయిన ధర్మశాస్త్రం, మునుపు ఉన్న ఆజ్ఞ ప్రక్కన పెట్టడం జరిగింది[7:18-19].
యేసు శాశ్వతం యాజకుడిగా ఉంటాడనే ప్రమాణం చెయ్యటం ద్వారా క్రీస్తులో విశ్వాసులకున్న దానిని దేవుడు శ్రేష్టమైన విశ్వాసంగా స్థిరపరచాడు[7:19-21].
శ్రేష్టమైన నిబంధనను యేసు ఖాయపరచాడు[7:22].
తన ద్వారా దేవునిదగ్గరకు వచ్చువారిని యేసు శాశ్వితంగా రక్షించగలుగుతున్నాడు ఎందుకంటే వారి పక్షంగా విజ్ఞాపనలు చెయ్యడానికి ఆయన ఎప్పటికి జీవిస్తూ ఉన్నాడు[7:25].
యేసు పాపం లేనివాడు, నిర్దోషి, కళంకం లేనివాడు, పాపులలో చేరని ప్రత్యేకమైనవాడు[7:26].
ప్రజల పాపం కోసం యేసు తనను తాను ఒక్కసారే అర్పించుకొన్నాడు[7:27].
యేసు పాపం లేనివాడు కనుక తనకు తాను ఎలాంటి అర్పణ అర్పించాల్సిన అవసరం లేదు[7:26-27].
ధర్మశాస్త్రం ద్వారా నియమితులైన యాజకులు బలహీనులు, అయితే యేసు శాశ్వితంగా సంపూర్ణసిద్ధి పొందినవాడు[7:28].
విశ్వాసుల ప్రధానయాజకుడు పరలోకంలో ఉన్న మహాఘనుడైన దేవుని సింహాసనం కుడిప్రక్కన కూర్చుని ఉన్నాడు[8:1].
నిజమైన గుడారం పరలోకంలో ఉంది[8:2].
ప్రతీ యజకునికి అర్పించడానికి ఏదో ఒకటి ఉండాలి[8:3].
ధర్మశాస్త్రం ప్రకారం అర్పణలు అర్పించే యాజకులు భూమి మీద ఉన్నారు[8:4].
భూమి మీద ఉన్న యాజకులు పరలోక విషయాలకు సూచనగా, నీడగా ఉన్న ఆరాధనా గుడారంలో సేవ చేయాలి[8:5].
దేవుడు మోషేకు పర్వతం మీద చెప్పిన పద్ధతి ప్రకారం భూసంబంధమైన గుడారం నిర్మాణం జరిగింది[8:5].
క్రీస్తుకు శ్రేష్టమైన సేవ దొరికింది ఎందుకంటే ఆయన శ్రేష్టమైన వాగ్దనాల మీద స్థాపితమైన శ్రేష్టమైన నిబంధనకు మధ్యవర్తియై యున్నాడు[8:6].
ఇశ్రాయేలు ఇంటితోను, యూదా ఇంటితోను దేవుడు నూతన నిబంధనను వాగ్దానం చేసాడు[8:8].
ఆయన తన శాసనాలను వారి మనసులలో రాస్తానని చెప్పాడు, వారి హృదయాలలో రాస్తానని చెప్పాడు[8:10].
నూతన నిబంధనలో అల్పులైనా, ఘనులైనా వారు ప్రభువును తెలుసుకుంటారు[8:11].
నూతన నిబంధనలో ప్రజల పాపాలను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడని చెప్పాడు [8:11].
క్రొత్త నిబంధనను ప్రకటించడం చేత దేవుడు మొదటి నిబంధనను పాతదిగా, అంతర్దానం కావడానికి సిద్ధమైనదిగా చేసాడు[8:13].
మొదటి నిబంధనకు ఆరాధన స్థలం భూమి మీద గుడారం[9:1-2].
భూసంబంధమైన గుడారంలోని పరిశుద్ధ స్థలంలో దీపస్తంభం, బల్ల, సన్నిధి రొట్టెలు ఉన్నాయి[9:2].
భూసంబంధమైన గుడారం అతి పరిశుద్ధ స్థలంలో బంగారు ధూపార్తి, నిబంధన మందసం ఉన్నాయి[9:4].
తన కోసం, ఇతరుల కోసం బలులు అర్పించిన తరువాత అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు సంవత్సరంలో ఒక్కసారే ప్రవేశిస్తాడు[9:7].
భూసంబంధమైన గుడారం, అర్పించిన అర్పణలు, బలులూ ప్రస్తుత కాలానికి ఉదాహరణగా ఉంది[9:9].
భూసంబంధమైన గుడారం బలులు ఆరాధకులను అంతర్వాణి విషయంలో పరిపూర్ణులుగా చేయలేవు[9:9].
భూసంబంధమైన గుడారం విధులు నూతన క్రమం వచ్చేవరకు వర్తిస్తాయి[9:10].
క్రీస్తు సేవ చేసే పవిత్ర గుడారం మరింత పరిపూర్ణమైనది, చేతులతో చేసినది కాదు, ఈ సృష్టి సంబంధమైనది కాదు[9:11].
క్రీస్తు తన సొంత రక్తంతోనే పవిత్రమైన గుడారంలోని అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాడు[9:12,14].
క్రీస్తు అర్పణ ప్రతి ఒక్కరికి శాశ్వత విమోచనను అనుగ్రహించింది [9:12].
జీవంగల దేవుని సేవకోసం విశ్వాసి మనస్సాక్షిని నిర్జీవ క్రియలనుండి శుద్ది చేస్తుంది[9:14].
క్రీస్తు నూతన నిబంధనకు మధ్యవర్తి [9:15].
మరణ శాసనం చెల్లుబాటు కావడానికి మరణం అవసరం[9:17].
మొదటి నిబంధనకు కోడెదూడల మరణం, మేకల మరణం అవసరం[9:18-19].
రక్తం చిందనిదే అపరాధాలకు క్షమాపణ లేదు[9:22].
ఇప్పుడు క్రీస్తు దేవుని సముఖంలో మన కోసం కనబడడానికి ఆయన పరలోకంలో ఉన్నాడు[9:24].
పాపాన్ని తీసివేయడానికి యుగాల అంతంలో ఒకేసారి క్రీస్తు తనను తాను బలిగా అర్పించుకున్నాడు[9:26].
ప్రతీవ్యక్తి చనిపోయిన తరువాత వారు తీర్పును ఎదుర్కొంటారు[9:27].
తన కోసం ఎదురు చూచేవారికి విముక్తి ప్రసాదించడానికి క్రీస్తు రెండవ సారి కనిపిస్తాడు[9:28].
క్రీస్తులోని నిజస్వరూపానికి ధర్మశాస్త్రం ఒక నీడ మాత్రమే[10:1].
ఏటేటా ధర్మశాస్త్రం ద్వారా జరుగుతున్న బలులు ఆరాధకులకు వారి పాపలను జ్ఞాపకం చేస్తున్నాయి[10:3].
ఎద్దుల రక్తం, మేకల రక్తం పాపాలను తీసివేయడం అసాధ్యం[10:4].
దేవుడు ఆయన కోసం ఒక శరీరాన్ని సిద్ధపరచాడు[10:5].
క్రీస్తు ఈ లోకానికి వచ్చినపుడు దేవుడు ధర్మశాస్త్రం ప్రకారం బలులు అర్పించవలసిన అభ్యాసాన్ని ప్రక్కన పెట్టాడు[10:8].
క్రీస్తు ఈ లోకానికి వచ్చినపుడు దేవుడు క్రీస్తు శరీరాన్ని అందరికోసం అర్పించే అభ్యాసాన్ని స్థిరపరచాడు[10:10].
తన శత్రువులు తన పాదాల క్రింద పీటగా అయ్యేవరకు ఎదురు చూస్తూ ఉన్నాడు[10:12-13].
క్రీస్తు తాను చేసిన ఏకైక బలి ద్వారా పవిత్రులైన వారిని క్రీస్తు శాశ్వతంగా పరిపూర్ణులను చేసాడు[10:14].
పాపాలకు క్షమాపణ లేని పక్షంలో అదనపు బలులు అవసరం లేదు[10:18].
యేసు రక్తం ద్వారా విశ్వాసులు ఇప్పుడు అతిపరిశుద్ధ స్థలం లోకి ప్రవేశించగలరు[10:19].
విశ్వాసి హృదయం నేరారోపణ చేయకుండా దాని మీద ప్రోక్షణ జరిగింది, శరీరం శుద్ధజలంతో శుద్ధి అయ్యింది[10:22].
విశ్వాసులు తమ నిరీక్షణ విషయం ఒప్పుకొనిన దానిని గట్టిగా పట్టుకోవాలి[10:23].
ఆ దినం దగ్గర పడే కొద్దీ విశ్వాసులు ఒకరినొకరు ప్రోత్సహించుకొంటూ ఉండాలి[10:25].
సత్యాన్ని తెలుసుకొన్న తరువాత ఒకడు బుద్ధిపూర్వకంగా పాపాలు చేస్తూ ఉంటే అతనికి తీర్పు, దేవుని శత్రువులను దహించి వేసే అగ్ని ఉంటుంది[10:26-27].
ఎవరైనా తనను ప్రత్యేకపరచిన క్రీస్తు నిబంధన రక్తాన్ని అపవిత్రంగా ఎంచినట్లయితే ఎలాంటి కరుణ లేకుండ మోషే ధర్మశాస్త్రం క్రింద ఉన్న శిక్షకు మించిన శిక్షకు అతడు పాత్రుడవుతాడు[10:28-29].
పగ తీర్చుట దేవుని వంతు[10:30].
వారి ఆస్తిపాస్తులు దోచుకోవడం జరిగినా దానికంటే శ్రేష్టమైన ఆస్తి పరలోకంలో వారికుందని తెలిసికొని విశ్వాసులు సంతోషంతో అంగీకరించారు[10:34].
దేవుడు వాగ్దానం చేసినది పొందేలా విశ్వాసికి ధైర్యం, ఓర్పు అవసరం[10:35-36].
నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు[10:38].
వెనుకకు తీసిన వ్యక్తి విషయం దేవుడు సంతోషించడు[10:38].
ఈ ఉత్తరాన్ని స్వీకరించిన వారు వారి ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసం కలిగినవారై ఉండాలని రచయిత కోరుకుంటున్నాడు [10:39].
ఇంకా సంపూర్తి కాని దేవుని వాగ్దానాలను విశ్వాసం కలిగిన ఒక వ్యక్తి ధైర్యంతో ఎదురు చూస్తాడు, వాటి పట్ల ఖచ్చితమైన వైఖరి కలిగి ఉంటాడు[11:1].
ప్రపంచాల్లో కనిపించే వస్తువులు కనిపించే వస్తువులతో నిర్మాణం కాలేదు[11:3].
విశ్వాసం ద్వారా హెబెలు కయీను అర్పించిన దానికంటే శ్రేష్టమైన బలిని అర్పించాడు కనుక దేవుడు హెబెలు విషయం గొప్పగా చెప్పాడు[11:4].
దేవుని దగ్గరకు వచ్చే వాడు దేవుడు ఉన్నాడని, ఆయనను హృదయపూర్వకంగా వెదికే వారికి ప్రతిఫలమిస్తాడని నమ్మాలి [11:6].
దేవుని హెచ్చరిక ప్రకారం తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఒక ఓడను నిర్మించడం ద్వారా నోవహు తన విశ్వాసాన్ని కనుపరచాడు[11:7].
విశ్వాసం ద్వారా అబ్రాహాము, శారాలు వయసు ఉడిగినా గర్భం ధరించడానికి వాగ్దానం పొందారు[11:11].
విశ్వాసం కలిగిన పితరులందరూ దూరం నుంచి దేవుని వాగ్దానాలను స్వాగతించారు [11:13].
విశ్వాసం కలిగిన పితరులందరూ భూమి మీద పరదేశులం, యాత్రికులం అని తమను తాము ఎంచుకున్నారు[11:13].
విశ్వాసం కలిగిన వారి కోసం దేవుడు ఒక పరలోక నగరాన్ని సిద్ధం చేసాడు[11:16].
మృతులలోనుండి తన కుమారుని లేపుతాడని అబ్రాహాము దేవుని నమ్మాడు[11:17-19].
మరే మాట వారితో చెప్పవద్దని ఇశ్రాయేలీయులు బతిమాలుకున్నారు [12:19].
తన అంతం సమీపంగా ఉన్నప్పుడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలు సంతానం నిర్గమనం గురించి యోసేపు విశ్వాసం ద్వారా ప్రవచించాడు[11:22].
విశ్వాసం ద్వారా మోషే పాపంతో కూడిన సుఖభోగాలు అనుభవించడానికి బదులు దేవుని ప్రజలతో హింసలు అనుభవించడానికి కోరుకున్నాడు[11:24-26].
ఇశ్రాయేలు ప్రథమ సంతానాన్ని కాపాడడంకోసం విశ్వాసం ద్వారా మోషే పస్కాను, రక్త ప్రోక్షణను ఆచరించాడు[11:28].
తాను నశించిపోకుండా విశ్వాసం ద్వారా రాహాబు వేగులను భద్రంగా దాచిపెట్టింది[11:31].
కొందరు పితరులు విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించారు, కత్తివాత పడకుండా తప్పించుకున్నారు, యుద్ధంలో వీరులయ్యారు, విదేశీసైన్యాలను పరుగులెత్తించారు[11:33-34].
విశ్వాసవీరులు కొందరు హింసకు గురి అయ్యారు, వెక్కిరింపులకు, కొరడా దెబ్బలకు, సంకెళ్ళు, ఖైదులూ అనుభవించారు, రాళ్ళ దెబ్బలు తిన్నారు, రంపాలతో రెండుగా కోయడం, మరణం, పేదరికానికి గురి అయ్యారు[11:35-38].
ఈ పితరులు విశ్వాసం కలిగినావారైనప్పటికి, దేవుడు వారికి చేసిన వాగ్దానాల నేరవేర్పును అనుభవించలేదు[11:39].
ఈ విశ్వాసవీరులు క్రీస్తులోని నూతన నిబంధన విశ్వాసులతో కలిసి దేవుని వాగ్దానాలను పొందుతారు, సంపూర్ణ సిద్ధి పొందుతారు[11:40].
ఇంత గొప్ప సాక్షి సమూహం మనచుట్టూ ఆవరించి ఉన్నందువలన సుళువుగా చిక్కులు పెట్టే పాపాలను విశ్వాసి త్రోసిపుచ్చాలి[12:1].
తనముందున్న ఆనందం కోసం యేసు సిలువను, దాని అవమానాన్ని ఓర్చుకొన్నాడు[12:2].
పాపులు తనకు వ్యతిరేకంగా చేసిన ఎదిరింపులు ఓర్చుకున్న యేసును తలపోయడం ద్వారా విశ్వాసి విసుకకుండ, అలసిపోకుండా ఉండగలడు [12:3].
తాను ప్రేమించి, స్వీకరించే వారిని ప్రభువు శిక్షిస్తాడు[12:6].
ప్రభువు శిక్ష లేనివారు కుమారులు కాదు గాని వారు అక్రమ సంతానం[12:8].
దేవుడు తన పిల్లలు తన పవిత్రతలో పాల్గొనాలని మేలుకే శిక్షిస్తాడు[12:10].
శిక్ష నీతి అనే ఫలాలను ఇస్తుంది[12:11].
విశ్వాసులు అందరితో కలిసి సమాధానం కోసం ప్రయత్నించాలి [12:14].
చెడు వేరు ఎదగకుండా, కలత పెట్టకుండా, అనేకులు అపవిత్రం కాకుండా ఉండాలి[12:15].
ఏశావు తన జన్మ హక్కు అమ్మివేసిన తరువాత దీవెన కోసం కన్నీళ్ళతో కోరుకున్నప్పుడు అతడు నిరాకరణకు గురి అయ్యాడు[12:17].
క్రీస్తునందున్న విశ్వాసులు సీయోను పర్వతానికి, సజీవుడైన దేవుని నగరానికి రావాలి[12:22].
క్రీస్తులో ఉన్న విశ్వాసులు పరలోకంలో రాసి ఉన్న జ్యేష్టుల సంఘానికి రావాలి[12:23].
క్రీస్తులో ఉన్న విశ్వాసులు అందరికీ న్యాయమూర్తి అయిన దేవుని దగ్గరకు , న్యాయవంతుల ఆత్మల దగ్గరకు , యేసు దగ్గరకు రావాలి[12:23-24].
పరలోకం నుంచి హెచ్చరించిన వాడి నుండి తొలగి పోయిన వారు దేవుని నుండి తప్పించుకోలేరు[12:25].
సృష్టించిన వాటిని కదిలించడానికి, తొలగించడానికి దేవుడు వాగ్దానం చేశాడు[12:26-27].
విశ్వాసులు నిశ్చలమైన రాజ్యాన్ని పొందుతారు[12:28].
విశ్వాసులు దేవుణ్ణి వినయ భయభక్తులు కలిగి ఆరాధించాలి[12:28].
దేవుడు దహించే అగ్ని కనుక విశ్వాసులు ఈ విధంగా దేవుణ్ణి ఆరాధించాలి[12:29].
కొందరు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు [13:2].
ఖైదులో ఉన్నవారితో కూడా వారునూ ఖైదీలై ఉన్నట్టే, వారు దౌర్జన్యానికి గురి అయిన వారిగా విశ్వాసులు వారిని జ్ఞాపకముంచుకోవాలి[13:3].
వివాహం అంటే అందరికి గౌరవముండాలి[13:4].
జారత్వం, వ్యభిచారం చేసేవారికి దేవుడు తీర్పు తీరుస్తాడు[13:4].
ధనాశనుండి విశ్వాసి విముక్తుడు ఎలా కాగలడంటే తనను ఎన్నడు విడువను, ఎన్నడు ఎడబాయనని దేవుడు చెప్పాడు[13:14].
దేవుని వాక్కు చెప్పి నాయకులుగా ఉన్నవారిని విశ్వాసులు అనుకరించాలి [13:7].
ఆహారం గురించి నియమాలు ఉన్న క్రొత్త బోధ విషయం రచయిత విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు[13:9].
బలుల కోసం ఉపయోగించిన జంతువుల కళేబరాలను శిబిరం బయట కాల్చివేస్తారు[13:11].
యేసు నగర ద్వారం వెలుపల బాధల పాలయ్యాడు[13:12].
విశ్వాసులు యేసు నిందను భరిస్తూ శిబిరం బయటికి ఆయన దగ్గరకు వెళ్ళాలి [13:13].
ఈ భూమి మీద విశ్వాసులకు శాశ్విత నగరం ఏదీ లేదు [13:14].
రానున్న నగరం కోసం విశ్వాసులు ఎదురు చూస్తున్నారు [13:14].
విశ్వాసులు దేవునికి స్తుతి యాగం ఎప్పుడూ అర్పిస్తూ ఉండాలి[13:15].
విశ్వాసులు తమ నాయకుల మాట వినాలి, వారికి లోబడాలి[13:17].
దేవుని దృష్టికి ప్రీతికరమైన దానిని విశ్వాసి జీవితంలో జరిగిస్తాడు[13:21].
విశ్వాసులను దర్శించడానికి రచయిత తిమోతితో కలిసి వస్తాడు[13:23].
యాకోబు ఈ లేఖ చెదరి పోయిన పన్నెండు గోత్రాలకు వ్రాశాడు(1:1).
సమస్యలు అనుభవిస్తూ ఉన్నపుడు వాటి అన్నింటిని ఆనందంగా ఎoచుకోవాలని యాకోబు చెపుతున్నాడు(1:2).
మన విశ్వాసo పరీక్షకు గురి అవుతుండగా పరిపక్వత, ఓర్పు కలుగుతాయి (1:3-4).
మనం విశ్వాసంతో దేవున్ని జ్ఞానం కోసం అడగాలి(1:5-6).
అనుమానంగా అడిగే వాడు తనకు దేవుని నుండి ఏదైనా దొరుకుతుందని చూడకూడదు (1:6-8).
ఆస్థిపరుడైన సోదరుడు వినయం కలిగి ఉండాలి ఎందుకంటే ఆతడు గడ్డిపువ్వులాగా గతించిపోతాడు(1:12).
విశ్వాస పరీక్ష గెలిచే వ్యక్తి జీవ కిరీటం పొందుతాడు(1:12).
ఒక వ్యక్తి దుష్టత్వం వలన శోధనకు గురి అవుటకు కారణం తన చెడ్డ కోరికలే(1:14).
వెలుగుకు కర్త అయిన తండ్రి నుండి కిందకి ప్రతి మంచి ఈవీ పరిపూర్ణమైన ప్రతి వరం వస్తాయి(1:17).
దేవుడు సత్య వాక్కు ద్వారా మనకు జీవం ఇవ్వాలని ఎంచు కొన్నాడు(1:18).
వినటానికి ఆతురoగా, మాట్లాడటానికీ కోపడటానికీ నిదానంగా ఉండాలని యాకోబు మనకు చెపుతున్నాడు(1:19).
వాక్కు విని దాని ప్రకారం చేయకపోవటం వల్ల మనంతట మనమే మోస పోతామని యాకోబు చెపుతున్నాడు(1:27).
మనం నిజమైన దైవ భక్తి కలిగి యుండుట కోసం నాలుకను అదుపులో ఉంచుకోవాలి(1:26).
దేవుని ఎదుట కళంకం లేని నిర్మలమైన దైవభక్తి ఏదంటే తండ్రి లేని పిల్లలనూ విధవరాండ్రను పరామర్శించటం, ఈలోక మాలిన్యం నుండి తనను కాపాడుకోవటం(1:27).
ప్రత్యేకమైన మనుషులు వచ్చినపుడు వారు కనపడే రూపాన్ని బట్టి అభిమానం చూపకూడదని యాకోబు సోదరులకు చెపుతున్నాడు(2 :1-4).
దేవుడు ఎన్నుకొన్నపేదవారు విశ్వాస విషయంలో భాగ్యవంతులై దేవుని రాజ్యానికి వారసులై ఉండాలని అని యాకోబు చెపుతున్నాడు(2:6-7).
భాగ్యవంతులు దేవుని నామo దుషిస్తూ సోదరులను అణగ ద్రోక్కుతారు అని యాకోబు చెపుతున్నాడు(2:6-7).
లేఖనాల అత్యుత్తమైన ఆజ్ఞ, "నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించుట " (2 :8 ).
ఎవరైన ధర్మశాస్త్ర మంతటిలో ఒక్క దేవుని ఆజ్ఞ విషయంలో తప్పి పోతే ధర్మశాస్త్ర మంతటిలో అపరాధి(2:10).
కరుణ చూపని వానికి కరుణ లేకుండా తీర్పు వస్తుంది(2:13).
విశ్వాసం కలిగి ఉన్నానని వాదించేవారు, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయకపోతే అలాంటి విశ్వాసం వారిని రక్షించదు అని యాకోబు చెపుతున్నాడు(2:14-16).
క్రియలు లేకుండా ఒంటిగా ఉండే విశ్వాసం మృతం. [2:17].
క్రియలు ద్వారా మనం విశ్వాసం చూపాలని యాకోబు చెపుతున్నాడు(2:18 ).
విశ్వాసం కలిగి ఉన్నానని వాదించేవారు, దయ్యాలు ఇద్దరూ ఒకే దేవుడున్నాడు అని నమ్ముతున్నారు(2 :19).
అబ్రాహాము బలిపీఠo మీద ఇస్సాకును సమర్పించినపుడు క్రియల ద్వారా తన విశ్వాసం ప్రదర్శించాడు(2:21-22).
అబ్రహాము విశ్వాస క్రియల వలన లేఖనం నెరవేరింది అది, "అబ్రహాము దేవుని నమ్మాడు, ఆ నమ్మకమే అతనికి నీతి అయ్యింది"(2:23).
ఆత్మనుంచి వేరైన శరీరం మృతం(2:26).
వారు మరీ కఠినమైన తీర్పు పొందుకుంటారు గనుక అనేకులు బోధకులుగా మారకండని యాకోబు చెపుతున్నాడు(3:1).
మనమందరము అనేక మార్గాల్లో తొట్రుపడతాo(3:2).
ఏ వ్యక్తి తన మాటల్లో తొట్రుపడడో ఆ వ్యక్తి తన శారీరమంతా అదుపులో ఉంచుకుoటాడు(3:2).
ఓ చిన్నవస్తువు ఓ పెద్ద వస్తువుని ఎలా అదుపు చేస్తుందో వివరించటానికి యాకోబు గుర్రం నోటికి తగిలించే కళ్ళెo, ఓడను అదుపుచేసే చుక్కాని, ఉదాహరణలుగా ఉపయోగించి వివరించాడు(3:3-4).
పాపిష్టి నాలుక శరీరాన్నoతా మాలిన్యం చేస్తుంది(3:6).
మనుషుల్లో ఎవరిచేతా మచ్చిక కానిది నాలుకే(3:8).
ఒకే నోటి నుంచి వచ్చే రెండు విషయాలు ఆశీర్వాదమూ శాపము(3:9-10).
ఒక వ్యక్తి తెలివి, జ్ఞానాన్నివినయంతో చేసిన క్రియల వల్ల బయటకు కనపరుస్తాడు(3:13).
ఇహలోక సంబంధమైన, సహజసిద్ధమైన, దయ్యాలచే కలిగే జ్ఞానం ఒక వ్యక్తిలో తీవ్రమైన అసూయ, స్వార్ధపూరితమైన ఆశను ప్రతిఫలిస్తుంది(3:14-16).
పైనుంచి దిగి వచ్చే జ్ఞానం శాంతికరమైనది, మృధువైనది, దయతో కూడిన హృదయంగలది, జాలితో మంచి ఫలాలతో నిండి ఉన్నది, పక్షపాతం లేనిది, నిష్కపటమైనదిగా ప్రతిబింబిస్తుంది(3:17).
విశ్వాసుల మధ్య జగడాలకూ పోట్లాటలకూ కారణo చెడు కోరికలే అని యాకోబు చెపుతున్నాడు(4:1).
విశ్వాసులు దేవున్ని అడిగేవి దురుద్దేశంతో చెడు కోరికలు వాడుకోటానికి చెడ్డ విషయాలు అడుగుతారు గనుక పొందుకోలేక పోతున్నారు(4:3).
ఒక వ్యక్తి ఈ లోకంతో స్నేహంగా ఉండాలని నిశ్చయిoచుకుంటే ఆ వ్యక్తి దేవునికి విరోధౌవుతాడు(4:4).
దేవుడు గర్విష్టులను ఎదిరిస్తాడు, వినయం గలవారికి కృప అనుగ్రహిస్తాడు(4:6).
విశ్వాసి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించినపుడు పారిపోతాడు (4:7).
దేవుని దగ్గరకు వచ్చే వారి దగ్గరకు ఆయన వస్తాడు(4:8).
విశ్వాసులు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు మాట్లాడాకోవద్దని యాకోబు చెప్పాడు(4:11).
దేవుడు అనుమతిస్తే, ప్రభువు చిత్తమైతే బ్రతికి ఉండి ఇదీ అదీ చేస్తాం అని చెప్పాలని విశ్వాసులుకు యాకోబు చెపుతున్నాడు (4:13-15).
తమ పథకాల గురించి గొప్పలు చెప్పుకునే వారు దుర్మార్గం జరిగిస్తున్నారు అని యాకోబు చెబుతున్నాడు (4: 16).
మంచి చేయడం తెలిసి కూడా చెయ్యక పోవడం పాపం (4: 17).
ధనికులు తమ సంపదలు నిలవ చేసుకున్నారు (5: 3).
ధనవంతులు తమ పని వారికి కూలి చెల్లించలేదు (5: 4).
ధనికులు నీతిపరులను దోషులుగా తీర్చి చంపారు (5: 6).
రాబోతున్న ప్రభువు కోసం విశ్వాసులు ఓర్పుగా కనిపెట్టుకొని ఉండాలని యాకోబు చెపుతున్నాడు(5:7-8).
పాత ఒడంబడిక ప్రవక్తలు మనకు ఓర్పు, బాధల్లో సహనాన్ని నిదర్శనంగా చూపెట్టారని యాకోబు చెపుతున్నాడు(5:10-11).
ఒక విశ్వాసి "అవును" అంటే అవును, "కాదు" అంటే కాదు అయి ఉండాలి (5:12).
ఎవరికైనా జబ్బు చేస్తే అతడు సంఘ పెద్దల్నిపిలిపించుకోవాలి అప్పుడు వాళ్ళు ప్రభు పేర నూనె రాసి ప్రార్ధన చెయ్యాలి (5:16).
ఆరోగ్యం చేకూరే క్రమంలో ఒకరితో ఒకరు పాపాలు ఒప్పుకోవాలి, ఒకరి కోసం ప్రార్ధన చెయ్యాలి అని చెపుతున్నాడు(5:16).
నీతిపరుని ప్రార్థన శక్తిగలదని ఏలీయా ఉదాహరణ మనకు ప్రార్థన గురించి చెబుతోంది [5:16-18].
ఒక పాపి వెళుతున్న తప్పు దారినుంచి మళ్ళించే వాడు అతని ఆత్మను మరణం నుంచి తప్పించి, అసంఖ్యాక మైన పాపాలను కప్పి వేస్తున్నాడు (5:20).
పేతురు యేసుక్రీస్తుకు అపోస్తలుడు (1:1).
పొంతు, గలతియ, కప్పదొకియ, ఆసియా, బితునియాలలో చెదిరి ఉన్న ఎంపిక అయిన వారికీ పేతురు రాసాడు (1:1).
తండ్రి అయిన దేవుని పూర్వ జ్ఞానాన్ని బట్టి, పరిశుద్ధాత్ముని పవిత్రీకరణను బట్టి పరదేశులు ఎంపిక అయిన వారుగా అయ్యారు (1:1, 2).
ఎంపిక అయిన వారికి కృప, అభివృద్ధి చెందే శాంతి ఉండాలని పేతురు రాశాడు (1:3).
తమ ప్రభువు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతులు పొందాలని పేతురు కోరుకున్నాడు (1:3).
దేవుడు వారికి తన గొప్ప కృప చొప్పున నూతన జీవం ఇచ్చాడు (1: 3).
ఎందుకంటే ఆ వారసత్వం పరలోకం నుండి వెల్లడి అయింది (1: 4).
చివరి రోజుల్లో వెల్లడి కావడానికి సిద్ధంగా ఉన్న రక్షణపై విశ్వాసముంచడం ద్వారా వారు భద్రంగా ఉన్నారు (1: 5).
వారి విశ్వాసం పరీక్షకు గురి కావాలని, వారి విశ్వాసం మూలంగా స్తుతి, మహిమ, యేసు క్రీస్తు ప్రత్యక్షం కలగాలి గనుక వివిధ కష్టాల్లో వారు దుఃఖించడం అవసరం (1:7).
నశించిపోయే బంగారం కన్నా విశ్వాసం మరింత విలువైనది (1: 7).
వారు ఆయన్ను ప్రేమించారు. నమ్మకం ఉంచారు. చెప్ప శక్యంగాని మహిమకరమైన అనందం వారిలో నిండింది (1: 8).
తమ ఆత్మ రక్షణ పొందారు (1: 9).
ప్రవక్తలు ఎంపిక అయిన పరదేశులు పొందుతున్న రక్షణ, వారి స్వంతం కాబోతున్న కృప గురించి జాగ్రత్తగా వెదికి పరిశోధించారు (1: 10).
క్రీస్తు బాధల గురించి, వాటి తరువాత రాబోయే మహిమను గురించి అయన వారికీ ముందుగానే చెబుతున్నాడు (1:11).
వారు ఎంపిక అయిన పరదేశులకు లాభం చేకూరుస్తున్నారు (1: 12).
దేవదూతలు సైతం ప్రవక్తల పరిశోధనల ఫలితాలు వెల్లడి కావాలని ఆశిస్తున్నారు (1: 12).
వారు తమ మనస్సు అనే నడికట్టు బిగించుకుని తమ ఆలోచనల్లో మెలకువగా ఉండి వారికీ అందిన కృప విషయంలో పూర్తి నిబ్బరం కలిగి, గతంలో తమకున్న ఆశలకు కట్టుబడకుండా ఉండాలని పేతురు అజ్ఞాపిస్తున్నాడు (1: 13,14).
ఎందుకంటే వారిని పిలిచినవాడు పవిత్రుడు (1: 15,16).
ఎందుకంటే ప్రతివాడి పని చొప్పున పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే వాణ్ణి వారు తండ్రి అని పిలుస్తున్నారు (1: 17).
వారు వెండితో బంగారంతో కాక, మచ్చ, కళంకం లేని గొర్రె పిల్లగా ప్రశస్తమైన క్రీస్తు రక్తం మూలంగా విమోచన పొందారు (1: 18,19).
వారు తమ పూర్వీకుల మూలంగా బుద్ధిహీనమైన ప్రవర్తన నేర్చుకున్నారు (1: 19).
భూమి పునాదులకు ముందే ఆయన ఎంపిక అయ్యాడు. ఎంపిక అయిన పరదేశులకు అయన అంత్య కాలంలో వెల్లడి అయ్యాడు (1: 20).
చనిపోయిన వారిలో నుండి లేపి మహిమ పొందిన క్రీస్తు ద్వారా విశ్వసించారు (1: 20, 21).
సోదర ప్రేమ విషయం సత్యానికి విధేయత చూపడం ద్వారా వారు తమ ఆత్మలను పవిత్రం చేసుకుంటారు (1: 22).
నశించి పోయే విత్తనం మూలంగా కాకా నాశనం కాని విత్తనం మూలంగా సజీవమైన, నిలిచి ఉండే దేవుని వాక్కు వాళ్ళ వారు తిరిగి జన్మించారు (1: 23).
శరీరం గడ్డిలాంటిది. దాని వైభవo గడ్డి పువ్వు లాంటిది(1:24).
ప్రభు వాక్కు శాశ్వతంగా నిలిచి ఉంటుంది(1:25).
సమస్తమైన మోసాన్ని, కపటాన్ని, అసూయను, దూషణను వారు విడిచి పెట్టాలి (2: 1).
ఎంపిక అయిన పరదేశులు తమ రక్షణలో ఎదిగేలా నిర్మలమైన ఆత్మసంబంధమైన పాలను కోరుకోవాలి (2:2).
ఆ రాయి యేసు క్రీస్తు (2: 4-5).
వారు ఆత్మ సంబంధమైన మందిరంగా నిర్మాణ మౌతున్న సజీవమైన రాళ్ళు. సిగ్గు పడనక్కరలేని పవిత్ర యజకులుగా వారు ఉండాలి (
తొట్రుపడటానికే నియమిoచ బడ్డారు గనక తొట్రుపడ్డారు(2:7-8).
జ.ఎవరయితే చెడు చేస్తూ మాట్లాడుతూ ఉంటారో వారు ప్రియమైన వారి మంచి ప్రవర్తన చూసి దేవున్ని మహిమపరచాలని పాప సంబంధమైన కోరికలు వదులుకోవాలని పేతురు పిలిచాడు(2:11-12).
బుద్ధిలేని వారి అజ్ఞాన పూరితమైన మాటల విషయం వారి నోరు మూయించడం కోసం ఎంపిక అయిన పరదేశులు తమ విధేయతను ఉపయోగించడం కోసం దేవుడు వారు ప్రతి మానవ అధికారానికి లోబడాలి అని దేవుడు కోరుతున్నాడు (2:13-15).
వారు తమ స్వేచ్ఛను దేవుని సేవకులుగా ఉండడానికి ఉపయోగించాలి.
యజమానులు అపకార బుద్ధి గల వారైన దాసులు లోబడాలి ఎందుకంటే మoచి చేస్తూ భాదలకు గురవుతూ ఉండటం దేవునిచే కొనియాడ తగింది (2:18-20).
ఎందుకంటె క్రీస్తు వారికోసం శ్రమపడి న్యాయంగా తీర్పు తీర్చు వానికి తనను అప్పగించు కొని వారికి ఒక మంచి ఆదర్శం ఉంచి వెళ్ళాడు(2:21-23).
వారిక మీదట పాపంలో ఎలాటి భాగం లేకుండా నీతి కోసం జీవించాలని, వారు తన గాయాల వల్ల స్వస్థత పొందాలని అయన వారి పాపాలు భరించాడు (2:24).
వారంతా తమ ఆత్మల రక్షకుని దగ్గరకు, కాపరి దగ్గరకు వచ్చారు (2:25).
జ భార్యలు అవిధేయుల అయిన భర్తలకు లోబడుట వలన వాక్కు లేకుండానే వారిని గెలుచుకోవచ్చు(3:1).
భార్యలు తమ వెలుపటి అలంకారం కాక హృదయం లోని వ్యక్తిత్వoతో వారిని గెలుచుకోవాలి(3:3-4).
దేవునిలో నమ్మకముంచి భర్తకు లోబడిన భార్యగా శారాను మాదిరిగా పేతురు చెప్పాడు(3:5-6).
జ భర్తలు తమ భార్యలతో తమ ప్రార్ధనలకు ఆటంకం కాకుండా జ్ఞానానుసారంగా యోగ్యoగా జీవించాలి(3:7).
ఎందుకంటే వారు అలా చేసి దీవెనలకు వారసులయ్యేoదుకు పిలుపు అందుకున్నారు (3:8-9).
జ.ఎందుకంటే పభువు కళ్ళు నీతిమంతుల పై ఉన్నాయి (3: 10, 12).
వారు తమ హృదయాల్లో క్రీస్తు ప్రభువును ప్రశస్తమైన వానిగా ప్రతిష్టించుకోవాలి (3:12,15)
నీతి కారణంగా బాధలు పడేవారే ధన్యులు(3:14).
ఎన్నికైన పరదేశులు దేవునిలోని వారి నమ్మకo గురించి అడిగే వారందరికీ గౌరవంగా సాత్వికంతో సమాధానం చెప్పాలి(3:15-16).
పేతురును, ఎన్నికైనవారిని, పరదేశులను దేవుని చెంతకు తేవడానికి క్రీస్తు పాపాల కోసం ఒక్కసారే హింసలు పొందాడు (3:18).
ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలు నోవహు కాలంలో దేవుడు సహనంతో ఎదురు చూసినప్పుడు అవిధేయంగా ఉన్న వారు (3: 19,20).
ఎన్నికైనవారిని, పరదేశులను రక్షించిన బాప్తిసాన్ని అది సూచిస్తున్నది. యేసు క్రీస్తు పునరుత్థానం ద్వారా మంచి మనస్సాక్షి వలె అది ఉంది (3: 20, 21)
ఎన్నికైనవారిని, పరదేశులను రక్షించిన బాప్తిసాన్ని అది సూచిస్తున్నది. యేసు క్రీస్తు పునరుత్థానం ద్వారా మంచి మనస్సాక్షి వలె అది ఉంది (3: 20, 21).
వారంతా ఆయనకు లోబడాలి (3:22).
క్రీస్తు శరీరంలో బాధలు అనుభవించినపుడు కలిగిన మనసును ఆయుధంగా ధరిoచమని పేతురు వారికి ఆజ్ఞాపించాడు(4:1).
యూదేతరులు ఎన్నికైన పరదేశుల గురించి చెడుగా ఎందుకు మాట్లాడారంటే, వారు యూదేతరుల్లాగా కామవికారాలలో, అభిలాషల్లో, తాగుడులో, విందువినోదాల్లో, అసహ్యమైన విగ్రహ పూజల్లో పాల్గొనరు (4:3,4).
సజీవులకు, మృతులకు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు (4:5).
ఎందుకంటే అన్నిటికీ అంతం వస్తుంది ఇoకా వారి ప్రార్ధనలు కోసం అలా చేస్తూ ఉండాలి(4:7).
యేసుక్రీస్తు ద్వారా దేవుడు మహిమ పొందుటకై తమకు ఇచ్చిన వరాలు ఇతరుల సేవకు ఉపయోగించాలి(4:10-11).
ఎందుకంటే క్రీస్తు నామం కోసం అవమానమూ బాధలు అనుభవించినట్లయితే వారు ధన్యులవుతారు(4:12-14).
ఎందుకంటే దేవుని ఇంటివారితో తీర్పు ఆరంభమయ్యే సమయం వచ్చింది (4 :15-17).
ఎందుకంటే నీతిపరులు సైతం బాధల గుండా రక్షణ పొందుతారు (4:17, 18).
తాము మేలు చేస్తూ నమ్మకమైన సృష్టి కర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి (4:19).
పేతురు సాటి పెద్ద, క్రీస్తు బాధలకు ప్రత్యక్ష సాక్షి, వెల్లడి కాబోతున్న మహిమ లో పాలిభాగస్థుడు (5:1).
దేవుని మందను కాస్తూ వారి విషయం శ్రద్ధ తీసుకోమంటున్నాడు (5:12).
యువకులు వృద్ధులకు లోబడాలి (5:5).
ఎందుకంటే సరైన సమయంలో వారిని హెచ్చించేలా దేవుడు వినయం గలవారికి కృప ఇస్తాడు (5:5-7).
ఎవరిని మింగాలా అని గర్జించే సింహం లాగా తిరుగులాడుతున్నాడు.
జ.వారు తమ అందోళనలను దేవునిపై వేసి, మెలకువగా, కనిపెట్టి చూస్తూ, సాతానును ధైర్యంగా ఎదిరించి నిలుస్తూ, తమ విశ్వాసంలో బలంగా ఉండాలి (5:7-9).
ఎన్నికైన పరదేశులు వారి సోదరులులాగా కొంచెం కాలం బాధలు ఓర్చుకున్న తరువాత దేవుడు వారిని పరిపూర్ణులుగా చేస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు(5:9-10).
పేతురు సిల్వానును నమ్మకమైన సోదరునిగా భావించాడు (5:12).
తను రాసినది నిజమైన దేవుని కృప అని అతడు భావించాడు (5:12).
బబులోనులో ఉన్న అమ్మగారు, పేతురు కుమారుడైన మార్కు, వారికి వందనాలు చెబుతున్నారు. వారి పవిత్రమైన ముద్దుతో ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి (5:13,14).
యేసుక్రీస్తు దాసుడూ అపోస్తులుడూ అయిన సీమోను పేతురు వ్రాశాడు(1:1).
పేతురు తమలాగే అమూల్య విశ్వాసం పొందిన వారికి వ్రాశాడు(1:1).
దేవుడు వీటిని దేవుని జ్ఞానం చొప్పున అయన ఇచ్చాడు (1: 3).
వారు దైవ స్వభావంలో భాగం పంచుకోవాలని అలా ఇచ్చాడు (1: 3-4).
వారు చివరకు తమ విశ్వాసం మూలంగా ప్రేమను పొందాలి (1: 5-7)
దగ్గరగా ఉన్నదే చూస్తాడు, అతడు అంధుడు (1:5-9).
శ్రేష్టమైన పిలుపునూ ఎన్నికనూ సోదరులు నిశ్చయం చేసుకోoటే వారు తొట్రుపడరు. ఇంకా వారి ప్రభువూ రక్షకుడూ అయిన యేసుక్రీస్తు శాశ్వత రాజ్యంలో ప్రవేశానికి అనుమతి లభిస్తుంది(1:10-11).
ఎందుకంటే పేతురు తన గుడారం త్వరలోనే విడిచి పెట్టాల్సి వస్తుందని వారి ప్రభువైన యేసుక్రీస్తు అతనికి చూపెట్టాడు(1:12-14).
తండ్రి అయిన దేవుని నుండి యేసు ఘనతా మహిమా పొందటం చూశారు(1:16-17).
ప్రవచనం మనిషి ఇష్టాన్ని బట్టి ప్రవక్తల ఊహాలో నుండి రాలేదు గాని మనుషులు పవిత్రాత్మవశులై దేవుని మూలంగా వ్రాశారు (1:19-21).
అబద్ద బోధకులు విశ్వాసులకు వినాశానకరమైన తప్పుడు సిద్ధాంతాలను రహస్యంగా తమను తీసుకొస్తారు కొన్న ప్రభువును కూడా కాదంటారు(2:1).
అబద్ద బోధకుల పైకి నాశనమూ శీఘ్ర విధ్వంసమూ వస్తుంది(2:1-3).
అబద్ద బోధకులు అత్యాశపరులై సోదరులు వలన లాభం సంపాదిస్తారు(2:1-3).
దేవుడు పాపం చేసిన దేవదూతలనూ పురాతన లోకంనూ అంతేకాదు సొదొమ, గొమొర్రా అనే పట్టణాలనూ విడిచి పెట్డ లేదు(2:5-7).
దేవుడు నోవహుతో ఏడుగురిని ఇoకా లోతును కాపాడాడు(2:9).
భక్తిపరులను రక్షించడం నీతిపరులను భద్రంగా ఉంచడం ఎలాగో ఆయనకు తెలుసునని దేవుని చర్యలు చూపిస్తున్నాయి (2: 9).
ఆ మహిమ రూపులు దేవదూతలు. వారు మనుషుల గురించి కించపరిచే తీర్పులు ప్రభువు దగ్గరికి తీసుకు రారు (2: 10, 11).
అబద్ద భోధకులు మరులు కొలిపి నిలకడ లేని ఆత్మలను చేస్తారు (2 :14).
బిలాం ప్రవక్త్హ అత్యాశను మాటాడని గాడిద మనిషి గొంతుతో మాట్లాడి ఆపింది(2:15-16).
మనిషిని ఏదయితే గెలుస్తుందో దానికి బానిస(2:19).
యేసుక్రీస్తు జ్ఞానంవల్ల లోక కల్మషాలు తప్పిo చుకొనిన వారు వెనుకకు తిరుగుట కంటే నీతి మార్గం ఏమిటో వారికి తెలియ కుంటేనే మేలు(2:20-21).
గతంలో ప్రవక్తలు పలికిన మాటలనూ రక్షకుడైన ప్రభువు ఇచ్చిన ఆజ్ఞనూ ప్రియమైన వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోవటానికి అతడు వ్రాశాడు(3 :1 -2 ).
చివరి రోజుల్లో వెక్కిరించే వాళ్ళు యేసు రాకడ గురించిన వాగ్ద్ధానం ఏమయింది అని ప్రశ్నిస్తూ సృష్టి ఆరంభం నుoచి ఉన్నట్లే అంతా ఉంది అని చెపుతారు(3:3-4).
దేవుని వాక్కు వల్ల ఆకాశాలూ భూమీ ఏర్పడి మంటలూ భక్తిహీనుల నాశనమూ తీర్పు జరిగే రోజు కోసం ఉంచడం జరిగింది(3:5-7).
ఎందుకంటే వారు నశించ కూడదని , అందరూ పశ్చాత్తాపపడలనీ ఆయన కోరిక(3 :9 ).
ప్రభువు రాకడ దినం దొంగ వచ్చినట్టు వస్తుంది(3:10).
ఎందుకంటే భూమి ఆకాశాలు నాశనమై పోతాయి, నీతిమంతులు కొత్త ఆకాశాలు కొత్త భూమిలో జీవించుటకు ఎదురు చూస్తూ ఉండాలి(3:11-13).
ఇతర లేఖనాలనూ పౌలుకు ఇయ్యబడ్డ జ్ఞానాన్నీ శిక్షణా నిలకడా లేని వారు అపార్థం చేసుకుంటే స్వనాశనమే వారి పనుల ఫలితం(3:15-16).
వారి ప్రభువూ రక్షకుడూ అయిన యేసుక్రీస్తు కృపలోనూ జ్ఞానమందునూ ఎదగాలని పేతురు ఆజ్ఞాపించాడు(3:17-18).
ఆది నుంచి జీవ వాక్కు ఉంది అని యోహాను చెప్పాడు[1:1].
యోహాను జీవ వాక్కును విన్నాడు, కళ్ళతో చూశాడు, దగ్గరగా గమనించి, చేతులతో తాకి చూశాడు[1:1].
యోహానుకు వెల్లడి కాక ముందు జీవ వాక్కు తండ్రితో ఉంది[1:2].
యోహాను కళ్ళతో చూసిందీ , విన్నదీ ఎందుకు ప్రకటిస్తున్నాడు అంటే అనేకులు వారితో సహవాసం కలిగి ఉండాలని[1:3].
తండ్రితో, అయన కుమారుడు యేసు క్రీస్తుతో యోహాను అప్పటికే సహవాసం కలిగి ఉన్నాడు[1:3].
దేవుడు వెలుగు, ఆయనలో చీకటి లేనే లేదు అనే సందేశాన్ని యోహాను ప్రకటిస్తున్నాడు [1:5].
అటువంటి మనిషి అబద్ధం ఆడుతున్నట్టే, సత్యన్ని ఆచరిస్తూన్నట్లు కాదు అని యోహాను చెబుతున్నాడు[1:6].
యేసు క్రీస్తు రక్తం మనల్ని ప్రి పాపం నుండి శుద్ధి చేస్తుంది[1:7].
తనలో పాపం లేదని చెప్పుకునే వ్యక్తి తనను తను మోసం చేసుకునేవాడు అతనిలో సత్యం ఉండదు అని యోహాను చెబుతున్నాడు?
ఎవరు అయితే వారి పాపాలు అంగీకరిస్తున్నారో వారికి దేవుడు వారి పాపాలను క్షమించి, సమస్త దుర్నీతి నుంచి శుద్ధి చేస్తాడు
సర్వలోక పాపాలకూ యేసు క్రీస్తు పరిహారం[2:2].
యేసు క్రీస్తు ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉంటే ఆయనను మనం ఎరిగినవారం అని మనకు తెలుస్తుంది [2:3].
దేవుడు తనకు తెలుసునని చెప్పుకుంటూ అయన ఆజ్ఞలు పాటించని వాడు అబద్ధికుడు (2:4).
విశ్వాసి యేసు క్రీస్తు నడిచినట్టు నడుచుకోవాలి (2:6).
ఒక మనిషి తను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ, తన సోదరుణ్ణి ద్వేషిస్తే వాడు చీకటిలోనే ఉన్నాడు[2:9,11].
దేవుడు క్రీస్తు నామము నిమిత్తము విశ్వాసుల పాపాలను క్షమించాడు.[2:12].
విశ్వాసుల లోకాన్నిగానీ, లోకంలో ఉన్నవాటిని గాని ప్రేమించకూడదు అని యోహాను చెప్పాడు[2:15].
శరీరాశ, నేత్రాశ, జీవిత దురహంకారం లోకంలో ఉన్నవి, అవి తండ్రి వద్ద నుండి వచ్చినవి కావు[2:16].
క్రీస్తు విరోధులు వచ్చారు, దీన్నిబట్టి యోహానుకు చివరి ఘడియలు గురించి తెలుసు అని చెప్పాడు[2:18].
క్రీస్తు విరోధి వస్తున్నాడని యోహాను చెబుతున్నాడు[2:18].
తండ్రిని , కుమారుణ్ణి నిరాకరించిన వాడే క్రీస్తు విరోధి అని మనకి తెలుస్తుంది[2:22].
ఎవరైనా కుమారుణ్ణి నిరాకరిస్తే వారికి తండ్రి లేనట్టే [2:23].
మొదటి నుండి విన్నదానిలో అలాగే నిలిచి ఉంటే మీరు కుమారునిలో, తండ్రిలో నిలిచి ఉంటారు అని యోహాను చెబుతున్నాడు[2:24].
విశ్వాసులకు దేవుడు శాశ్వత జీవాన్ని వాగ్ధానంగా ఇచ్చాడు[2:25].
ఆయన రాకడలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు కుమారుని లో ఉన్నవారు ఆయన ముందు సిగ్గుపాలు కాకుండా ధైర్యంతో నిలబడగలిగేలా ఉంటారు[2:28].
తండ్రి ప్రేమతో ఆయనని నమ్మిన విశ్వాసులకు దేవుని పిల్లలు అని ప్రాదిస్తున్నాడు[3:1-2].
క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసులు ఉన్నవాడు ఉన్నట్లుగానే చూస్తారు, ఆయన వలే ఉంటారు [3:2].
క్రీస్తులో ఆశాభావంగా ఉన్న విశ్వాసులుగా తమను తాము పవిత్రం చేసుకుంటారు[3:3].
క్రీస్తులో ఏ పాపమూ లేదు[3:5].
పాపం చేస్తూ ఉండే వాడు దేవుని తెలుసుకోలేరు, దేవుని ఎన్నడూ చూడలేరు[3:6,8].
సైతాను పనులను నాశనం చేయడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షం అయ్యాడు[3:8].
దేవుని పిల్లలు నీతిని జరిగించే వారుగా ప్రత్యక్షం చేసుకుంటారు, సైతాను పిల్లలు పాపం చేస్తూ ప్రత్యక్షం చేసుకుంటారు [3:7-10].
తన తమ్ముణ్ణి చంపి కయీను సైతాను సంబంధి అని ప్రదర్శించుకున్నాడు
లోకం తమను ద్వేషించడం చూసి ఆశ్చర్యపడకండి అని యోహాను చెప్పాడు[3:13].
జ .ఎవరైనా దేవుని పిల్లలు అయితే వారి వైఖరి విశ్వాసులు పట్ల ప్రేమగా ప్రర్శించాలి[3:10- 11,14].
యేసుక్రీస్తు మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు కాబటి మనకు ప్రేమ ఏమిటో తెలిసింది[3:16].
జ.తన సోదరుడు అవసరంలో ఉంటే విశ్వాసి తన ప్రేమను లోక అవసరతలు తీర్చుట ద్వారా చూపించాలి [3:17-18].
విశ్వాసి దేవుని సత్యమును, ప్రేమను, ప్రదర్శించినప్పుడు, ఆతడు తనకు అభయం సాధించుకొని దేవుని దగ్గర ధైర్యముగా ఉంటాం[3:19,21].
దేవుని కుమారుడు యేసు క్రీస్తు నామంలో విశ్వాసం ఉంచాలి, ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి అనేది దేవుని అజ్ఞ అని యోహాను గుర్తు చేస్తున్నాడు[3:23].
దేవునిలో నిలిచి ఉండటానికి విశ్వాసులకు దేవుడు ఆయన ఆత్మని ఇచ్చాడు[3:24].
లోకంలో చాలా మంది అబద్ధ ప్రక్తలు ఉన్నారు అని యోహాను విశ్వాసులు హెచ్చరిస్తున్నాడు[4:1].
జ .శరీర రూపంలో వచ్చిన యేసు క్రీస్తు దేవుడు అని ప్రతి ఆత్మ అంగీకరిస్తుంది[4:2].
శరీర రూపంలో వచ్చిన యేసు క్రీస్తు దేవుడు కాదు క్రీస్తు విరోధికి చెందిన ఆత్మ అంగీకరించదు[4:3].
ఈ లోకంలో ఉన్నవాని ఆత్మ కన్నా విశ్వాసులో ఉన్న ఆత్మ గొప్పది[4:4-5].
దేవుడు ప్రేమ కావున విశ్వాసులు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు దాని ద్వారా తమకు దేవుడు తెలుసు అని చూపిస్తారు[4:7-8].
దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలో పంపించి ఆయన ప్రేమని వెల్లడి చేశాడు[4:9].
తండ్రి తన కుమారుణ్ణి మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా, లోక రక్షకుడుగా ఈ లోకానికి పంపాడు.
యేసు దేవుని కుమారుడు అని నిజమైన విశ్వాసులు అంగీకరిస్తారు[4:15].
ప్రేమలో, దేవునిలో నిలిచి ఉన్నవారు తీర్పు రోజున ధైర్యము కలిగి ఉంటారు[4:17].
దేవుడు మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమించాము[4:19].
తన సోదరుణ్ణి ద్వేషించే వాడు దేవుని ప్రేమించలేడు[4:20].
దేవుని ప్రేమించే వాడు తప్పక తన సోదరుణ్ణి కూడా ప్రేమించాలి[4:21].
ఆయన అజ్ఞలు పాటిస్తే మనం దేవుణ్ణి ప్రేమించేవారమని ప్రదర్శించుకోవచ్చు[5:3].
లోకాన్ని జయిoచే విజయం అంటే మన విశ్వాసమే[5:4].
యేసు క్రీస్తు నీళ్ళు ద్వారా, రక్తం ద్వారా వచ్చినవాడు[5:6].
ఆత్మ, నీళ్ళు, రక్తం, ఈ మూడు యేసు క్రీస్తుకి సాక్షం చెబుతాయి[5:7-8].
దేవుని కుమారుడుకు సంబంధించిన సాక్ష్యము నమ్మని వాడు ఎవరైనా దేవుణ్ణి అబద్ధికుణ్ణి చేసినట్టే[5:9-10].
దేవుడు తన కుమారుని ద్వారా శాశ్వత జీవం ఇచ్చాడు[5:11].
దేవుని చిత్తానికి అనుగుణంగా ఏది అడిగినా, ఆయన మన విన్నపం వింటాడు అనేది విశ్వాసులకు ఉన్న ధైర్యం[5:14].
మరణం కలిగించే పాపం తన సోదరుడు చెయ్యడం చూస్తే విశ్వాసి తన సోదరుని కోసం ప్రార్ధిoచాలి తద్వారా తన సోదరునికి దేవుడు జీవం ఇస్తాడు[5:16].
సమస్త దుర్నీతీ అంటే పాపం [5:17].
సర్వ లోకం దుష్టుని అధీనంలో ఉంది[5:19].
యేసు క్రీస్తు తండ్రి నిజమైన దేవుడు[5:20].
విశ్వాసులు విగ్రహాలకు దూరముగా ఉండాలి [5:21].
యోహాను ఈ లేఖలో తానను పెద్దగా పరిచయం చేసుకున్నాడు[1:1].
ఎన్నికైన తల్లికి, ఆమె పిల్లలకు పత్రిక రాయబడినది [1:1].
తండ్రి అయిన దేవుని నుంచి, కుమారుడైన యేసు క్రీస్తు నుంచి # మ, దయ, శాంతి వస్తాయి అని యోహాను చెప్పాడు[1:3].
స్త్రీ పిల్లలు కొందరు సత్యమార్గంలో నడుస్తున్నారు అన్ని తెలిసి యోహాను సంతోషిస్తున్నాడు [1:4].
ఒకరిని ఒకరు # మించాలన్నఅజ్ఞ ఆరంభం నుండి వారికి ఉన్నది అని యోహాను చెప్పాడు[1:5].
మ అనేది దేవుని అజ్ఞల # ారం నడుచుకోవటం అని యోహాను చెబుతున్నాడు[1:6].
యేసు క్రీస్తు రక్తమాంసాలతో వచ్చాడని ఒప్పుకొనని వాళ్ళు మోసగాళ్ళు, క్రీస్తు విరోధులు అని యోహాను పిలిచాడు[1:7].
చేసిన పనికి రావలసిన ఫలితాన్ని పోగొట్టుకోకుండా విశ్వాసుల్ని జాగ్రత్తగా ఉండాలి అన్నియోహాను చెప్పాడు[1:8].
ఎవరైనా క్రీస్తు గురించి నిజమైన బోధ కాకుండా మరొక బోధ తీసుకు వస్తే అతని ఆహ్వానించవద్దు అని విశ్వాసులుకు యోహాను చెప్పాడు[1:10].
క్రీస్తు గురించి నిజమైన బోధను కాకుండా మరొక బోధను విశ్వాసి ఆహ్వనిస్తే అతడు అతని చెడ్డ పనుల్లో పాలిభాగస్తుడు అవుతాడు[1:11].
ఎన్నికైన సోదరితో ముఖాముఖి మాట్లాడాలని యోహాను ఆశతో ఉన్నాడు[1:12].
యోహాను తనను తాను ఒక పెద్దగా పరిచయం చేసుకొంటున్నాడు.
యోహాను గాయిని నిజంగా ప్రేమిస్తున్నాడు.
గాయి తన ఆత్మ వర్ధిల్లుతూ ఉన్న ప్రకారం, అన్ని విషయాలలో వర్ధిల్లాలనీ, ఆరోగ్యవంతునిగా ఉండాలనీ యోహాను ప్రార్థిస్తూ ఉన్నాడు.
తన పిల్లలు సత్యంలో నడుచుకుంటున్నారని వినడం యోహాను కున్న గొప్ప సంతోషం.
గాయి సోదరుల కోసం పనిచేసాడు, వారు అపరిచితులు అయినప్పటికీ వారి కోసం పనిచేశాడు.
వారిని దేవునికి తగినట్టుగా అతడు పంపించాడు.
వారికి సహాయం అవసరం అయ్యింది ఎందుకంటే వారు అన్యజనుల నుండి ఏమీ తీసుకోవడం లేదు.
విశ్వాసులు వారిని స్వీకరించాలని యోహాను చెప్పాడు తద్వారా వారు సత్యం కోసం జతపనివారు అవుతారు.
దియోత్రెఫే సమాజంలో గొప్పవాడిగా ఉండాలని ప్రేమిస్తున్నాడు.
దియోత్రెఫే యోహానును అంగీకరించడం లేదు.
యోహాను వచ్చినప్పుడు అతడు దియోత్రెఫే యొక్క పనులను జ్ఞాపకం చేసుకొంటాడు.
దియోత్రెఫే సోదరులను స్వీకరించడం లేదు.
వారు సోదరులను స్వీకరించకుండా దియోత్రెఫే వారిని నిలువరిస్తున్నాడు, వారిని సంఘం నుండి త్రోసివేస్తున్నాడు.
మంచిని అనుకరించమని యోహాను గాయికి చెపుతున్నాడు.
యోహాను రావాలనీ, గాయితో వ్యక్తిగతంగా మాట్లాడాలని యోహాను ఎదురుచూస్తున్నాడు.
యూదా యేసు క్రీస్తుకి సేవకుడు [1:1].
యూదా యాకోబు సోదరుడు [1:1].
తండ్రి అయిన దేవుని పిలుపు అందుకుని, అయన ప్రేమను చూరగొని, యేసు క్రీస్తు ద్వారా భద్రంగా ఉన్న వారికీ యూదా వ్రాశాడు [1:1].
దయ, శాంతి, ప్రేమ, రెట్టింపు కలగాలి అని యూదా కోరుకున్నాడు[1:2].
మనకందరికీ చెందిన రక్షణ గురించి రాయాలని ముందుగా యూదా అనుకున్నాడు[1:3].
పవిత్రులు విశ్వాసం నిమిత్తం పట్టుదలతో పోరాడాలని యూదా వ్రాయలి అనుకున్నాడు[1:3].
కొంతమంది శిక్షా పాత్రులు, భక్తిహీనులు దొంగచాటుగా వస్తారు[1:4].
దేవుని కృపను, లైoగిక అవినీతికి వీలుగా మార్చి, మన ఏకైక యజమాని ప్రభువైన క్రీస్తును నిరాకరిస్తున్నారు [1:4].
ప్రభువు ఐగుప్తు నుండి జనాంగాన్నిరక్షించాడు [1:5].
ఎవరు అయితే నమ్మరో అ ప్రజలను ప్రభువు నాశనం చేస్తాడు [1:5].
ప్రభువు వాళ్ళని సంకెళ్ళతో చీకటిలో బంధించి మహా తీర్పు రోజు కోసం ఉంచాడు [1:6].
లైంగిక అవినీతికి అసహజమైన లైంగిక కోరికలకు పాలుపడ్డారు [1:7].
వాళ్ళు వారి కలల్లో కూడా తమ శరీరాల్ని అపవిత్రం చేసుకుంటున్నారు, ప్రభుత్వన్ని నిరాకరిస్తూ, చెడుగా చెబుతున్నారు [1:8].
ప్రభువు నిన్ను గద్దించును గాక, అని ప్రధాన దూత మిఖాయేలు చెప్పాడు [1:9]
వారు సిగ్గు లేకుండా తమ క్షెమమే చూసుకున్నారు[1:12].
ప్రజలు అందరీ మీద తీర్పు అమలు చేయబడుతుంది[1:15].
ఆదాము వరుసలో హనోకు ఏడవ వాడు[1:14].
తమ దురాశలను బట్టి నడుచుకుంటూ, లాభం కోసం మనుషులను పొగుడుతూ, తమకు ఉన్న స్ధితిని బట్టి సణుగుతూ, గొణుగుతూ ఉన్నవారు[1:16].
అంతకుముందు అపహాస్యులు గురించి మన ప్రభువైన యేసు క్రీస్తు అపోస్తులులు పలికారు [1:17].
వాళ్ళకి దైవాత్మ లేదు[1:19].
అతిపవిత్రమైన విశ్వాసంలో ఎదుగుతూ, పవిత్ర ఆత్మలో ప్రార్ధన చేస్తూ ప్రియమైన వారు తమలో తాము ఎదుగుతూ వస్తున్నారు [1:20].
A .ప్రియమైన వారు దేవుని ప్రేమలో భద్రం చేసుకుంటూ శాశ్వత జీవం కోసం, మన ప్రభువైన యేసు క్రీస్తు దయ కోసం ఎదురు చూడాలి[1:21].
అనుమానంతో ఉన్నకొంతమంది పట్ల, అగ్నిలో ఉన్న వారిపట్ల, భయంతో ఉన్న వారి పట్ల, పాపంతో మలినమైన దుస్తులతో ఉన్న వారిపట్ల ప్రియమైన వారు దయగా ఉండి రక్షించాలి [1:22-23].
దేవుడు వారు తడబడకుండా భద్రం చేయడానికి ఆయన తన మహిమ గల సన్నిధి ఎదుట మహా గొప్ప ఆనందంలో మిమ్ముల్నిమచ్చలేని వాళ్ళుగా ఉంచగలవాడు [1:24-25].
దేవునికి మహిమ అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ కలుగును గాక[1:25].
యేసుక్రీస్తు ప్రత్యక్షత దేవుని నుండి వచ్చింది, ఆయన తన దాసులకు చూపాడు(1:1).
ఈ ప్రత్యక్షత గూర్చిన సంగతులు త్వరలో జరుగుతాయి(1:1).
ఈ గ్రంథం బహిరంగంగా చదివేవారు, వినేవారు, వాటిని పాటించేవారు ధన్యులు(1:3).
యోహాను ఈ గ్రంథం ఆసియాలో ఉన్న ఏడు సంఘాలకు రాశాడు(1:4).
యేసు క్రీస్తుకు యోహాను నమ్మకమైన సాక్షి, చనిపోయిన వారిలోనుంచి మొదట లేచినవాడు, భూరాజులను పరిపాలించువాడు అనే మూడు బిరుదులను ఇచ్చాడు(1:5).
యేసు విశ్వాసులను తండ్రియైన దేవునికి రాజ్యంగానూ యాజకులుగానూ చేశాడు(1:6).
యేసు వచ్చినప్పుడు ప్రతీ కన్నూ, ఆయనను పొడిచినవారూ చూస్తారు(1:7).
ప్రభువైన దేవుడు తనను తాను అల్ఫాయు ఓమెగయు, ప్రస్థుతమూoటూ, పూర్వముoడి, భవిష్యత్తులో రాబోవు వాడినని వివరించుకొన్నాడు(1:8).
యోహాను పత్మాసు దీవిలో దేవుని వాక్కు కోసం యేసును గూర్చిన సాక్ష్యం కోసం ఉన్నాడు(1:9).
యోహానుకు వెనుక నుంచి వచ్చిన స్వరం తాను చూచినది గ్రంథంలో రాసి ఆసియాలోని ఏడు సంఘాలకు పoపంపించాలని చెప్పడం జరిగింది(1:11).
యోహాను చూచిన వ్యక్తి ఉన్నివలె తెల్లని వెంట్రుకలూ, మండుచున్న అగ్ని వంటి కన్నులూ కలిగి ఉన్నాడు(1:14).
ఆ వ్యక్తి కుడి చేతిలో ఏడు నక్షత్రాలు, రెండంచుల పదునైన కత్తి నోటి నుంచి బయటకు వస్తుంది(1:16).
ఆ వ్యక్తిని చూచినప్పుడు యోహాను చచ్చిన వాని వలె ఆ వ్యక్తి పాదాల దగ్గర పడ్డాడు(1;18).
ఏడు నక్షత్రాలూ ఏడు సంఘాల దూతలు ఏడు ద్వీప స్తంభాలూ ఏడు సంఘాలు(1:20).
తరువాతి గ్రంథ భాగం ఎఫెసులో ఉన్న సంఘo దూతకు రాయడం జరిగింది(2:1).
ఎఫెసులో ఉన్న సంఘo దుష్టులైన వారిని సహించలేదూ, అబద్ద ప్రవక్తలను పరీక్షించి సహించలేదు(2:2).
ఎఫెసు సంఘంలో క్రీస్తు కలిగియున్న వ్యతిరేకత వారి మొదటి ప్రేమను విడిచి పెట్టడం(2:5).
వారు మారుమనస్సు పొందక పోతే వారి దీపస్తంభం దాని ఉన్న చోటు నుంచి తొలగిస్తానని క్రీస్తు చెప్పాడు(2:5).
జయించు వారికి పరదైసులో జీవ వృక్ష ఫలాలు తినడానికి ఇస్తానని క్రీస్తు వాగ్దానం చేశాడు(2:7).
తరువాతి గ్రంథ భాగం స్ముర్న సంఘo దూతకు రాయడం జరిగింది(2:8).
స్ముర్న సంఘము శ్రమానుభవమూ, పేదరికమూ, నిందానుభవం కలిగి ఉంది(2:9).
మరణం వరకు నమ్మకంగా ఉండి జయించిన వారికి క్రీస్తు జీవకిరీటమిచ్చీ, రెండవ మరణం వల్ల ఎటువంటి హాని కలగదని వాగ్దానం చేశాడు(2:10-11).
తరువాత గ్రంథ భాగం పెర్గములోని సంఘo దూతకు రాయడం జరిగింది(2:12).
పెర్గము సంఘo సాతాను సింహాసనo ఉన్న స్థలంలో నివాసముంది(2:13).
అంతిప చనిపోయినపుడు పెర్గము సంఘం క్రీస్తు నామమును గట్టిగా పట్టుకొని, విశ్వాసం కాదన లేదు(2:13).
పెర్గము సంఘంలో కొందరు బిలాం బోధలూ, కొoదరు నికోలయతు బోధలూ పట్టుకొని ఉన్నారు(2:14-15).
మారుమనస్సు పొందక అబద్ద బోధలను పట్టుకుంటే వారికి వ్యతిరేకంగా యుద్దము చేస్తానని క్రీస్తు హెచ్చరిస్తున్నాడు(2:16).
జయించిన వారికి మరుగైన మన్నానూ, ఒక కొత్త పేరుగల తెల్లని రాయి పొందుతారని క్రీస్తు వాగ్దానం చేశాడు(2:17).
తరువాత గ్రంథ భాగం తుయతైరలోని సంఘం దూతకు రాయడం జరిగింది(2:18).
తుయతైర సంఘంలోని ప్రేమా, విశ్వాసమూ, సేవా, సహనమూ ఓర్పు వంటి మంచిపనులను క్రీస్తు తెలుసుకున్నాడు(2:19).
తుయతైర సంఘంలో క్రీస్తుకు ఉన్న వ్యతిరేకత, వారు యెజెబెలు ప్రవక్తి అనైతికమైన తప్పుడు విధానాన్ని సహిస్తున్నారు(2:20).
యెజెబెలు మారుమనసు పొందకపోతే ఆమెను మంచం పట్టించి ఆమె పిల్లలను కొట్టి చంపేస్తానని క్రీస్తు హెచ్చరించాడు(2:22-23).
యెజెబెలు బోధను పాటించని వారు ఆయన వచ్చే వరకు ఆయనలో కలిగింది గట్టిగా పట్టుకోoడని క్రీస్తు చెప్పాడు(2:25).
జయించిన వారికి జనాల మీద అధికారంనూ వేకువ నక్షత్రానిస్తానని క్రీస్తు వాగ్దానం చేశాడు(2:7).
చదివేవారు సంఘాలకు ఆత్మ చెబుతున్నమాట వినాలని క్రీస్తు చెబుతున్నాడు(2:29).
తరువాత గ్రంథ భాగం సార్దీసులో ఉన్న సంఘo దూతకు రాయడం జరిగింది(3:1).
సార్దీసులో ఉన్న సంఘo బ్రతికుంది కానీ దానిలోని సత్యం చనిపోయిoది(3:1).
సార్దీసులో ఉన్న సంఘాని మేల్కొని, మిగిలిన వాటిని దృఢ పరచుకొని, జ్ఞాపకం చేసుకొని, తగ్గించుకొని, మారుమనసు పొందాలని క్రీస్తు హెచ్చరిస్తున్నాడు(3:2-3).
జయించిన వారికి తెల్లని వస్త్రాలు ధరించడం జరుగుతుంది, జీవగ్రంథంలో పేరు నిలిచి ఉంటుంది, తండ్రియైన దేవుని ఎదుట వారి పేరు పలకడం జరుగుతుంది(3:5).
తరువాత గ్రంథ భాగం ఫిలదెల్ఫియలో ఉన్న సంఘo దూతకు రాయడం జరిగింది(3:8).
ఫిలదెల్ఫియలో ఉన్న సంఘo తక్కువ బలమున్నప్పటికీ క్రీస్తు వాక్కుకు విధేయత చూపీ ఆయన పేరు తెలియదనలేదు(3:8).
సాతాను సమాజం వారిని పవిత్రుల కాళ్ళ ముందు పడి నమస్కారం చేసేలా క్రీస్తు చేస్తాడు(3:9).
ఆయన త్వరగా వచ్చేoతా వరకు ఫిలదెల్ఫియ సంఘo ఏదైతే కలిగిఉoదో ఆ కిరీటం ఎవరు తీసుకోకుండా గట్టిగా పట్టుకోవాలని క్రీస్తు చెప్పాడు(3:11).
జయించిన వారిని దేవుని ఆలయంలో స్తంభంగా ఉంటారు, దేవుని పేరు కలిగి ఉంటారు, దేవుని పట్టణం పేరు కలిగి ఉంటారు, క్రీస్తు కొత్త పేరు వారి మీద రాయడం జరుగుతుందని క్రీస్తు వాగ్దానం చేశాడు(3:12).
తరువాత గ్రంథ భాగం లవొదికయలో ఉన్న సంఘ దూతకు రాయడం జరిగింది(3:14).
లవొదికయలో ఉన్న సంఘo చల్లగానైన వెచ్చగానైన ఉండాలని క్రీస్తు కోరుకుంటున్నాడు(3:15).
లవొదికయలో ఉన్న సంఘo నులివెచ్చగా ఉన్నందుకు తన నోటి నుంచి ఉమ్మి వేయబోతున్నాడు (3:16).
లవొదికయలో ఉన్న సంఘo తన గూర్చి తాను ధనవంతుడననీ తనకు కొదువంటూ ఏమి లేదని అనుకుంటుంది(3:17).
లవొదికయలో ఉన్న సంఘo గూర్చి క్రీస్తు దిక్కుమాలినవాడనీ, దౌర్భగ్యుడనీ, దరిద్రుడనీ, గుడ్డివాడనీ, దిగంబరిగా ఉన్నావని క్రీస్తు చెబుతున్నాడు(3:17).
ఆయన ప్రేమిoచువారికి శిక్షణ ఇచ్చి నేర్పిస్తాడు(3:19).
జయించు వారిని క్రీస్తు తన సింహాసనం మీద కూర్చోనిస్తాడు(3:21).
చదివేవారు సంఘాలకు ఆత్మ చెబుతున్నమాట వినాలని క్రీస్తు చెబుతున్నాడు(3:22).
యోహాను పరలోకంలో ఒక తలుపు తెరుచుకోడం చూశాడు(4:1).
యోహానుతో ఆ స్వరం ఇక మీదట జరిగేది ఆయన చూపుతాడని చెప్పింది(4:1).
పరలోకంలో ఎవరో సింహాసనం మీద కూర్చున్నాడు(4:2).
పరలోకంలో సింహాసనం చుట్టూ ఇరవైనాలుగు సింహాసనాలు పైన ఇరువైనాలుగు మంది పెద్దలు కూర్చున్నారు(4:4).
సింహాసనం ఎదుట మండుచున్న ఏడు దీపాలు దేవుని ఏడాత్మలు (4:5).
సింహాసనం చుట్టూ ఉన్నవి నాలుగు జీవులు(4:6).
రాత్రింబవళ్ళు నాలుగు జీవులు దేవునికి మహిమా ఘనతా కృతజ్ఞతా స్తుతులు మానక చేస్తున్నాయి (4:8-9).
దేవునికి ఆ నాలుగు జీవులు మహిమ చెల్లిస్తున్నపుడు ఇరవైనాలుగు మంది పెద్దలు సింహాసనం ఎదుట వంగి సాగిలపడి, తమ కిరీటాలు పడేశారు(4:10).
దేవుడు సమస్తమును సృష్టించెను ఆయన చిత్తం ద్వారా అవన్నియు జీవిస్తున్నాయి అని పెద్దలు చెప్పారు(4:11).
సింహాసనం మీద కూర్చున్న వాని కుడిచేతిలో ఏడు ముద్రలతో ముద్రించి ఉన్న గ్రంథం యోహాను చూశాడు(5:1).
గ్రంథం విప్పటానికి చదవటానికి భూమి మీద యోగ్యులెవరూ లేరు(5:2-4).
చుట్టి ఉన్న గ్రంథo, దాని ఏడు ముద్రలు విప్పుటకు యూదగోత్ర సింహం, దావీదు వేరు చిగురు సమర్ధుడు(5:5).
సింహాసనం ఎదుట పెద్దల మధ్యలో చూడ్డానికి వధింపబడినట్టుగా ఉన్న గొర్రెపిల్ల నుంచుంది(5:6).
గొర్రెపిల్ల మీదున్న ఏడు కొమ్ములు ఏడు కన్నులు భూమంతటికీ పంపిన దేవుని ఏడాత్మలు(5:6).
పెద్దలు కలిగున్నసువాసన ధూపంతో నింపిన బంగారు పాత్రలు పవిత్రుల ప్రార్ధనలు(5:8).
చుట్టి ఉన్న గ్రంథం విప్పుటకు గొర్రెపిల్ల యోగ్యుడు ఎందుకంటే ప్రతీ గోత్రం నుంచి, బాష నుంచి, ప్రజల నుంచి, జనం నుంచి ఆయన రక్తంతో దేవుని కోసం ఆయన మనుషులను కొన్నాడు(5:9).
దేవుని యాజకులు భూమ్మీద పరిపాలిస్తారు(5:10).
గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, ఘనత, మహిమ, స్తుతి పొందడానికి యోగ్యుడు అని దేవదూత చెప్పాడు [5:12].
సింహాసనంపై కూర్చున్న వానికీ గొర్రెపిల్లకూ ఇప్పుడూ ఎల్లప్పుడూ స్తుతి ఉండును అని సృష్టించ బడిన ప్రతిదీ చెప్పడం జరిగింది(5:13).
నాలుగు జీవులు విని "ఆమెన్!" అన్నప్పుడు పెద్దలు సాష్టాంగపడి ఆరాధించిరి(4:14).
గొర్రెపిల్ల చుట్టి ఉన్న గ్రంథం ఏడు ముద్రలలో ఒకటి విప్పడం చేసింది(6:1).
మొదటి ముద్ర విప్పిన తరువాత తెల్లని గుర్రంపై జయిoచడానికి బయలుదేరిన ఒకనిని యోహాను చూశాడు(6:2 ).
రెండవ ముద్ర విప్పిన తరువాత భూమి మీద నుండి శాంతిని తీసివేయడానికి మండుచున్న ఒక ఎర్రనిగుర్రం తోలేవాన్నియోహాను చూశాడు(6:4).
మూడవ ముద్ర విప్పిన తరువాత త్రాసు చేత పట్టుకొని ఒక నల్లని గుర్రం తోలేవాన్ని యోహాను చూశాడు(6:5).
నాలుగవ ముద్ర విప్పిన తరువాత ఒక కాంతిలేని తెల్లబారిన గుర్రాన్ని తోలే మరణం అనే పేరు గలవాన్నియోహాను చూశాడు(6:9).
ఐదవ ముద్ర విప్పిన తరువాత దేవుని వాక్కు కోసం చనిపోయిన వారిని యోహాను చూశాడు(6:9).
బలిపీఠo కింద ఉన్న ఆత్మలు వారి రక్తం కోసం ఎంతకాలానికి పగ తీర్చు కుంటాడని దేవుని నుండి తెలుసుకోవాలనుకొన్నాయి(6:10).
ఆరవ ముద్ర విప్పిన తరువాత యోహాను భూకంపం, సూర్యుడు నల్లగామారడం, చంద్రుడు రక్తంలాగ మారడం, నక్షత్రాలు భూమి మీద పడటం చూశాడు(6:12-13).
భూరాజులూ, ప్రముఖులూ, ధనవంతులూ, బలవంతులూ ప్రతి ఒక్కరు గుహలలో దాగి బండలతో మా మీద పడి దాచమని అడగడం యోహాను చూశాడు(6:15-16).
భూరాజులూ, ప్రముఖులూ, ధనవంతులూ, బలవంతులూ ప్రతి ఒక్కరు సింహాసనం మీద కూర్చున్న వాని నుంచీ గొర్రెపిల్ల కోపం నుంచీ దాగి ఉండాలని కోరారు(6:16).
సింహాసనం మీద కూర్చున్న వాని నుంచీ గొర్రెపిల్ల నుంచీ మహా ఉగ్రత రోజు వచ్చింది(6:17).
యోహాను చూచినప్పుడు భూమ్మీద నలుదిక్కుల నిలుచున్న నలుగురు దూతలు భూమి నాలుగు దిక్కుల గాలులను పట్టుకున్నారు(7:1).
భూమికి హనీ చేయక ముందు దేవుని దాసుల నొసట మీద ముద్ర వెయ్యాలని దేవదూత చెప్పాడు(7:2-3).
ఇశ్రాయేలీయుల ప్రతి గోత్రం నుంచి 1,44,OOO మంది ముద్రించడం జరిగింది(7:4).
సింహాసనం ముందూ గొర్రెపిల్ల ఎదుట ప్రతి జనంలో నుంచీ, ప్రతి గోత్రంలో నుంచీ, ప్రతి ప్రజల్లో నుంచీ, ప్రతి భాషల్లో నుంచీ గొప్ప జనసముహంను యోహాను చూశాడు(7:10).
సింహాసనం ముందు ఉన్న వారి ప్రకారం దేవునికీ గొర్రెపిల్లకూ రక్షణ చెందినది(7:10).
దేవదూతలు, పెద్దలు, నాలుగు జీవులు వారు సాష్టాంగపడి తమ ముఖాలు నేలపై ఉంచి దేవున్ని ఆరాధిoచారు. (7:11).
సింహాసనం ముందు తెల్లని వస్త్రాలు ధరించిన వారు మహా శ్రమల్లో నుంచి వచ్చిన వారని పెద్ద చెప్పాడు(7:14).
సింహాసనం ముందున్నవారి వస్త్రాలు గొర్రెపిల్ల రక్తం ద్వారా తెల్లగా అయ్యాయి(7:14).
తెల్లని వస్త్రాలు ధరించిన వారి పైన దేవుడు తన గుడారం కప్పుతాడు కనుక వారెప్పటికి భాదపడరు(7:15-16).
తెల్లని వస్త్రాలు ధరించిన వారికి గొర్రెపిల్ల కాపరియై జీవజలం ఊటకు నడిపిస్తుంది(7:17).
ఏడవ ముద్ర గొర్రెపిల్ల విప్పినప్పుడు పరలోకంలో నిశ్శబ్దంగా ఉంది(8:1).
దేవుని ముందు నిల్చున్న ఏడు దూతలకు ఏడు బూరలివ్వడం జరిగింది(8:2).
దేవుని ఎదుట పవిత్రుల ప్రార్ధనా ధూపం పొగ లేచింది(8:4).
దేవదూత బలిపీఠo నుంచి నిప్పులు తీసి భూమ్మీద పడేసినప్పుడు ఉరుములూ, ధ్వనులు, మెరుపులు కలిగి భూకంపం వచ్చిoది(8:5).
మొదటి దూత బూర ఊదినప్పుడు భూమ్మీద మూడోవంతు కాలిపోయింది, చెట్లలో మూడోవంతు కాలిపోయాయి, పచ్చగడ్డి మూడోవంతు కాలిపోయింది(8:7).
రెండవ దూత బూర ఊదినప్పుడు సముద్రాలలో మూడోవంతు రక్తంగా మారింది, సముద్ర జీవులలో మూడోవంతు చనిపోయాయి, ఓడలలో మూడోవంతు నాశనమయ్యాయి(8:8-9).
మూడవ దూత బూర ఊదినప్పుడు నీటిలో మూడోవంతు చేదుగా మారింది దాని వల్ల అనేకమంది చనిపోయారు(8:10-11).
నాలుగోవ దూత బూర ఊదినప్పుడు పగటి సూర్యుని వెలుగులో మూడోవంతు చీకటై పోయింది చంద్ర నక్షత్రాల వెలుగులో మూడోవంతు చీకటై పోయింది(8:12).
ఉదాటానికి మిగిలివున్న మూడు బూరలు గూర్చి భూమ్మీదున్న వారికీ "అయ్యో, అయ్యో, అయ్యో" అని గ్రద్ద అంది(8:13).
ఐదవ దూత బూర ఊదినప్పుడు యోహాను పరలోకం నుంచి భూమ్మీద పడుతున్న నక్షత్రాన్ని చూశాడు(9:1).
నక్షత్రం అంతంలేని లోతైన అగాధం తెరిచింది(9:2).
అగాధంలో నుంచి వచ్చిన మిడతలుకు భూమికి హాని చేయకూడదని, నోసళ్ళ మీద దేవుని ముద్ర లేని వారికే హాని చెయ్యాలని చెప్పడం జరిగింది(9:6).
మిడతలు ద్వారా బాధలుపడిన వారు చావును వెదుకుతారు కానీ కనుగొన లేకపోతారు(9:6).
మిడతల రెక్కలు యుద్దంలో పరుగెత్తుతున్నా అనేక గుర్రాలు రధాలు వలె శబ్దం చేస్తాయి(9:9).
మిడతలన్నిటి పైన రాజు అగాధానికి దూత అబద్దోను, గ్రీకులో అపోల్లుయోను(9:12).
ఐదవ బూర ఊదిన తరువాత మొదటి శ్రమ గతించింది(9:12).
ఆరవ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న బంగారు బలిపీఠo నుంచి ఒక స్వరం విన్నాడు(9:13).
ఆ స్వరం విన్నప్పుడు నలుగురు దేవదూతలు మనుషుల్లో మూడోవంతు చంపుటకు విడిపించడం జరిగింది(9:15).
ఇరవై కోట్ల మంది సైనికులు గుర్రాలపైన ఉండటం చూశాడు(9:16).
గుర్రాల నోటిలో నుంచి వచ్చే మంటలు, పొగ, గంధకాల తెగుళ్ళు చేత మనుషుల్లో మూడోవంతు చంపడం జరిగింది(9:18).
తెగుళ్ల చేత చావని మనుషులు వారి పనుల వల్ల పశ్చాత్తాపపడలేదూ దయ్యాలని పూజించడం మానలేదు(9:20).
యోహాను చూచిన బలిష్ఠుడైన దేవదూత ముఖo సూర్యుని వలే, కాళ్ళు అగ్ని స్తంభాలను పోలి ఉన్నాయి(10:2).
దేవదూత తన కుడిపాదం సముద్రం మీద ఎడమ పాదం నేల మీద పెట్టి నుంచున్నాడు(10:2).
ఏడు ఉరుములు చెప్పిన సంగతులు రాయకూడదని యోహానుకు చెప్పాడు(10:4).
బలిష్ఠుడైన దేవదూత పరలోకాన్నీ, భూమినీ, సముద్రాన్నీ సృజించి యుగయుగాలు జీవించుచున్న వాని తోడని ప్రమాణం చేసెను(10:6).
ఇక ఆలస్యం కాదు ఏడవ దూత బూర ఊదినప్పుడు దేవుని రహస్యము సమాప్తమవుతుందని బలిష్ఠుడైన దేవదూత చెప్పాడు(10:7).
బలిష్ఠుడైన దేవదూత నుంచి విప్పిన పుస్తకం తీసుకోమని యోహానుకు చెప్పడం జరిగింది(10:8).
యోహాను ఆ గ్రంథం తినినప్పుడు నోటికి తియ్యగాను కడుపుకి చేదవుతుందని దేవదూత చెప్పాడు(10:9).
యోహాను ఆ గ్రంథం తినిన తరువాత అనేకమంది ప్రజల గూర్చి, జనముల గూర్చి, అనేక భాషలు మాట్లాడేవారి గూర్చి, అనేకమంది రాజులను గూర్చి ప్రవచనం చెప్పాడు(10:11).
దేవుని ఆలయమును బలిపీఠo కొలిచి అందులో ఆరాదించు వారిని లెక్కపెట్టమని యోహానుకు చెప్పాడు(11:1).
అన్యజనులు నలబై రెండు నెలలు పవిత్రమైన పట్ట్తణాన్ని తొక్కుతారు(11:2).
ఇద్దరు సాక్షులకు ఒక వెయ్యి రెండు వందల అరవై రోజులు ప్రవచించుటకు, వారి శత్రువులను చంపుటకు, ఆకాశం మూయుటకు, అనేకరకాల తెగుళ్ళతో భూమిని బాధించుటకు అధికారం ఇవ్వడం జరిగింది(11:3-6).
ఇద్దరు సాక్షుల మృతదేహాలు పట్టణం వీధిలో పడుoటాయి ఆ నగరానికి అలంకారికంగా సొదొమ, ఐగుప్తు అని పిలుస్తారు అక్కడ వారి ప్రభువు సిలువ వేయడం జరిగింది(11:8-9).
ఇద్దరు సాక్షులును చంపివేసినపుడు భూనివాసుల సంతోషించి పండగ చేసుకున్నారు(11:10-12).
మూడున్నర రోజుల తరువాత ఇద్దరు సాక్షులు వారి కాళ్ళపైన నిలిచి పరలోకానికి వెళ్ళడం జరిగింది(11:10-12).
ఇద్దరు సాక్షులు తరువాత, భూకంపం ముగిసిన తరువాత రెండవ శ్రమ గతించిoది(11:13-14).
ఏడవ దూత బూర ఊదినప్పుడు భూలోక రాజ్యాలు మన ప్రభువు రాజ్యంగానూ ఆయన క్రీస్తు రాజ్యంగానూ మారిపోయాయి(11:15).
ప్రభువైన దేవుడు ఇప్పుడు పరిపాలించడం మొదలుపెట్టాలని పెద్దలు చెప్పారు(11:16-17).
చనిపోయిన వారికి తీర్పుతీర్చు సమయమూ, దేవుని దాసులు బహుమతులు పొందబోయే సమయమూ, భూమిని నాశనం చేసేవారిని దేవుడు నాశనం చేసే సమయమూ ఇప్పుడు వచ్చింది(11:18).
అప్పుడు పరలోకంలో దేవుని ఆలయం తెరవడం జరిగింది(11:1-2).
పరలోకంలో సూర్యున్ని ధరించుకొన్నగర్భిణి స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రునితో, ఆమె తలమీద పన్నెండు నక్షత్రాలతో, ప్రసవ వేదనలతో కేకలు వేస్తున్న స్త్రీని గూర్చిన సూచన కనపడింది(12:1-2).
పరలోకంలో ఎర్రని పెద్ద మహా సర్పం ఏడు తలలు పది కొమ్ములు ఏడు కిరీటాలు తో మరొక గొప్ప సూచన కనపడింది(12:3-4).
మహా సర్పము దాని తోకతో మూడో వంతు నక్షత్రాలను ఊడ్చి భూమ్మీద పడేసింది(12:3-4).
మహా సర్పము ఆ స్త్రీ కనిన శిశువును మ్రింగి వేయాలనుకుంది(12:3-4).
ఆ మగ శిశువు తన జనములను ఇనుప కడ్డీతో ఏలాలని వెళుతున్నాడు (12:5).
ఆ మగ శిశువు ఆయన సింహాసనం దగ్గరకు కొనిపోయాడు(12:5).
ఆ స్త్రీ అరణ్యంలోకి పారిపోయిoది(12:6).
మిఖాయేలును, అతని దూతలును మహా సర్పమునకు దాని దూతలకు వ్యతిరేకంగా యుద్ధం చేశారు(12:7).
యుద్దము తరువాత మహా సర్పము దాని దూతలు భూమి మీదకు పడద్రోయడం జరిగింది(12:9).
ఆ మహా సర్పము ఆది సర్పము, పిశాచము, సాతాను [12:9].
సోదరులు మహా సర్పంను గొర్రెపిల్ల రక్తంతోను, వారి సాక్ష్యంతోను జయించిరి(12:11).
మహా సర్పం తనకింక కొద్ది కాలమే మాత్రమే మిగిలి ఉందని తెలుసుకుంది(12:12).
మహా సర్పం స్త్రీని హింసించినప్పడు ఆమె కోసం సిద్దపరచిన స్థలంకు ఎగిరిపోవుటకు ఆమెకు రెక్కలు ఇవ్వడం అయ్యింది అక్కడ ఆమె పోషించడం జరిగింది(12:13-14).
స్త్రీని తుడిచి పెట్టలేక పోయినప్పుడు మహా సర్పం ఎవరైతే దేవుని ఆజ్ఞలకు విధేయత చూపుతారో యేసుని గూర్చి సాక్ష్యం కలిగుంటారో వారితో యుద్దము చేయడానికి వెళ్ళింది(12:15-18).
మరణకరమైన గాయం తగిలి బాగైనoదు వల్ల లోకమంతా ఆశ్చర్యపోతూ క్రూర జంతువుని అనుసరించారు(13:3).
క్రూర జంతువు తన నోటితో దేవుని పేరు దూషిస్తూ,గర్వంగా మాట్లాడుచూ, ఆయన నివాసమునకునూ, పరలోక నివాసులకునూ వ్యతిరేకంగా మాట్లాడింది(13:5-6).
పవిత్రులైన మనుషులతో యుద్ధం చెయ్యడానికీ వారిని జయించడానికి క్రూర జంతువుకు అనుమతివ్వడం జరిగింది(13:7).
ఎవరి పేరులు జీవగ్రంథంలో రాయడం జరిగిందో వారు ఆ క్రూర జంతువుని పూజించలేదు(13:8).
పవిత్రులైన వారిని ఓర్పు, సహనం, విశ్వాసం కోసం పిలవడం జరిగింది(13:10).
మరొక క్రూర జంతువు భూమిలో నుంచి బయటికి రావడం యోహాను చూశాడు(13:11 ).
మరొక క్రూర జంతువు గొర్రెపిల్ల లాంటి కొమ్ములు కలిగి మహా సర్పంలాగా మాట్లాడుతుంది(13:11).
మరొక క్రూర జంతువు భూమ్మీద నివసించే వారు మొదటి క్రూర జంతువును పూజించుటకు కారణమైంది(13:12).
క్రూర జంతువును పూజించుటకు నిరాకరించిన వారిని చంపడం జరిగింది(13:15).
ప్రతిఒక్కరు మరొక క్రూర జంతువు నుంచి కుడిచేతి మీదా లేక నొసటి మీద ముద్ర పొoదారు(13:16).
క్రూర జంతువు సంఖ్య 666(13:18).
యోహాను తన ముందు గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలుచుండడం చూశాడు(14:1).
భూమ్మీద విమోచన పొందిన 144,000 మంది మాత్రమే సింహాసనం ముందు కొత్త పాట నేర్చుకొని పాడుటకు సమర్ధులు(14:3).
నిందించడానికి తప్పులేని 144,000 మంది దేవునికీ గొర్రెపిల్లకు మొదటి ఫలంగా విమోచన పొందినవారు(14:4-5).
దేవదూత నిత్య సువార్త ప్రకటన ప్రతీ దేశం వారికీ, ప్రతి వంశం వారికీ, ప్రతి భాష మాట్లాడే వారికీ,భూమ్మీద ఉన్న ప్రతి జనానికీ ఇచ్చాడు(14:6).
భూమ్మీద నివసిస్తున్న వారు దేవునికి భయపడి ఆయనకు మహిమ చెల్లించమని దేవదూత చెప్పాడు(14:7).
దేవుని తీర్పు గడియ వచ్చిందని దేవదూత చెప్పాడు(14:7).
రెండవ దూత మహా బబులోను కులిపోయిందని ప్రకటించాడు(14:8).
క్రూర జంతువు ముద్ర పొందుంటే వారికి అగ్నిగంధకాలతో ఎన్నటెన్నటికి వేదించడం జరుగుతుందని మూడవ దూత ప్రకటించాడు(14:9-11).
పవిత్రులు సహనంతో ఓర్చు కునేందుకు పిలవడం జరిగింది(14:12).
మేఘాల మీద దేవుని కుమారుని పోలిన ఒకరు కూర్చోవడం యోహాను చూశాడు(14:14).
మేఘాలమీద కూర్చున్నఆయన భూమి మీద పంట కోతకు కొడవలి ఊపాడు(14:16).
దూత పదునైన కొడవలితో భూమ్మీద ద్రాక్ష పంటను కూర్చి దేవుని కోపమనే ద్రాక్ష గానుగ తొట్టిలో పడేశాడు(14:18-19).
ద్రాక్ష గానుగ తొక్కడం జరిగింది దాని నుంచి రక్తం బయటికి పారింది(14:20).
ఏడుగురు దూతలు ఏడు తెగుళ్ళు పట్టుకొని ఉండటం యోహాను చూశాడు, ఇవే చివరి తెగుళ్ళు(15:1).
క్రూర జంతువు మీద గెల్చి ఆయన పోలిక గల వారు సముద్రం దగ్గర నుoచున్నారు(15:2).
సముద్రం దగ్గర నుoచున్న వారు మోషే పాటా, గొర్రెపిల్ల పాటా పాడుతున్నారు(15:3).
ఆ పాటలో దేవుని మార్గాలు న్యాయమైనవి యధార్ద మైనవని వివరించడం జరిగింది(15:3).
ఈ పాటలో అన్ని రాజ్యాలు వచ్చి దేవుని ఆరాదిస్తారు(15:4).
అప్పుడు ఏడు తెగుళ్ళుతో ఏడుగురు దేవదూతలు అతి పరిశుద్ద స్థలం నుంచి బయటకు వచ్చారు(15:6).
ఏడుగురు దేవదూతలకు దేవుని కోపoతో నిండిన ఏడు పాత్రలు ఇవ్వడం జరిగింది(15:7).
ఏడు తెగుళ్ళు పూర్తయ్యే వరకు అతి పరిశుద్ద స్థలంలోకి ఎవ్వరు ప్రవేశించ లేదు(15:8).
ఏడుగురు దేవదూతలకు వెళ్లి దేవుని కోపమనే ఏడు పాత్రలు భూమ్మీద పోయమని చెప్పారు(16:1).
దేవుని మొదటి ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు క్రూర జంతువు ముద్ర ఉన్న మనుషుల మీద బాధకరమైన చెడ్డ కురుపులు వచ్చాయి(16:2).
దేవుని రెండవ ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు సముద్రం చనిపోయిన వారి రక్తంలాగా మారిoది(16:3).
దేవుని మూడవ ఉగ్రత పాత్ర బయటకు కుమ్మరించినప్పుడు నదులూ ఊటలూ రక్తం అయినాయి(16:4).
దేవుడు ఈ ప్రజలకు తాగటానికి రక్తమివ్వడమనేది యధార్ధమైనదీ న్యాయమైనది ఎందుకంటే వారు దేవుని పవిత్రుల రక్తం, ప్రవక్తల రక్తం ఒలికించారు(16:6).
దేవుని నాలుగవ ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు సూర్యుడు అగ్నితో మనుషులను మాడ్చడం జరిగింది(16:8).
ఈ తెగుళ్ళకు మనుషులు మారుమనస్సు పొందలేదూ దేవుని మహిమ పరచలేదు(16:9).
దేవుని ఆరవ ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు యూఫ్రటీసు నది నీరు ఎండి పోయి తూర్పు నుంచి వచ్చు రాజులకు దారి ఏర్పడింది(16:12).
దేవుని మహా దినాన జరిగే యుద్ధం కోసం భూలోక రాజులను పోగు చేయడానికి మూడు అపవిత్రాత్మలు వెళ్ళాయి(16:13-14).
భూలోక రాజులను తెచ్చి పోగుచేసిన స్థలo పేరు హార్ మెగిద్దోను(16:16).
దేవుని ఏడవ ఉగ్రత పాత్ర కుమ్మరించినప్పుడు ఒక గొప్ప స్వరం,"సమాప్తo అయ్యింది!" అప్పుడు మెరుపులూ, ఉరుములూ, భూకంపము వచ్చింది(16:17-18).
ఈ సమయంలో దేవుడు మహా బబులోనును జ్ఞాపకం చేసుకొని, ఆయన తన ఉగ్రతతో నిండిన పాత్రను బబులోనుకు ఇచ్చాడు(16:19).
ఈ తెగుళ్ళకు మనుషులు దేవుని దూషించారు(16:21).
దేవదూత యోహానుకు మహా వేశ్య మీదకు వచ్చే తీర్పును చూపిస్తానాని చెప్పాడు(17:1).
ఆ స్త్రీ ఏడు తలలు ఏడు కొమ్ములతో ఉన్న జంతువు మీద కూర్చుంది(17:3).
ఆ స్త్రీ తన చేతితో పట్టుకున్న పాత్రలో అసహ్యమైన ఆమె వ్యభిచార సంబంధమైన మాలిన్యoతో నిండి ఉంది(17:4).
ఆ స్త్రీ పేరు, "మహా బబులోను వేశ్యలకూ, భూలోకoలో అసహ్యమైన వాటికి తల్లి"(17:5).
ఆ స్త్రీ యేసు హతసాక్షుల రక్తం, పరిశుద్దుల రక్తం తాగి మత్తెక్కుంది(17:6).
స్త్రీ కూర్చున్న జంతువు లోతైన అంతులేని అగాధం నుంచి వచ్చింది(17:8).
క్రూర జంతువు ఏడు తలలు స్త్రీ కూర్చున్న ఏడు కొండలు, ఏడుగురు రాజులు (17:9-10).
క్రూర జంతువు నాశనానికి పోతుంది(17:8,11)
క్రూర జంతువు పది కొమ్ములు పది మంది రాజులు(17:12).
అప్పుడు క్రూర జంతువూ రాజులూ ఒకే ఉద్దేశము కలిగి గొర్రెపిల్లకు వ్యతిరేకంగా యుద్ధం చేశారు(17:14).
వేశ్య కూర్చున్న జలాలు ప్రజలూ, జనసమూహాలూ, జాతులూ, ఆయా భాషలు మాట్లాడేవారు(17:15).
క్రూర జంతువు రాజులూ ఆ స్త్రీని ద్వేషించీ, దిగంబరిచేసీ, ఆమె మాంసం తిని నిప్పంటించి కాల్చివేస్తాయి(17:16).
యోహాను చూసిన స్త్రీ భూరాజులను పరిపాలించిన మహా నగరం(17:18).
దేవదూత గొప్ప అధికారంతో మహా బబులోను కూలిపోయిందని ప్రకటించింది(18:1-2).
పరలోకం నుంచి స్వరం దేవుని ప్రజలు బబులోను నుంచి బయటకు రమ్మనీ, ఆమె పాపములో భాగ మవ్వద్దని చెప్పడం జరిగింది(18:4).
బబులోను చేసిన దానికి దేవుడు తిరిగి దానికి రెండంతలు ఆమెకు చెల్లిస్తాడు(18:6).
ఆమెను అగ్నితో కాల్చిన రోజున బబులోనుపై ఒక్క రోజులో దుఃఖమూ కరువు విరుచుకు పడ్డాయి (18:8).
భూలోక రాజులూ వర్తకులు బబులోను తీర్పును చూసినప్పుడు ఆమె కోసం ఏడుస్తూ రోదించారు(18:9-11).
బబులోను విలాసవంతమైన వైభవాన్ని కోరుకుంది. అవన్నీ ఒక్క ఘడియలోనే తుడిచి పెట్టుకు పోయాయి(1814).
బబులోను తీర్పు సమయoలో రాజులూ, వర్తకులూ, ఓడ నావికులు దాని వేదనలకు భయపడి దూరంగా నిలిచారు(18:9-10,15,17).
జ బబులోను గూర్చి ఓడ నావికులు,"ఈ మహా పట్టణం లాంటి పట్టణం ఏది?"అని ప్రశ్నలడిగారు(18:18).
దేవుని ద్వారా బబులోనుకు తీర్పు జరిగినప్పుడు పవిత్రులూ, అపోస్తులులూ, ప్రవక్తలు ఆనందించండని చెప్పారు(18:20).
ఆమె తీర్పు జరిగిన తరువాత, ఇంకెప్పటికి బబులోను కనబడదు(18:21).
బబులోను మహా పట్టణంలో ప్రవక్తల రక్తమూ, పవిత్రుల రక్తమూ, భూమి మీద చంపడం జరిగిన వారoదరి రక్తం కనుగొవడం జరిగింది(18:24).
దేవుని తీర్పులు న్యాయమైనవీ, యధార్దమైనవని పరలోకంలో చెప్పడం జరిగింది(19:1-2).
ఆమె తన వ్యభిచారంతో భులోకాన్ని చెడగొట్టి, దేవుని దాసుల రక్తం చిందించడం వల్ల దేవుడు గొప్ప వేశ్యకు తీర్పు తీర్చాడు(19:2).
మహా వేశ్య నుంచి యుగ యుగాలకు పొగ లేస్తూ ఉంటుంది(19:2).
దేవునికి భయపడే దాసులు ఆయనను స్తుతించాలని చెప్పడం జరిగింది(19:5).
గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చినందుచేత దేవుని దాసులు సంతోషంగా ఉండీ ఆనందించాలని స్వరం చెబుతుంది(19:7).
గొర్రెపిల్ల పెండ్లి కూతురు మంచి నార బట్టలుతో ఉంది, అవి దేవుని పవిత్ర ప్రజల నీతి క్రియలు(19:8).
యేసు గూర్చిన సాక్ష్యం ప్రవచనాత్మయై ఉన్నదని దేవదూత చెప్పాడు(19:10).
యోహాను చూచిన తెల్లని గుర్రం తోలే వాని పేరు దేవుని వాక్కు(19:11-13).
జనాలను కొట్టడానికి దేవుని వాక్కు నోటి నుంచి వాడిగల ఖడ్గం బయటికి వెళుతుంది(19:15).
దేవుని వాక్కు వస్త్రం మీదనూ తొడ మీదనూ,"రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు" అని రాసి ఉంది(19:16).
రాజుల మాంసంనూ, సైన్యాధికారుల మాంసంనూ, బలిష్ఠుల మాంసంనూ, గుర్రాల మాంసంనూ, వాటిని తోలే రౌతులైన వారి మాంసంనూ, అందరి మాంసoనూ తినడానికి ఆకాశoలో ఎగిరే పక్షులను పిలవడం జరిగింది(19:18).
భూలోక రాజులునూ క్రూర జంతువును దేవుని వాక్కుతోనూ ఆయన సైన్యంతోనూ యుద్ధం చేయడానికి బయట పోగై ఉన్నారు(19:19).
క్రూర జంతువు, అబద్ద ప్రవక్త వారి ఇద్దరిని బతికుండగానే గంధకంలో మండు అగ్ని గుండంలో పడవేయడం జరిగింది(19:20).
దేవుని వాక్కుకు వ్యతిరేకంగా యుద్దo చేసిన మిగిలిన వారికీ, దేవుని వాక్కు నోటి నుంచి వచ్చు ఖడ్గo వల్ల చంపడం జరిగింది(19:21).
పరలోకం నుంచి దిగి వచ్చిన దేవదూత తన చేతిలో అంతులేని అగాధం తాళం చెవి, పెద్ద గొలుసు కలిగియున్నాడు(20:1).
దేవదూత సాతానును అడుగులేని అగాధం లోనికి విసిరేసాడు(20:3).
వెయ్యి సంవత్సరాలు సాతానును బంధించి ఉంచడం జరిగింది(20:2-3).
సాతాను బంది అయినప్పుడు జనాలను మోసగించడానికి సామర్ద్యం లేకుండా పోయిoది(20:3).
క్రూర జంతువు ముద్ర తిరస్కరించిన వారు బ్రతికి వెయ్యి సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యపాలన చేశారు(20:4).
చనిపోయిన వారిలో మిగిలిన వారు వెయ్యి సంవత్సరాలు గడచిపోయే వరకు బ్రతకలేదు(20:5).
మొదటి పునరుత్థానంలో పాల్గొన్నవారు దేవునికీ క్రీస్తుకూ యాజకులై ఉండి ఆయనతో కూడా వెయ్యి సంవత్సరాలు రాజ్యపాలన చేస్తారు(20:6).
వెయ్యి సంవత్సరాలు గడచిన తరువాత, సాతాను విడుదల పొంది జనాలను మోసం చేయడానికి బయలుదేరిపోతాడు(20:8).
పవిత్రుల శిబిరం చుట్టుముట్టినప్పుడు, పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చి గోగు, మాగోగులను మ్రింగివేస్తుంది(20:9).
ఈ సమయంలో సాతాను అగ్ని గంధాకాల సరస్సులో పడత్రోయడం జరిగి యుగయుగాలు వేదనపడుతుంది(20:10).
మృతులంతా గ్రంథాల్లో రాసి ఉన్న ప్రకారం వారు చేసిన పనులను బట్టి తీర్పు పొందారు [20:12-13].
రెండవ మరణం అంటే అగ్ని సరస్సు(20:14).
జీవ గ్రంథంలో పేర్లు కనుగొనని వారoదరు అగ్ని సరస్సులో పడత్రోయడం జరుగుతుoది(20:15).
మొదటి భూమీ, మొదట ఆకాశం గతించి పోవడం యోహాను చూశాడు(21:1).
మొదటి భూమీ, మొదట ఆకాశాల స్థానంలో కొత్త భూమి కొత్త ఆకాశం వచ్చాయి(21:1).
పరలోకo నుంచి పవిత్ర పట్టణం , నూతన యెరుషలేo దిగి వచ్చాయి(21:2).
సింహాసనం నుంచి వచ్చిన స్వరం ఇప్పుడు దేవుని నివాసం మనుషులతో కూడా ఉందని చెప్పింది(21:3).
మరణం, దుఃఖo, ఏడ్పు, బాధ గతించిపోయాయి(21:4).
సింహాసనం మీద కూర్చున్న ఆయన తననుతాను అల్ఫాయు ఓమెగయు, మొదటి వాడను కడపటి వాడనని పేరున పిలుచుకొన్నాడు(21:6).
విశ్వాసం లేని వారూ, వ్యభిఛార సంబంధంమైన పాపమూ, విగ్రహారాధికులు అగ్ని గంధకాల సరస్స్లులో ఉంటారు(21:8).
గొర్రెపిల్ల భార్య, పెండ్లి కూతురు పరలోకమందున్న దేవుని నుంచి వచ్చుచున్న పవిత్ర పట్టణం, యెరూషలేము(22:12).
యెరూషలేము గుమ్మముల మీద ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రముల పిల్లల పేర్లు రాసున్నాయి(21:12).
యెరూషలేము పునాదుల మీద గొర్రెపిల్ల యొక్క పన్నెండు అపోస్తులుల పేర్లు రాసున్నాయి(21:14).
కొత్త యెరూషలేము నాలుగు వైపుల సమానంగా ఉంది(21:16).
పట్టణమూ వీధులూ స్వచ్చమైన బంగారమూ, శుభ్ర మైన గాజువలే కట్టడం జరిగింది(21:18-21).
కొత్త యెరూషలేములోప్రభువైన దేవుడునూ, గొర్రెపిల్లయే దేవాలయం(21:22).
కొత్త యెరూషలేములో దేవుని మహిమా, గోర్రేపిల్ల మహిమా వెలుగుకు ములాధారం(21:23).
కొత్త యెరూషలేములో అపవిత్ర మైనది ఏదియూ ప్రవేశించలేదు(21:27).
దేవుని సింహాసనం నుంచి జీవ జల నది ప్రవహించడాన్ని యోహాను చూసాడు(22:1).
జీవ వృక్షo ఆకులు జనములను స్వస్థ పరచడo కోసం(22:2).
పట్టణంలో ఇంకా ఏవిధమైన శాపo ఉండదు, చీకటనేదే ఉండదు(22:3-5)
దేవుని సింహాసనమూ గొర్రెపిల్ల సింహాసనమూ పట్టణంలో ఉంటాయి(22:3).
ఈ గ్రంథం ద్వారా దీవెన పొందాలంటే ఇందులోని ప్రవచన వాక్కులకు లోబడాలి [22:7].
యోహాను దేవదూత పాదాల దగ్గర సాగిలపడినప్పుడు, దేవదూత యోహానుతో దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలని చెప్పాడు(22:8-9).
యోహాను ఈ పుస్తకంలోని ప్రవచన వాక్యాలకు ముద్ర వేయ వద్దు ఎందుకంటే సమయం దగ్గరా వుందని చెప్పాడు22:10).(
ప్రభువు వచ్చేప్పుడు తనతో బహుమానము తీసుకోస్తున్నానని చెప్పాడు(22:12).
జీవ వృక్ష ఫలం తినే హక్కు సంపాదించుకోవాలనుకునే వారు తమ బట్టలు ఉతుక్కోవాలి (22:14)
దావీదు వేరు దావీదు సంతానమని యేసు చెప్పాడు(22:16).
ఈ గ్రంథ ప్రవచనాలకు ఎవరైన ఏదైనా కలిపిన తెగుళ్ళు వస్తాయనే విషయం రాసుంది (22:18).
ఈ గ్రంథ ప్రవచనాల నుంచి ఎవరైనా ఏదైనా తీసివేసిన జీవ వృక్షంలో భాగం తీసివేయడం జరుగుతుంది(22:19).
యేసు చివరి మాటలు,"అవును! నేను త్వరలో వస్తున్నాను"(22:20).
ఈ గ్రంథంలో చివరి పదం "ఆమెన్"(22:21).